Organ donation
-
చిన్న వయసు.. పెద్ద మనసు
వయసులో ఆమె చాలా చిన్నది.. కానీ గొప్ప మనసుందని ప్రపంచానికి చాటి చెప్పింది.. తాను మరణిస్తున్నానని తెలిసి.. మరో ఐదుగురి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అంతేకాదు..మరణానంతరం మరో ఐదుగురికి ప్రాణంపోయడమే కాదు.. వారి రూపంలో తాను జీవించి ఉందనేలా.. ఆమె తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. అవయవ దానంపై ఆమె నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. ఇంతటి గొప్ప త్యాగానికి.. రూపమిచ్చిన ఆమె పేరు డాక్టర్ భూమికారెడ్డి.. యువ డాక్టర్ నంగి భూమికారెడ్డి (24) స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం, తలుపుల మండలం, నంగివాండ్లపల్లి. నంగి నందకుమార్ రెడ్డి, లోహిత దంపతుల ఏకైక కుమార్తె. ఇటీవలే వైద్య విద్యను పూర్తి చేసి హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్గా వైద్య సేవలను అందిస్తోంది. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని అనుకోకుండా ప్రమాదానికి గురైంది. అపస్మారక స్థితిలో ఉన్న భూమికారెడ్డిని సమీపంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని న్యూరో సర్జన్ డాక్టర్ శివానందరెడ్డి నేతృత్వంలో వైద్య బృందం చికిత్సలు చేసింది. క్రానియోటమీ సర్జరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం తుది శ్వాస విడిచింది.బిడ్డ మాట కోసం.. భూమికారెడ్డి తమతో పదే పదే అవయవదానం గురించి మాట్లాడుతుండేదని, ఆ మేరకు తమ బిడ్డ మాట కోసం భూమికారెడ్డి అవయవాలను దానం చేయడానికి తమ కుటుంబ సభ్యులతో చర్చించి చివరకు అంగీకరించారు తల్లిదండ్రులు. మృతదేహం వద్ద తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే.. ఆస్పత్రిలోని సందర్శకులు, ఇతర రోగుల కళ్లు చెమ్మగిల్లాయి. బిడ్డను కోల్పోయిన బాధను దిగమింగుకుని మరో ఐదుగురి ప్రాణాలను నిలబెట్టాలనే నిర్ణయానికి వచి్చన భూమికారెడ్డి తల్లిదండ్రులను అక్కడి డాక్టర్లు అభినందించారు. అనంతరం భూమికారెడ్డి మృతదేహానికి కాంటినెంటల్ ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు.భూమికారెడ్డి త్యాగం వెలకట్టలేనిది.. యువ డాక్టర్ భూమికారెడ్డి మన మధ్య లేకపోయినా ఆమె చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆమె, తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు సమిష్టిగా నిర్ణయించి అవయవదానం చేయడానికి ముందుకురావడం కలకాలం గుర్తిండిపోతుంది. భూమికారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. వైద్య రంగం ఓ మంచి వైద్యురాలిని కోల్పోయింది. – కాంటినెంటల్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డిఅవయవదానం వివరాలు.. డాక్టర్ భూమికారెడ్డి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రెండు కిడ్నీలను అవయవదానం చేశారు. ఇందులో భాగంగా ఊపిరితిత్తులను కిమ్స్ ఆస్పత్రికి, గుండెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి, కాలేయం కాంటినెంటల్ ఆస్పత్రికి, కిడ్నీల్లో ఒకటి నిమ్స్ ఆస్పత్రికి, మరొకటి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. -
మరణించినా మరికొందరిలో ప్రభవిస్తున్నారు!
సాక్షి, అమరావతి: మరణించినా అవయవదానం ద్వారా మరికొందరికి ప్రాణం పోస్తున్న వారి సంఖ్య గత మూడేళ్లుగా పెరుగుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 2021 నుంచి 2023 వరకు అవయవదానాల సంఖ్య 42,040కు చేరిందని, అదే సమయంలో రాష్ట్రంలోనూ ఈ సంఖ్య 965కు చేరిందని పేర్కొంది. అవయవదానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరణించాక అవయవదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసినవారవుతారన్న తరహాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవయవదానం నమోదును సులభతరం చేసేందుకు ఆధార్ అనుసంధానంతో డిజిటల్ వెబ్ పోర్టల్ను గతేడాది సెప్టెంబర్లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. మరణించాక తమ అవయవాలను దానం చేస్తామంటూ ఇప్పటి వరకూ రెండు లక్షల మంది ఈ పోర్టల్లో ప్రతిజ్ఞ చేయడం విశేషం. అవయవదానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా భారతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెమినార్లు, వెబ్నార్లు, వర్క్షాప్ల వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అవయవాల సేకరణ, మార్పిడి, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలతో మూడంచెల నెట్వర్క్ను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్, ఐదు ప్రాంతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్లు, రాష్ట్ర స్థాయిలో 21 రాష్ట్ర అవయవాలు, టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం 900పైగా ఇనిస్టిట్యూషన్లు, ఆస్పత్రులు అవయవాల మార్పిడి, పునరుద్ధరణ నెట్వర్క్తో అనుసంధానమయ్యాయి.రూ.10 వేల పారితోషికంబ్రెయిన్ డెడ్ అయి అవయవదానాలు చేస్తున్న వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అవయవాల సేకరణ అంనతరం భౌతిక కాయాన్ని ఉచిత రవాణా సదుపాయాలతో స్వస్థలాలకు చేర్చడంతో పాటు.. కుటుంబ సభ్యులకు రూ.10 వేల పారితోషికం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను సత్కరించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం
విజయనగరం ఫోర్ట్: పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంతలోకాలకు వెళ్లిపోతుందని తెలిసి అవయవదానానికి అంగీకరించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ ఈ నెల 20న భార్య దేవి, కుమార్తె పల్లవి (11)తో కలిసి ద్విచక్రవాహనంపై మండలంలోని ఎగువ కొండపర్తిలోని వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా అనంతగిరి మండలం ఎన్.ఆర్.పురం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడిపోయారు. తుప్పల్లో ఉన్న రాళ్లపై పడడంతో పల్లవి తలకు తీవ్ర గాయమైంది. వెంకటరమణ కాలుకు, భార్య దేవి చేతికి గాయాలయ్యాయి. ప్రమాద బాధితులను వెంటనే గ్రామస్తులు ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పల్లవి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు పల్లవికి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. పాప అవయవాలు దానం చేస్తే మరికొందరికి పునర్జన్మనిచ్చినట్లు అవుతుందని మెడికవర్ వైద్యులు పల్లవి తల్లిదండ్రులకు నచ్చజెప్పారు. దీంతో వారు అవయవదానానికి అంగీకరించారు. తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో పల్లవి శరీరం నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు, కళ్లలోని కార్నియాలను సేకరించారు. కిడ్నీలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్సులో విశాఖపట్నం మెడికవర్ ఆస్పత్రికి ఒకటి, కిమ్స్ ఐకాన్కు మరొకటి తరలించారు. నేత్రాలను విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ ఐ ఆస్పత్రికి తరలించారు. అవయవదానానికి ముందుకొచి్చన పల్లవి తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. -
‘చచ్చి’ బతికాడు!
అమెరికాలోని కెంటకీలో థామస్ హోవర్ అనే 36 ఏళ్ల వ్యక్తి డ్రగ్ ఓవర్డోస్ వల్ల గుండెపోటుకు గురయ్యాడు. హుటాహుటిన బాప్టిస్ట్ హెల్త్ రిచ్మండ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతనిక బతికి బట్ట కట్టడం కల్లేనని వైద్యులు తేల్చారు. అవయవ దానం చేసి ఉండటంతో ముందుగా గుండెను సేకరించాలని నిర్ణయించారు. ఆపరేషన్ టేబుల్పైకి తీసుకెళ్లి సరిగ్గా కత్తులూ, కటార్లకు పని చెప్పబోయే సమయానికి మనవాడు ఉన్నట్టుండి కళ్లు తెరిచాడు! కాళ్లూ చేతులూ కదిలించేందుకు ప్రయతి్నంచాడు. తన పరిస్థితి అర్థమై కన్నీరు పెట్టుకున్నాడు. ఇదంతా చూసి డాక్టర్లంతా దిమ్మెరపోయారు. దాంతో అవయవ సేకరణ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు. ఇది 2021 అక్టోబర్లో జరిగితే ఆస్పత్రి వర్గాలు మాత్రం వెలుగులోకి రానివ్వలేదు. కనీసం హూవర్ కుటుంబీకులకు కూడా సమాచరమివ్వలేదు. పైగా అతనిలో కనిపిస్తున్న ప్రాణ లక్షణాలను పట్టించుకోకుండా అవయవాలను సేకరించాల్సిందిగా డాక్టర్లపై ఒత్తిడి తెచ్చాయి. వారు నిరాకరించడంతో వేరే వైద్యులను నియోగిస్తే వాళ్లు కూడా చేతులెత్తేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆస్పత్రి మాజీ ఉద్యోగి ఒకరు గత జనవరిలో హూవర్ సోదరి డోనాకు విషయం చేరవేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల సలహా మేరకు అతన్ని ఇంటికి తీసుకెళ్లిందామె. హూవర్ బ హుశా ఇంకెంతో కాలం బతక్కపోవచ్చన్న డాక్టర్ల అంచనాలను వమ్ము చేస్తూ సోదరి సంరక్షణలో అతను చాలావరకు కోలుకున్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు కెంటకీలో టా కాఫ్ ద టౌన్గా మారింది. కెంటకీ అటార్నీ జనరల్ కార్యాలయం దీనిపై విచారణ కూడా జరుపుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవయవదానానికి ఒప్పుకున్న కుటుంబ సభ్యులు
-
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. -
అవయవాల అమ్మకం కథ కంచికేనా?
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్ నిర్వాహకులే శ్రీకాంత్ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లోని కార్పొరేట్, కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్దాన్ అనే సంస్థకు శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్, శ్రావణ్, సాయిరాం, సాగర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..? శ్రీకాంత్ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి సర్జన్.. శ్రీకాంత్ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ను కరీంనగర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి కరీంనగర్ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్ భార్య స్పప్న ఫోన్నంబర్ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం. పూర్తిస్థాయి విచారణ ఏమైంది.. అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణ సాగుతోందని తెలిపారు. -
వీసీ సజ్జనార్ అవయవదాన ప్రతిజ్ఞ.. క్యూఆర్ కోడ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి దేహాలను ఖననం లేదా దహనం చేస్తుంటారని, అలా చేసేముందు వారి శరీరంలో ముఖ్యమైన అవయవాలు దానం చేస్తే మరో 8 ప్రాణాలు బతుకుతాయని అదనపు డీజీపీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. మరణానంతరం తాను తన అవయవాలు దానం చేస్తున్నట్లు ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నానని, ప్రజలందరూ కూడా ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో అవవయదాన అవగాహన ప్రచారం ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతియేటా ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా చేసుకుంటారు. దీనిపై ఉన్న అపోహలను తొలగించి, మరింతమందిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు, అవయవదానంపై అవగాహన కల్పిచేందుకు ఈ కార్యక్రమం చేపడతారు.ఈ సందర్భంగా కామినేని ఆస్పత్రుల సీఓఓ గాయత్రీ కామినేని మాట్లాడుతూ.. “గౌరవనీయులైన వీసీ సజ్జనార్ ఈ కార్యక్రమానికి వచ్చి అందరికీ స్ఫూర్తినిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇక్కడ అనేకమంది రోగులు తమకు జీవితంలో లభించే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 వేల మందికి పైగా వ్యక్తులు అవయవమార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే మనమంతా స్పందించాలి. అవయవదాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ మేం ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరూ పేర్లు నమోదుచేసుకుని, ఇక్కడ ఉన్నవారికి ఒక ఆశ కల్పించాలని కోరుతున్నాను. రాబోయే సంవత్సరాల్లో జాతీయ సగటును మించి మన తెలుగు రాష్ట్రాల్లో అవయవ దానాలు జరగాలని ఆశిస్తున్నాను. ప్రస్తుత సమాజంలో మాత్రం పరిస్థితి అలా లేదు. దాతల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. అవయవదానం అంటే ప్రాణాన్ని నిస్వార్థంగా మరొకరికి దానం చేయడమే. అలా చేయడం ద్వారా మరో ఎనిమిది మందిలో మనం చిరంజీవులుగా ఎప్పటికీ ఉండిపోతాం. నేనూ ఇప్పటికే అవయవదాన ప్రతిజ్ఞ చేశాను. మీరంతా నాతో కలిసొస్తారని ఆశిస్తున్నా. మనమంతా కలిసి ఒక ప్రభంజనంలా ఈ అవయవదాన సత్కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. వ్యాధులతో బాధపడుతున్న దశ నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ల కథలు వింటే మీ హృదయాలు కరుగుతాయి” అని తెలిపారు.ప్రజలందరూ ముందడుగు వేసి, అవయవదాతలుగా మారాల్సిన అవసరం ఉందని అదనపు డీజీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... “కామినేని ఆస్పత్రిని నా తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తున్నాను. ఇటీవల ఇలాంటి కార్యక్రమం నేను చూడలేదు. అవయవదానం గురించి అవగాహన కల్పించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని నాకు విశ్వాసం ఉంది. కామినేని కుటుంబంతో నాకు రెండు దశాబ్దాల సాహిత్యం ఉంది. పోలీసులకు కూడా వాళ్లు చాలా చేశారు. పోలీసు శాఖ తరఫున కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొవిడ్ వచ్చినప్పుడు కామినేని ఆస్పత్రి చేసిన సేవలు అపూర్వం. నేను చాలామంది వైద్యులకు ఫోన్లు చేసేవాడిని. శశిధర్ లాంటివాళ్లు అర్ధరాత్రి చేసినా స్పందించేవారు. వైద్యులు, నర్సులు, అందరూ కొవిడ్ సమయంలో చాలా సేవలు చేశారు. తీవ్రగాయాలు అయినప్పుడు మొట్టమొదటగా కామినేని ఆస్పత్రికే మా సిబ్బందిని పంపేవాడిని. ముఖ్యంగా అవయవదానం విషయంలో చాలా అవగాహన రావాలి. కొన్ని లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం గత సంవత్సరం దేశంలో 18,378 డొనేషన్లు అయితే, వాటిలో లైవ్ డొనేషన్లు 15,436 కెడావర్ డొనేషన్లు 2,942చొప్పున ఉన్నాయి. లైవ్ డొనేషన్లలో కూడా అత్యధికం అంటే దాదాపు పదివేలకు పైగా మహిళలే చేశారు. మూడోవంతు మాత్రమే పురుషులు ఉన్నారు. దేశంలో ఒక ట్రాన్స్జెండర్ కూడా అవయవదానం చేయడం విశేషం. మాతృప్రేమ ఇందులో స్పష్టంగా తెలుస్తోంది. పది సంవత్సరాల క్రితం 4,490 మంది మాత్రమే మొత్తం అవయవదానాలు చేశారు. ఇప్పుడు ఇంత పెరగడానికి వివిధ ఆస్పత్రులు, ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలే కారణం. డాక్టర్ స్వర్ణలత లాంటివాళ్లు జీవన్దాన్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్లలో ఎంతో ముందున్నారు. వీరందరికీ నా మనఃపూర్వక అభినందనలు” అని చెప్పారు.క్యూఆర్ కోడ్ విడుదలఈ సందర్భంగా ఎవరైనా అవయవదానం చేయాలనుకుంటే అందుకు వీలుగా కామినేని ఆస్పత్రి తరఫున ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన ఎవరైనా తమ స్మార్ట్ ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఆ కోడ్ను స్కాన్ చేస్తే ఒక దరఖాస్తు ఫారం వస్తుంది. దాన్ని నింపి, సబ్మిట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ అవయవదాతలుగా మారొచ్చు.అవయవదానంపై అవగాహన కల్పించేందుకు కామినేని ఆస్పత్రి డైరెక్ట్ మెసేజ్లు, సోషల్ మీడియా ప్రచారాలతో కూడిన సమగ్ర అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛంద దాతలను ప్రోత్సహించేందుకు ఆసుపత్రి ఆవరణలో డిజిటల్ కియోస్క్ ఏర్పాటుచేశారు. ఆసక్తి ఉన్నవారు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వారి వివరాలు సమర్పించిన వెంటనే వారి వాట్సప్ నంబర్లకు 'గర్వించదగిన అవయవ దాత' కార్డును పంపిస్తారు. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కామినేని ఆస్పత్రి అందరినీ ఆహ్వానిస్తోంది. అవయవదాతగా పేరు నమోదుచేసుకోవడం ద్వారా, కుటుంబానికి జీవనాధారమైన వ్యక్తులకు ప్రాణదానం చేయగల అవకాశం మీకు దక్కవచ్చు. -
జన్మనిచ్చింది... కాలేయం ఇచ్చింది...
నాంపల్లి: కన్నకొడుకు కాలేయ సమస్యతో మంచంపట్టడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని ఇచ్చి పునర్జన్మనిచ్చింది ఓ తల్లి. ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రుల వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం కొండ వనమాల గ్రామానికి చెందిన మోదుగు గుణశేఖర్, అమల దంపతుల కుమారుడు మాస్టర్ చౌహాన్ ఆదిత్య(03) పుట్టుకతోనే పిత్తాశయ ధమని, కాలేయసమస్యతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కాలేయ మార్పిడి కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కాలేయమారి్పడి బృందం, నిలోఫర్ వైద్యు లు కలిసి ఈ నెల 3న ఆదిత్యకు కాలేయమారి్పడి చికిత్సను విజయవంతం చేశారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆరోగ్యంగానే ఉన్నారు. వారిని మంగళవారం ఓజీహెచ్ నుంచి డిశ్చార్జి చేశారు. ఇదే శస్త్రచికిత్స కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించి ఉంటే రూ.30 లక్షలు అయ్యేవని, కూలిపని చేసుకుని జీవించే తమ జీవితాల్లో ఉస్మానియా, నిలోఫర్ ఆసుపత్రి వైద్యులకు వెలుగులు నింపారంటూ బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊహించని పనిచేసి షాకిచ్చిన హీరో విశ్వక్ సేన్
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లెక్కకు మించి హీరోలు వస్తున్నారు. వీళ్లలో తమదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడ్డ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. యాటిట్యూడ్ కామెంట్స్ వల్ల అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు గానీ మంచి యాక్టర్. ఇప్పుడు అంతకు మించిన మంచి పని చేసి శెభాష్ అనిపించుకున్నాడు.(ఇదీ చదవండిు: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)తాజాగా హైదరాబాద్లో 'మెట్రో రెట్రో' పేరుతో అవయవ దానంకి సంబంధించిన ఓ ఈవెంట్ జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన విశ్వక్.. తాను కూడా అవయవ దానం చేస్తానని అన్నాడు. ఈ మేకరు తన వివరాలు ఇచ్చాడు. మిగతా తెలుగు హీరోలు కూడా విశ్వక్ సేన్లా ముందుకొస్తే, అభిమానులు కూడా తమ వంతుగా డోనర్స్ అవుతారు.రీసెంట్గా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించిన విశ్వక్ సేన్.. ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్తో పాటు ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండిు: ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా) -
ప.గో... పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసు!
యలమంచిలి: పుట్టెడు దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా... ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడిని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరిపాలేనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు(బుల్లియ్య) కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టం కొనుక్కుని ఫంక్షన్స్కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల ఒకటోతేదీన కుమ్మరపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు.దానికి పవన్కుమార్ తన స్నేహితుడు కుడక అజయ్తో కలసి సౌండ్ బాక్సులను ఏర్పాటుచేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైనా పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా, అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు ఇద్దరినీ పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పవన్ తలలో రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినా... 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు చెప్పారు. చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మతో కలసి అక్కడకు వెళ్లి మృతదేహానికి నివాళులరి్పంచారు. అవయవ దానం చేసిన తల్లిదండ్రులను అభినందించారు. -
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మరణించినా మరొకరికి జీవనం.. అవయవ దానంపై ఎందుకింత నిర్లక్ష్యం?
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ప్రస్తుతం అవయవాల అవసరం ఉన్నవారు ఎక్కువగానూ, వాటిని దానం చేసే వారి సంఖ్య తక్కువగానూ ఉంది. మన సమాజంలో ఎన్నో అపోహలు రాజ్యమేలుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఇందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే మరణించిన వ్యక్తికి ఏమాత్రం పనికిరాని అవయవాలు మరెందరి ప్రాణాలనో నిలబెడతాయనే విషయాన్ని చాలావరకు గుర్తించడం లేదు. మట్టిలో కలవడం కంటే.. కట్టెలో కాలడం కంటే ఇతరులకు ప్రాణదానం చేయడం ఎంతో మేలని ప్రతివారిలోనూ అవగాహన కలగాలి. అప్పుడే మరెందరో అవయవార్థులు జీవం పుంజుకొని సమాజంలో తమవంతు బాధ్యతలను పోషిస్తారు. ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా చైతన్యం వచ్చినా అవయవాల కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్తో పోలిస్తే లభ్యత తక్కువే. అపోహలు తొలగి మరింత మంది అవయవదానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. భారత్లో అవయవ దానం పరిస్థితి ఎలా ఉంది? దేశంలో అవయవ దానం గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది మరణిస్తున్నారు. దీనివల్ల తమ వారి ప్రాణాలను నిలుపుకోవడం కోసం వారి బంధువులు పడుతున్న వేదన ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేవలం మూత్రపిండాల కొరతతోనే దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక ప్రాణం బలవుతోంది. ఫలితంగా ప్రతి ఏటా 1,00,000 మరణాలు సంభవిస్తున్నాయి మూత్రపిండాలు: దేశంలో దాదాపు 2,00,000 మూత్రపిండాలు అవసరం ఉండగా.. కేవలం 4,000 మార్పిడి (2 శాతం) మాత్రమే జరుగుతుంది. కాలేయం: లక్షమందికి కాలేయం అవసరం ఉండగా..500 (0.5%) మాత్రమే లభిస్తున్నాయి. గుండె: 50,000 మందికి గుండె అవసరం ఉంది.కానీ 50 మార్పిడులు (0.1%). మాత్రమే జరుగుతున్నాయి. కార్నియా: 1,00,000 ప్రజలకు కార్నియా అవసరం. అయితే 25,000 మాత్రమే (25 శాతం) అందుబాటులో ఉంది. అవయవ దానం విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో ముఖ్యమైనవి అవగాహన లేకపోవడం: చాలా మందికి అవయవ దానం గురించి తెలియదు. అపోహలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు: అవయవ దానానికి ఆటంకాలుగా మారాయి. కఠినమైన చట్టాలు: కూడా దీనిని ప్రభావితం చేస్తాయి. ఎక్కువ మంది మహిళలు దానం చేస్తారు. కానీ తక్కువ మంది అవయవాలను అందుకుంటారు. ఆసుపత్రుల కొరత: దేశంలో కేవలం 301 ఆసుపత్రులు మాత్రమే ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నాయి. జనాభా పెరుగుదల: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడం.. పై కారణాలతో భారత్లో అవయవ దానాల రేటు కేవలం 0.34శాతం మాత్రమే ఉంది. ఇక పోతే మరణించిన వారి అవయవాలను దానం చేసేందుకు ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రూ.149.5 కోట్ల బడ్జెట్తో జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం ప్రారంభించింది. అవయవ దాన రేటులో తమిళనాడు వంటి రాష్ట్రాలు ముందున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవగాహన ప్రచారాలు, విద్య, సమాజ ప్రమేయం చాలా అవసరం. మానవ అవయవాలు, కణజాలాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం అవయవ దానం జీవించి ఉన్న దాత ను చి లేదా బ్రెయిన్ డెడ్ అయిన దాత చేయవచ్చు. బ్రెయిన్ డెత్ అనేది రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయం కావడం వల్ల లేదా మరే కారణం చేతనైనా మెదడులో రక్తనాళం చిట్లడం వల్ల సంభవిస్తుంది. శాశ్వతంగా మెదడు పని చేయకపోవడాన్ని బ్రెయిన్డెత్గా నిర్ధారిస్తారు. జీవించి ఉన్న వారు కిడ్నీలు, ప్యాంక్రియాస్లోని భాగాలు, కాలేయంలోని భాగాలను దానం చేయవచ్చు. మరణం తర్వాత మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ పేగులను దానం చేయవచ్చు . అవయవ దానం అవశ్యకత ను దాని ప్రాముఖ్యతను విరివి గా ప్రచారం చేయాల్సిన అవస రం ఉన్నది. దాతగా మారాలనే నిర్ణయం ఎనిమిది మంది జీవితాలను కాపాడుతుంది. అవయవ దానం చేయడం వల్ల ఇతరులకు ఆనందాన్ని, చిరునవ్వులను అందించవచ్చు. కేవలం ఒక అవయవాన్ని దానం చేయడం ద్వారా మరణించిన వారు సైతం శాశ్వతంగా జీవించవచ్చు. చివరగా.. అవయవదానంపై అవగాహనను పెంచి అపోహాలను దూరం చేద్దాం. అవయవ దానాన్ని ప్రోత్సహించి, అవసరమైన వారికి జీవితాన్ని బహుమతిగా ఇద్దాం. -
అవయవదానంతో యువతికి పునర్జన్మనిచ్చిన వీఆర్వో
శ్రీకాకుళం రూరల్/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ)/తిరుపతి తుడా : పుట్టెడు దుఖంలోనూ తమ కుమార్తె అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మను ప్రసాదించిందో కుటుంబం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేటకు చెందిన మౌనిక(23) వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను శ్రీకాకుళంలోని రిమ్స్కు, అనంతరం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖలోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. మౌనిక మెదడు పూర్తిగా డెడ్ అయినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె అవయవాలు వేరేవారికి పునర్జన్మను ప్రసాదిస్తాయని తెలుసుకున్న తల్లిదండ్రులు.. దుఃఖాన్ని దిగమింగుకుని అవయవాల దానానికి ముందుకొచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా రాగోలులోని జెమ్స్ ఆస్పత్రిలో మౌనిక శరీరం నుంచి అవయవాలు వేరుచేశారు. గుండెను తిరుపతి పద్మాలయ హృదయాలయ ఆస్పత్రికి గ్రీన్ చానల్ ద్వారా ప్రత్యేక విమానంలో తరలించారు. ఒక మూత్ర పిండాన్ని వైజాగ్లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి, మరో మూత్ర పిండాన్ని శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి పంపగా.. రెండు కళ్లను రెడ్క్రాస్ సంస్థకు అప్పగించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, ఉమాదేవి మాట్లాడుతూ తమ కూతురు చనిపోలేదని.. అవయవాలను దానం చేసి.. వారిలో బతికే ఉందని చెప్పారు. గుండె మార్పిడితో పునర్జన్మ తిరుపతిలోని శ్రీ పద్మావతి గుండె చికిత్సాలయం మరో యువతికి గుండె మార్పిడి చేసి పునర్జన్మను ప్రసాదించింది. నెల్లూరు పట్టణానికి చెందిన 21 ఏళ్ల యువతి డైలేటెడ్ కార్డియో మయోపతి సమస్యతో బాధపడుతోంది. ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రికి రావడంతో ఆ యువతికి వైద్య పరీక్షలు చేసి.. గుండె సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిందని, మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మౌనిక కుటుంబ సభ్యులు అవయవదానం చేయడంతో విషయాన్ని సీఎం కార్యాలయం చొరవ తీసుకుని సమాచారాన్ని సీఎం వైఎస్ జగన్కు వివరించింది. విశాఖ నుంచి గుండెను తీసుకొచ్చేందుకు చాపర్ విమానాన్ని అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులను విడుదల చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో తెచ్చిన గుండెను యువతికి అమర్చారు సుమారు రూ.12 లక్షలకు పైగా ఖర్చయ్యే గుండె మార్పిడి చికిత్సను ఉచితంగా చేసి యువతికి పునర్జన్మను ప్రసాదించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు 5.30 గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెమార్పిడిని పూర్తిచేసింది. -
మహిళలే త్యాగమూర్తులు.. అవయవ దానంపై ఆసక్తికర అధ్యయనం!
అవయవదానం అనేది చాలా గొప్పది. శరీరంలో ఏదైనా అవయం పాడైపోయి చావుకు దగ్గరైనవారికి అవయవ మార్పిడితో తిరిగి ఊపిరిపోస్తున్నారు. అవయవ మార్పిడిలో అత్యాధునిక వైద్య విధానాలు రావడంతో అవయవ మార్పిడి చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. అయితే స్త్రీ, పురుషుల్లో అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు ఎంత మంది? అవయవ దానం చేసినవారు ఎంత మంది అనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఐదుగురిలో నలుగురు మహిళలే.. దేశంలో అవయవదానం పొందిన ప్రతి ఐదుగురిలో నలుగురు పురుషులు ఉండగా మహిళలు కేవలం ఒక్కరే. ఇక అవయవ దానం చేసిన వారిలో ప్రతి ఐగుగురిలో నలుగురు మహిళలు ఉండగా మగవారు ఒక్కరే ఉన్నారు. 1995 నుంచి 2021 వరకు ఉన్న డేటా ప్రకారం దేశంలో 36,640 అవయవ మార్పిడిలు జరిగాయి. వీటిలో 29,000 మార్పిడులు పురుషులకు, 6,945 మార్పిడులు మహిళలకు జరిగాయి. అంటే అవయవదానం పొందిన వారిలో ఐదింట నాలుగు వంతుల మంది మగవారే ఉన్నారు. ఆర్థిక ఆర్థిక బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు, పాతుకుపోయిన ప్రాధాన్యతలే ఈ అసమానతలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేసేవారిలో మగవారు ఎక్కువగా ఉండగా బతికుండగానే అవయవ దానంచేసిన వారిలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారని నేషనల్ ఆర్గాన్ & టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (NOTTO) డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. దేశంలో మొత్తం అవయవ దానాల్లో బతికుండి అవయవదానం చేసినవారినవి 93 శాతం ఉండగా వీరిలో అత్యధికులు మహిళలేనని ఆయన పేర్కొన్నారు. గ్రహీతల్లో మగవారే.. 2021లో ఎక్స్పెర్మెంటల్ అండ్ క్లినికల్ ట్రాన్స్ప్లాంటేషన్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయన పత్రం భారత దేశంలో అవయవ మార్పిడికి సంబంధించి భారీ లింగ అసమానతలను బయటపెట్టింది. 2019లో అవయవ మార్పిడి డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం సజీవ అవయవ దాతలలో 80 శాతం మంది మహిళలేనని తేల్చింది. వీరిలోనూ ప్రధానంగా భార్య లేదా తల్లి దాతలుగా ఉంటున్నారు. ఇక అవయవ గ్రహీతల విషయానికి వస్తే 80 శాతం మంది మగవారు ఉన్నారు. అవయవ దాతల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటానికి ప్రాథమిక కారణాలను ఈ అధ్యయనం వివరించింది. కుటుంబంలో సంరక్షకులుగా, త్యాగానికి ముందుండేలా మహిళలపై సామాజిక-ఆర్థిక ఒత్తిడి ఉందని, మగవారే కుటుంబ పోషకులుగా ఉండటంతో వారు శస్త్రచికిత్స చేయించుకోవడానికి వెనుకాడతారని విశ్లేషించింది. పూణేలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్కు చెందిన అవయవ మార్పిడి కోఆర్డినేటర్ మయూరి బార్వే మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా తాను ఈ రంగంలో పనిచేస్తున్నానని, ఇన్నేళ్ల తన అనుభవంలో ఒక్కసారి మాత్రమే భర్త తన భార్యకు అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చాడని చెప్పారు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవయవదానం చేసేందుకు ముందుంటారని, ఒకవేళ వారిద్దరూ అందుబాటులో లేనప్పుడు, భార్యలు అవయవ దానానికి ముందుకు వస్తున్నట్లు ఆమె చెపారు. తరచుగా కుమార్తె అవివాహిత అయితే ఆమె దాత అవుతోందని, కానీ భార్యకు అవయవం అవసరమైనప్పుడు మాత్రం దాతలు ముందుకు రాకపోవడంతో వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తోందని వివరించారు. -
అవయవదానంతో ఆరుగురికి ఊపిరి
రాంగోపాల్పేట్: తను శ్వాసను వదలి పెట్టి..మరో ఆరుగురికి ఊపిరి ఉదాడు. తను తనువు చాలిస్తూ ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపాడు. కొండంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు..ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే భర్తను కోల్పోయిన భార్య పెద్ద మనసుతో తీసుకున్న ఆ నిర్ణయం ఆరుగురి ప్రాణాలు నిలబెట్టింది. బ్రెయిన్డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణం పోసేందుకు సికింద్రాబాద్ కిమ్స్ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. వివరాలలోకి వెళితే ఏపీలోని నెల్లూరు పట్టణం గౌతంనగర్ ప్రాంతానికి చెందిన అనంతరెడ్డి, సంపూర్ణమ్మల కుమారుడు హనుమాన్రెడ్డి (46) హైదరాబాద్లో వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్య విజయారెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 29వ తేదీన తీవ్రమైన తలనొప్పి రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్ క్లాట్స్ అయ్యాయని గుర్తించారు. అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్కు గురి కాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. కిమ్స్లోని అవయవదాన సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. ఆయన మరణించినా మరికొంత మంది ప్రాణాలు నిలబెడతారని వారు వివరించారు. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తల్లిదండ్రులు, భార్యా, కుమారులు ఓ గొప్ప కార్యానికి అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు ఆయన రెండు కిడ్నీలు, లంగ్స్, లివర్, రెండు కార్నియాలను సేకరించి వారికి అప్పగించారు. వీటిని జీవన్దాన్లో రిజిస్ట్రర్ చేసుకుని దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి అందిస్తామని జీవన్దాన్ ప్రతినిధులు తెలిపారు. -
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవ దానం
వేలూరు: రాణిపేట జిల్లా సిప్కాడు సమీపంలోని తగరకుప్పం గ్రామానికి చెందిన రాబర్ట్ భార్య జభకుమారి(33). ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడున్నారు. దంపతులిద్దరూ సిప్కాడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబర్ట్, జభకుమారి నాలుగు రోజుల క్రితం కంపెనీలో పని పూర్తి చేసుకొని బైకుపై ఇంటికి బయలు దేరారు. పొన్నై క్రాస్ రోడ్డులోని అనకట్టు చర్చి వద్ద వస్తున్న సమయంలో జభకుమారి ప్రమాదవశాత్తూ బైకు నుంచి కింద పడింది. ఆ సమయంలో జభకుమారి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆమెను రాణిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో జభకుమారికి సోమవారం రాత్రి బ్రెయిన్డెడ్ అయ్యింది. దీంతో ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ చ్చారు. దీంతో ఆమె అవయవాలను రాణిపేటలోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సిప్కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడుగురికి పునర్జన్మనిచ్చిన ‘కీర్తి’
పిచ్చాటూరు: తాను మరణించినా.. తన అవయవాలతో ఏడుగురికి పునర్జన్మనిచ్చింది కీర్తి అనే యువతి. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం రామాపురం ఎస్సీ ప్రాంతానికి చెందిన సి.సంపత్కుమార్, అమ్ములు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. సంపత్కుమార్ ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు. మొదటి కుమార్తె కీర్తి గత ఏడాది బీకామ్ పూర్తి చేసి చెన్నై అరుబాక్కంలోని కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండేది. రెండో కుమార్తె స్వాతి డిగ్రీ, మూడవ కుమార్తె స్మృతి ఫార్మసీ, కుమారుడు సారథి ఇంటర్ చదువుతున్నారు. కీర్తి ఆదివారం చెన్నై నుంచి స్వగ్రామం రామాపురం వచ్చింది. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని కీర్తిని తల్లిదండ్రులు కోరారు. చెల్లెళ్లు, తమ్ముడి చదువులు కొలిక్కి వచ్చాక పెళ్లి చేసుకుంటానని అమ్మ, నాన్నలకు నచ్చజెప్పింది. సాయంత్రం తమిళనాడులోని కరడిపుత్తూరులో ఓ పెళ్లికి గ్రామంలోని తమ బంధువుతో కలసి ద్విచక్ర వాహనంపై వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కరడిపుత్తూరు సమీపంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి దిగబడిపోవడంతో వెనుకవైపు కూర్చుని ఉన్న కీర్తి కిందపడిపోయింది. ఆమె తలకు, చేతికి తీవ్ర గాయమై స్పృహ కోల్పోయింది. వాహనం నడుపుతున్న రాబర్ట్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సాయంతో ఇద్దరినీ సమీపంలో ఉన్న తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని రాజీవ్గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. కీర్తిని పరీక్షించిన వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్థారించారు. గుండె సహా మిగిలిన అన్ని అవయవాలు పనిచేస్తున్న విషయాన్ని గుర్తించారు. కీర్తి అవయవాలను దానం చేయడం ద్వారా మరికొంత మందిని బతికించే అవకాశం ఉందని వైద్యులు వివరించడంతో కీర్తి అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. కీర్తికి గౌరవ వందనం చెన్నై జీహెచ్ వైద్యులు కీర్తి శరీరం నుంచి గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్లు, గుండె వాల్వు, కాలేయం, మూత్రనాళాలు, ఊపిరితిత్తులను మంగళవారం రాత్రి సేకరించారు. స్టాండ్లీ ప్రభుత్వ ఆస్పత్రికి రెండు అవయవాలను తరలించి.. మిగిలిన వాటిని అదే ఆస్ప త్రిలోని రోగులకు అమర్చినట్టు వైద్యులు వెల్లడించా రు. రాగా, మంగళవారం అర్ధరాత్రి కీర్తి పార్థివదేహం వద్ద ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. -
చనిపోయినా బతికుందాం!
మట్టిలో కలిసిపోయే గుండె ఇంకో మనిషిని బతికించగలదు. మంటల్లో కాలిపోయే కళ్లు మరో బతుకులో వెలుగు నింపగలవు. ఆయువు తీరిన దేహం మరొకరి ఆయుష్షు రేఖను పెంచగలదు. ఇందుకు ఒకటే దారి.. అదే అవయవదానం. అంపశయ్యపై ఉన్న వారి తలరాత మార్చాలన్నా.. చావు అంచుల్లో నించున్న వారిని తిరిగి బతుకు దారిలోకి తీసుకురావాలన్నా ఇదొక్కటే మార్గం. నేడు అవయవదాన దినోత్సవం. చనిపోయాక శరీర భాగాలను వృధా చేయడం కంటే మరో మనిషి కోసం వినియోగించడం మాధవ సేవ అని చెప్పే రోజు. అపోహలు వీడి ఓ చైతన్య కాగడాను ఊరూరా వెలిగించాల్సిన తేదీ. ఇచ్ఛాపురం రూరల్: మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అవే అవయవాలను దానం చేస్తే ఎన్నో కుటుంబాల్లో చిరునవ్వులు నింపవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క. సాధారణ మరణాల్లో నేత్రాలను తీసుకుంటారు. నమోదు ఇలా అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తమకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. జీవన్దాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టగా, రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి తమ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా బ్రెయిన్డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీవన్దాన్ డాట్ జీవోవి డాట్ ఇన్’ వెబ్ సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. సజీవమూర్తి కిరణ్చంద్ సోంపేట పట్టణం గీతా మందిరం కాలనీకి చెందిన మల్లారెడ్డి మోహన్, గిరిజా కల్యా ణిల ఒక్కగానొక్క కుమారుడు కిరణ్చంద్(16) జిల్లా వాసుల్లో నింపిన స్ఫూర్తి అనన్యసామాన్యం. 2023 ఏప్రిల్ 15న పదో తరగతి ఆఖరి పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న కిరణ్చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అయితే మెదడులో సమస్య వచ్చిందని, వెంటనే విశాఖపట్నం వెళ్లాలని వైద్యులు సూచించడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి రాగోలు జెమ్స్ ఆస్పత్రికి మార్చారు. వారం రోజుల అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యులు, ఆర్గాన్ డొనేషన్ సమన్వయకర్తలు తల్లిదండ్రులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను దానం చేసి మరికొందరి బతుకుల్లో వెలుగులు నింపారు. 8 మంది జీవితాల్లో ‘చంద్ర’కాంతులు జి.సిగడాం మండలం మధుపాం గ్రామానికి చెందిన పట్నాన చంద్రకళ(32) సీఎఫ్గా పనిచేసేవారు. ఈ ఏడాది మే 30న తలనొప్పితో బాధపడుతూ శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చంద్రకళ తలలో నరాలు చిట్లిపోయి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్డెడ్ అయిందని, ఈమె అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాలకు నూతన వెలుగులు ప్రసాదించాలని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. భర్త శివను, ఇద్దరు కుమార్తెలను ఒప్పించడంతో జూన్ 1న అవయవదానం చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపారు. -
నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు..
వాషింగ్టన్: అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి గుండె చప్పుడు విని భావోద్వేగానికి గురయ్యారు. నాలుగేళ్ల క్రితం తన తండ్రి చనిపోగా ఆయన అవయవాలను దానం చేశారు ఆ బిడ్డలు. ఆ గుండె ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లిన ఆ అక్కాచెలెళ్లకు తండ్రి గుండెను అమర్చిన వ్యక్తి దొరికారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు. మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి. అలా అవయవదానం చేసిన ఎస్టబెన్ శాంటియాగో(39) కుమార్తెలు తన తండ్రి అవయవాల కోసం వెతుకుతూ చివరికి ఆయన గుండెను కనుగొన్నారు. కిసండ్ర శాంటియాగో(22) ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగి చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు. కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఈ మొత్తం దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది. View this post on Instagram A post shared by TODAY (@todayshow) ఇది కూడా చదవండి: దుబాయ్లో భారతీయుడి జాక్పాట్.. నెలకు రూ.5.59 లక్షలు.. -
మైనర్ బాలిక బ్రెయిన్ డెడ్.. అవయవాలు దానం
హైదరాబాద్: ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన రాయపూరి పూజ(16) అవయవాలను కుటుంబసభ్యులు దానం చేశారు. నిమ్స్ వైద్యులు బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయడంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేశారని జీవన్దాన్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకనలో తెలిపారు. వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 18న ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడించింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో వైద్యులు సేవలందించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో బ్రెయిన్ డెత్గా నిర్ధారించారు. దీంతో అవయవ దానం పట్ల జీవన్ దాన్ కోఆర్డినేటర్ అవగాహన కల్పించడంతో పూజ అవయవాలను దానం చేసేందుకు ఆమె కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాస్ను జీవన్ దాన్కు దానం చేశారు. -
దినేష్.. నీ త్యాగం చిరస్మరణీయం !
తాడేపల్లి రూరల్: అవయవదానం చేసి నలుగురికి జీవితాల్లో వెలుగులు నింపిన యువకుడికి మణిపాల్ యాజమాన్యం గురువారం ఘన నివాళులర్పించింది. విజయవాడ విద్యాధరపురానికి చెందిన వుజ్జురి దినేష్(22) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో మణిపాల్ ఆసుప్రతికి తీసుకు వచ్చారు. ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు క్రేనియోటమీ శస్త్ర చికిత్సను నిర్వహించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. వైద్యపరీక్షల అనంతరం బ్రెయిన్ డెడ్గా గుర్తించారు. దినేష్ భార్య వసంత, తండ్రి ఏడుకొండలు, తల్లి సుశీల అంగీకారం మేరకు జీవన్ధార్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబు, మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడిల ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. దినేష్ కాలేయం, కిడ్నీని మణిపాల్ ఆసుపత్రిలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా అమర్చినట్లు మణిపాల్ ఆసుపత్రి వర్గాలు తెలిపారు. కళ్లను వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్కు, లంగ్స్ను కిమ్స్ (సికింద్రాబాద్), ఒక కిడ్నీని విజయ హాస్పిటల్(విజయవాడ)కు తరలించామని వివరించారు. అవయవ దానానికి ముందుకు వచ్చిన దినేష్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది. -
అవయవదానంపై నూతన విధానం రావాలి
సాక్షి, అమరావతి: దేశంలో అవయవదానం, అవయవమార్పిడికి నూతన విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సమాఖ్యతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వస్త్య చింతన్ శిబిర్ కార్యక్రమంలో శనివారం రెండో రోజు మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. అసంక్రమిత వ్యాధుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం గొప్ప విరుగుడుగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో 2021 అక్టోబర్లో అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో క్యాన్సర్, గుండె వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలను గ్రామాల్లోనే చేపడతామన్నారు. ఇప్పటికే 600కుపైగా క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి ఏటా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వివరించారు. రూ.350 కోట్లతో బోధన ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, వసతులు, స్టేట్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్హెచ్ఎం నిధులను మరింత అదనంగా కేటాయించి సహకరించాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్, ఏపీ కుటుంబ సంక్షేమ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయి.. ఐదుగురి జీవితాలకు ‘సంతోష’మిచ్చాడు!
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆరిలోవ ప్రాంతం అంబేడ్కర్నగర్కు చెందిన బొండా వెంకట సంతోష్ కుమార్ (32) బ్రెయిన్డెడ్కు గురికాగా అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబీకులు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవయవాలను దానం చేయడానికి గాను సంతోష్ భౌతికకాయాన్ని విమ్స్కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసి శరీరంలో బాగా పనిచేస్తోన్న అవయవాలను తొలగించి జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. విశాఖ సీపీ సహకారంతో ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అవయవాలను పలు ఆస్పత్రులకు తరలించారు. సంతోష్ భౌతికకాయానికి గురువారం విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఆధ్వర్యంలో ఆర్మీ జవాన్కు జరిగిన మాదిరిగా ఘన వీడ్కోలు పలికారు. సిబ్బంది రెండు వరసలుగా ఏర్పడి పూలుజల్లుతూ అమర్రహే సంతోష్ అంటూ నినాదాలు చేశారు. సంతోష్ తండ్రి శంకర్కు రాంబాబు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. విమ్స్ అంబులెన్స్లో ఆరిలోవలోని నివాసానికి పార్థివదేహాన్ని తరలించగా...కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సంతోష్ శరీరం నుంచి 2 కారి్నయాలు, కిడ్నీలు, లివర్ తీశామన్నారు. హెల్త్సిటీలో అపోలోకు ఓ కిడ్నీ, షీలానగర్లో కిమ్స్ ఆస్పత్రికి మరో కిడ్నీ, హెల్త్సిటీలో పినాకిల్ ఆస్పత్రికి లివర్, హనుమంతవాక వద్ద ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కార్నియాలను జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం తరలించినట్లు తెలిపారు. -
నా తనువు మట్టిలో కలిసినా.. కన్నీరు పెట్టిస్తున్న నిఖిల్ కవిత
మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవ సంబంధాలు కేవలం డబ్బు చుట్టూరానే తిరుగుతున్నాయి. మనం బాగుంటే చాలూ.. పక్కవాడు ఏమైపోతే మాకేం అనుకునేవాళ్లు మనమధ్యే ఉన్నారు. రోడ్డు మీద ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్ఫోన్లతో బంధించే యువత ఉన్న ఈ రోజుల్లో.. చదువుకున్న ఓ యువకుడి ఆలోచన శెభాష్ అనిపించడమే కాదు.. జీవితాన్ని ముందే పసిగట్టి అతను రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది కూడా. చిన్ని నిఖిల్.. వనపర్తి జిల్లా అమరచింతకి చెందిన యువకుడు. బెంగళూరులో బీఏఎంస్ చేసి.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా. అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో విధికి కన్నుకుట్టిందేమో.. 24 ఏళ్ల నిఖిల్ను రోడ్డు ప్రమాదం చలనం లేకుండా చేసేసింది. ఏప్రిల్ 29వ తేదీన బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో నిఖిల్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. చివరకు మే 1వ తేదీన చికిత్స పొందుతున్న నిఖిల్కు బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. అంత శోకంలోనూ కొడుకు ఆశయం నెరవేర్చాలని ఆ తల్లిదండ్రులు రమేష్, భారతిలు ముందుకొచ్చారు. ప్రత్యేక ఆంబులెన్స్లో నిఖిల్ను సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. ఆరుగురికి అవయవదాతగా నిలిచాడు. స్టూడెంట్గా ఉన్న టైంలోనే.. ఆర్గాన్ డొనేషన్ ప్రతిజ్ఞ చేసిన నిఖిల్ అందుకు సమ్మతి పత్రాన్ని సైతం ఓ ఆర్గనైజేషన్కు అందజేశాడు. ఆ సమయంలో ఆ పత్రాలకు అతను జత చేసిన కవిత ఇలా ఉంది.. నా తనువు మట్టిలో కలిసినా.. అవయవదానంతో మరొకరిలో జీవిస్తా.. ఒక అమ్మకు బిడ్డగా మరణించినా.. మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా.. ఏనాడూ వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్లు.. ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు కాలేయం పని చేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం నాలోని ప్రతీ అణువూ అవసరమైన వారికి ఉపయోగపడాలి ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి ఇదే మీకు నాకు ఇచ్చే గొప్ప బహుమతి ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను.. చిరంజీవినై ఉంటాను అవయవదానం చేద్దాం.. మరో శ్వాసలో శ్వాసగా ఉందాం అంటూ పిలుపు ఇచ్చాడు నిఖిల్. ఇదీ చదవండి: తనలాంటి వాళ్లకు కృష్ణప్రియ చేసే సాయం ఇది -
బ్రెయిన్ డెడ్ విద్యార్థి అవయవదానం
-
బాలుడి అవయవదానం.. ఇద్దరికి ప్రాణదానం
శ్రీకాకుళం రూరల్/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్ డెడ్ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్చంద్(16)కు బ్రెయిన్ డెడ్ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు. కిరణ్చంద్ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్చంద్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్చంద్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు. మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్దాన్ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు. గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖలోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు. యువకుడికి కిడ్నీ, లివర్ కిరణ్చంద్ అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్లో విశాఖకు చేర్చారు. ఎయిర్పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్ను అమర్చి ప్రాణం పోశారు. దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్చంద్ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 27 నిమిషాల్లో శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, డాక్టర్ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు. వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్ జవహర్రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు. గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు. -
బ్రెయిన్డెడ్ మహిళ అవయవాలతో ప్రాణదానం..
బెంగళూరు: బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవాలతో ఇద్దరి ప్రాణాలను కాపాడారు వైద్యులు. ఒకరికి లివర్, మరొకరికి కిడ్నీ సకాలంలో అందించి వారికి పునర్జన్మనిచ్చారు. కర్ణాటక ఉడుపి జిల్లా మణిపాల్లో ఈ ఘటన జిరిగింది. జిల్లాలోని ఉప్పండాకు చెందిన 44 ఏళ్ల శిల్పా మాధవ్ ఫిబ్రవరి 25న రోడ్డుప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలపాలైన ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స అందించిన వెద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. దీంతో ఆమె బతికే అవకాశాలు లేకపోవడంతో అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు అనుమతి ఇచ్చారు. అనంతరం కస్తుర్బా ఆస్పత్రి వైద్యులు శిల్పా మాధవ్ లివర్ను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగికి అందించి అతని ప్రాణాలు కాపాడారు. అలాగే కిడ్నీని మంగళూరులోని ఆస్పత్రిలో ఓ రోగికి అమర్చారు. మరో కిడ్నీతో పాటు శిల్పా కళ్ల కార్నియాలు, చర్మాన్ని కసుర్బా ఆస్పత్రిలో భద్రపరిచారు వైద్యులు. వీటిని కూడా అవసరమైన వారికి అందిస్తామని చెప్పారు. చదవండి: బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట -
Devananda: ఇలాంటి కూతురు ఉండాలి!
‘ఈ అమ్మాయిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకు ఇలాంటి కూతురు ఉండాలి’ అని సాక్షాత్తు కేరళ హైకోర్టు 17 ఏళ్ల దేవనంద గురించి అంది. ఎందుకో చదవండి! కేరళలోని త్రిసూర్లో కాఫీ హోటల్ నడుపుకునే 48 ఏళ్ల ప్రతీష్కు నిన్న మొన్నటి దాకా జీవితం సాఫీగానే సాగింది. భార్య ధన్య, కూతురు దేవనంద, కొడుకు ఆదినాథ్... అందరిలాంటి ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం. అయితే ఈ మధ్య కాలు వాపు తరచూ కనిపిస్తుండేసరికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. పరీక్షలు చేశాక డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు– లివర్ కేన్సర్. వైద్యం అంటూ లేదు... లివర్ ట్రాన్స్ప్లాంటేషనే శరణ్యం అని తేల్చి చెప్పారు. అది కూడా వెంటనే జరగాలని చెప్పారు. ఆ మధ్యతరగతి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొచ్చిలోని రాజగిరి హాస్పిటల్ వారు మీరు డోనర్ని తెస్తే మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అని భరోసా ఇచ్చారు. కాని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు డోనర్ దొరకడం అంత సులభం కాదు. దొరికినా సూట్ కావాలి. సమయం లేదు... మరి ఏం చెయ్యాలి? నేనే ఎందుకు ఇవ్వకూడదు అనుకుంది కూతురు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న దేవనంద తండ్రిని కోల్పోవడానికి సిద్ధంగా లేదు. మరో ఆలోచన చేయకుండా ఆస్పత్రి వర్గాల దగ్గరకు పోయి తనే లివర్లోని కొంత భాగం డొనేట్ చేయవచ్చా అని అడిగింది. చేయచ్చు గాని ‘ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ 1994’ ప్రకారం మైనర్లకు అనుమతి లేదని చెప్పారు. దేవనంద ఇంటర్నెట్ జల్లెడ పట్టింది. గతంలో ఇలాంటి కేసులో ఒక మైనర్కు ఆర్గాన్ డొనేట్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చినట్టుగా చదివింది. అయితే ఆ మైనర్ నుంచి ఆర్గాన్ డొనేషన్ జరగలేదు. ఆ తీర్పు ఆధారంగా తాను హైకోర్టుకు వెళ్లాలని నిశ్చయించుకుంది. జడ్జి పూనుకొని హైకోర్టులో జస్టిస్ వి.జి.ఆరుణ్ సమక్షానికి ఈ కేసు వచ్చింది. ప్రత్యేకమైన కమిటీని వేసి ఆర్గాన్ యాక్ట్లో ఏదైనా మినహాయింపుతో దేవనంద తన తండ్రికి లివర్ ఇవ్వొచ్చోకూడదో సూచించమని ఆదేశించాడాయన. కమిటీ అధ్యయనం చేసి చిన్న వయసులో ఇవ్వడానికి ఏ మాత్రం వీలు లేదని, దేవనందను ఇందుకు అనుమతించ వద్దని తేల్చి చెప్పింది. కాని దేవనంద కమిటీ రిపోర్టును మళ్లీ సవాలు చేసి తండ్రిని కాపాడుకునే హక్కు తనకు ఉందని కోర్టుకు చెప్పింది. ‘నాన్నను కోల్పోతే మేము దిక్కులేని వాళ్లం అవుతాం’ అని చెప్పింది. జస్టిస్ వి.జి.అరుణ్ దేవనంద పట్టుదలను, తండ్రి కోసం ఆమె పడుతున్న ఆరాటాన్ని ఎంతో ప్రశంసించారు. ‘ఇలాంటి కూతురు అందరికీ ఉండాలి’ అన్నారు. ఈసారి మరో కమిటీని వేశారు. ఆ కమిటీ దేవనందకు అనుకూలంగా రిపోర్టు ఇవ్వడంతో డిసెంబర్ 2022లో అనుమతి ఇస్తూ తీర్పు చెప్పారు. అన్ని విధాలా సిద్ధమయ్యి ఈ విషయం తెలిసి బంధువులు వారించినా దేవనంద వెనక్కు తగ్గలేదు. తండ్రికి ఆరోగ్యకరమైన లివర్ ఇవ్వడానికి జిమ్లో చేరింది. మంచి పోషకాహారం తీసుకుంది. తండ్రి కోసం ఫిబ్రవరి 9న ఆపరేషన్ బల్ల ఎక్కింది. పెద్ద వైద్యుల బృందం ఆధ్వర్యంలో తండ్రీకూతుళ్లకు సర్జరీ చేసి లివర్ ట్రాన్స్ప్లాంట్ను విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన రాజగిరి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్ల బృందం దేవనందకు ఫ్యాన్స్ అయ్యా రు. తండ్రీ కూతుళ్లు డిశ్చార్జ్ అవుతుంటే అందరూ వచ్చి జ్ఞాపికతో వారిని సాగనంపారు. అంతేనా? దేవనంద పట్టుదల, ప్రేమను చూసి తండ్రి ఆపరేషన్ ఖర్చులను మాఫీ చేశారు. కూతురు ప్రేమ సాధించిన ఘన విజయంగా దీనిని అభివర్ణించవచ్చు. -
తను మరణించినా.. ముగ్గురికి ఊపిరి పోశాడు
కాకినాడ రూరల్: తను మరణించినా.. తన అవయవాల ద్వారా పలువురికి ఊపిరి పోశారు కాకినాడకు చెందిన పెంకే గోవిందకుమార్ (50). కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన గోవిందకుమార్ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు రాజశేఖరన్, ప్రశాంత్, యు.కిషోర్కుమార్, కల్యాణి, శ్రీకాంత్, గణేష్ ఆదిమూలం, డీవీఎస్ సోమయాజులు, వై.కల్యాణ్ చక్రవర్తి, ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, సనా ప్రవీణ తదితరులు రాత్రి 8 గంటలకు దాత నుంచి అవయవాలు సేకరించారు. ఒక కిడ్నీని ఆస్పత్రిలోనే రోగికి విజయవంతంగా అమర్చారు. రాత్రి 10 గంటల సమయంలో మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి, కాలేయాన్ని (లివర్) గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద మణిపాల్ ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. దీనికోసం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్సులు గమ్యానికి సజావుగా చేరేలా ఎస్పీ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అవయవాల తరలింపును ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ సమన్వయం చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్ కో–ఆర్డినేటర్గా స్వాతి వ్యవహరించారు. -
షాకింగ్: 560 మంది శరీర భాగాలను అమ్ముకున్న తల్లీకూతుళ్లు!
వాషింగ్టన్: అమెరికాలోని కొలొరాడో రాష్ట్రంలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. శ్మశన వాటిక మాజీ ఓనర్ అయిన ఓ 46 ఏళ్ల మహిళకు ఫెడరల్ కోర్టు మంగళవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంత్యక్రియల కోసం తీసుకొచ్చిన 560 మృతదేహాలకు చెందిన వివిధ అవయవాలను బంధువులకు తెలియకుండానే అమ్ముకున్నట్లు నేరం నిరూపణ అయిన క్రమంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మృతుల బంధువులను మోసం చేసి ఫోర్జరీ డోనార్ పత్రాల సాయంతో ‘మేగన్ హెస్’ అనే మహిళ శరీర భాగాలను విక్రయించినట్లు తేలిందని అధికారులు తెలిపారు. గత జులై నెలలో తను చేసిన నేరాన్ని అంగీకరించిందని, ఈ క్రమంలోనే కోర్టు 20 ఏళ్ల శిక్ష విధించినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఆమెకు సహకరించిన తల్లి షిర్లే కొచ్కు 15 ఏళ్ల జైలు శిక్ష పడినట్లు తెలిపింది. ఇదీ జరిగింది.. కొలొరాడో రాష్ట్రంలోని మోంట్రోస్లో ‘సన్సెట్ మెసా’ అనే శశ్మాన వాటిక, అవయవదాన సేవలను నిర్వహించేది మేగన్ హెస్. 69 ఏళ్ల తల్లి షిర్లే కొచ్ ఆమెకు ఈ కార్యక్రమాల్లో సహకరించేది. ఈ క్రమంలోనే ఇరువురు అక్రమంగా మృతదేహాల అవయవాలను విక్రయిస్తూ డబ్బులు సంపాదించటం మొదలు పెట్టారు. బంధువులే అవయవాలను దానం చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలను సృష్టించి తమ చీకటి కార్యాన్ని నిర్విగ్నంగా కొనసాగించారు. ఇలా 560 మంది శరీర భాగాలను విక్రయించారు. 2016-2018 మధ్య అమెరికాలో అవయవాల విక్రయాలపై రాయిటర్స్ పరిశోధనాత్మక కథనాలు వెలువడిన క్రమంలో మేగన్ హెస్, ఆమె తల్లి షిర్లే చేసిన దందా బయటపడింది. తల్లీకూతుళ్ల విషయాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)కి రాయిటర్స్ సమాచారం అందించడంతో వారి బిజినెస్ కేంద్రాలపై దాడులు చేసింది. అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన కేసుగా పోలీసులు అభివర్ణించారు. ఇరువురిని అరెస్ట్ చేసి విచారించగా గత జులై నెలలో నేరం అంగీకరించారు. ఈ క్రమంలోనే మేగన్ హెస్కు 20 ఏళ్లు, ఆమె తల్లి షిర్లే కొచ్కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఫెడరల్ కోర్టు. నిందితురాలి తల్లి షిర్లే ప్రధానంగా అవయవాలను శరీరం నుంచి వేరు చేసి భద్రపరిచే పనిలో సహకరించేదని తేల్చింది. తల్లీకూతుళ్ల ఆపరేషన్కు 200లకుపైగా కుటుంబాలు బాధితులుగా మారినట్లు తెలిసింది. మరోవైపు.. హెస్ చేసిన చర్యలను సమర్థించారు ఆమె న్యాయవాది. నిందితురాలికి 18 ఏళ్ల వయసులో మెదడు దెబ్బతిన్నదని అందుకే ఇలా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. కోర్టులో సాక్ష్యం చెప్పిన ఓ బాధితుడు వారి నేరాలపై కీలక విషయాలు బయటపెట్టాడు. తన తల్లికి చెందిన భుజాలు, మోకాళ్లు, పాదాలు విక్రయించారని ఆరోపించారు. అమెరికాలో అవయవాల మార్పిడి కోసం గుండె, కిడ్నీలు వంటి వాటిని విక్రయించడం నేరం. వాటిని ఎవరైనా దానం చేస్తేనే మార్పిడికి ఉపయోగించాలి. చట్టం పరిధిలో లేని తల, భుజాలు, వెన్నెముఖలను సైతం వారు విక్రయించేవారని తేలింది. ఇదీ చదవండి: దేశం విడిచి వెళ్లమని బెదిరింపులు.. నెలకి రూ.1కోటి ఆఫర్: మహిళా కోచ్ -
తనువు లేకున్నా.. తనుంది!
ప్రొద్దుటూరు క్రైం: తాను చనిపోయినా.. తన శరీరంలోని అవయవాలు పది మందికి ఉపయోగపడాలనే ఆమె గొప్ప ఆలోచన పలువురికి ప్రాణం పోసింది. అవయవ దానంతో యువతి ఆదర్శంగా నిలవడమే కాకుండా మరికొందరికి కొత్త జీవితాన్ని అందిస్తున్నది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దేవరశెట్టి సుచిత్ర (25) అనే యువతి బ్రెయిన్ డెడ్తో సోమవారం హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని శ్రీరాంనగర్కు చెందిన దేవరశెట్టి నరసింహులు, అనురాధ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తె రూపశరణ్య, చిన్న కుమార్తె సుచిత్ర. సుచిత్ర స్థానికంగా బీ ఫార్మసీ పూర్తి చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి బెంగళూరులో ఉద్యోగం చేస్తుండగా, రూపశరణ్య బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. నరసింహులు విద్యుత్శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. సుచిత్రకు డిసెంబర్ 31న తీవ్ర తలనొప్పిగా ఉందని చెప్పడంతో స్నేహితులు, తోటి ఉద్యోగులు హుటాహుటిన ప్రొద్దుటూరుకు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించి వైద్యుల సూచన మేరకు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించారు. బ్రైయిన్లో రక్తం గడ్డకట్టిందని స్కానింగ్లో నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులు సుచిత్రను వెంటనే హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ జరిగినా కోలుకోలేక సుచిత్ర సోమవారం మృతి చెందింది. కాగా తమ కుమార్తె మరణానంతరం అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించిందనే విషయాన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రి వైద్యులకు తెలిపారు. దీంతో కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి యువతి శరీరంలోని నేత్రాలు, గుండె, మూత్రపిండాలు, వెన్నెముకను సేకరించి భద్రపరిచారు. మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూర్చులో అంత్యక్రియలు నిర్వహించారు. -
పెళ్లి నాటి ప్రమాణం.. అవయవదానం
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుక అవయవదాన హామీ పత్రాల సమర్పణకు వేదికగా మారింది. వధూవరులు సజీవరాణి, సతీష్కుమార్తోపాటు 66 మంది తమ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. విశాఖలోని అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘం, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అవయవదాన ఆవశ్యకతను తెలియజేస్తూ వివాహ వేదిక వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ట్రస్ట్ ప్రతినిధుల సూచనల మేరకు వధూవరులు, వారి బంధుమిత్రులు 66 మంది అవయవదానం చేస్తామని హామీ పత్రాలపై సంతకాలు చేసి ట్రస్ట్ చైర్çపర్సన్ గూడూరు సీతామహలక్ష్మికి అందజేశారు. ఈ పత్రాలను ప్రభుత్వ సంస్థ జీవన్దాన్కు అందిస్తామని సీతామహలక్ష్మి తెలిపారు. తాము ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది నుంచి అవయవదాన హామీ పత్రాలను స్వీకరించామని చెప్పారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ విద్యార్థుల బోధన అవసరాల కోసం 2007లో 35 మృతదేహాలను అప్పగించిన తర్వాత అవయవదాన హామీ పత్రాల ఉద్యమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 35 మెడికల్ కళాశాలలకు 400 భౌతికదేహాలను అందజేశామన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ద్వారా 18 మందిని బతికించవచ్చని వివరించారు. అవయవదానం చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో ఒకరికి క్లాస్–4 ఉద్యోగం కల్పించినా మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారన్నారు. -
నూతన వధువరుల వినూత్న ఆలోచన.. కుటుంబాలను ఒప్పించి..
నిడదవోలు(తూర్పుగోదావరి): పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అందరి దృష్టి పడేలా చేసి అవగాహన కల్పించాలనుకున్నాడు. కాబోయే భార్యతో ఈ విషయం పంచుకున్నాడు. ఆమె సరే అంది. ఇంకేముంది తమతోపాటు ఓ సామాజిక బాధ్యతకూ పెళ్లిరోజున పెద్దపీట వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు. ఇరువురూ పెద్దలు ముందుకు రావడంతో 60 మంది అవయవదాన హామీ పత్రాలను ఇచ్చే ఘట్టానికి నిడదవోలులో వివాహ వేడుక వేదిక కానుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్కుమార్ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల ఇతనికి పెళ్లి కుదిరింది. వివాహం రోజున సతీశ్ కుమార్ తనతో పాటు బంధువులు, స్నేహితులు కలసి ఇచ్చే అవయవ దాన హమీ పత్రాలే తన వివాహానికి పెద్ద బహుమానమని చెప్పాడు. వారంతా ఇందుకు అంగీకరించారు. కాబోయే జీవిత భాగస్వామి కూడా సతీష్ ఆలోచనను మెచ్చుకుంది. తాను కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం ఈ నవ దంపతుల వివాహ వేడుక జరుగుతుంది. 60 మంది అవయవదాన హామీ పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ గూడూరు సీతామహలక్ష్మి (విశాఖపట్నం) సంతోషం వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా పెళ్లికి హాజరై అవయవదాన హామీ పత్రాలు స్వీకరించనున్నారు. పెళ్లి పత్రికలో అవయవదానం చేయండి–ప్రాణదాతలు కండి అని ముద్రించడం అందరినీ ఆలోచింపజేసింది. అవయవదాన ఆవశ్యకతను విస్త్రతంగా ప్రచారం చేస్తున్న కొత్త దంపతులను పలువురు అభినందిస్తున్నారు. చదవండి: కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. ఓ బాలుడి మరణం కదిలించింది వేలివెన్నులో పదేళ్ల బాలుడు కిడ్నీ పనిచేయక చనిపోయాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స దశలో బాధిత బాలుడికి కిడ్ని దానం చేయడానకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి అవయవదానం అవసరాన్ని గ్రహించాను. చేతనైన మేర దీనిపై ప్రచారం చేస్తున్నాను. నాపెళ్లి శుభలేఖలో కూడా ఇదే అంశాన్ని నినాదంగా ప్రచురించాను. కాబోయే భార్య సజీవరాణికి చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించింది. ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు 60 మంది అవయవదాన హామీపత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. – సతీశ్కుమార్, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం ఆయన ఆలోచన నచ్చింది నిశ్చితార్థానికి ముందు సతీశ్కుమార్ అవయవదానం గురించి చెప్పారు. ఇంత మంచి సేవా కార్యక్రమానికి వివాహం వేదిక కావడం సంతోషం అనిపించింది. అవయవదానంపై మా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. వారంతా అవయవదానానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అవయవదానంపై ఇద్దరం కలిసి ప్రచారం చేస్తాం. – సజీవరాణి, దొమ్మేరు, కొవ్వూరు మండలం -
అవయవదానం ఉద్యమంలా సాగాలి
గాంధీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి పునర్జన్మ ప్రసాదించే అవయవదానం ఉద్యమంలా కొనసాగాలని, ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉండి కూడా దానం చేసేందుకు అంగీకరించడం నిజంగా చాలా గొప్ప విషయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ వివేకానంద ఆడిటోరియంలో జీవన్దాన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అవయవదాతల కుటుంబసభ్యులను సన్మానించి ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. బ్రెయిన్డెడ్ అయినవారు భౌతికంగా మనమధ్య లేకున్నా, దానంతో ప్రాణభిక్ష పొందిన మరో ఎనిమిది మంది వారి ప్రతిరూపాలేనని అన్నారు. బ్రెయిన్డెడ్ అయి అవయవదానం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, పిల్లల చదువు, డబుల్బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. అవయవదానంలో తెలంగాణ చాంపియన్ అవయవదానంలో తెలంగాణ చాంపియన్గా నిలుస్తోందని, ఈ ఏడాది బ్రెయిన్డెడ్ అయిన 179 మంది అవయవాలను దానం చేయగా ఆయా అవయవాలను 1432 మందికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పునర్జన్మ ప్రసాదించామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే దాతలు ఎక్కువన్నారు. బ్రెయిన్డెడ్ అయిన వారిని లేదా వారి నుంచి సేకరించిన అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు హెలికాప్టర్ సేవలు విని యోగించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ఎనిమిదో అంతస్తులో అత్యంత అధునాతమైన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నామని, టెండరు ప్రక్రియ పూర్తయిందని, ఆరు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కోర్టు వివా దాల తర్వాత ఉస్మానియా ఆస్పత్రిలో కూడా ఇటు వంటి బ్లాక్ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో జీవన్దాన్ ఇన్చార్జి స్వర్ణలత, డీఎంఈ రమేష్రెడ్డి, వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, గాంధీ, ఉస్మానియా సూపరింటెండెంట్లు రాజా రావు, నాగేందర్, నిమ్స్ ఇన్చార్జి్జ బీరప్ప, వైద్యులు మంజూష, మనీషా, కిరణ్మయి పాల్గొన్నారు. -
విజయ్ కీలక ప్రకటన, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
రౌడీ హీరో విజయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన మరణాంతరం అవయవ దానం చేస్తానని వెల్లటించాడు. కాగా బాలల దినోత్సవం సందర్బంగా మాదాపూర్లోని పేస్ హాస్పిటల్ అధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేస్తున్న 24 గంటల హెల్ప్లైన్ను విజయ్ ప్రారంభించాడు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారికి బహుమతులు అందించాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘డాక్టర్లు నాకు ఇప్పుడే చెప్పారు.. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన చాలా ఆపరేషన్స్ పబ్లిక్ డోనర్స్, ప్రభుత్వ డోనర్ షిప్ వల్ల జరిగినవే అని. ఇతరుల కోసం అవయవాలను దానం చేయడం చాలా గొప్ప విషయం. అయితే దక్షిణాది దేశాల్లో ఆర్గాన్ డోనేషన్ అనే కల్చర్ చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: హీరోతో డేటింగ్, పెళ్లి.. ఇన్స్టా పోస్ట్స్ డిలీట్ చేసిన మంజిమా మోహన్ మీ అందరి ముందు చెప్తున్నా నేను నా అవయవాలన్నింటిని దానం చేస్తునన్నా’ అని ప్రకటించాడు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆస్పత్రి వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడిన వీడియోను సదరు ఆస్పత్రి యాజమాన్యం తమ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. షరియల్ హీరో’, ‘మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పది అన్న’ అంటూ విజయ్ని కొనియాడుతున్నారు. Vijay Deverakonda | Encouraging Organ Donation at Adult and Pediatric Liver Transplantation Awareness Program, PACE Hospitals #VijayDeverakonda #livertransplant #pacehospitals pic.twitter.com/iIUneNPb6w — PACE Hospitals (@PACEHospitals) November 16, 2022 #VijayDeverakonda celebrating #ChildrensDay by gifting warriors of end-stage liver disease at @PACEHospitals Adult and Pediatric Liver Transplantation Awareness Program #pacehospitals #LiverTransplant @TheDeverakonda 👏🙏🤝👍🫡🤩 pic.twitter.com/Kxh27yauYB — PACE Hospitals (@PACEHospitals) November 16, 2022 -
బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. విల్క్స్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరు ర్యాన్ మార్లో. పాస్టర్గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్ఫెక్షన్తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్ఫెక్షన్ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. వైద్యపరంగా చెప్పాలంటే మరణించినట్లే అని పేర్కొన్నారు. తన భర్త పరిస్థితిని మేగన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిపింది. తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది. మళ్లీ పరీక్షలు.. వెంటనే మేగన్ వైద్యుల దగ్గరికి వెళ్లి తన భర్త బ్రెయిన్ పనితీరుపై మరోమారు పరీక్షలు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్ డెడ్గా ప్రకటించినట్లు స్పష్టమైంది. స్కాన్ రిపోర్టుల అనంతరం మేగన్ మళ్లీ సోషల్ మీడియాలో తన భర్త పరిస్థితి గురించి వెల్లడించింది. ర్యాన్కు బ్రెయిన్ డెడ్ కాలేదని చెప్పింది. దేవుడే తనను బతికించాడని పేర్కొంది. రీస్కాన్ తర్వాత ర్యాన్ హార్ట్బీట్ కొంచెం పెరిగింది. అయితే వైద్యుల చికిత్సకు స్పందనలో మాత్రం మార్పు లేదని మేగన్ చెప్పింది. ర్యాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని పేర్కొంది. చదవండి: ఉక్రెయిన్తో యుద్ధం.. కొరియా కిమ్తో చేతులు కలిపిన పుతిన్! -
గుండెకోతను భరించి...
సాక్షి, అమరావతి: హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం కల్లోలం సృష్టించింది. ఒక మహిళను జీవచ్ఛవంగా మార్చివేసింది. ఇక తన భార్య జీవించడం అసాధ్యమని తెలిసిన ఆమె భర్త గుండెనిండా బాధ ఉన్నా, ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడేందుకు ముందుకొచ్చారు. తన భార్య అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన గుంతి నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ(58) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె హిమశైలుష అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుండగా, మరో కుమార్తె డాక్టర్ బిందుమాధవి విజయవాడ రమేష్ ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్ విభాగంలో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. నాగేశ్వరరావు, వెంకటేశ్వరమ్మ, మరో ఇద్దరు కలిసి ఈ నెల 13న కారులో ప్రయాణిస్తుండగా చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తలకు తీవ్ర గాయాలైన వెంకటేశ్వరమ్మను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగురోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేష్ ఆస్పత్రికి తరలించారు. అయితే 18న వెంకటేశ్వరమ్మ బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు. కుమార్తె చొరవతో... ఒకవైపు తన తల్లి వెంకటేశ్వరమ్మకు బ్రెయిన్ డెడ్ అయిన బాధ, మరోవైపు డాక్టర్గా తల్లి అవయవాలతో మరొకరి ప్రాణం నిలపాలన్న సంకల్పం.. తీవ్ర మానసిక సంఘర్షణ పడుతూనే డాక్టర్ బిందుమాధవి తన తల్లి అవయవదానానికి తండ్రిని ఒప్పించారు. వెంకటేశ్వరమ్మ నుంచి శుక్రవారం రెండు కిడ్నీలు స్వీకరించిన వైద్యులు సీనియారిటీ ప్రకారం ఒక కిడ్నీని రమేష్ ఆస్పత్రిలోని రోగికి, మరొకదాన్ని ఆయుష్ ఆస్పత్రిలోని రోగికి అమర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపారు. లివర్, లంగ్స్, గుండెను గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించారు. అవయవదానం చేసేవరకు బ్రెయిన్ డెడ్ అయిన తల్లిని కుమార్తె బిందుమాధవి దగ్గరుండి వైద్య సేవలు అందిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అవయవదానానికి ముందుకు వచ్చిన వెంకటేశ్వరమ్మ భర్త నాగేశ్వరరావును, కుమార్తెలు హిమ శైలుష, డాక్టర్ బిందు మాధవిని జీవన్దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రాంబాబు అభినందించారు. ప్రజలు అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. -
తాను మరణిస్తూ ఐదుగురికి జీవితాన్నిచ్చిన విద్యార్థి
చెన్నై: మరణంలోనూ జీవనం! అవయవ దానం ఉద్దేశం ఇదే. మరణించిన తర్వాత మరొకరి జీవితాన్ని నిలబెడుతుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్గా మారిన ఓ 19 ఏళ్ల విద్యార్థి తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. తమిళనాడు, చెన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం ఐదుగురికి ఆ యువకుడి అవయవాలు అమర్చారు. చెన్నై శివారులోని ఆర్టేరియల్ గ్రాండ్ సౌథర్న్ ట్రంక్ రోడ్డుపై నెల రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో చెన్నైకి చెందిన ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆ యువకుడిని స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రేలా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ యువకుడు బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. అయినప్పటికీ అతడి ఇతర అవయవాలు పని చేస్తున్నాయని చెప్పారు. ఆసుపత్రికి చెందిన సామాజిక కార్యకర్తలు విద్యార్థి కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు అందుకు అంగీకరించారు. ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. బ్రెయిన్ డెడ్ టీనేజర్కు చెందిన అవయవాలను ఇతరులకు అమర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులకు కిడ్నీ, గుండె అమర్చాం. మరో ముగ్గురికి ఓ కిడ్నీ, రెండు ఊపిరితిత్తులు, కాలేయం మార్చాం.’ అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. అవయవదానంలో తమిళనాడు ముందంజలో ఉందని, అందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ట్రాన్ట్సాన్ సభ్యులు ఆర్ కాంతిమతి. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదీ చదవండి: Viral Video: త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.. మహిళ వీడియో వైరల్ -
అయ్యో టీచరమ్మ! స్కూల్కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర
బనశంకరి(కర్ణాటక): ప్రముఖ ఆసుపత్రుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి కిడ్నీ దానం చేసే వారికి రూ.4 కోట్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు ఆఫ్రికా దేశీయులను సోమవారం బెంగళూరు ఆగ్నేయ విభాగం సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఘనా దేశానికి చెందిన మిని మిరాకల్, నైజీరియాకు చెందిన కోవా కూలింజ్, మ్యాథ్యూ ఇన్నోసెంట్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. సోమవారం అదనపు పోలీస్ కమిషనర్ సుబ్రమణ్యేశ్వరరావ్ ఈ వివరాలను తెలిపారు. పై ముగ్గురూ గతంలోనూ కిడ్నీల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి అరెస్టయ్యారు. విడుదలై మళ్లీ దందా సాగించారు. నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో నకిలి వెబ్సైట్లు, వాట్సప్ ఖాతాలను రూపొందించి ఒక కిడ్నీ విరాళమిస్తే రూ. 4 కోట్లు ఇస్తామని ప్రచారం చేశారు.. ప్రముఖ ఆస్పత్రుల పేర్లతో ఉండడంతో నిజమేననుకుని పలువురు సంప్రదించగా వారి నుంచి వివిధ రుసుముల కింద డబ్బు వసూళ్లు చేశారు. మోసమని తెలిసి కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తే తమకే ఇబ్బంది అని మిన్నకుండిపోయారు. ఆస్పత్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు అమృతహళ్లి అపార్టుమెంట్పై దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితులు హెచ్ఎస్ఆర్ లేఔట్ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
బ్రెయిన్ డెడ్ అయిన వార్డు వలంటీర్ అవయవదానం
గన్నవరం/తాడేపల్లి రూరల్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలంటీర్గా పనిచేస్తోన్న ఓ యువకుడికి రోడ్డు ప్రమాదం జరగడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి, బంధువుల అనుమతితో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఆ యువకుడి అవయవాలను దానం చేశారు. మచిలీపట్నం సుల్తానా బజార్కు చెందిన మరీదు వెంకటరత్నం (లేటు), రేవతిల రెండవ కుమారుడు కోటేశ్వరరావు (27) అక్కడే వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు వివాహం జరగడంతో తల్లితో ఉంటున్నాడు. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వివాహంలో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా భీమడోలు వద్ద కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కు తీసుకువచ్చారు. ఇక్కడి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కోలుకోకపోవడంతో అవయవదానం చేసేందుకు తల్లి రేవతి ముందుకు వచ్చారు. దీంతో కోటేశ్వరరావు అవయవాలను ఎన్ఆర్ఐ వైద్యులు తొలగించారు. 8 మందికి కొత్త జీవితం.. కోటేశ్వరరావు శరీరంలో 6 అవయవాలను దానం చేయడంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎన్ఆర్ఐ చెన్నై ఆసుపత్రికి చెందిన 40 మంది డాక్టర్లు గురువారం శస్త్రచికిత్స చేశారు. కోటేశ్వరరావు శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులు, ప్రాంకయిటిస్, లివర్ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికోసం మంగళగిరి పోలీసులతో పాటు తాడేపల్లి, కృష్ణలంక, పటమట, రామవరప్పాడు, ఆటోనగర్, ఎనికేపాడు, గన్నవరం పోలీసులు హైవేపై భారీ బందోబస్తు నిర్వహించి గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రహదారిలో గ్రీన్ చానల్ను ఏర్పాటు చేశారు. అవయవాలతో ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి బయలుదేరిన 3 అంబులెన్స్లు 27 నిమిషాల్లో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. అక్కడ అవయవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 విమానాల్లో వాటిని చెన్నైకి తరలించారు. కోటేశ్వరరావు 2 కిడ్నీలలో ఒక కిడ్నీని గుంటూరులోని రమేష్ హాస్పిటల్కు, మరో కిడ్నీని మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో రోగికి అమర్చనున్నారు. రెండు కళ్లను ఓ కంటి ఆసుపత్రికి అందజేశారు. -
జీవప్రదాతలు పుస్తకావిష్కరణ
జీవన్ దాన్, నిమ్స్ హైదరాబాద్ విభాగంలో, సదాశయఫౌండేషన్ (గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా) ఆధ్వర్యంలో తీసిన జీవప్రదాతలు అనే ప్రత్యేక సంచికను గురువారం ఆవిష్కరించారు. డాక్టర్ స్వర్ణలత (జీవన్ దాన్ ఇంచార్జ్) పుస్తకావిష్కరణ చేశారు. ఈ పుస్తకంలో అవయవ, శరీరదానం గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దీటి వెంకటస్వామి (సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబెర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ గత 13సంవత్సరాలుగా చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. 500 నేత్రదానాలు, 70 శరీర, 65 అవయవదానాలు చేయడం అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, సెక్రటరీ లింగమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. -
60వ పుట్టిన రోజు: కీలక ప్రకటన ఇచ్చిన జగపతి బాబు
సినిమాల్లో హీరో కన్నా జీవితంలో హీరో అవ్వాలని ఉద్దేశ్యంతో అవయవ దానం చేస్తున్నట్టు నటుడు జగపతి బాబు అన్నారు... సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన అవయవ దానం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విలక్షన నటుడు జగపతిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. చదవండి: Khiladi Movie Review: ఖిలాడి మూవీ ఎలా ఉందంటే.. మనుషులుగా జన్మిస్తాము. మనుషులుగానే చనిపోతాం. వెళ్లేటపుడు 200 గ్రాముల బూడిద తప్ప ఇంకేం మిగలదు అని ఆయన అన్నారు... అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత 7,8 మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు అని జగపతి బాబు అన్నారు... అవయవ దానం చేసిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మ భూషణ్ లు ప్రదానం చేయాలని ఆయన అన్నారు... ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండి భాస్కర్ రావు, సీనియర్ IAS అధికారి జయేష్ రంజాన్, జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ స్వర్ణలత, అక్కినేని నాగసుశీల పాల్గొన్నారు. చదవండి: అక్షయ్తో వివాదం.. వివరణ ఇచ్చిన ప్రముఖ కమెడియన్ -
కన్నుమూస్తూ.. నలుగురికి కొత్త జీవితం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): తను చనిపోతూ నలుగురికి జీవం పోశాడు ఓ వ్యక్తి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన యతిరాజ్యం రామారావు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్కు గురై శాశ్వత లోకాలకు వెళ్లిపోతూ నేత్రాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు దానం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆమదాలవలసకు చెందిన రామారావు వ్యవసాయం చేసేవారు. ఈయనకు భార్య రూపావతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భార్య గృహిణి, పిల్లలిద్దరికీ వివాహమైంది. కుమారుడు నగరంలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్లో పనిచేస్తున్నారు. పదేళ్ల కిందట వ్యవసాయ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో రామారావు కాలు విరిగిపోయింది. చికిత్స చేసి రాడ్లు వేశారు. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా వ్యక్తిగత పనుల నిమిత్తం ఈ నెల 2న వేరే వ్యక్తితో ద్విచక్ర వాహనంపై వెనక కూర్చుని వెళ్తుండగా రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామం వద్ద బండి అదుపు తప్పి రామారావు కింద పడిపోయాడు. దీంతో రామారావును విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించగా, 3వ తేదీన శస్త్రచికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. దీంతో రామారావు అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. ఆస్పత్రి యాజమాన్యం స్పందించి కాలేయం, ఊపిరితిత్తులను వేరే వారికి అమర్చేందుకు తీసుకున్నారు. రెండు నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి అందజేశారు. గుండెను చెన్నైలోని ఎంజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. రామారావు చనిపోతూ నలుగురికి జీవం పోయడంపై ఆయనను, ఆయన కుటుంబసభ్యులను పలువురు అభినందించారు. -
హైదరాబాద్: తనువు చాలిస్తూ.. పలువురికి ఊపిరి పోశారు
సాక్షి, లక్డీకాపూల్ : 55 ఏళ్ల రైతు తాను చనిపోతూ మరి కొంత మందికి ప్రాణదాతగా నిలిచాడు. అవయవాల్ని దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. నల్గొండ జాజిరెడ్డి గూడెంకు చెందిన రైతు సత్తయ్య(55) ఈ నెల20న స్పృహ కోల్పోయాడు. దీంతో కుటుంబసభ్యులు మలక్పేట యశోద హాస్పటల్కు తరలించారు. బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. జీవన్దాన్ ప్రతినిధులు సత్తయ్య భార్య కె. లక్ష్మమ్మను కలిసి అవగాహన కల్పించారు. దీంతో ఆమె తన భర్త అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించినట్టు జీవన్దాన్ ప్రతినిధి పవన్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఇదో గమ్మత్తు కథ.. సీజ్ చేసిన గంజాయి ఎటు పోతుందో తెలుసా! 96 ఏళ్ల వయసులో నేత్రదానం బంజారాహిల్స్: తాను మరణిస్తూ మరొకరికి వెలుగులు నింపాడు ఆ వృద్ధుడు. ప్రముఖ మానవతావాది గోపవరం రామసుబ్బారెడ్డి(96) ఈ నెల 23న కన్నుమూశారు. ఆయన నేత్రాలను అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం సేకరించి కంటి ఆస్పత్రికి అందజేసింది. బతికుండగానే ఆయన తన నేత్రాలను దానం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులు మరణానంతరం వాటిని సంబంధిత కంటి ఆస్పత్రికి అందజేశారు. మరణం తర్వాత కూడా ఆయన తన మానవత్వాన్ని చాటుకున్న గొప్ప సంఘసేవకుడని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వరలింగం తెలిపారు. -
కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్/కూసుమంచి: కానిస్టేబుల్ కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మను ప్రసాదించారు. చనిపోయి కూడా ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన వీరబాబు(35) కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్. మూడు రోజుల క్రితం బైక్పై ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో గొల్లగూడ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు.మలక్పేట యశోద ఆస్పత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయమై మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆరోగ్యపరిస్థితి విషమించింది. ఈ క్రమంలో వైద్యులు మంగళవారం సాయంత్రం బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేశారు. ఈ నేపథ్యంలో వీరబాబు అవయవాలు దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో వైద్యులు వెంటనే జీవన్దాన్కు సమాచారమిచ్చారు. 9.8 కిలోమీటర్లు.. 12 నిమిషాల్లో... ఖమ్మం జిల్లాకు చెందిన పెయింటింగ్ కార్మికుడు తుపాకుల హుస్సేన్(33) అప్పటికే గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండెమారి్పడి చికిత్స నిమిత్తం గుండె కోసం జీవన్దాన్లో సోమవారం రిజిస్టర్ చేసుకున్నారు. దాత కోసం ఎదురు చూస్తుండగా ఆ మరునాడే వీరబాబు గుండె ప్రదానం విషయం ఖరారు కావడం విశేషం. డాక్టర్ సాయిసునీల్, డాక్టర్ రవితేజలతో కూడిన వైద్య బృందం బుధవారం ఉదయం మలక్పేట యశోద ఆస్పత్రికి చేరుకుని అక్కడి వైద్యుల సహకారంతో దాత శరీరం నుంచి గుండెను వేరు చేసింది. దానిని ప్రత్యేక బాక్స్లో భద్రపరిచి రోడ్డుమార్గంలో అంబులెన్స్లో నిమ్స్కు చేర్చింది. అప్పటికే ట్రాఫిక్ పోలీసులుగ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ మధ్యాహ్నం 1.44 గంటలకు యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరి 9.8 కిలోమీటర్లు ప్రయాణించి 1.56 గంటలకు.. అంటే కేవలం 12 నిమిషాల్లో నిమ్స్కు చేరుకుంది. గుండెను భద్రపరిచిన బాక్స్ను తీసుకువస్తున్న నిమ్స్ వైద్య బృందం పదిమంది.. ఆరు గంటలు శ్రమించి డాక్టర్ అమరేష్రావు నేతృత్వంలోని డాక్టర్ గోపాల్, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ పద్మజ, డాక్టర్ నర్మద, డాక్టర్ అర్చనలతో కూడిన బృందం మధ్యాహ్నం రెండు గంటలకు గుండె మారి్పడి చికిత్స ప్రారంభించి రాత్రి ఎనిమిది గంటలకు పూర్తి చేసింది. స్వీకర్త నుంచి సేకరించిన గుండెను విజయవంతంగా దాతకు అమర్చినట్లు వైద్యబృందం ప్రకటించింది. బాధితుడు ఐసీయూలో కోలుకుంటున్నట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా గుండె మారి్పడి చికిత్స చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ చికిత్సను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ సహా ఆస్పత్రి సూపరింటిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాగా, గుండె దాత, స్వీకర్త ఇద్దరూ ఒకే మండలవాసులు కావడం విశేషం. గుండెదాత వీరబాబు స్వగ్రామం కూసుమంచికాగా, స్వీకర్త పెయింటర్ తుపాకుల హుస్సేన్(33) స్వగ్రామం కూసుమంచి మండలంలోని మునిగేపల్లి. -
మృతి చెందాక కూడా 8 మందికి జీవితం ఇవ్వొచ్చు!
దానాలన్నిటిలో అవయవదానం గొప్పది అంటారు పెద్దలు. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు. ఒక మరణించిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మరణానంతరం ఎంతో విలువైన అవయవాలను మట్టిపాలు చేయటం కంటే మన అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతాం. ఒక మనిషి అవయవాలను దానం చేయడం వలన వాటి అవసరం ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టొచ్చంటున్నారు వైద్యులు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా దాదాపు 50 మంది నిరుపేదలకు సహాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక అధికారిక సమాచారం ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవ దాతలు లేక మరణిస్తున్నారు. ఇక అవయవ దానం విషయానికి వస్తే.. దేశంలో ఒక మిలియన్ మందికి గానూ 0.26 శాతం మంది మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చు.. సాధారణంగా అవయవ దానం రెండు రకాలు కాగా మరణం తర్వాత చేసే అవయవ దానం మోదటిది అయితే సజీవ అవయవ దానం రెండవది. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి తన శరీరంలోని మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్ దానం చేయొచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు తదితర అవయవాలను సహజ మరణం పొందిన వారి నుంచే స్వీకరిస్తారు. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చిన్న పేగును మార్పిడి చేయవచ్చు. వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు దానం చేయవచ్చు. ఏదైనా ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయడం ద్వారా తిరిగి చూపు ప్రసాదించవచ్చు. కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేస్తారు. గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తారు. అవయవాలను ఎవరు దానం చేయగలరు.. ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు వరకు అవయవ దానాలు విజయవంతమయ్యాయి. అయితే 18 ఏళ్లలోపు వ్యక్తి మాత్రం తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఏ అవయవ మార్పిడికి ఎంత సమయం.. అవయవ దాత శరీరం నుంచి గుండెను తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే. మూత్రపిండాలను శరీరం నుంచి వేరు చేసిన 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు. కాలేయం, పాంక్రియాస్ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి. అయితే వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడతాయి. అమర్చిన శరీర భాగాన్ని స్వీకర్త శరీరం అంగీకరించక తన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరించి దాడి చేస్తుంది. ఇక దీన్ని నివారించడానికి వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం కొన్నిసార్లు జీవిత కాలంపాటు స్వీకర్త ఔషధాలు వాడాల్సి వస్తుంది. నియమ నిబంధనలు.. అవయవ దానం చేసేవారి కోసం భారత ప్రభుత్వం కొన్ని రూల్స్ను రూపొందించింది. వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్ను పూరించాల్సి ఉంటుంది. -
నువ్వు గ్రేట్ అన్న.. చనిపోతూ కూడా..
సాక్షి,చాదర్ఘాట్(హైదరాబాద్): కుటుంబ సభ్యుడు విగతజీవిగా మారినా గుండె నిబ్బరం చేసుకుని ఓ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. మానవత్వాన్ని మించిన గొప్పతనాన్ని చాటిన ఆ కుటుంబానికి ఆసుపత్రిలోని పలువురు కన్నీటితోనే ఓదార్పును అందజేశారు. తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి జీవన దానం చేసిన అతడు దేవుడితో సమానమని.. సరైన సమయంలో ఆ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవటం గొప్ప విషయమని మలక్పేట యశోదా ఆసుపత్రి ఎండీ సురేందర్రావు కొనియాడారు. ► కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బాబుక్యాంపులో నివాసముండే కంజుల అనిల్కుమార్ (45) మణుగూరు టీఎస్ జెన్కో బీటీపీఎస్లో జేపీఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 11న పాల్వంచ నుంచి మణుగూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు అతడిని మలక్పేట యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. అనిల్కుమార్కు శస్త్ర చికిత్స నిర్వహించి ఆరు రోజుల పాటు వెంటిలేటర్పై ఉంచారు. ► మంగళవారం సాయంత్రం అనిల్కుమార్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు “జీవన్ దాన్’కార్యక్రమం గురించి వివరించారు. మృతుడి అవయవాలను చికిత్స పొందుతున్న ఆరుగురికి అందించి ప్రాణదాతలు కావాలని ఆ కుటుంబ సభ్యులను కోరారు. శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు జీవన్ దాన్కు ఒప్పుకుని ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. ఆరుగురికి అవయవ దానం... బ్రెయన్డెడ్ అయిన అనిల్కుమార్ గుండెను ప్రత్యేక విమానంలో చెన్నై ఆసుపత్రికి.. కిడ్నీని అపోలో, యశోదా ఆసుపత్రులకు, కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి, లివర్, ఊపిరితిత్తులను సికింద్రాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించి అక్కడి రోగుల చికిత్సకు అందజేశారు. అనిల్కుమార్ మృతదేహానికి యశోదా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనం చేశారు. -
ఏ అవయవాన్ని ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు?
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి చనిపోతూ ఎనిమిది మందిని బతికించవచ్చు. కానీ ఆ ఎనిమిది మంది బతకాలంటే చనిపోయిన వ్యక్తి ఇచ్చే అవయవాలతో పాటు వైద్యుల సహకారం కావాలి. సాటిమనిషిని బతికించాలన్న మనసు రావాలి. మన పెద్దాసుపత్రుల్లో ఏటా లక్షల మందికి వైద్యం అందుతోంది. మూడు వేల మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్నీ ఉన్నా ఆసక్తి లేకపోవడం వల్ల బ్రెయిడ్డెడ్ వ్యక్తి నుంచి రావాల్సిన అవయవాలు సేకరించేవారు లేరు. చాలామంది అవయవాల సేకరణ అనేది తమ పరిధిలో లేదని, తమకెందుకులే అని భావిస్తున్నారు. అదనపు భారంగా భావిస్తున్న వైద్యులు ప్రభుత్వ పరిధిలో ఉండే బోధనాసుపత్రులకే ఎక్కువ బ్రెయిడ్డెడ్ కేసులు వస్తాయి. ఈ కేసులకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించాలి. సదరు ఆస్పత్రిలో అవయవాలు అవసరం లేకపోయినా అవయవాలను సేకరించి జీవన్దాన్ ట్రస్ట్కు సమాచారమిస్తే సకాలంలో తీసుకెళ్తారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ డాక్టర్లు ఉన్న ప్రతిచోటా ఈ అవయవాలు సేకరించవచ్చు. కానీ చాలా చోట్ల వైద్యులు ఇది అదనపు పని కదా అని భావిస్తూ ఆసక్తి చూపడంలేదు. ప్రోత్సాహం ఇవ్వాలి.. అవయవాలు సేకరించిన వారికి ఏదైనా ఇన్సెంటివ్లు ఇస్తే బాగుంటుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో జరుగుతున్న ఆవయవ మార్పిడి పరిస్థితిని చూస్తే వేచిచూస్తున్న బాధితులకు 2031 సంవత్సరం వరకు అవయవాలు లభించే పరిస్థితి లేదు. అందువల్ల పెద్దాస్పత్రుల్లోని వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి, అవయవదానంపై ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవగాహన కల్పించి మరింత మందిని బతికించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి వంద పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి జీవన్దాన్ ట్రస్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోయినా సమాచారమిస్తే అవయవాల సేకరణ జరుగుతుంది. దీంతో మరొకరిని బతికించినట్టు అవుతుంది. కానీ చాలామంది రిజిస్ట్రేషన్కు ముందుకు రావడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే కేసులు కూడా.. తమ ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగికి అవసరమైతేనే సేకరిస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తున్నారు. జీవన్దాన్ పరిధిలోకి తేవాలి అవయవాల సేకరణకు స్పెషలిస్టులు చొరవ చూపితేనే సాధ్యమవుతుంది. ఎన్నో బ్రెయిడ్డెడ్ కేసుల విషయంలో అవగాహన లేక వదిలేస్తున్నాం. అన్ని ఆస్పత్రులనూ జీవన్దాన్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకురావాలి. బ్రెయిన్డెడ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ట్రస్ట్కు సమాచారమిచ్చేలా చేస్తే మరింతమందిని బతికించే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి బ్రెయిన్డెడ్ కేసులోనూ అవయవాలు వాడుకోగలిగితే.. వేలమందిని బతికించవచ్చు. – డా.కె.రాంబాబు, జీవన్దాన్ స్టేట్ కోఆర్డినేటర్ ఏ అవయవాన్ని ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు అవయవం- నిల్వ సమయం కళ్లు- 4 నుంచి 6 గంటలు గుండె, ఊపిరితిత్తులు- 4 నుంచి 6 గంటలు కాలేయం- 12 నుంచి 20 గంటలు క్లోమగ్రంథి (పాంక్రియాస్)- 12 నుంచి 24 గంటలు మూత్రపిండాలు- 48 నుంచి 72 గంటలు అవయవాల కోసం వేచిచూస్తున్న బాధితులు అవయవం- బాధితుల సంఖ్య కాలేయం- 556 కిడ్నీ- 1,438 గుండె- 33 ఊపిరితిత్తులు- 10 మొత్తం- 2,037 -
పదమూడేళ్ల బాలుడు.. 7 గురికి కొత్త జీవితం ఇచ్చాడు..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని బాలుడు తన మరణంలోనూ మరో ఏడుగురికి జీవితాన్ని ఇచ్చాడు. చిన్నతనంలోనే అవయవ దానంపై ఆలోచనలు కలిగిన ఆయన మరణంలోనూ తన లక్ష్యాన్ని వదలలేదు. వివరాల్లోకి వెళ్లే... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన డాక్టర్ భానుప్రసాద్ – సీత దంపతులు సామాజిక, అన్యాయాలకు గురైన బిడ్డలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తూ సొంత బిడ్డల్లా చూసుకుంటారు. ఇలా పది మంది పిల్లలు ఉండగా, వీరిలో నాలుగో బాలుడు సిద్దూ. ఆరో తరగతి చదివే ఆయన ఈనెల 14న తీవ్ర జ్వరం రావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 19వ తేదీన హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సిద్ధూ కోరిక మేరకు గురువారం ఆయన శరీరంలో పనికొచ్చే అవయవాలను భానుప్రసాద్ దంపతులు అందజేసి ఉదారత చాటుకున్నారు. కాగా, ఆస్పత్రి వైద్యులు సిద్దూ నేత్రాలు, కిడ్నీలు, లివర్, ప్రాంకియాస్ అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చనుండడంతో ఏడుగురికి ప్రాణభిక్ష పెట్టినట్లయింది. -
దానం.. శరణం గచ్ఛామి
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.. అన్నీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. అవయవ మార్పిడిపై మాత్రం తీవ్ర ప్రభావం పడింది. నిత్యం రోగుల సంఖ్య పెరుగుతున్నా వారికి అవయవాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు మినహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సలు నిలిచిపోయాయి. అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతిని తాత్కాలికంగా మందులతో నెట్టుకొస్తున్న బాధితులకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం జీవన్ దాన్లో 8,985 మంది పేర్లు నమోదు చేసుకోగా, వీరిలో అత్యధికంగా 4,526 మంది మూత్ర పిండాల కోసం, 4,073 మంది కాలేయాల కోసం ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ప్రమాదాలు తగ్గి బ్రెయిన్ డెడ్స్ లేవు. నిజానికి మూత్రపిండాలు, కాలేయాలను లైవ్డోనర్ల నుంచి కూడా సేకరించే అవకాశం ఉన్నప్పటికీ.. బాధితుల కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు రాకపోవడంతో బాధితుల సంఖ్య పెరగడానికి మరో కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే 2013 నుంచి 2021 జులై తొమ్మిది వరకు 872 మంది దాతలు 3,308 అవయవాలను దానం చేశారు. వీటితో 2,233 మందికి పునర్జన్మను ప్రసాదించారు. 43 ఆస్పత్రుల్లో.. 8,985 మంది బాధితులు.. కోవిడ్ కారణంగా సాధారణ చికిత్సలతో పాటు అవయవ మారి్పడి చికిత్సలను కూడా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇదే సమయంలో బ్రెయిన్ డెత్ డిక్లరేషన్లు లేకపోవడంతో అవయవాల కొరత ఏర్పడింది. ప్రస్తుతం జీవన్దాన్ నెట్వర్క్లోని 43 ఆస్పత్రుల్లో 8,985 మంది బాధితులు పేర్లు నమోదు చేసుకుని, అవయవ మారి్పడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వీరిలో ఇప్పటికే కొంత మంది మృతి చెందగా.. మరికొంత మంది ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నారు. అవయవాల కోసం.. ♦ జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 8,985 ♦ కిడ్నీల కోసం నమోదు చేసుకున్నవారు 4,526 ♦ కాలేయ చికిత్సల ఎదురుచూస్తున్న వారు 4,073 ఏ ఆస్పత్రిలో.. ఎంతమంది..? ♦ అపోలో-1494 ♦ యశోద-1772 ♦ నిమ్స్-1310 ♦ కిమ్స్-1209 ♦ గ్లోబల్-1371 ♦ ఉస్మానియా-276 ♦ కేర్-324 చిన్న వయసులోనే పెద్ద జబ్బులు మారిన జీవనశైలికి తోడు ఆహారపు అలవాట్లు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడానికి జన్యుపరమైన సమస్యలతో చాలామంది చిన్న వయసులోనే పెద్ద జబ్బులకు గురవుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తించి మందులు వాడితే నయం అయ్యే జబ్బులను.. అవగాహన లేమికి నిర్లక్ష్యం తోడై వారి పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటి వరకు అవయవాలను దానం చేసిన దాతల్లో 70 శాతం మంది 50 ఏళ్లలోపు వారే. వీరంతా వివిధ రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, కొన ఊపిరితో ఆస్పత్రుల్లో చేరిన క్షతగాత్రులే.. అంతేకాదు అవయవాల కోసం అనేక మంది ఎదురు చూస్తుండగా, వీరిలో 50 ఏళ్లలోపు వారు 4,491 మంది ఉండగా, ఆపై వయసు్కలు 4,494 మంది ఉండటం గమనార్హం. ఊపిరితిత్తుల కోసం కిమ్స్లో.. ఉత్తరప్రదేశ్ లక్నోలోని రామ్మనోహార్ లోహియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఆర్ఎంఎల్ఐఎంఎస్)కు చెందిన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ శారదా సుమన్కు ఏప్రిల్ 14న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటికే ఆమె 8 నెలల గర్భిణి. ఆమెకు వెంటిలేటర్ అమర్చి మే 1న సిజేరియన్ చేసి, కడు పులోని బిడ్డను కాపాడారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎక్మోసపోర్ట్ అవసరమైంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న ఆమెను నాలుగు రోజుల క్రితం ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో నగరానికి తరలించారు. ప్రస్తుతం ఆమె కిమ్స్లో అవయవ మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తోంది. దాతలు ముందుకు రావడం లేదు అవయవ దానంపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఈ జన్మలో అవయవాలను దానం చేస్తే.. వచ్చే జన్మలో ఆ అవయవ లోపంతో జని్మస్తారని భావించి, అవయవ దానానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి అన్ని దానాల్లో కన్నా అవయవ దానం గొప్పది. బ్రెయిన్డెత్ స్థితిలో ఉన్న వ్యక్తి అవయవాలను దానం చేయడం వల్ల తొమ్మిది మందికి పునర్జన్మను ప్రసాదించొచ్చు. పెద్ద సంఖ్యలో ఉన్న బాధితులను కాపాడాలంటే దాతలు కూడా అదే స్థాయిలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ ఏజీకే గోఖలే, గుండె మార్పిడి నిపుణుడు -
‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’
విజయవాడ: ‘మేం ఆత్మహత్య చేసుకుంటున్నాం.. మా అవయవాలు మావిడకు ఇవ్వండి’ అంటూ లేఖ రాసి ఓ వ్యక్తి తన కూతురును హత్య చేసి ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పట్టణంలో చోటుచేసుకుంది. మృతుడు రాసిన లేఖ చూస్తే అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. భార్య అనారోగ్యం చెందడంతో తమ అవయవాలతోనైనా ఆమె కోలుకుంటుందనే ఉద్దేశంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే తన కూతురును కూడా ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని శ్రీనగర్ కాలనీకి చెందిన జగానీ రవి (40), భరణి భార్యాభర్తలు. వారికి ఒక కుమార్తె (10). రవి గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుండేవాడు. వీరు రామకృష్ణపురంలో నివసిస్తున్నారు. రవి భార్య భరణి కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యం పాలయ్యింది. ఆమె అనారోగ్యం చెందడంతో రవి, కుమార్తె మనస్తాపానికి గురయ్యారు. దీంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఆత్మహత్య లేఖ రాసి కూతురుతో కలిసి రవి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చనిపోయిన తర్వాత తమ అవయవాలను భార్యకు దానం చేయాలని లేఖలో రవి పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి సత్యనారాయణ పురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
వైద్యులను భయపెట్టిన బ్రెయిన్ డెడ్ రోగి
లండన్: బ్రెయిన్ డెడ్తో కోమాలోకి జారుకొనే వ్యక్తులను.. బతికున్న శవంగా భావిస్తారు. వారు మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆశ చావక వైద్యం కొనసాగిస్తే.. మరి కొందరు మాత్రం తమ బిడ్డ ఎలాను బతకడు.. తన అవయవాలను దానం చేస్తే.. మరి కొందరి ప్రాణాలైనా నిలబడతాయనే ఆశతో అవయవాలను దానం చేసేందుకు ముందుకు వస్తారు. ఇలాంటి స్థితిలో ఇక బతకడు అని డిసైడ్ అయ్యి.. అతడికి ఆపరేషన్ చేద్దామనుకుంటుండగా.. సదరు బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరంలో కదలిక వస్తే.. చాలా విచిత్రంగా ఉంటుంది కదా ఆ పరిస్థితి. ఇలాంటి ఘటన యూకేలో చోటు చేసుకుంది. అయితే, యూకేలోని లీక్ అనే పట్టణానికి చెందిన లూయిస్ రాబర్ట్స్ అనే 18 ఏళ్ల యువకుడి విషయంలో విచిత్రం చోటుచేసుకుంది. బ్రెయిన్ డెడ్తో ఇక బతికే అవకాశాలు లేవని భావించిన వైద్యులు.. అతడి అవయవాలను మరొకరికి దానం చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది సేపట్లో అవయవాలు తొలగిస్తారనగా లూయిస్ కళ్లు తెరిచాడు. ఈ ఏడాది మార్చి 13న లూయిస్ ప్రయాణిస్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. దాంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వైద్యులు అత్యాధునిక వైద్యం అందించినప్పటికి అతడు కోలుకోలేదు. పూర్తిగా కోమాలోకి జారుకున్న లూయిస్కు వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. మార్చి 17న వైద్యులు మరోసారి అతడికి పరీక్షలు నిర్వహించారు. అతడు బ్రెయిన్ డెడ్ అయ్యాడని .. బతికే అవకాశాలు లేవని డిక్లేర్ చేశారు. దాంతో లూయీస్ కుటుంబ సభ్యులు అతడి అవయవాలను దానమిచ్చేందుకు అంగీకరించారు. లూయిస్ అవయవాలు తొలగించేందుకు వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందించడం నిలిపేశారు. సర్జరీకి ఒక గంట సమయం ఉందనగా.. లూయిస్ తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టాడు. ఊహించని ఈ ఘటనకు వైద్యులు తొలత షాక్ అయ్యారు. ఆ తర్వాత ఈ విషయాన్ని లూయిస్ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆశ్చర్యపోయారు. అతడు స్పృహలోకి రావడమే కాకుండా కాళ్లు చేతులు కూడా కదుపుతున్నాడు. రెప్పలు వేయడం, తలను అటూ ఇటూ తిప్పడం వంటివి కూడా చేస్తున్నాడు. దాంతో వైద్యులు అతడికి వైద్యం అందిస్తున్నారు. దీని గురించి జనాలకు తెలియడంతో అతడి వైద్యానికయ్యే ఖర్చులను ప్రజలు భరిస్తున్నారు. లూయిస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చదవండి: పోస్ట్ మార్టం చేస్తుండగా.. భయానక సంఘటన -
‘బబిత, నేనూ కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం’
న్యూఢిల్లీ: మనిషి పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయంలోనూ ఏదో ఒక పరమార్థం దాగే ఉంటుంది అంటారు పెద్దలు. కొంతమంది సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తే.. మరికొంత మంది తాము చనిపోయినా అవయవదానంతో నలుగురికి పునర్జన్మ కలిగించే గొప్ప భాగ్యం పొందుతారు. కారణజన్ములుగా కీర్తింపబడుతూ ఎంతో మంది తల్లులకు కడుపుకోత తీర్చే దేవతామూర్తులుగా నిలుస్తారు. ఢిల్లీకి చెందిన 20 నెలల పాపాయి ధనిష్ట కూడా ఈ కోవకే చెందుతుంది. ఓ ప్రమాదంలో ఆ చిన్నారికి బ్రెయిన్డెడ్ కాగా.. ఆమె అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. బిడ్డను కోల్పోయామనే బాధను దిగమింగుకుని ఐదుగురు వ్యక్తులకు కొత్త జీవితం ప్రసాదించేందుకు సిద్ధమయ్యారు. తద్వారా దేశంలోనే అత్యంత చిన్న వయసులో అవయవ దానం చేసిన వ్యక్తిగా ధనిష్ట పేరు నిలిచింది. వివరాలు... రోహిణి ప్రాంతానికి చెందిన ఆశిష్ కుమార్, బబిత దంపతులకు ధనిష్ట సంతానం. జనవరి 8న తమ ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో చిన్నారి అదుపు తప్పి మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక గంగారాం ఆస్పత్రికి తరలించారు. తనను కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జనవరి 11న బ్రెయిన్డెడ్ అయినట్లు ప్రకటించారు.(చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన రెండున్నరేళ్ల చిన్నారి) ఈ క్రమంలో.. అదే ఆస్పత్రిలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తూ వేదన అనుభవిస్తున్న పేషెంట్ల పరిస్థితిని కళ్లారా చూసిన ఆశిష్-బబిత.. తమ బుజ్జాయి ద్వారా వారి జీవితంలో వెలుగులు నింపాలని భావించారు. వైద్యులను సంప్రదించి.. తమ నిర్ణయాన్ని చెప్పగా వారు అందుకు అంగీకరించారు. దీంతో ఐదుగురికి కొత్త జీవితం లభించనుంది. ధనిష్ట గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాలను వైద్యులు వారికి అమర్చారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ.. ఇంతటి విషాదంలోనూ ధైర్యం ప్రదర్శించి.. స్వచ్చందంగా అవయవదానానికి ముందుకు వచ్చిన ధనిష్ట తల్లిదండ్రులను ప్రశంసించారు. ఇక బబిత, తాను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ ఐదుగురిలో తమ పాప బతికి ఉంటుందనే సంతోషమైనా మిగులుతుందని ఆశిష్ చెప్పాడు. అదే విధంగా అవయవదానంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతిరోజూ ఎంతో మంది అభాగ్యులు కన్నుమూస్తున్నారని, ఆశిష్- బబితలా ఆలోచిస్తే అలాంటి వారికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కాగా భారత్లో సగటున ప్రతి ఏడాది సుమారు 5 లక్షల మంది అవయవాలు దెబ్బతినడం వల్ల మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి మనం కూడా వీలైనంత ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్ చేయడం సహా ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ జీవితానంతరం కూడా ఈ లోకంలో మన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నారి ధనిష్టలాగే మరికొంత మందిని బతికిద్దాం. ఏమంటారు?! -
మరణించిన కుమారుడి గుండె చప్పుడు విని..
వాషింగ్టన్: చెట్టంత ఎదిగిన బిడ్డ చేతికి అందివచ్చే సమయంలో మరణిస్తే.. ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణించడానికి మాటలు చాలవు. జీవితాంతం ఆ కడుపుకోత వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. తమను వదిలిపోయిన బిడ్డ అవయవాలను దానం చేసి.. మరి కొందరి కడుపుకోతను దూరం చేస్తారు. వారిలో తమ బిడ్డను చూసుకుంటారు. అమెరికాకు చెందిన జాన్ రెయిడ్ కూడా ఇదే పని చేశాడు. 2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన బహుళ వాహన ప్రమాదంలో జాన్ రెయిడ్ కుమారుడు(16) మరణించాడు. దాంతో అతడి అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు జాన్ రెయిడ్. ఇలా అవయవాలు పొందిన వారిలో రాబర్ట్ ఓ'కానర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మసాచుసెట్స్కు చెందిన రాబర్ట్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. దాంతో జాన్ రెయిడ్ కుమారుడి గుండెని అతడికి అమర్చారు. (చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి) ఆపరేషన్ విజయవంతం అయ్యి.. రాబర్ట్ కోలుకుని ఇంటికి వెళ్లాడు. తర్వాత తనకు గుండెని దానం చేసి పునర్జన్మ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని భావించాడు. దాంతో తన హార్ట్బీట్ని రికార్డు చేసి.. ఓ టెడ్డీ బేర్ బొమ్మలో అమర్చి.. దాన్ని రెయిడ్కు బహుమతిగా పంపాడు. రాబర్ట్ పంపిన గిఫ్ట్బాక్స్ని ఒపెన్ చేసిన రెయిడ్ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని హార్ట్బీట్ని విన్నాడు. ఒక్కసారిగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్. గుండె చప్పుడు వింటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ దృశ్యాన్ని రెయిడ్ భార్య వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక టెడ్డీ బేర్ షర్ట్ మీద ‘బెస్ట్ డాడ్ ఎవర్’ అని ఉంది. ఆ కోట్ని వాస్తవం చేసి చూపారు అంటూ నెటిజనులు రెయిడ్ని ప్రశంసిస్తున్నారు. -
ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి
గాంధీనగర్: దానం చేయడం అంటేనే మనకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచడం. ఇక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యా దానం గొప్పదని చెప్తారు. ఒకటి ఆకలి తీర్చితే.. మరొకటి మనతో పాటు మరి కొందరి ఆకలి తీర్చే మార్గం చూపిస్తుంది. అయితే వీటన్నిటికంటే గొప్పదానం మరొకటి ఉంది. కానీ దాని గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు. అదే అవయవ దానం. అవును మనం చనిపోతూ మరి కొందరిని బతికించడం. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. కానీ ఎందుకో మన దగ్గర అవయవ దానం గురించి ఎక్కువగా అవగాహన లేదు.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవు. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి.. వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపుకోతను మర్చిపోతున్నారు. (చదవండి: 36 కిమీ..28 నిమిషాలు! ) వివరాలు.. గుజరాత్కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్ గురించి తెలుసుకున్న డోనేట్ లైఫ్ అనే ఎన్జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. (చదవండి: రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!) ఈ క్రమంలో యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్నాగర్కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్ తల్లిదండ్రులు వీరిలో తమ చిన్నారిని చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్లకు ఎస్కార్ట్గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్కుమార్ తెలిపారు. -
నిర్భయ: ‘వారి పట్ల మానవ కనికరం అవసరం’
న్యూఢిల్లీ: నిర్భయ దోషులకు రేపు (మంగళవారం) ఉరి శిక్ష విధించనున్న నేపథ్యంలో దాఖలైన ఓ పిటిషన్పై సుప్రీం కోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్భయ దోషుల అవయవాలను దానం చేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం సోమవారం తిరస్కరించింది. ఓ వ్యక్తి చనిపోవడం వల్ల.. ఆ కుటుంబానికి తీరని శోకం మిగులుతుందని, అవయవ దానం కోసం దోషుల మృతదేహాలను ముక్కలు చేయడం సరికాదని చెప్పింది. వారి పట్ల మానవ కనికరం కలిగి ఉండాలని పేర్కొంది. అవయవ దానం అనేది స్వచ్ఛందంగా జరగాలని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. (చదవండి: క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి) ఉరిశిక్ష ఎదుర్కోనున్న నలుగురు దోషుల అవయవాలు దానం చేసే వీలు కల్పించాలని మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్ సల్దానా తన పిటిషన్లో కోరారు. ఇకపై మరణ శిక్షకు గురైన వారి అవయవాలను సైతం దానం చేసే దిశగా మార్గదర్శకాలు జారీ చేయాలని సల్దానా పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకరైన పవన్గుప్తా దాఖలు చేసిన పిటిషన్ను సైతం సుప్రీం కోర్టు నేడు కొట్టివేసింది. ఇక పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొన్ని గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. అలాగే డెత్వారెంట్పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌజ్ కోర్టు కూడా నిరాకరించింది. దీంతో నలుగురు దోషులను రేపు (మంగళవారం) ఉదయం ఆరుగంటలకు తీహార్ జైల్లో ఉరితీయానున్నారు. దీని కొరకు జైలు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. -
అవయవదానంపై అవగాహన పెంచాలి
న్యూఢిల్లీ: అవయవదానం గురించి ఒక ఉద్యమంలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని, అప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అవయవ మార్పిడి చేస్తున్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణించిన దాతల నుంచి మార్పిడి, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య భారీ అంతరం ఉందని తెలిపారు. భారత్లో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 0.65 అవయవ దాన రేటు ఉందని చెప్పారు. ఢిల్లీలో భారతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. -
మానవత్వానికే మచ్చ !
సాక్షి,నెల్లూరు: ‘అవయవదానం చేయండి. పదిమంది జీవితాల్లో వెలుగు నింపండి. ప్రాణదానం చేయండి’. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు దీని అర్థాన్నే మార్చేస్తున్నాయి. అవయవదానం ముసుగులో అక్రమాలకుపాల్పడుతూ మానవత్వానికే మాయని మచ్చ తెస్తున్నారు. ఇటీవల కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న వ్యవహారాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు చేసిన శస్త్రచికిత్స విఫలమై బ్రెయిన్డెడ్ అయింది. బాధితుడి పేదరికం ఆస్పత్రికి వరంగా మారింది. అతని అవయవాలపై కన్నేసింది. చికిత్సకైన బిల్లును చెల్లించు.. లేదా అవయవాలు దానం చేస్తావా? అంటూ ఆస్పత్రి యాజమాన్యం బాధితుని భార్యను బ్లాక్మెయిల్ చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అంగీకరించింది. తర్వాత ఆస్పత్రి యాజమాన్యం నిర్వాకంపై ఆమె జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రి వ్యవహారం అధికార బృందం విచారణ జరిపి చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఏం జరిగిందంటే.. అల్లూరు మండలం ఉద్దేపుగుంటకు చెందిన ఏకొల్లు శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి రోడ్డుపై నడిచి వెళుతుండగా బీరంగుంట గ్రామం వద్ద వెనుకనుంచి మోటార్బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతడిని 108 వాహనంలో వైద్యం కోసం నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఈనెల 18వ తేదీన అతని మెదడుకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా విఫలమై శ్రీనివాసులు కోమాలోకి వెళ్లిపోయాడు. బ్రెయిన్డెడ్ కావడంతో బతకడని భావించిన వైద్యులు అతని భార్య అరుణమ్మకు విషయం చెప్పారు. డిశ్చార్జి చేయాలంటే ఆపరేషన్ ఖర్చు రూ.1.27 లక్షలుచెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అసలే రెకా>్కడితే డొక్కాడని ఆ కుటుంబం బిల్లు చెల్లించలేని పరిస్థితి కావడంతో ఆస్పత్రి యాజమాన్యం శ్రీనివాసులు అవయవాలపై కన్నేసింది. బిల్లు చెల్లిస్తావా? కిడ్నీఇస్తావా? అంటూ అతని భార్యపై ఒత్తిడి పెంచారు. యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేని అరుణమ్మ అవయవాలు తీసుకోమని చెప్పింది. అంతే ఆగమేఘాలపై ఆస్పత్రి యాజమాన్యం రెండు కిడ్నీలు, గుండె, రెండుకళ్లు, సేకరించి అందులో కిడ్నీ మాత్రం ఉంచుకుని మిగిలిన అవయవాలు ఇతర ఆస్పత్రులకు పంపింది. అవయవాలు సేకరించిన ఆస్పత్రి యాజమాన్యం కనీస మానవత్వం కూడా చూపకుండా అంత్యక్రియలకు కూడా సాయం చేయలేదు. దీంతో గిరిజన మహిళ అరుణమ్మ తన భర్తను అనాథశవంలా వదిలివేయలేక అష్టకష్టాలు పడి మృతదేహన్ని తీసుకుని సొంతూరికి చేరుకుని ఇతరుల సాయంతో అంత్యక్రియలు చేసింది. ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె రొడ్డెక్కింది. అధికారులకు ఆస్పత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసింది. అవయవ సేకరణలో ఎన్నెన్నో అనుమానాలు? శ్రీనివాసులు అవయవదానంలో ఆస్పత్రి వర్గాలు వ్యవహరించిన వైఖరి పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుల దగ్గర్నుంచి ముందస్తుగా బిల్లు కట్టించుకోలేదు. ఎన్టీఆర్ వైద్యసేవలు వర్తించవని తెలిసినా ఖరీదైన శస్త్ర చికిత్స ఎలాచేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..తలపైన బలమైన గాయాలు లేకపోయినా మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏముంది? నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అవయవాలపై కన్నేసి బిల్లు చెల్లించలేరని తెలుసుకుని అతని భార్యను బ్లాక్మెయిల్ చేశారా? జీవన్దాన్ సంస్థ నిబంధనల ప్రకారం అవయవ దానం స్వీకరించే ఆస్పత్రి ఒక అవయవాన్ని మాత్రం తీసుకునే అవకాశం ఉంది. దానిని ఆస్పత్రి యాజమాన్యం రూ.లక్షల్లో విక్రయించే అవకాశం ఉంది. ఈ కోణంలో ఆస్పత్రి యాజమాన్యం కాసుల కోసం మానవత్వం మరిచిందా? మిగిలిన అవయవాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రులకు పంపిన వైనంలో కూడా కాసులు వేట ఉందా? అవయవ సేకరణ సమయంలో నిబంధనలు సక్రమంగా పాటించారా? ఇలా ఎన్నో అనుమానాలను అనేకమంది వ్యక్తం చేస్తున్నారు. నివేదిక సిద్ధం నెల్లూరులో ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన అవయవ సేకరణపై దుమారం రేగడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. వైద్య అధికారుల బృందంతోపాటు కావలి సబ్కలెక్టర్, తహసీల్దార్ విచారణ జరిపి నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు ఇచ్చారు. అధికారులు విచారణలో అవయవదానం ముసుగులో కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆస్పత్రి నిర్వాకంపై నివేదిక సిద్ధిం చేసి జిల్లా కలెక్టర్కు పంపారు. అయితే సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవద్దంటూ రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
కంటే కూతుర్నే కనాలి
కంటికి రెప్పలా కాచుకునే నాన్నకు చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలతోపాటు కుటుంబంలోని అందరూ తల్లడిల్లిపోతారు. కష్టాలన్నింటిని చిరునవ్వుల మాటున దాచేసి తన వారందరికీ సంతోషాలు పంచే తండ్రి కాస్తంత నీరసంగా కనపడితేనే కుటుంబ సభ్యులంతా కలవరపడతారు. తన భుజాలనే అంబారీగా చేసి సవారి చేయించిన పితాజీ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే కన్నబిడ్డలు పడే వేదన అంతా ఇంతా కాదు. చేయి పట్టి నడక నేర్పించడం దగ్గర నుంచి ప్రయోజకులను చేసే వరకు మార్గదర్శిగా నిలిచిన నాన్నకు కష్టమొస్తే కడుపున పుట్టినవారికి కలత తప్పదు. ఎలాగైనా, ఏం చేసైనా నాన్నను పూర్ణాయుష్కుడిలా చూడాలనుకుంటారు. తన తండ్రి ప్రాణాలను నిలబెట్టేందుకు 19 ఏళ్ల యువతి రాఖీ దత్తా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనే ఇప్పుడు రాఖీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ట్వీట్తో రాఖీ దత్తా గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. కన్నతండ్రి ప్రాణాలు కాపాడేందుకు రాఖీ దత్తా తన కాలేయంలో 65 శాతం దానం చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో తన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయాన్ని పక్కకుపెట్టి మరీ కాలేయాన్ని ఇచ్చిందని తెలిపారు. తండ్రిపై కూతుళ్లు ఎల్లప్పుడూ అవ్యాజమైన అనురాగాన్ని చూపిస్తుంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉండదన్నారు. కూతుళ్లు ఎందుకు పనికిరారని వాదించే వారికి రాఖీ దత్తా సమాధానంగా నిలిచిందని ప్రశంసించారు. రాఖీ దత్తా తన తండ్రితో కలిసున్న ఫొటోతో గోయంకా పెట్టిన ఈ ట్వీట్కు వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు వచ్చాయి. ఆమెను మెచ్చుకుంటూ పుంఖాను పుంఖాలుగా కామెంట్లు పెడుతున్నారు. రాఖీ దత్తాలా మంచి కూతురిగా ఉండాలనుకుంటున్నామని చాలామంది యువతులు వ్యాఖ్యానించారు. ఎంతో గొప్ప పని చేశావని, నిన్ను చూసి గర్విస్తున్నామని మరికొంత మంది అన్నారు. ఎవరీ రాఖీ దత్తా..? కోల్కతాకు చెందిన 19 ఏళ్ల రాఖీ దత్తాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే టెక్నో ఇండియా కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ చేసింది. కోల్కతా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ హానర్స్ కూడా చదివింది. సాఫీగా ఆమె జీవితం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఆమె తండ్రి అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు కాలేయం చెడిపోయిందని, ఆరోగ్యం బాగుపడాలంటే కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ‘నా కాలేయంలో కొంత భాగం తీసి నాన్నకు పెట్టండి’ అంటూ మరో ఆలోచనకు తావులేకుండా రాఖీ దత్తా స్పష్టం చేయడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కేవలం 19 ఏళ్లున్న యువతి ఎలాంటి బెరుకు లేకుండా అవయవదానానికి ముందుకు రావడం వైద్యులను విస్మయానికి గురిచేసింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేందుకు కోల్కతా డాక్టర్లు ముందుకు రాకపోవడంతో సోదరితో కలిసి తన తండ్రిని హైదరాబాద్ తీసుకొచ్చింది. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజి (ఏఐజీ)లో చేర్పించి తన నిర్ణయాన్ని వైద్యులకు వివరించింది. కత్తిగాటుకు, శరీరంపై గాట్లకు భయపడకుండా తన కాలేయంలో 65 శాతం ఇచ్చి తండ్రికి పునర్జన్మ ఇచ్చింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ అనిష్ మిశ్రా, డాక్టర్ ఆనంద్ కులకర్ణిలతో కూడిన బృందం విజయవంతంగా కాలేయ మార్పిడి పూర్తి చేశారు. ఆపరేషన్ అనంతరం రాఖీ దత్తా తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. ఇంత ఘనకార్యం చేసిన రాఖీదత్తా ఎప్పుడూ చెప్పే మాటలు ‘కలలు కనడం ఆపకండి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోండి. ముఖంపై చిరునవ్వును వెలిగించండి. ఆందోళన వదిలేయండి. జరిగిపోయిన దానిగురించి బాధ పడకండి. అన్వేషిస్తూ ఎదగండి’. నిజంగా రాఖీ దత్తా గ్రేట్! సానుకూల పరిణామం మనదేశంలో తండ్రులకు కాలేయ దానం చేస్తున్న యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్కు ఆయన కుమార్తె శ్రీ ప్రశాంతి కాలేయం దానం చేశారు. రెండేళ్ల క్రితం నవీ ముంబైకు చెందిన 22 ఏళ్ల పూజా బిజార్నియా కూడా తన తండ్రి శ్రీరామ్కు కాలేయం దానం చేశారు. ఆమె కుటుంబంలో నలుగురు ముందుకు రాగా పూజ మాత్రమే 12 టెస్ట్ల్లో పాసయి లివర్ ఇవ్వగలిగారు. తండ్రి కోసం తన క్రీడాజీవితాన్ని వదులుకునేందుకు కూడా ఆమె సిద్ధపడ్డారు. అవయవదానం చేయడానికి యువతులు ముందుకు రావడం సానుకూల పరిణామమని వైద్యులు అంటున్నారు. అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని నొక్కి చెబుతున్నారు. పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ డెస్క్ -
అవయవదానంలోనూ ‘ఎర్రవల్లి’ స్ఫూర్తి
జగదేవ్పూర్ (గజ్వేల్): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో 35 మంది అవయవదానానికి ముందుకొచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ భాగ్యభిక్షపతి ఆధ్వర్యంలో మొత్తం 35 మంది యువకులు, మహిళలు కలిసి అవయవదానాలు చేస్తామని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ఎర్రవల్లిని బంగారువల్లిగా మార్చారని, అందుకు కృతజ్ఞతగా తాము అవయవదానం చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భాగ్య, వీడీసీ సభ్యులు బాల్రాజు, కరుణాకర్రెడ్డి, నవీన్, శ్రీశైలం, దాసు తదితరులు పాల్గొన్నారు. -
అవయవదానంతో మరొకరికి ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పుట్టిన రోజున తెలంగాణ జాగృతి మరో బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిలో 50 వేల మందితో అవయవదాన ప్రతిజ్ఞలు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆదివారం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో జరిగిన అవయవదాన ప్రతిజ్ఞ సదస్సులో ప్రకటించింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తొలి సంతకాలు చేసి తమ అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీతో నిరుపేదలకు ఉచిత వైద్యం అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇటీవలే అవయవదానాన్ని కూడా అందులో చేర్చిందని చెప్పారు. అవయవదానంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందన్నారు. సమాజం, తోటి మనుషుల ప్రాణాలపై తెలంగాణ వాసులకుండే గౌరవం, కరుణలను మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఏడాదిలో 50 వేల అవయవదాన ప్రతిజ్ఞల కోసం తెలంగాణ జాగృతి నడుం బిగించిందని తెలిపారు. విస్తృత ప్రచారం అవసరం.. అవయవదానం గురించి ఎవరికీ అవగాహన లేని సమయంలోనే నగరంలో గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి అవయవదాన మార్పిడి శస్త్ర చికిత్స చేసి నూతన ఒరవడిని సృష్టించారని కవిత చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే అవయవ దానంలో మొదటి స్థానంలో ఉండటం గర్వంగా ఉందన్నారు. అవయవదానంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. చనిపోయిన తర్వాత కూడా చిరంజీవులుగా ఎలా బతకవచ్చన్న అంశాన్ని సాధారణ జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని జాగృతి బృందాలకు కవిత సూచించింది. పేదవారిలో అవయవ మార్పిడి శస్త్రచికిత్సను ప్రోత్సహించేందుకు నిమ్స్ వంటి ఆరోగ్య సంస్థల్లో అవయవదానం, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగిందని వివరించారు. అంతేగాకుండా అవయవ మార్పిడి తర్వాత తలెత్తే సమస్యలకు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకు నిమ్స్లో చేసిన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని, అందుకోసం కృషి చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్దాన్తో ఒప్పందం.. అవయవదానంపై ప్రభుత్వ నిమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన జీవన్దాన్ (అవయవదాన కేంద్రం)కు తెలంగాణ జాగృతికి మధ్య కుది రిన ఒప్పంద పత్రాలపై ఎంపీ కవిత, జీవన్దాన్ చైర్మన్ రమేశ్రెడ్డిలు సంతకం చేశారు. కార్యక్రమంలో 800 మందికిపైగా అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్, ముఠా గోపాల్, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు కట్టా శేఖర్రెడ్డిలతో పాటు పలు స్వచ్ఛంద, యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞను చేశారు. అంతకుముందు పుల్వామా దాడిలో మరణించిన జవాన్ల మృ తికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. సమావేశం ముగింపులో స్కౌట్స్ అండ్ గైడ్స్ నిర్వహించిన బ్యాండ్ ఆకట్టుకుంది. ఇది శుభ పరిణామం.. అవయవాల పనితీరు తగ్గిపోయిన పరిస్థితుల్లో అవయవ మార్పిడియే చివరి అవకాశం. జీవన్దాన్ ద్వారా 2012 నుంచి ప్రారంభమైన అవయదానాలు అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్నాయి. 2015లో బ్రెయిన్డెడ్ ద్వారా 104 డొనేషన్లు రాగా 2017లో ఈ సంఖ్య 150కి పెరిగింది. 2018లో 164 వరకు పెరిగి అత్యధిక స్థానంలో ఉన్న తమిళనాడు కంటే ముందుకు వెళ్ళాం. రాష్ట్రవ్యాప్తంగా అవయవదానంపై అవగాహన సదస్సులు విస్తృతంగా చేపట్టడం శుభపరిణామం. డాక్టర్ మనోహర్, నిమ్స్ డైరెక్టర్ ప్రభుత్వ సాయం అందితే మరింత సక్సెస్ 1989లోనే అవయవదానం చేస్తానని సంతకం చేశాను. అవయవదానం ద్వారా 8 మందికి ప్రాణం పొసిన వాళ్ళమవుతాం. ఇప్పుడున్న నూతన సాంకేతికతతో బోన్, కార్టిలేజ్, స్కిన్ అన్నీ ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్దాన్ కార్యక్రమం ప్రారంభించాక అవయవదానంపై అవగాహన పెరిగింది. అవయవదానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం అందేలా చేస్తే కార్యక్రమం మరింత విజయవంతమవుతుంది. డాక్టర్ కె.రవీంద్రనాథ్, చైర్మన్, గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ అవగాహన పెంచాల్సిన అవసరముంది.. దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. స్పెయిన్లో 20 లక్షల మందికి 70 మంది అవయవదానం చేస్తే, అమెరికాలో ఆ సంఖ్య 40గా ఉంటే మనదేశంలో 20 లక్షల మందికి ఒక్కరు మాత్రమే అవయవదానం చేస్తున్నారు. అవయవదానంపై 80 శాతం మందిలో అవగాహన లేదు. మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గురువారెడ్డి, సన్ షైన్ హాస్పిటల్స్ చైర్మన్ -
అవయవదానం.. ఆరేళ్లలో మూడింతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. ఆరేళ్లలో దాతల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2013లో అవయవదానాలు 188 కాగా గతేడాది 573 కు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవన్దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల మార్పిడి కోసం ప్రయత్నించి విఫలమై మరణిస్తున్నారు. దీంతో అవయవదానాలపై మరింత అవగాహన పెరగాల్సి ఉందని వైద్యులు అంటున్నారు. ఎవరు దానం చేయవచ్చు? ఏ ఏ అవయవాలు దానం చేయవచ్చు, ఎవరు చేయవచ్చు అనే సందేహాలున్నాయి. జీవించి ఉండగానే కొన్ని అవయవాలు, వాటి భాగాలను దానం చేయటం ఒక పద్ధతైతే, మరణించిన తర్వాత దానం చేయటం మరో పద్ధతి. ఎవరైనా తాము చనిపోయిన తర్వాత అవయవ దానం చేయాలని సంకల్పిస్తే, అలాంటి వారు తమ రక్త సంబంధీకులు, బంధువుల అనుమతి, అంగీకారంతో అవయవదానపత్రంపై సంతకాలు చేసి అధికారులకు సమర్పించవచ్చు. బ్రెయిన్డెడ్ అయినవారిలో చాలా అవయవాలు అవయవ మార్పిడికి అనువుగా ఉంటాయి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకునే కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నింటిని అవయవ మార్పిడికి ఉపయోగించవచ్చు. మృతి చెందిన వారినుంచి సేకరించిన అవయవాలను ఉపయోగించి అనేకమంది ప్రాణాలను కాపాడవచ్చు. పెరిగిన డిమాండ్... సగమే లభ్యత అవయవ లభ్యత ఎక్కువగా లేనందున మరణాలు జరుగుతూనే ఉన్నాయి. అవస రాలకు, లభ్యతకు పొంతనలేదు. గత ఆరేళ్లలో 4,728 మందికి అవయవాలు అవసరమైతే 2,402 మందికి మాత్రమే వాటిని అందించ గలిగారు. ప్రస్తుతం జీవన్దాన్ నెట్వర్క్తో అనుసంధానమైన ఆస్పత్రులకు రొటేషన్ పద్ధ తుల్లో రోగికి అవయవాలు అందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ఇలాంటి ఆస్పత్రులు 27 ఉన్నాయి. ఒత్తిళ్లు, పలుకుబడితో అవయవాలు పొందే పరిస్థితి ఎక్కడాలేదు. ఈ 27 ఆస్పత్రుల్లోని రోగుల వివరాలూ, వారి ప్రాధాన్యతల వారీగా అనుసంధానమై ఉన్నాయి. దాంతో కేటాయింపుల్లో ఏమాత్రం పొరపాటుకు తావులేదని జీవన్దాన్ అధికారులు అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రులతోపాటు నిమ్స్, గాంధీ, ఉస్మానియాల్లోనూ అవయవ మార్పిడులు చేస్తున్నారు. అవయవాలు కావాల్సిన రోగులు కూడా జీవన్దాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబరు ఇస్తారు. అవయవదానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు. ఎముక మజ్జ, కిడ్నీ, కాలేయంలో భాగం, ఊపిరితిత్తుల్లో కొంతభాగం, పాంక్రియాస్లో కొంతభాగం దానం ఇవ్వొచ్చు. ఎముక మజ్జ, కాలేయం, ఊపిరిత్తులు వంటివి రక్త సంబంధీకులవే బాగా పనికొస్తాయి. బ్రెయిన్డెడ్ను ఎలా నిర్ధారిస్తారు? ప్రమాదం వల్లగాని, నివారణకాని వ్యాధి వల్లగాని మనిషి అపస్మారకస్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్గా పేర్కొంటారు. ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలున్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్లతోపాటు సదరు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన ఐదుగురు సభ్యులతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. అప్పుడు ఆ బ్రెయిన్డెడ్కు గురైనవారి బంధువులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగమైన ’జీవన్దాన్’బృందం సభ్యులు కలసి, మాట్లాడి వారిని అవయవదానానికి ఒప్పిస్తారు. -
పసి వయసు పరబ్రహ్మ
ఏడాది క్రితం..! మెట్టుమెట్టుగా భవిష్యత్ను నిర్మించుకుంటూ పదో తరగతి చేరింది పద్నాలుగేళ్ల అవులూరి అభినయ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలో సాధారణ కుటుంబం అభినయది. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సోదరుడు వెంకట్ వరుణ్ పాల్వంచ కేఎల్ఆర్ కాలేజీలో మైనింగ్లో డిప్లొమా చేస్తున్నాడు. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఒక ప్రింట్ మీడియాలో సీనియర్ జర్నలిస్ట్. గతేడాది ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆరోజే ఒక్కసారిగా అభినయ కలలసౌధం కుప్పకూలింది. చెప్పాలని ఉంది..! తండ్రి ఎడబాటుతో అభినయ విచలితురాలైంది. ఒక వైపు తల్లి శోకాన్ని పరికిస్తూ, మరోవైపు.. ఆవేదనలో ఉన్న సోదరుడిని ఓదారుస్తూ, తండ్రినే కలవరిస్తూ, పలవరిస్తూ నీరసపడిపోయింది. పగలంతా తండ్రి జ్ఞాపకాలు. రాత్రి నిద్రలోనూ తండ్రిని కోల్పోయిన పీడకలలే. ఆ క్రమంలోనే రోజురోజుకూ నీరసించిన అభినయను మానసిక నిస్సత్తువ కుంగదీసింది. తీరని ఆ విషాదంలోనే తలనొప్పి రూపంలో ఆమెను తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. వైద్యులకే అంతుచిక్కని వ్యాధితో కృషించి పోయింది అభినయ. దాంతో కొత్తగూడెంలో వైద్యం అందిస్తున్న స్థానిక వైద్యులు హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇదంతా గమనిస్తున్న అభినయ తన తల్లి కవితకు మనసులో మాటేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపించేది. ఇదేదో ప్రాణాంతక వ్యాధి అని గ్రహించిందో ఏమో ఆ చిట్టి తల్లి.. తను పోయినా నలుగురిలో బతికుండాలని తపన పడింది. తటపటాయిస్తూనే ‘చిరంజీవి’గా ఉండిపోవాలనే తన జీవితేచ్ఛను తల్లి చెవిలో విన్పించింది. అందుకు తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం, విద్యాదానం, నేత్రదానం గొప్పవని మనంచెప్పుకుంటుంటాం. అయితే బాల్యమింకా పూర్తిగా వీడకుండానే అవయవదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాలని అభినయ ఆశించిందని తెలిసి పలువురి కళ్లు చెమర్చాయి. ఐదుగురికి పునర్జన్మ బ్రెయిన్ డెడ్ అయిన అభినయ కళ్లు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయం బాగానే పనిచేస్తున్నాయి. వీటిని అవసరమైన ఐదుగురు రోగులకు వైద్యులు అమర్చారు. అలా అభినయ వల్ల ఐదుగురికి పునర్జన్మ లభించింది. కడసారిగా తను సంకల్పించినట్టుగానే ఆ చిన్నారి తన జీవితేచ్ఛను నెరవేర్చుకుంది. పిన్న వయసులోనే పదుగురికి ఆదర్శంగా నిలిచి ఇక వీడ్కోలంటూ మరలిరాని లోకాలకేగినా ఈ భువిపై తరతరాల జ్ఞాపకంగా అందరి మదిలో నిలిచిపోయింది. ∙విషాదమేమిటంటే ఆమె తండ్రి కర్మ ఈనెల 17వ తేదీన వస్తుండగా, అదే తేదీన అభినయ కర్మ కూడా రావడం! ఈ విషయాన్ని చెబుతూ, ‘ఇదేమి కర్మ భగవంతుడా’ అని అభినయ తల్లి కవిత బోరున విలపించింది. ‘అది నా బిడ్డ చివరి కోరిక’ ‘‘నా బిడ్డ లోకం విడిచిపోయినా ఐదుగురికి పునర్జన్మనిచ్చి వెళ్లింది. నా భర్త జాండీస్ సోకి, అనారోగ్యంపాలై ఆకస్మికంగా చనిపోయారు. తండ్రి పోయాక అభినయ బాగా నీరసించిపోయింది. భరించలేని తలనొప్పితో ఈనెల ఐదున అనారోగ్యం పాలైంది. వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాం. అక్కడ రెండు రోజుల పాటు వైద్యం అందించారు. ఏడవ తేదీ సాయంత్రం అభినయకు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. అభినయ కోరిక ప్రకారం ఆమె అవయవాలు దానం చేశాం’’ అని చెప్పారు కవిత. -
‘నాలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు’
వాషింగ్టన్ : గర్భవతిని అయ్యాననే సంతోషం క్రిస్టా డేవిస్కు ఎంతో కాలం నిలవలేదు. 18 వారాలు నిండిన తర్వాత చెకప్ కోసం వెళ్లిన ఆమె.. పుట్టిన కొన్ని నిమిషాల్లోనే బిడ్డ మరణిస్తుందనే చేదు వార్త వినాల్సి వచ్చింది. కుదిరితే వెంటనే అబార్షన్ చేయించుకోవాలి లేదా బిడ్డ పుట్టిన తర్వాత అవయవాలు దానం చేసి మరికొంత మందికి పునర్జన్మ ఇవ్వొచ్చని సలహా ఇచ్చారు డాక్టర్లు. క్రిస్టా, ఆమె సహచరుడు డేరెక్ లోవెట్కు డాక్టర్లు ఇచ్చిన రెండో ఆప్షన్ నచ్చింది. బిడ్డకు జన్మనిచ్చి ఆమెను చిరంజీవిని చేయాలని నిర్ణయించుకున్నారు. అలా క్రిస్మస్ ముందు రోజు తమ గారాల పట్టి ‘రైలీ ఆర్కాడియా లోవెట్’ను భూమ్మీదకు తీసుకువచ్చారు. వారం రోజుల పాటు బతికింది.. ఎనెన్సీఫలీ(మెదడు భాగం రూపుదిద్దుకోకపోవడం)అనే అరుదైన వ్యాధితో జన్మించిన రైలీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వారం రోజుల పాటు బతికింది. రైలీని చూసిన వైద్యులు నిజంగా తనో అద్భుతం అని, ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కాస్త సంతోషాన్నైనా పంచిందని పేర్కొన్నారు. అనంతరం క్రిస్టా, డెరిక్ల అనుమతితో రైలీ హార్ట్ వాల్వ్స్ను ఇద్దరు పిల్లలకు అమర్చారు. అంతేకాకుండా ఆమె ఊపిరితిత్తులను కూడా సేకరించి మరొకరికి అమర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ విషయం గురించి రైలీ తల్లి క్రిస్టా పీపుల్ మ్యాగజీన్తో మాట్లాడుతూ.. ‘ రైలీ పరిస్థితి తెలియగానే షాక్కు గురయ్యాం. మా కూతురిని ఇంటికి తీసుకురాలేమని తెలిసినప్పటికీ తనకి జన్మనివ్వాలని నిర్ణయించుకున్నాం. 40 వారాల తర్వాత వైద్యుల పర్యవేక్షణలో తనకి జన్మనిచ్చా. రైలీ మరణించేంత వరకు నేను, డెరిక్ ఆస్పత్రిలోనే ఉన్నాం. ఆ వారం రోజులు తను అస్సలు ఏడవలేదు. కానీ చనిపోయే ముందు మాత్రం చిన్నగా మూలిగింది. బహుషా ఆ సమయంలో తనకి శ్వాస అందలేదేమో. ఏదేమైనా నాలాంటి పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు. రైలీ అవయవాలు దానం చేయడం ద్వారా తాను పునర్జన్మ పొందినట్లుగా భావిస్తున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత నెల మొదటి వారంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెటిజన్ల మనస్సును ద్రవింపజేస్తోంది. -
అవయవదాన పత్రంపై లక్ష్మారెడ్డి సంతకం
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసి సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. మరికొందరు అవయవదానం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించడం విశేషం. ఆదివారం లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబి రం నిర్వహించినట్లు తెలిపారు. 15 ఏళ్లుగా తన పుట్టినరోజున శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. గతంలో 1,220 యూనిట్ల రక్త సేకరణ రికార్డుగా ఉండగా, ఈ ఏడాది 2,120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. -
210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం
భువనేశ్వర్: పెద్దల అదుపాజ్ఞలు లేక కుంటుపడిన తన విద్యాభ్యాసంలా.. నేటి తరం బాలలు విద్యకు దూరం కాకూడదనే ‘పెద్ద మనసు’ ఆయనను సంఘ సేవలోకి అడుగిడేలా చేసింది.. పసి హృదయాల్లో ప్రాథమిక విద్యాభ్యాసంపై మక్కువ పెంపొందించి విద్యార్జనకు పునాది వేసే ‘ఆశా ఓ ఆశ్వాసన్’ సంస్థను స్థాపించేలా ప్రేరేపించింది. స్వీయ జీవితంలోని తప్పిదాలు భావితరాలకు పునరావృతం కాకూడదనే సదభిప్రాయమే ఆయనకు మన దేశపు ప్రతిష్టాత్మక పురస్కారం ‘పద్మశ్రీ’ తెచ్చిపెట్టింది. ఆయనే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వలస వచ్చి కటక్ మహానగరంలోని బక్షిబజార్ (మురికివాడ)లో స్థిరపడిన దేవరపల్లి ప్రకాశరావు. ఆయన వయసిప్పుడు 59 సంవత్సరాలు. తాత, ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో స్థిరపడ్డారు. అర్ధాంతరంగా ఆయన చదువు అటకెక్కడంతో.. తండ్రి పెట్టిన టీ కొట్టునే జీవనాధారం చేసుకున్నారు. తనలా మరెవరూ విద్యకు దూరం కాకూడదనే సత్సంకల్పంతో తనకున్న రెండు గదుల ఇంటిలోనే ఓ గదిని చిన్న స్కూల్గా మార్చేశారు. ఇప్పుడు ఆ స్కూల్లో సుమారు 80 మంది విద్యనభ్యసిస్తున్నారు. విద్యాదానమే కాదు... ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ ప్రకాశరావుది పెద్ద చెయ్యే. ఒకానొక సందర్భంలో తనకు రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడిన ఓ అపరిచిత వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన.. 1976 నుంచి ఇప్పటి వరకు 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశారు. ప్రతి రోజూ ప్రభుత్వాస్పుత్రిలోని పేద రోగులకు పాలు, బిస్కెట్లు, పండ్లు దానం చేస్తుంటారు. విద్యాధికుడు కాకున్నా జీవన స్రవంతిలో దైనందిన మనుగడ కోసం ఆయన 8 భాషల్లో మాటామంతీ చేయగల సమర్థుడు. ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం తరహాలోనే చదువుపై బాలల్లో మక్కువ పెంపొందించేందుకు పాలు, బిస్కెట్లు, బన్ వంటి తినుబండారాలు నిత్యం ఉచితంగా ఇస్తూ ఆదరిస్తున్నారు. పిల్లలకు యూనిఫాం, చెప్పులు కూడా ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం 4 నుంచి 9 ఏళ్ల లోపు సుమారు 80 మంది బాలలు ఆయన ఆధ్వర్యంలో అక్షరాలు నేర్చుకుంటున్నారు. చిట్ట చివరగా ఆయన మరణానంతరం కూడా మానవాళి మనుగడకు ఎంతో కొంత దోహదపడాలనే తపనతో అవయవ దానం చేసేందుకు ఇప్పటికే అంగీకార పత్రం ఇచ్చారు. ఆయన ఆర్జించిన దానిలో సింహ భాగం సంఘసేవకే వెచ్చిస్తుంటారు. కాగా నిజ జీవితంలో ఎదురైన కష్ట నష్టాలు తోటి వారిలో తిరిగి చూడరాదనే భావమే సంఘ సేవకు ప్రేరేపించి నేడు తనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీతగా నిలిపిందని ‘సాక్షి’తో దేవరపల్లి ప్రకాశరావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు ప్రకాశరావు సంఘసేవ గురించి తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది మే నెలలో ఒడిశా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా దేవరపల్లి ప్రకాశరావుతో భేటీ అయ్యారు. ఆయన నిర్వహిస్తున్న సంస్థను సందర్శించి ముచ్చటపడ్డారు. ఆయన సేవలు అనన్యమని అభినందించారు. అనంతరం మన్ కీ బాత్ ప్రసార కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రకాశరావు సంఘసేవలో తలమునకలై నిరంతరం కొనసాగించడం అభినందనీయమని.. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం విశేషం. ప్రకాశరావును పద్మశ్రీ వరించినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. -
ఆ నలుగురిలో సజీవంగా..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై బ్రెయిన్ డెడ్కు గురైన యువకుడి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తమ కొడుకు కళ్లెదుట లేకున్నా.. మరో నలుగురిలో సజీవంగా ఉండాలన్న ఆశయంతో అవయవదానానికి ముందుకొచ్చారు. కృష్ణా జిల్లా యనమలకుదురు కట్ట ప్రాంతంలో నివసించే సంభాన దుర్గాప్రసాద్ (23) ప్రయివేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుంటాడు. ఈ నెల 21న ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స కోసం కానూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు దుర్గాప్రసాద్ను పరీక్షించి బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిర్ధారించారు. ఎంత ఖరీదైన వైద్యం చేసినా ఫలితం ఉండదని, అవయవదానం చేస్తే మరికొందరికి ప్రాణదానం చేయవచ్చని కుటుంబీకులకు వివరించారు. కొడుకు చనిపోతున్నాడనే బాధలోనూ తల్లిదండ్రులు మంచి ఆశయంతో అవయవదానానికి సమ్మతించారు. ‘సన్రైజ్’లో అవయవాల సేకరణ బ్రెయిన్డెడ్కు గురైన యువకుడిని జీవన్దాన్ అనుమతి ఉన్న సన్రైజ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరోసారి న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్ల బృందం పరిశీలించి బ్రెయిన్డెడ్గా నిర్ధారించిన అనంతరం అవయవాలను సేకరించారు. గుండెను చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి, కిడ్నీలు సన్రైజ్, ఆయుష్ ఆస్పత్రులకు, లివర్ను ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. గుండెను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా గన్నవరం, అక్కడి నుంచి విమానంలో చెన్నైకి తరలించారు. పోలీసులు అంబులెన్స్కు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయడంతో సన్రైజ్ ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయానికి 19 నిమిషాల్లోనే చేరుకుంది. పోలీసులకి సన్రైజ్ ఆస్పత్రి అధినేత డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
గురుగ్రాం కాల్పుల కేసు : జడ్జి కుమారుడి అవయవదానం
సాక్షి, న్యూఢిల్లీ : సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో గాయపడిన గురుగ్రాం జడ్జి కుమారుడు పదిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. మరణించిన అడిషనల్ సెషన్స్ జడ్జి కుమారుడి కీలక అవయవాలు గుండె, కాలేయం, మూత్రపిండాలను దానం చేసినట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. గురుగ్రాం సెక్టార్ 49లో న్యాయమూర్తి అధికారిక సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో జడ్జి భార్య ఘటనా స్ధలంలోనే మరణించగా, తీవ్ర గాయాలైన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న వెంటనే మహిపాల్ సింగ్గా గుర్తించిన గన్మాన్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసేందుకు సెలవు కావాలని గార్డు కోరగా, అందుకు నిరాకరించిన జడ్జి తన కుటుంబం షాపింగ్ వెళ్లేందుకు తోడుగా వెళ్లాలని సూచించారు. దీనిపై తీవ్ర ఆగ్రహానికి లోనైన సెక్యూరిటీ గార్డు గురుగ్రాం మార్కెట్లోని జనసమ్మర్ధం కలిగిన రోడ్డుపై పట్టపగలే తల్లీకొడుకులపై కాల్పులకు తెగబడ్డాడు. మరోవైపు హర్యానా పోలీసులు తమను వేధిస్తున్నారని నిందితుడి కుటుంబం ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూసేందుకు మహిపాల్ సింగ్ సెలవు కోరారని వారు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మందుల చీటీని సైతం వారు చూపుతున్నారు. మహిపాల్ సింగ్ వారి ఇంట్లో పనిచేయడం లేదని, తనను సెక్యూరిటీగా కుటుంబ సభ్యులతో పంపడం ఆయనకు ఇష్టంలేదని సింగ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
మరణించినా జీవించు
వైద్య రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోంది. అధునాతన పరికరాలు, వైద్య సేవలు, మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ రోగాన్ని అయినా తగ్గించే డాక్టర్లు, ఆస్పత్రుల సంఖ్య అధికంగానే ఉంటోంది. కృత్రిమ అవయవాలు కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ, కొన్ని అవయవాలను మాత్రం ఒక మనిషికి మరో మనిషి నుంచి సేకరించే అమర్చాలి. అలాంటి అవయవాలను కోల్పోయి చావుకు చేరువైన వారిని బతికించాలంటే.. చనిపోయిన వారు అవయవదానం చేయాలి. మరణానంతరం ఒక వ్యక్తి అవయవదానం చేస్తే.. అలాంటి అవయవాల లోపంతో బాధపడుతున్న 8 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. ఇటీవల కొన్ని నగరాల్లో ఇలాంటి అవయవదానాలతో ఎంతోమందికి పునర్జన్మ లభించింది. అవయవదానం చేసిన వారికి మరణాంతరం కూడా మళ్లీ జీవించే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో అవయవదానంపై అవగాహన కోసం ‘సాక్షి’ ప్రత్యేక కథనం... అద్దంకి: మానవ శరీరంలోని అవయవాలు కణజాలంతో నిర్మితమై ఉంటాయి. మన శరీరంలోని ప్రతి అవయవం ప్రత్యేక పనులు నిర్వర్తిస్తుంటుంది. పుట్టిన సమయంలో అవసరానికన్నా మిగులు సామర్థ్యం కలిగి.. వయసు పెరుగుతున్న కొద్దీ పనిచేసే సమర్థ్యం తగ్గుతూ ఉంటుంది. అటువంటి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు కీలకమైనవి. పలు కారణాల వలన పాడవుతున్న అవయవాలు... కొన్ని రకాల వ్యాధుల కారణంగా శరీరంలోని అవయవాలు దెబ్బతింటుంటాయి. అనేక రకాల చికిత్సలతో దెబ్బతిన్న అవయవం తిరిగి సక్రమంగా పనిచేసేలా చేయొచ్చు. అయితే, మూత్రపిండ వ్యాధితో డయాలసిస్ చేయించుకునే వారికి కార్డియో వ్యాస్క్యులర్ (గుండె జబ్బు) ముప్పు ఉంటుంది. డయాలసిస్ చేసే సమయంలో రక్తంలో యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోవడమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుకే అధిక కేసుల్లో అవయవ పనితీరు క్షీణిస్తే మరో అవయవాన్ని అమర్చడమే ప్రత్యామ్నాయంగా మారింది. దానికి ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి అవయవాన్ని తీసి రోగికి అమరుస్తారు. దీన్నే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. అవయవదాత జీవించి ఉన్న వ్యక్తి, లేదా చనిపోయిన వ్యక్తి అయినా కావచ్చు. అవయవదానం ఎవరు చేయవచ్చు..? కేన్సర్, హెచ్ఐవీ వ్యాధి బాధితులు, రక్తంలో లేదా శరీర కణజాలంలో వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్న వారు, ఇన్ఫెక్షన్కు గురైన వారు, గుండె, మూత్రపిండాల వ్యాధులన్న వారు మినహా మిగిలిన వారందరూ అవయవదానం చేయడానికి అర్హులే. ఇలా చేసే అవయవదానం మరణానంతరమే కాకుండా, జీవించి ఉన్న సమయంలోనూ చేసే అవయవాలున్నాయి. అవయవదానం చేయదలచుకున్న వారు జీవన్దాన్ సంస్థలో పేరు నమోదు చేసుకోవచ్చు. జీవించి ఉన్న వారి అవయవాలను ఎవరు స్వీకరించవచ్చు...జీవించి ఉన్న వారి అవయవాలను వారి తల్లిదండ్రులు, పిల్లలు, సోదర, సోదరిలు, మనవరాళ్లు, మనవళ్లకు మాత్రమే దానం చేయవచ్చు. వేరేవారికి ఈ అవయవాలను దానం చేయడం కుదరదు. కొన్ని సందర్భాల్లో స్నేహితుల నుంచి దానం స్వీకరించవచ్చు. మరణించిన వ్యక్తి అవయవాలతో ఎంతమందికి ప్రాణదానం చేయొచ్చు... మరణించిన వ్యక్తి నుంచి స్వీకరించిన ఎనిమిది అవయవాలను ఎనిమిది మంది రోగులకు అమర్చి వారికి ప్రాణదానం చేయవచ్చు. అలా దానం చేసే అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పాన్క్రియాస్, చిన్నపేగు, కార్నియా (కంటిపై పారదర్శక పొర), ఎముక కణజాలం, గుండె కవాటాల రక్తనాళాలు ఉన్నాయి. అవయవదానం సురక్షితమేనా..? దాతల్లో హెచ్ఐవీ, హెపటైటిస్, కేన్సర్ ఇన్ఫెక్షన్ కారకాలు ఉన్నాయో.. లేవో అన్నది వైద్యులు నిర్ధారించిన తర్వాతే అవయవదానం చేయాలా.. వద్దా..? అనేది తేలుస్తారు. దానానికి ముందుకు వచ్చిన వారికి ఆరోగ్య సమస్యలుంటే వాటిని పరీక్షిస్తారు. బ్లడ్ గ్రూప్, రోగ నిరోధక శక్తి వ్యవస్థ స్థితి స్వీకర్తతో సరిపోతుందా..లేదా..? అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవయవాలను తీసుకుంటారు. అవయవదానానికి ఎలా సమాచారం అందించాలి... మరణం లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి కేసులు వైద్యశాలల్లో నమోదైనప్పుడు ఆ సమాచారాన్ని ఆర్గాన్ ప్రోక్యూర్మెంట్ విభాగాలకు వెంటనే అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తి అవయవదానానికి అంగీకరించి ఉన్నారా.. లేదా..? చెక్ చేస్తారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానానికి ఆమోదం తీసుకుంటారు. వెంటనే అవయవాలను వేరుచేసే పనిని వేగంగా చేస్తారు. వైద్యశాలల్లో మరణించిన వారి విషయంలో ఈ పని చాలా వేగంగా జరుగుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి కేసుల్లో మరింత సులువుగా ఉంటుంది. ఎంత సమయంలోగా దానం చేయాలి..? దాత శరీరం నుంచి గుండెను బయటకు తీసిన తర్వాత దాని జీవిత కాలం కేవలం సగటున నాలుగు గంటలే. ఊపిరితిత్తులు కూడా అంతే. మూత్రపిండాలను 30 గంటల్లోపు రోగి శరీరంలో అమర్చాలి. లివర్, పాన్క్రియాస్ అవయవాలను సేకరించిన 12 గంటల్లోపు అమర్చాలి. ముఖ్యంగా దాత నుంచి అవయవాన్ని వేరుచేసిన తర్వాత వేగంగా రోగి శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో వయసు వ్యక్తిని బట్టి ఆ సమయం మారుతూ ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అంటే..? మెదడు పనిచేయకుండా ఆగిపోయో స్థితిని బ్రెయిన్ డెడ్ అంటారు. గాయం కారణంగా మెదడు దెబ్బతిని పనిచేయకుండాపోతే ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉండదు. అయితే, కృత్రిమ వ్యవస్థల సాయంతో పనితీరును కొనసాగించవచ్చు. ఇలా చేసి ఆ వ్యక్తి నుంచి అవయవాలను బయటకు తీసి రోగి శరీరంలో అమరుస్తారు. బ్రెయిన్ డెడ్ తర్వాత గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాన్క్రియాస్ను దానం చేయవచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలను సహజ మరణం పొందిన వారి నుంచి కూడా స్వీకరించవచ్చు. వైద్యశాలల్లో పేర్ల నమోదుతో అవయవ మార్పిడి... అవయవాలు ఎవరికి అవసరమో ఆ జాబితాను దాదాపు ప్రతి వైద్యశాల తయారు చేస్తుంది. అవయవదానానికి సమ్మతించిన వారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జీవన్దాన్ సంస్థలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా హామీ ఇచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు దానానికి సమ్మతించాలి. అలాగే, మొత్తం శరీరాన్ని వైద్య పరీక్షల కోసం దానం చేయవచ్చు. ఎవరి అవయవాలు దానం చేయవచ్చు... సాధారణంగా మనిషి మృతిచెందిన తర్వాతే అవయవదానం అంశం తెరపైకి వస్తుంది. అటువంటి వ్యక్తి అవయవాలు సేకరించడం కోసం మరణానికి ముందు అతని ఆరోగ్య పరిస్థితి, వ్యాధుల సమాచారం ఆధారంగా తగిన పరీక్షలు చేస్తారు. ఆ తర్వాతే అవయవాలు సేకరిస్తారు. జీవించి ఉండగానే దానం చేసే అవయవాలివే... మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, కళ్లు కార్నియా, కాలేయం, పాన్క్రియాస్ చిన్నపేగు, చర్మ కణజాలం, ఎముక కణజాలం, గుండె కవాటాలు, నరాలు, ఇయర్ డ్రమ్స్ (చెవికి సంబంధించినవి) వంటివి దానం చేయవచ్చు. పిల్లలైనా దానం చేయవచ్చు... అవయవాలను మరణించిన తర్వాత లేదా బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి స్వీకరిస్తారు. వైద్యశాలల్లో అటువంటివి సంభవించినప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన పిల్లల అవయవాలను అవసరం ఉన్న చిన్నారులకు అమరుస్తారు. అయితే, స్వీకరించే పిల్లల వయసు కన్నా దాతల వయసు తక్కువగా ఉండాలి. కేన్సర్ రోగులు కూడా అవయవదానం చేయొచ్చు... కొన్ని రకాల కేన్సర్ రోగులు సైతం అవయవదానం చేయొచ్చు. అతని పరిస్థితి ఏమిటన్నదానిపై అవయవదానం చేయొచ్చా.. లేదా..? అనే అంశం ఆధారపడి ఉంటుంది. లేకుంటే అవయవం అమర్చిన వారికి కూడా కేన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానం చేసిన అవయవాలు ఎలా పనిచేస్తాయంటే..? ► దాత నుంచి సేకరించిన మూత్రపిండం అమర్చిన వారికి 9 ఏళ్లపాటు పనిచేస్తుంది. ► జీవించి ఉన్న వారు తమకున్న రెండింటిలో ఒక మూత్రపిండాన్ని రోగికి దానం చేయవచ్చు. ► జీవించి ఉన్న వ్యక్తి తన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని అవసరమైన రోగికి దానం చేయవచ్చు. ►జీవించి ఉన్న వారి నుంచి పాన్క్రియాస్లో కొంత భాగం దానం చేసినా మిగిలిన భాగం చక్కగా పనిచేస్తుంది. ►పేగులోని కొంత భాగాన్ని అదే పేగు పాడైపోయిన వారికి దానం చేయవచ్చు ►కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలా ఇచ్చిన దాత కాలేయం నుంచి తీసిన ► భాగం కొన్నాళ్లకు మళ్లీ ఏర్పడి పూర్తి అవయవంగా తయారవుతుంది. మానవ శరీరంలో కొంత తీసిన తర్వాత మళ్లీ పెరిగే అవయవం ఇదొక్కటే. ► కంటిలో ఉండే చూపునకు సంబంధించిన పారదర్శక పొర ప్రమాదం కారణంగా, లేదా ఇన్ఫెక్షన్ కారణంగా దెబ్బతిన్న రోగికి మళ్లీ కార్నియాను అమర్చడం వల్ల తిరిగి చూపు తెప్పించవచ్చు. ► కాలిన గాయాల వారికి చర్మ కణజాలం మార్పిడి చేయవచ్చు. ఇది జీవించిన వ్యక్తి నుంచే తీసి రోగికి వేయవచ్చు. ఇలా వేసినందుల వల్ల దాతలకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. ►గుండెకు బైపాస్ సర్జరీ చేసే వారికి పాడైపోయిన నరాల స్థానంలో దాత నుంచి సేకరించిన నరాలను ఉపయోగిస్తుంటారు. ► అలాగే రక్తం, రక్తం మూలకణాలను దానంగా ఇవ్వవచ్చు -
మరణంలోనూ జీవించు !
గుంటూరు మెడికల్ : దానాలలో కెల్లా గొప్ప దానం ఏదంటే.. టక్కున అవయవదానం అనేమాట వినిపిస్తోంది. ఆధునిక వైద్యం అందించిన మహాదానం ఇది. మరణంలోనూ మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. సామాజిక స్పృహతో ఎన్నో నిండు ప్రాణాలను నిలబెడుతోంది. చనిపోయిన తర్వాత కూడా పది మంది గుర్తుంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. నేడు అవయవదానం దినోత్సవం సందర్భంగా సాక్షి కథనం. ఇది మరో జీవితం.. ప్రతిరోజూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 20మందికి పైగా వివిధ రకాల వ్యాధులతో, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో, ఇళ్ల వద్ద మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి కౌన్సిలింగ్ చేసి అవయవదానం చేయించటం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చు. అవయవదానంపై ప్రజలకు అవగాహన లేకపోవటం, మూఢనమ్మకాలతో చనిపోయిన వారి భౌతిక కాయాన్ని దహనం, ఖననం చేస్తున్నారు. వాస్తవానికి చనిపోయిన వారి అవయవాలను దానం చేయడం వల్ల ఎంతో మంది బతుకుల్లో వెలుగులు నింపొచ్చు. మరణంలోనూ జీవించవచ్చు. 122 మంది అవయవదానం చేశారు.. గుండె, కిడ్నీలు, కళ్లు, లివర్, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాసిస్ అవయాలను దానం చేయటం ద్వారా ఆపరేషన్లు చేసి బాధితులకు ప్రాణదానం చేయవచ్చు. ఇప్పటి వరకు 122 మంది అవయవాలను దానం చేసినట్లు జీవన్ధాన్ కార్యక్రమం సీఈఓ డాక్టర్ గాదె కృష్ణమూర్తి తెలిపారు. బ్రెయిన్డెడ్ అయిన దాతల నుండి కిడ్నీలు 218, లివర్లు 103, గుండెలు 38, ఊపిరితిత్తులు 34 సేకరించి ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించినట్లు వెల్లడించారు. ఎంత సమయం పడుతుంది.. మానవ శరీరంలోని ఉపయోగపడే అవయవాలు బ్రెయిన్ డెడ్ కేసు నుంచి బయటకు తీసేందుకు ఐదు గంటల సమయం పడుతుంది. అవయవాలు సేకరించిన తర్వాత గుండె, లంగ్స్ను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాలి. లేని పక్షంలో సేకరించిన అవయవాలు పనిచేయకుండా పోతాయి. కళ్లు చాలా కాలం వరకు స్టోర్ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవభాగాలను ‘యూ డబ్ల్యూయూ సొల్యూషన్’ అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్బాక్సుల్లో భద్రం చేసి అవయవాదనం కోసం ఎదురు చూస్తున్నవారికి అమర్చుతారు. గుంటూరు, విజయవాడల్లో కేంద్రాలు.. జీవన్ధాన్ పథకం రాష్ట్ర వ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో ఉంది. గుంటూరు జిల్లాలోని గుంటూరు జీజీహెచ్లో, గుంటూరు సిటీ హాస్పిటల్, వేదాంత హాస్పిటల్లో, అశ్విని హాస్పిటల్లో, రమేష్ మల్టీస్పెషాలిటి హాస్పిటల్లో, శ్రీలక్ష్మీ సూపర్స్పెషాలిటి, ఎన్ఆర్ఐ, మణిపాల్ ఆస్పత్రిలలో అందుబాటులో ఉంది. కృష్ణా జిల్లాలో ఆయుష్, ఆంధ్రాహాస్పిటల్, అరుణ్కిడ్నీ సెంటర్, సెంటిని, విజయ సూపర్స్పెషాలిటి, సన్రైజ్, స్వరూప్, కామినేని, మెట్రో సూపర్స్పెషాలిటి ఆస్పత్రుల్లో ఉంది. గుండె మార్పిడి ఆపరేషన్లు.. జీజీహెచ్లో సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణగోఖలే ఆధ్వర్యంలో 2016 మే 20న తొలి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. గుంటూరుకు చెందిన డ్రైవర్ ఉప్పు ఏడుకొండలు అనే వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్తో జాతీయస్థాయిలో గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన ఐదో ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. అధికారికంగా 385 మంది ఎదురుచూపులు.. అనారోగ్యంతో అవయవాలు చెడిపోయి వారు ఆపరేషన్లు చేయించుకునేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకోసం జీవన్ధాన్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ కేంద్రంగా 2015 నుంచి జీవన్ధాన్ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 509 మంది కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల కోసం, 74 మంది లివర్ మార్పిడి ఆపరేషన్లు కోసం, 15 మంది గుండె మార్పిడి ఆపరేషన్లు కోసం, ఇద్దరు లంగ్స్ మార్పిడి ఆపరేషన్ల కోసం దరఖాస్తు చేసుకుని అవయవాల కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. సకాలంలో వీరికి అవయవాలు లభించకపోతే వీరు ప్రాణాలు కోల్పోతారు. ఆపరేషన్లుకు అయ్యే ఖర్చులు భరించలేక జీవన్ధాన్లో పేర్లు నమోదు చేయించుకోని కిడ్నీ బాధితులు, గుండెజబ్బు బాధితులు అధికంగానే ఉన్నట్లు సమాచారం. ఏ అవయవాలు దానం చేయవచ్చు మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ఫ్యాంక్రియాస్, ప్రేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోవడంతో బ్రెయిన్డెడ్గా నిర్ధారణ అయిన వారి నుండి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఎలా రిజిస్టార్ కావాలి.. అవయవదానం చేయాలనుకునే వ్యక్తులు ముందస్తుగా తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసిన వాళ్లకు తాను అవయవదానం చేస్తున్నట్లు తెలపాలి. ఇలా తెలియజేయడం వల్ల సదరు వ్యక్తి మరణానంతరం అతని కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్ధాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. దీని ద్వార బ్రెయిన్డెడ్ అయిన కేసుల నుంచి అవయవాల నుండి సేకరిస్తారు. ఠీఠీఠీ. ్జ్ఛ్ఛఠ్చిnఛ్చీn. జౌఠి. జీn వెబ్సైట్లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నవారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది. అవయవాలు కావాల్సి వస్తే.. అవయవమార్పిడి కోసం జీవన్ధాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్నవారికి సీరియల్ నంబర్ ఇస్తారు. ఎవరైనా అవయవదానం చేసేందుకు వెబ్సైట్కు సమాచారం ఇస్తే తక్షణమే సీరియల్ నంబర్ ప్రకారం ముందస్తు వరుసలో ఉన్నవారికి అవయవాలు అమర్చేలా చర్యలు తీసుకుంటారు. -
చిరంజీవి.. కుమార్
హైదరాబాద్, మూసాపేట: తాను చనిపోతూ ఓ యువకుడు అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగు నింపాడు. మూసాపేట ఆంజనేయనగర్ కాలనీకి చెందిన కూచుంపూడి నాగేశ్వరరావు, తులసి దంపతుల కుమారుడు బాల ప్రసన్న కుమార్(21) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం దూలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. అతడి గుండె, లివర్, కిడ్నీ, లంగ్స్తో మరికొందరికి జీవితాన్నివ్వవచ్చని బాధితుడి తల్లిదండ్రులకు సూచిండడంతో అందుకు వారు అంగీకరించారు. దీంతో జీవన్మృతుడి అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా తీసి అత్యవసరంగా చెన్నైకి తరలించారు. తన కుమారుడు లేడన్న బాధ ఉన్నప్పటికీ అతడి అవయవాలు అమర్చిన ఇంకొందరిలో చిరంజీవిగా ఉంటాడని తల్లిదండ్రులు తెలిపారు. -
యువతి బ్రెయిన్ డెడ్
సోమాజిగూడ: బైక్పై వెళుతున్న తల్లికూతుళ్లను లారీ ఢీకొట్టిన ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా..కుమార్తె బ్రైయిన్ డెడ్కు గురైన సంఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. ఐకె గూడకు చెందిన శృతి (26) సాప్ట్ ఉద్యోగి. ఈ నెల 8న తల్లి మాధవితో కలిసి బైక్పై ఈసీఐల్కు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మాధవి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శృతిని చికిత్స నిమిత్తం ఈ నెల 9న బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఆమె బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్దారించారు. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె శరీరంనుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లనుసేకరించి మరో ఐదుగురికి ప్రాణ దానం చేశారు. -
కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: ఆ బాలుడికి తల్లి జన్మనిస్తే... తండ్రి పునర్జన్మను ప్రసాదించాడు. దీనికినగరంలోని నిమ్స్ ఆస్పత్రి వేదికైంది. ఆ బాలుడి పేరు శశికిరణ్. ఆయన తండ్రి ఉప్పలయ్య. లివర్ సిరోసిస్ (కాలేయం పనితీరు దెబ్బతినడం)తో బాధపడుతున్న కుమారుడికి కాలేయం దానం చేసిన ఉప్పలయ్య ఫాదర్ ఆఫ్ శశికిరణ్ అనిపించుకున్నారు. అందరి మన్ననలుఅందుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలోనే తొలి లైవ్ లివర్ట్రాన్స్ప్లాంటేషన్గా ఇది నిలిచిపోయింది. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ ఈ చికిత్సవివరాలను సోమవారం ఆస్పత్రిలో వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం విడవల్లి గ్రామానికి చెందిన పోలియో బాధితుడు దొంతగాని ఉప్పలయ్య టైలర్. ఈయన కుమారుడు మాస్టర్ శశికిరణ్(14) కామెర్లతో బాధపడగా, ఏడాది క్రితం నిమ్స్కు తీసుకొచ్చారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ బీరప్ప వైద్య పరీక్షలు నిర్వహించి, బాలుడు లివర్ సిరోసిస్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీనికి కాలేయ మార్పిడి చికిత్స ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారు. ఈ మేరకు జీవన్దాన్ సహా ఆరోగ్యశ్రీలోనూ పేరు నమోదు చేయించారు. అయితే బ్రెయిన్డెడ్ దాత కాలేయం లభించకపోవడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని కుమారుడికి ఇచ్చేందుకు ఉప్పలయ్య ముందుకొచ్చారు. 30 రోజులు... 8 కిలోలు వైద్యులు ఉప్పలయ్యకు పరీక్షలు నిర్వహించగా, ఆయన ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. కాలేయంలో కొవ్వు కరిగిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత చికిత్స చేయాలని వైద్యులు భావించారు. దీంతో వ్యాయామం చేయాలని సూచించారు. కుమారుడిపై ప్రేమతో ఉప్పలయ్య నెల రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గాడు. జూన్ 4న డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని 20 మందితో కూడిన వైద్యబృందం 12గంటలు శ్రమించి కాలేయ మార్పిడి చికిత్సను విజయవంతంగా చేశారు. ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్ ఫర్ లివర్ సైన్సెన్ (యూకే) డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య సహకారం అందించారు. ‘సర్కారీ’లో తొలిసారి... జీవన్దాన్ పథకంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటి వరకు బ్రెయిన్డెడ్ డోనర్ నుంచి సేకరించిన కాలేయ మార్పిడి చికిత్సలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా లైవ్ డోనర్ కాలేయ మార్పిడి చికిత్స జరగడం విశేషం. ప్రస్తుతం దాత, స్వీకర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ బీరప్ప తెలిపారు. చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలకు పైగా ఖర్చవుతుంటే.. ఆరోగ్యశ్రీ సహకారంతో నిమ్స్లో కేవలం రూ.10.80 లక్షలకే చేసినట్లు తెలిపారు. విలేకర్ల సమావేశంలో డాక్టర్లు పద్మజ, వేణుమాధవ్, సూర్యరామచంద్రవర్మ, నవకిషోర్, జగన్మెహన్రెడ్డి, గంగాధర్, దిగ్విజయ్, అభిజిత్, హితేష్, వికాశ్, నిర్మల, మధులిక, ఇందిరా, కవిత పాల్గొన్నారు. 11వేల సర్జరీలు... ఆస్పత్రిలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో ఈ మూడేళ్ల కాలంలో సర్జరీలు రెట్టింపయ్యాయి. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏటా 7వేల సర్జరీలు జరిగితే... 2017లో 13వేలకు పైగా సర్జరీలు నిర్వహించగా, ఈ ఏడాది ఇప్పటికే 11వేల సర్జరీలు చేశాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న ఏడుగురు బాధితులు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా కిడ్నీమార్పిడి చికిత్సలు నిర్వహించాం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
గుంటూరులో అవయవదానం
గుంటూరు మెడికల్: బ్రెయిన్ డెడ్ అయిన లారీ డ్రైవర్ అవయవాలను వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు దానం చేసేందుకు అంగీకరించారు. గుంటూరులో వైద్యులు శనివారం అతని అవయవాలను సేకరించారు. వివరాల్లోకి వెళితే.. క్రోసూరు మండలం నాగవరానికి చెందిన ఆంజనేయులు (45) లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజుల క్రితం బ్రెయిన్స్ట్రోక్ రావటంతో కుటుంబ సభ్యులు అతడిని గుంటూరు జీజీహెచ్కు చికిత్స కోసం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గురువారం గుంటూరు సిటీ హాస్పిటల్కు తీసుకురాగా బీపీ తగ్గిపోయి ఆరోగ్యం విషమించింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆంజనేయులుకు శుక్రవారం బ్రెయిన్డెడ్ అయినట్లుగా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. 9 మందికి పునర్జన్మ.. ఈ సందర్భంగా వారు అవయదానం గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శనివారం భార్య మాలతి, కుమారుడు మహేష్, కుమర్తె నాగమణి.. ఆంజనేయులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ చక్కా శివరామకృష్ణ, న్యూరో సర్జన్ డాక్టర్ చిట్టెం లక్ష్మణరావు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఐసీయూ స్పెషలిస్టు డాక్టర్ రాజశేఖర్, యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్లు బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాలను సేకరించారు. బీపీ పూర్తిగా పడిపోవటంతో తొలుత గుండె, ఊపిరితిత్తులు ఇతర అవయవాలు పనిచేయటం మానివేశాయి. కిడ్నీలు, కళ్లు సేకరించినా కిడ్నీలు వినియోగించే అవకాశం లేకపోవటంతో నేత్రాలను మాత్రమే పెదకాకాని శంకర కంటి ఆస్పత్రికి తరలించారు. అవయవదానం చేసిన ఆంజనేయులు భౌతిక కాయాన్ని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సందర్శించి నివాళులర్పించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులను అభినందించారు. అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఒక వ్యక్తి అవయవదానంతో 9 మందికి నూతన జీవితాన్ని ప్రసాదించవచ్చని చెప్పారు. -
తాను మరణిస్తూ.. మరొకరికి ప్రాణం పోస్తూ..
గుంటూరు : బ్రెయిన్ డెడ్తో మరణం అంచున ఉన్న వ్యక్తి కనీసం కాలు కూడా కదపలేడు. కానీ తన అవయవదానంతో మరొకరి ప్రాణాలను నిలుపగలడు. ఇది నమ్మిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకొచ్చి మంచి మనసును చాటుకున్నారు. మనవత్వం బతికే ఉందని తెలిపే ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. జిల్లాలోని క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి అధిక రక్తపోటుతో బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్లారు. ఆయన తిరిగి కోలుకునే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఆంజనేయులు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. తమ ఆత్మీయుడు చనిపోతున్న బాధలో ఉండి కూడా ఒక మంచి పనికి ఒప్పుకున్న ఆంజనేయులు కుటుంబసభ్యుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆంజనేయులు కుటుంబసభ్యులను శనివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ సతీష్ పరామర్శించారు. -
ఆ యువతి మరణిస్తూ.. కొందరికి వెలుగు
సోమాజిగూడ : బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేసి మరికొందరి జీవితాలను నిలబెట్టారు. శనివారం జీవన్దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రామగిరికి చెందిన డీసీఎం డ్రైవర్ కె.మల్లిబాబు, లలితల కుమార్తె మౌనిక (21) స్థానిక ఎస్ఆర్టీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. గతనెల 28న మధ్యాహ్నం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. ఆమెను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన మౌనికను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మే 29న ఎల్బీనగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేస్తున్న న్యూరో ఫిజీషియన్ మౌనికకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఆమె కుటుంబ సభ్యులకు జీవన్దాన్ ప్రతినిధులు అవయవ దానంపై కౌన్సిలింగ్ ఇవ్వగా అందుకు వారు అంగీకరించారు. దీంతో మౌనిక శరీరం నుంచి రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను సేకరించారు. -
అమరావతిలో ‘రేలా’ ఆసుపత్రి
సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అవయవ మార్పిడి ఆసుపత్రి నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవయవ మార్పిడి నిపుణులు, భారత్ విశ్వవిద్యాలయ చాన్స్లర్ డా.మహమద్ రేలా ముందుకు వచ్చారు. శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మనిషి ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్ని అమరావతిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. గుండె, కిడ్నీ, కాలేయం, లంగ్స్, యూట్రిస్ వంటి ప్రధాన శరీర అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు. కాగా, డాక్టర్ రేలా ఇప్పటివరకూ 4,500 లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. కుమార్తెకు పిల్లలు పుట్టకపోతే ఓ తల్లి తన యూట్రెస్ను కుమార్తెకు దాన చేసిందని, ఆ ఆపరేషన్ వల్ల కుమార్తెకు బిడ్డ జన్మించినట్లు రేలా వెల్లడించారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాల భూమి అవసరం అవుతుందని, అందుకు సహకారం అందించాలని సీఎంను రేలా కోరారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలతో వస్తే అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ రేలాకు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అప్పారావు, డాక్టర్ రమేష్ కృష్ణన్, డాక్టర్ వి.చౌదరి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. -
అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ
నెల్లూరు(బారకాసు)/వాకాడు: బ్రెయిన్ డెడ్కు గురైన తన భర్త అవయవాలతో మరికొందరికి ప్రాణం పోయాలని సంకల్పించిన భార్య అవయవదానానికి అంగీకరించడంతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. వివరాలు..వాకాడు మండలం కొండాపురం పంచాయతీ జాండ్రపేటకు చెందిన రాయపు శ్రీనివాసులు(45) ట్రాక్టర్ డ్రైవర్. భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమారులు మహేంద్ర, మధుసూదన్ ఉన్నారు. వావిళ్లపాళెం వద్ద మంగళవారం రాత్రి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో శ్రీనివాసులు తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన శ్రీనివాసులును కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. రెండ్రోజులపాటు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపారు. శ్రీనివాసులుకు బ్రెయిన్ డెడ్ మాత్రమే అయిందని, మిగిలిన అవయవాలు పనిచేస్తున్నాయని, వెంటిలేటర్ను తొలగిస్తే చనిపోతాడని తెలిపి అవయవదానం విశిష్టతను వివరించారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆస్పత్రి వైద్యులు జీవన్ధాన్ సంస్థకు సమాచారం అందించారు. అవయవ శస్త్రచికిత్స విజయవంతం గురువారం రాత్రి వైద్య బృందం శ్రీనివాసులు దేహం నుంచి గుండె, కిడ్నీలు, కళ్లు వేరు చేసే శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. గుండెను చెన్నైలోని గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు తీసుకెళ్లగా.. ఒక కిడ్నీని తిరుపతి స్విమ్స్ వైద్యులు తీసుకెళ్లారు. మరో కిడ్నీని సింహపురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి అమర్చేందుకు ఆస్పత్రిలోనే భద్రపరిచారు. నేత్రాలను నెల్లూరు నగరంలోని మోడరన్ కంటి వైద్యశాల వారు సేకరించారు. అవయవదానం అనంతరం శ్రీనివాసులు మృతదేహాన్ని కోట మండలం విద్యానగర్ నుంచి వాహనంపై ర్యాలీగా స్వగ్రామం తీసుకెళ్లారు. శ్రీనివాసులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసులు పెద్ద కుమారుడు మహేంద్రబాబు ఎంటెక్, చిన్న కుమారుడు మధుసూదన్ డిగ్రీ చదువుతున్నారు. అవయవదానంపై అవగాహన పెరిగింది సింహపురి ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి చైర్మన్ కాటంరెడ్డి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరిస్తున్నారని తెలిపారు. అవయవదానం చేయడమంటే ఇతరులకు పునర్జన్మను ప్రసాదించినట్లని అన్నారు. అవయవదాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీనివాసులు కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సమావేశంలో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పవన్కుమార్రెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్ సాగర్ పాల్గొన్నారు. -
ఒకరి మరణం ఆరుగురికి పునర్జననం..!
మరణమంటే.. చావు! భౌతికంగా ఈ లోకాన్ని వీడి, పంచభూతాల్లో కలవడం. మనలో అనేకమందికి తెలిసిన అర్థం ఇదే. మరణమంటే.. పునర్జన్మ!! ఖమ్మం నగరానికి చెందిన ఓ సాధారణ గృహిణి మాత్రం.. ఇలా కొత్త అర్థాన్నిచ్చారు. ఖమ్మంవ్యవసాయం: ‘‘మరణమంటే.. అనేకమంది అనుకుంటున్నట్టుగా ‘చావు’ మాత్రమే కాదు. మరణమంటే.. పునర్జన్మ..! మరణిస్తూనే.. మరికొందరికి ప్రాణం పోయడం. వారి దేహంలో భాగమవడం. ఇదే పునర్జన్మ’’ అంటున్నారు పసుమర్తి స్మిత. ఎవరీమె..? ఏం చేసింది..? వీటికి జవాబులు కావాలనుకుంటే.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే. ♦ ఆయన పేరు పసుమర్తి వేణు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్లోగల స్నేహ జ్యూయలరీ షాప్ యజమాని, వ్యాపార ప్రముఖుడిగా వేణుకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్య స్మిత, కూతురు స్నేహ ఉన్నారు. ఆ ముగ్గురిదీ ముచ్చటైన కుటుంబం. ♦ హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా భయంకరమైన కల్లోలం. ఈ నెల 23న వేణు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థుడయ్యారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ♦ వేణు–స్మితది పాతికేళ్ల దాంపత్యం. ఇన్నేళ్లపాటు తనను ప్రాణప్రదంగా చూసుకున్న జీవిత భాగస్వామి ఒక్కసారిగా దూరమయ్యాడన్న చేదు నిజాన్ని విని ఆమె తట్టుకోలేకపోయారు. గుండె పగిలినంత పనైంది. ఆ తల్లీబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ♦ మన మనిషి ఎవరైనా అసాధారణ పరిస్థితిలో చనిపోతే... సాధారణంగా పోస్టుమార్టానికి అంగీకరించం. కానీ, ఈ ఇల్లాలు స్మిత అలా కాదు. అంత బాధలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భౌతికంగా ఈ లోకాన్ని వీడిని తన భర్త ద్వారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి బతుకును ఇవ్వాలనుకున్నారు. ♦ వెంటనే, తన స్వంత ఖర్చుతో భర్తను అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకం ‘జీవన్దాన్’ కింద తన భర్త అవయవాలను దానం చేసేందుకు సిద్ధపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం వేణు దేహం నుంచి రెండు కళ్లు, గుండె, లివర్, రెండు కిడ్నీలను వైద్యులు సేకరించారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో దాదాపుగా ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఆరుగురికి అమర్చారు. ఆ ఆరుగురూ రేపోమాపో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి బయటికొస్తారు. ఆ ఆరుగురిలో వేణు బతికుంటారు..! ఇక్కడ పునర్జన్మ పొందింది ఆ ఆరుగురు మాత్రమే కాదు..!! పసుమర్తి వేణు కూడా...!!! ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆయన అవయవాలు ఇతరుల దేహాల్లో చక్కగా పనిచేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అనేకమంది తమ మనసుల్లో ఇలా దీవిస్తున్నారు... ‘అమ్మా స్మితమ్మా..! వందనం తల్లీ...!!’ మహోన్నతం పసుమర్తి వేణు అవయవదానం మహోన్నతమని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని వర్తక సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వెండి, బంగారం మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. వేణు అవయవాలను దానం చేయాలని ఆయన భార్య, కుటుంబీకులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, సాహసోపేతమైనదని అన్నారు. ఈ సమావేశంలో కొప్పు నరేష్కుమార్, గొడవర్తి శ్రీనివాస్రావు, కురువెళ్ల ప్రవీణ్కుమార్, పత్తిపాక రమేష్, తూములూరి లక్ష్మీనరసింహారావు, బందు సూర్యం, నకిరికంటి రాధాకృష్ణ(సతీష్), బూర్లె లక్ష్మీనారాయణ, సుంకరి నరసింహారావు, రాయపూడి శేషగిరిరావు, బూమా సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. నేడు అంత్యక్రియలు పసుమర్తి వేణు అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఇందుకు ఖమ్మం పౌర సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లను ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొప్పు నరేష్, గొడవర్తి శ్రీనివాస్రావు, కళాపరిషత్ చైర్మన్ వివి.అప్పారావు, కిరాణా జాగిరి మర్చంట్స్ అధ్యక్షుడు వేములపల్లి వెంకన్న, బంగారం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బందు సూర్యం, నకిరికంటి సతీష్, రోటరీ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్, చాంబర్ ఆఫ్ మాజీ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు కొదుమూరి జగన్నాథం, ప్రతాపనేని నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు. -
ఆమె జీవితం ధన్యం
విశాఖ క్రైం : ఆమె భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా... మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సజీవంగానే ఉంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసినా... పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆదివారం మృతి చెందిన ఇప్పిలి లక్ష్మి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. తాను చనిపోయినప్పటికీ కొందరి బతుకుల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన లక్ష్మి... తాను చనిపోతే తన అవయవాలు దానం చేయండి అని కుటుంబ సభ్యుల నుంచి ముందుగానే హామీ తీసుకున్నారు. లక్ష్మి కోరికను భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్ నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 13న ఉదయం విశాఖ కైలాసపురానికి చెందిన ఇప్పిలి లక్ష్మి (58) ఆంజనేయస్వామి గుడికి వెళుతుండగా ఒక ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను విశాఖలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను జీవన్దాన్ ట్రస్ట్కు దానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను లక్ష్మి భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్లతో పాటు కుమార్తెలు, అల్లుల్లు పర్యవేక్షించారు. లక్ష్మి మృతదేమాన్ని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు సమాచారం. పుట్టెడు దుఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు లక్ష్మికి ఇచ్చిన మాట నెరవేర్చారు. అంత విషాదంలోనూ వారి ఔదార్యాన్ని చూసి అనేక మంది వైద్యులు, నగర వాసులు ప్రసంసలు కురిపించారు. ప్రమాదంపై నాలుగో పట్టణ సీఐ బి.తిరుమలరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎర్రాజీరావు తెలిపారు. అమ్మ కోరిక నెరవేర్చేందుకే అమ్మ ప్రమాదానికి గురైనట్లు సమాచారం రాగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. కొన్ని రోజులుగా ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. అయితే ఆదివారం బ్రెయిన్డెడ్ కావడంతో అమ్మ కోరిక మేరకు కుటుంబ సభ్యులమంతా కలిసి ఆమె అవయవాలు దానం చేసేందుకు ఏర్పాటు చేశాం. చెన్నై ఆస్పత్రిలో గుండె సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తికి అమర్చేందుకు గుండెను తరలించనున్నారు. లివర్ను విశాఖలోని ఫినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి, కిడ్నీలను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అందజేస్తున్నాం. – ఇప్పిలి హేమవెంకట కుమార్ (లక్ష్మి కుమారుడు) -
వారి జీవితాలను రంగులమయం చేయండి : హీరో
దేశవ్యాప్తంగా హోలీ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వీరిలో సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ అవయవధానానికి సంబంధించిన పోస్టర్ను ట్వీట్ చేశాడు సాయి. ‘మీకు అంధ ప్రపంచాన్ని రంగులమయం చేయగలిగే శక్తి ఉంది. ప్రతిజ్ఞ చేయండి’ అన్న కామెంట్స్ ఉన్న పోస్టర్ను ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. పండుగ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్పై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటిలిజెంట్ సినిమాతో నిరాశపరిచిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. Wishing everyone a very happy #holi #takeapledge 🙏🏼 pic.twitter.com/pgzXA38kDz — Sai Dharam Tej (@IamSaiDharamTej) 2 March 2018 -
నిండుప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమం): ఒకరి నిర్లక్ష్యం మరొకరి కుటుంబానికి తీరని అన్యాయం చేసింది. తమ ఇంటి దీపం ఆరిపోయిన పలువురి జీవితాలను నిలబెట్టేందుకు అవయవదానం చేసేందుకు పేద కుటుంబం ముందుకొచ్చింది. అయితే ప్రమాదానికి కారణమైన యువకుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిం చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ గొల్లపాలెంగట్టు బావి ప్రాంతంలో కాకి చిరంజీవి(45) భార్య రమణమ్మ, ఇద్దరు కుమార్తెలతో నివసిస్తున్నారు. చిరంజీవి అల్యూమినియం పాత్రల తయారీ పనిచేస్తారు. వచ్చే అరకొర సంపాదనలోనే కుమార్తెలను చదివిస్తున్నారు. ఈ నెల 18న చిరంజీవి మరో యువకుడితో కలిసి సైకిల్పై బంగారయ్య కొట్టు వైపు నుంచి వాగు సెంటర్ వైపు వెళ్తుండగా, ఓ యువకుడు డివైడర్పై నుంచి బైక్ను దూకించి సైకిల్ను ఢీకొట్డాడు. చిరంజీవి, అతనితో ఉన్న వ్యక్తి కూడా గాయపడ్డారు. చిరంజీవి తలకు గాయమై స్పృహకోల్పోవడంతో బైక్తో ఢీకొట్టిన వ్యక్తి సమీపంలోని డాక్టర్ వద్ద చేర్చి జారుకున్నాడు. ఈ తతంగం అంతా ఘటనా స్థలానికి కూతవేటు దూరంలో ఉన్న బ్యాకరీ ఎదుట ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. అనంతరం చిరంజీవిని 108పై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడలో సరైన వైద్యం అందక గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబీకులు చిరంజీవి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి గురించి ఆరా తీసేందుకు బాధితుని బంధువులు కొత్తపేట పోలీస్ స్టేషన్కు చేరుకోగా చేదు అనుభవం ఎదురైంది. సీసీ కెమెరాలో బైక్ నంబర్ సరిగా రికార్డు కాలేదని, కేసు దర్యాప్తులో ఉందంటూ పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పారని బాధితులు ఆరోపించారు. న్యాయం జరగకుంటే సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. -
అవయవదానంలో మనమే నంబర్ వన్
సాక్షి, హైదరాబాద్: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్వోటీటీవో) అవార్డును ప్రకటించింది. సోమవారం ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్ధాన్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు. తమిళనాడును దాటేసి.. తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. జనాభా ప్రతిపాదికన పరిశీలిస్తే.. తమిళనాడుతో పోలిస్తే అవయవ దానంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఎన్వోటీటీవో తెలిపింది. అవయవదానంపై అవగాహన, శిక్షణ, సాప్ట్వేర్ నిర్వహణ.. ఇలా అన్ని విభాగాల్లోనూ ముందు నిలిచిందని కొనియాడింది. ఇక కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్రెయిన్డెడ్ స్థితిలో తమ అవయవాలను దానం చేసేందుకు అనేక మంది ఇప్పటికే తమ పేర్లను జీవన్దాన్లో నమోదు చేసుకున్నారు. దాతల్లో ప్రముఖ క్రీడాకారులు అనిల్కుంబ్లే, గౌతం గంభీర్, నటుడు అక్కినేని నాగార్జున, హీరోయిన్ ప్రియాంకా చోప్రా, టాలీవుడ్ నటి సమంత సహా 30 వేల మందికిపైగా ఉన్నారు. మరోవైపు 4,203 మంది గుండె, కాలేయం, కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 2,221 మంది కిడ్నీ కోసం, 1,897 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా.. అవయవమార్పిడి చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. బ్రెయిన్డెడ్ దాత నుంచి సేకరించిన గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.10.5 లక్షల చొప్పున, ఏకకాలంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు రూ.13.6 లక్షలు, బోన్మ్యారో చికిత్సకు రూ.8.7 లక్షలు, లైవ్డోనర్ కాలేయ మార్పిడి చికిత్సకు రూ.13 లక్షల చొప్పున చెల్లిస్తోంది. కేవలం బ్రెయిన్డెడ్ బాధితులే కాదు.. బతికుండగానే శరీర భాగాలను బాధితులకు ఉచితంగా ఇచ్చేందుకు బంధువులు(లైవ్ డోనర్స్)ముందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ అవార్డు బాధ్యతను పెంచింది: లక్ష్మారెడ్డి, మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ అవయవదానంలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించడం సంతోషం. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. అన్ని దానాలకంటే అవయవదానం గొప్పది. జీవితానంతరం ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలి. ఒక వ్యక్తి చేసిన అవయవదానంతో మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. -
మరుజన్మకు ఓ సంతకం
అవయవ దానంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడంతో పాటు మరణానంతరమూ జీవించవచ్చని సినీనటి రకుల్ ప్రీత్సింగ్ పేర్కొంది. గురువారం నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రకుల్.. తానూ అవయవ దానం చేస్తున్నట్టు ఆర్గాన్ డొనేషన్ పత్రంపై సంతకం చేసింది. నగర ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 26న నిర్వహించే 10కే రన్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. -
అవయవదానంతో ఐదుగురికి జీవితం
గుంటూరు మెడికల్:తాను చనిపోతూ తన అవయవదానం ద్వారా ఐదుగురికి నూతన జీవితాన్ని దుర్గారావు ప్రసాదించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్లో జీవన్ధాన్ పథకం ద్వారా అవయవాలను సేకరించి చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారికి అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట శృంగావరప్పాడు గ్రామానికి చెందిన బలే దుర్గారావు (22) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 8న ఇంటి వద్ద మెట్లపై జారిపడి తలకు గాయమైంది.కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం భీమవరం, ఏలూరు ఆశ్రమ ఆస్పత్రి, విజయవాడ ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందించి, ఈనెల 18న గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు. దుర్గారావును పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెత్గా నిర్ధారించి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. రమేష్ హాస్పిటల్ వైద్యులు జీవన్ ధాన్ పథకం ద్వారా దుర్గారావు అవయవాలను సేకరించి ఆస్పత్రుల్లో ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న బాధితులకు తరలించారు. లివర్ను విజయవాడ మణిపాల్ హాస్పిటల్కు, ఒక కిడ్నిని గుంటూరు వేదాంత హాస్పిటల్కు, మరో కిడ్నిని శ్రీలక్ష్మి సూపర్స్పెషాలిటీ హాస్పిటల్కు, కళ్లను గుంటూరులోని సుదర్శిని హాస్పిటల్కు పంపారు. దుర్గారావుకు నాలుగేళ్ల కిందట రాధతో వివాహమైంది. మూడేళ్ల అఖిల, ఏడాది వయస్సు ఉన్న హాసిని ఉన్నారు. ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ శైలజ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ ప్రకాశం పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆపరేషన్ ప్రక్రియ జరిగినట్లు రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్బాబు తెలిపారు. -
ప్రాణ ప్రదాతలు
సమాజం మనకేమిచ్చిందని వారేనాడూ అనుకోలేదు.. సమాజానికి మనమేం చేశామనే తలంచారు ఆ యువకులు. సాటి మనుషులకు సాయపడటమే జీవన పరమాధిగా భావించారు. రక్తదానంతో పలువురికి ప్రాణదాతలుగా మారారు. ఇండియా హెల్త్లైన్ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పి రక్తదానం చేస్తున్నారు రాయదుర్గం ప్రాంతానికి చెందిన పలువురు యువకులు. 20 ఏళ్లలో సుమారు 107సార్లు రక్తదానం చేశారు కోట సంపత్కుమార్. వీరితో పాటు కానిస్టేబుల్ హాజీ సైతం సామాజిక సేవలో పాలుపంచుకుంటూ పలువురిని అవయవ దానానికి ప్రోత్సహిస్తున్నారు. అటు రక్తదానం, ఇటు అవయవ దానం చేస్తూ.. జీవదాతలుగా మారిన యువకులపై ప్రత్యేక కథనం. ఆ వార్తే కదిలించింది.. అంబర్పేట: ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి రక్తం అందకపోవడంతో మృతి చెందాడని దినపత్రికలో వచ్చిన వార్త అతడి మనసును చలింపజేసింది. సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు తనవంతు కర్తవ్యంగా రక్తదానం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గడిచిన 20 ఏళ్లలో 107 సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలిచాడు కోట సంపత్కుమార్. ప్రకాశం జిల్లా కుడిచెడుకు చెందిన సంపత్కుమార్ జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం మాదాపూర్కు వచ్చి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గాంధీ ఆస్పత్రిలో రక్తం అందక ఓ రోగి మృతిచెందాడని ఓ దినపత్రికలో వచ్చిన వార్త చదివి చలించిపోయాడు. వెంటనే ఆ ఆస్పత్రికి వెళ్లి రక్తం అవసరమున్న రోగికి రక్తదానం చేసి వెళ్లాడు. అప్పట్నుంచి రక్తదానం చేస్తూనే ఉన్నాడు. గత 20 ఏళ్లలో ఆయన 107సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా మారాడు. తాను ఒక్కడే కాకుండా మిత్రులను సైతం రక్తదానం చేసేందుకు ఒప్పించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సిమ్కార్డు తీసుకొని సోషల్ మీడియాలో సైతం అందుబాటులో ఉంచాడు. అపోహలు వీడి ముందుకు రండి.. రక్తదానంపై యువత ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రెండువందల సార్లు రక్తదానం చేయవచ్చు. ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూ.25 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్ నిలిచిపోయిన సందర్భంలో నేను రక్తదానం చేశా. ఆ ఆపరేషన్ సక్రమంగా జరిగేలా చేసిన సంఘటన ఎప్పటికీ మరవలేను. ఆపదలో రక్తం కావాల్సినవారు 99923 45678లో సంప్రదించవచ్చు. – సంపత్కుమార్ ఆదర్శం.. హాజీ, అనాథలకు అండ...,ఆపన్నులకు చేయూత అవయవ దానాన్ని ప్రోత్సహిస్తున్న కానిస్టేబుల్ అతనో సాధారణ కానిస్టేబుల్. మెడికల్ డ్యూటీ అతని విధి. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ఎవరైనా మృతి చెందినా వెంటనే అక్కడ వాలిపోయి కుటుంబసభ్యుల గురించి ఆరా తీస్తాడు. మృతి చెందిన వ్యక్తి అవయవాలు దానం చేయాలంటే 8 గంటల సమయం మించిపోకూడదు. ఆ విషయాన్ని గుర్తెరిగిన కానిస్టేబుల్ వెంటనే కుటుంబసభ్యులను ఒప్పించే పనిచేస్తాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 25 మందికి పైగా కంటి చూపునిచ్చి ఉన్నతాధికారులతో శభాష్ అనిపించుకున్నాడు. ఎక్కడ పనిచేసినా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రశంస పత్రాలు అందుకున్నాడు. అంతే కాదు.. తాజాగా తప్పిపోయిన ఓ వృద్ధురాలిని ఆమె కుమారుల చెంతకు చేర్చి మానవత్వం చాటుకున్నాడు. ఆయనే పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహ్మద్ హాజీ అహ్మద్. – కుత్బుల్లాపూర్ ఎందరో అనాథలు సిటీలో వివిధ కారణాలతో కన్ను మూస్తున్నారు. వారు బతికి ఉన్నప్పుడే ఆదరించేవారు లేరు. ఇక చనిపోతే ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వారికి బంధువులా మారతారు హాజీ. ఎవరైనా అనాథ చనిపోతే సొంత డబ్బులతో అంత్యక్రియలు జరిపిస్తుంటారు. 2000 సంవత్సరం బ్యాచ్కు చెందిన హాజీ ఐదేళ్లు గ్రేహౌండ్స్లో పనిచేశారు. శామీర్పేట్, బాలానగర్ పీఎస్లలో పనిచేసి, మూడేళ్ల క్రితం పేట్ బషీరాబాద్కు బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న క్రమంలో.. రెండేళ్ల క్రితం మెడికల్ డ్యూటీ (ఎంసీ) బాధ్యతలు అప్పగించారు. మొదట భయపడిన హాజీని ఎస్సై వెంకటేశ్ భుజం తట్టి ధైర్యం చెప్పడంతో నాటి నుంచి నేటి వరకు ఏ పని అప్పగించినా పట్టువీడని విక్రమార్కుడిలా చేస్తున్నారు. అవగాహన కల్పిస్తూ.. మంచి చేయాలన్న తలంపు వచ్చిన హాజీకి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రమాదాల్లో మృతి చెందినా, బ్రెయిన్డెడ్తో ఎవరైనా చనిపోతున్నారని తెలిసినా కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవ దానం చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా 25–30 మంది కళ్లను దానం చేసేందుకు ఒప్పించారు హాజీ. ఇటీవల సంగీత (38) అనే మహిళకు బ్రెయిన్డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి జీవన్దాన్ ట్రస్ట్కు అవయవ దానం చేయించారు. చేరదీసి.. ఇంటికి చేర్చి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన లింగమ్మ అనే వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. కాటేదాన్లో ఉండే తన కుమారుడి ఇంటికి వచ్చి ఆమె దారితప్పి సుచిత్ర సర్కిల్కు చేరింది. అక్కడ ఓ వాహనదారుడు లింగమ్మను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న హాజీ.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత జయరాంనగర్లోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. అనంతరం వివరాలు తెలుసుకొని లింగమ్మను ఆమె కుమారులకు అప్పగించారు. ఒక్క మెసేజ్తో.. రాయదుర్గం: సేవ లక్ష్యంగా.. ప్రాణదానమే పరమార్థంగా పలువురు యువకులు రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క ఫోన్కాల్, మెసేజ్తో వచ్చిన వెంటనే ఆçస్పత్రికి వెళ్లి ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగికి రక్తమిస్తున్నారు. ఇండియా హెల్త్ లైన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలందిస్తున్నారు. 2015 ఏప్రిల్ 10న ఏర్పాటైన ఈ గ్రూపులో మొదట్లో పది మంది మాత్రమే ఉండేవారు. అనంతరం నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వారూ ఈ గ్రూపులో చేరారు. ప్రస్తుతం మూడు బ్లడ్ వాట్సప్ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఈ మూడింటిని రాయదుర్గం ప్రాంతానికి చెందిన నిఖిల్యాదవ్ నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల్లో 256 మంది చొప్పున ఉండగా మూడో గ్రూపులో 175 మంది సభ్యులున్నారు. రక్తదానం చేసేందుకు వీరంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయా వాట్సప్ గ్రూపుల్లో చిన్న మెసేజ్ పెడితే చాలు స్పందించి ఏ ప్రాంతం, ఏ ఆస్పత్రి, అందుబాటులో ఎవరుంటారో గుర్తించి అక్కడికి రక్తదానం చేస్తున్నారు. కార్యాచరణకు అంకురార్పణ ఇలా.. 2015 ఏప్రిల్లో నిఖిల్ యాదవ్ నానమ్మకు రక్తం అవసరమైంది. నానల్నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా నగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్కు వెళ్లి ‘బి’ పాజిటివ్ కావాలని అడగగా.. నిఖిల్ బ్లడ్ను తీసుకోవడంతోపాటు రూ.1000 తీసుకున్నారు. దీంతో ఆరోగ్యవంతులైన యువకులతో ఓ బ్లడ్ గ్రూపును ఏర్పాటు చేయాలనుకున్నారు నిఖిల్. మానవతా దృక్పథంతో కుల మతాలకతీతంగా రక్తం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 450 మందికి రక్తదానం చేశాం.. ఇండియా హెల్త్లైన్లో సుమారు 700 మంది సభ్యులున్నారు. వీరు ఇప్పటివరకు 450 మందికి ఉచితంగా రక్తాన్ని అందించారు. అంతేకాకుండా 20 మందికి ప్లేట్లెట్స్ కూడా ఇచ్చాం. రక్తం అవసరమున్నవారు 80194 53480 నంబరుకు వాట్సప్ గ్రూపులో రోగి పేరు, వ్యాధి, చికిత్స పొందుతున్న ఆస్పత్రి పేరు, నగరంలోని ప్రాంతం పేరును మెసేజ్ చేస్తే రక్తం ఇస్తాం. నగరంలో పలు చోట్ల బ్లడ్ గ్రూప్ నిర్ధారణ కోసం ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తున్నాం. – నిఖిల్ యాదవ్, ఇండియా హెల్త్లైన్ నగర ప్రధాన కార్యదర్శి రాయదుర్గంలో బ్లడ్గ్రూప్ నిర్ధారణ శిబిరంలో ఇండియా హెల్త్లైన్ ప్రతినిధులు (ఫైల్) -
హెలికాప్టర్లో గుండె తరలింపు
బెంగళూరులో ఇదే మొదటిసారి సాక్షి, బెంగళూరు: అవయవదానంలో ప్రతి క్షణం బంగారమే. అందుకే నగరంలోని మొట్టమొదటిసారిగా హెలికాప్టర్ అంబులెన్సులో గుండెను తరలించారు. రామనగర్కు చెందిన 45 ఏళ్ల మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బన్నేరుఘట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఆమె బ్రెయిడ్ డెడ్ అయినట్లు వైద్యులు తేల్చారు.అవయవదానానికి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 51 ఏళ్ల మహిళ తీవ్రమైన గుండెజబ్బుతో మత్తికెరె వద్ద ఉన్న ఎం.ఎస్రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొంతున్నారు. ఆమెకు ఈ గుండెను అమర్చాలి. ఇరు ఆసుపత్రుల మధ్య ఉన్న దూరం 17.5 కిలోమీటర్లు. కాగా గురువారం సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు గుండెతో బయల్దేరిన హెలికాప్టర్ పదినిమిషాల్లో ఎం.ఎస్ రామయ్య ఆసుపత్రి వద్దకు చేరుకుంది. వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్సను పూర్తిచేశారు. గుండెను సేకరించడం నుంచి తరలించడం వరకు వైద్యలు, సిబ్బంది ఆగమేఘాలపై నిర్వహించారు. బాధితురాలి కళ్లు, కాలేయం, మూత్రపిండాలను వేరే రోగులకు అమర్చనున్నారు. -
అవయవదానం చేయనున్న మణిరత్నం దంపతులు
చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, ఆయన సతీమణి, నటి సుహాసిని అవయవదానం చేయనున్నట్లు వెల్లడించారు. చెన్నైలో సాగా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో వీరితో పాటు చారుహాసన్, కోమలం చారుహాసన్ దంపతులు తమ అవయవాలను దానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీతదర్శకుడు భరద్వాజ్ నేతృత్వంలో సంగీత విభావరి కూడా నిర్వహించారు. -
సుబ్బారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం
హైదరాబాద్ : ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన 35 ఏళ్ల పెల్లేటి సుబ్బారెడ్డి గత అక్టోబర్ 2న రాత్రి జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తక్షణం స్థానిక నారాయణ ఆస్పత్రిలో చేర్పించగా తీవ్రంగా గాయపడిన సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుబ్బారెడ్డి మరణం ఆ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలో పడేసింది. రేపటి నుంచి కుటుంబం ఎలా గడవాలో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఔదార్యం ప్రదర్శించి అవయవదానం చేయడానికి సిద్ధపడ్డారు. 4వ తేదీ అవయవ దానం చేశారు. సుబ్బారెడ్డి ఊపిరితిత్తులను చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, అలాగే గుండెను గుంటూరు ఆస్పత్రిలో ఉన్న రోగి కోసం, కాలేయం విజయవాడ ఆస్పత్రికి, కిడ్నీలు, కళ్లు నెల్లూరు, తిరుపతిలలో ఉన్న ఆస్పత్రులకు తరలించి మరణించిన సుబ్బారెడ్డి తన అవయవదానంలో మరో అయిదుగురికి ప్రాణం పోశారు. చిన్నపాటి ప్రైవేటు పనులు చేసుకుంటున్న సుబ్బారెడ్డికి భార్య శివకుమారి, తల్లి సుబ్బమ్మ, పిల్లలు సమీర (9 సంవత్సరాలు), జశ్వంత్ (7 సంవత్సరాలు) ఉన్నారు. వారిది నిరుపేద కుటుంబం. ఇంటిపెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం నుంచిగానీ ఇతరుల నుంచి గానీ ఎలాంటి సహాయం అందకపోవడంతో వారు దిక్కులేని వాళ్లయ్యారు. ఆ విషయం తెలిసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా, స్పందించిన వైఎస్సార్ సీపీ నేతలు, ప్రవాసాంధ్రులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కుటుంబంలోని పిల్లలు ఇద్దరి పేరిట చెరో లక్ష రూపాయలు, తల్లి పేరిట మరో 60 వేల రూపాయలు మొత్తంగా 2,60,000 ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రవాసాంధ్రులు ఆపన్నహస్తం అందించారు. వర్జీనియాకు చెందిన పాటిల్ సత్యారెడ్డి ఆ ఇద్దరు పిల్లలు చదువుకున్నంత కాలం వారికయ్యే ఫీజులు చెల్లించడానికి అంగీకరించారు. వర్జీనియాకే చెందిన రాంప్రసాదరెడ్డి బయ్యపరెడ్డి ఆ కుటుంబానికయ్యే ఇంటి ఖర్చును భరిస్తానని ప్రకటించారు. వీధిన పడిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రకంగా పలువురు ముందుకు రాగా, శనివారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో దాతలు ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పుట్టపర్తి వైఎస్సార్ సీపీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ తదితరులు ఉన్నారు. డాక్టర్ హరికృష్ణ ఆ కుటుంబ పరిస్థితిని వైఎస్ జగన్కు వివరించగా, అదే సందర్భంగా ఎంపీ మేకపాటి ఆ కుటుంబానికి మరో 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ కుటుంబానికి తన వంతు కూడా చేయూతనందిస్తానని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అవయవదానం చేసి నలుగురికి ప్రాణం పోసిన సుబ్బారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవడానికి తగిన సహాయం ప్రకటించిన వారందరినీ ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపి హైదరాబాద్ వరకు రప్పించి సహాయాన్ని అందించినందుకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. -
మరణిస్తూ మహాదానం
► నెల్లూరులో దినేశ్రెడ్డి బ్రెయిన్డెడ్.. చనిపోతూ అవయవదానం ► పత్యేక హెలికాప్టర్లో గుండె, కాలేయం హైదరాబాద్కు తరలింపు ► కిమ్స్లో యువకుడికి కాలేయ మార్పిడి ► నెల్లూరులో మరో ఇరువురికి కిడ్నీల దానం సాక్షి, హైదరాబాద్/నెల్లూరు రూరల్: తను కన్నుమూస్తూ మరో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి అమరజీవిగా నిలిచాడు నెల్లూరుకు చెందిన దినేశ్రెడ్డి (32). నెల్లూరు నవాబుపేటలో నివాసముంటున్న ఆయనకు ఈనెల 13న రాత్రి ఫిట్స్ వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మిలు హుటాహుటిన నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు మెదడుకి శస్త్ర చికిత్స చేశారు. చికిత్స పొందుతుండగానే మరోమారు ఈనెల 18న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కోమాలోకి వెళ్లారు. దీంతో వైద్యులు దినేష్రెడ్డి బ్రెయిన్డెడ్ అయ్యాడని నిర్ధారించారు. అనంతరం శోకసంద్రంలోనే దినేశ్రెడ్డి అవయవదానానికి తల్లిదండ్రులు అంగీకరించగా, వైద్యులు జీవన్దాన్కు సమాచారమిచ్చారు. జీవన్దాన్లో పేరు నమోదు చేసుకుని హైదరాబాద్ కిమ్స్లో కాలేయ, గుండె మార్పిడి చికిత్సకు ఎదురు చూస్తున్న ఇద్దరు బాధితులకు సమాచారం ఇచ్చారు. అవయవమార్పిడి చికిత్సకు వారు అంగీకరించడంతో వారికి చికిత్స చేస్తున్న వైద్య బృందం వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరు చేరుకుంది. దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలను సేకరించింది. రెండు కిడ్నీలను నెల్లూరు కిమ్స్లో చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులకు అమర్చగా, గుండె, కాలేయాన్ని ప్రత్యేక బాక్స్లో భద్రపరిచి ఉదయం 6.30 గంటలకు నెల్లూరులో గ్రీన్చానల్ ద్వారా జిల్లా పోలీసు కవాతు మైదానానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి ఉదయం 7.30కి చేర్చారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో కిమ్స్కు తరలించారు. మహారాష్ట్ర నాందేడ్కు చెందిన 36 ఏళ్ల యువకునికి కాలేయాన్ని విజయవంతంగా అమర్చారు. ఒక కిడ్నీ నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని నగరంలోని కిమ్స్కు, కళ్లను మోడరన్ ఐ బ్యాంకుకి తరలించారు. దాత నుంచి సేకరించిన గుండె స్వీకర్తకు మ్యాచ్ కాలేదు. దాత హైబీపీతో బాధపడుతుండటం, 1సెంటీమీటర్ల మందం లో ఉండాల్సిన గుండె రక్త నాళాలు 1.5 సెంటీమీటర్ల మందంలో ఉండటంతో అవయవమార్పిడికి పనికి రాలేదు. దీంతో గుండె మార్పిడి చికిత్సను విరమించుకున్నట్లు కిమ్స్ సీఈవో భాస్కర్రావు వెల్లడించారు. -
నీ త్యాగం స్ఫూర్తిదాయకం!
తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణం పోస్తూ.. గుండె, లివర్ ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలింపు కిడ్నీ, నారాయణ, బొల్లినేనికి శోక సంద్రంలో కుటుంబ సభ్యులు నెల్లూరురూరల్: తాను మరణిస్తూ కూడా మరో ఐదు మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించిన చిల్లకూరు దినేష్రెడ్డి త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన అవయవదానంతో దానంతో ధన్యుడయ్యాడు. బ్రెయిన్ డెడ్ అయిన చిల్లకూరు దినేష్రెడ్డి(32) అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. బిడ్డ ఎలాగూ బతకడని తెలుసుకున్న తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా తన బిడ్డ అవయవాలు ఇతరులకు ఊపిరి పోస్తాయనే ఆశతో అంగీకరించారు. ఈ సంఘటన శనివారం నెల్లూరులో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. విడవలూరు మండలం వావిళ్ల గ్రామానికి చెందిన చిల్లకూరు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మి దంపతులు ఆర్థికంగా ఎదిగేందుకు నెల్లూరు నగరానికి 16 ఏళ్ల క్రితం వచ్చారు. స్థానిక నవాబుపేటలోని పుల్లమ్మ సత్రం దగ్గర కాపురం ఉంటున్నారు. గేదెలు కొనుక్కుని మిని పాలడైరీ నడుపుతూ సంతోషంగా జీవిస్తున్నారు. వారికి ఒక కుమార్తె అనూష. కుమారుడు దినేష్రెడ్డి. కుమారుడు స్థానిక చికెన్స్టాల్లో పనిచేస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న ఆకుటుంబంపై విధి పగబట్టింది. అనుకోకుండా పెళ్లీడు కొచ్చిన కుమారుడు దినేష్రెడ్డి ఈనెల 13న రాత్రి ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన అపోలో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెదడుకి ఆపరేషన్ చేశారు. తరువాత చికిత్స పొందుతుండగానే మరొక సారి ఈనెల 18న తీవ్రమైన ఫిట్స్కు గురయ్యాడు. కోమాలోకి వెళ్లాడు. పరిశీలించిన ౖÐð ద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. కోలుకోలేడని స్పష్టంగా చెప్పారు. పిడుగు లాంటి వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్ప కూలిపోయారు. తన బిడ్డను ఎలాగోలా బతికించాలని డాక్టర్ల కాళ్లా, వేళ్లా పడి బతిమిలాడుకున్నారు. బ్రెయిన్ డెడ్కి గురైన వ్యక్తిని బతికించడం సాధ్యం కాదని డాక్టర్లు వివరించారు. బిడ్డ ఎలాగు బతకడు కాబట్టి అవయవదానం చేస్తే మీ బిడ్డ కనీసం ఐదుమందికి ప్రాణదానం చేసినట్టని తెలిపారు. దుఃఖాన్ని దిగమించి తల్లిదండ్రులు కుమారుడు లేడన్న దుఃఖాన్ని పంటి బిగువున దాచుకుని తన బిడ్డ మరణించినప్పటికీ మరో ఐదుమందికి జీవితాన్నిస్తాడనే ఆశతో అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ ట్రస్టు అనుమతి పొందిన నారాయణ ఆసుపత్రికి దినేష్రెడ్డిని తరలించారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి దినేష్రెడ్డి శరీర భాగాలను వేరు చేశారు. గుండె, లివర్ను హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్కు ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నెల్లూరు పోలీసు ఎస్ఐ సుబ్బారావు పేరడే గ్రౌండ్ వరకు గ్రీన్కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక పెట్టెలో గుండె, లివర్ను భద్రపరచిన వైద్యులు తొలుత ప్రత్యేక వాహనంతో జిల్లా పోలీసు కవాతు మైదానం వరకు తీసుకొచ్చి, అక్కడ నుండి హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించారు. ఒక కిడ్నీని నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని కిమ్స్ ఆసుపత్రికి, కళ్లను మోడరన్ ఐ బ్యాంకుకి తరలించనున్నారు. -
తాను మరణిస్తూ.. ఐదుగురికి ప్రాణం పోస్తూ..
దినేష్రెడ్డి అవయవదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం అవయవాలు హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు నెల్లూరురూరల్ : చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి దున్నుగా నిలిచాడు. ఇప్పుడు తాను మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణాలు పోస్తున్నాడు. బ్రెయిన్ డెడ్ అయిన దినేష్రెడ్డి (32) తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంనూ తమ బిడ్డ అవయవాలు ఇతరులకు ఊపిరి పోస్తాయనే ఆశతో అంగీకరించారు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. విడవలూరు మండలం వావిళ్లకు చెందిన చిల్లకూరు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మి దంపతులు బతుకుతెరువు కోసం నెల్లూరు నగరానికి 16 ఏళ్ల క్రితం వచ్చారు. నవాబు పేటలోని పుల్లమ్మసత్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గేదెలతో మినీ పాలడెయిరీ నడుపుతూ సంతోషంగా జీవిస్తున్నారు. వారికి ఒక కుమార్తె అనూష, కుమారుడు దినేష్రెడ్డి ఉన్నారు. కుమారుడు స్థానిక చికెన్ స్టాల్లో పనిచేస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. పెళ్లీడు కొచ్చిన కుమారుడు దినేష్రెడ్డి ఈ నెల 13న రాత్రి ఫిట్స్ రావడంతో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటావుటిన అపోలో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెదడుకి ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతుండగానే మరొక సారి ఈ నెల 18న తీవ్రమైన ఫిట్స్కు గురై కోమాలోకి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. పిడుగు లాంటి ఈ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్ప కూలిపోయారు. తన బిడ్డను ఎలాగోలా బతికించాలని డాక్టర్ల బతిమిలాడారు. బ్రెయిన్ డెడ్కు గురైన వ్యక్తిని బతికించడం సాధ్యం కాదని డాక్టర్లు వివరించారు. బిడ్డ ఎలాగు బతకడని అవయవదానం చేస్తే మీ బిడ్డ కనీసం ఐదు మందికి ప్రాణదానం చేస్తాడని డాక్టర్లు చెప్పడంతో దుఃఖాన్ని దాచుకుని మరో ఐదుగురికి జీవితాన్నిస్తాడనే ఆశతో అవయవదానానికి అంగీకరించారు. జీవన్దాన్ ట్రస్ట్ అనుమతి పొందిన నారాయణ ఆసుపత్రికి దినేష్రెడ్డిని తరలించారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి దినేష్రెడ్డి శరీర భాగాలను తరలించేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్కు గుండె, లివర్ దినేష్రెడ్డి గుండెను, లివర్ను ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక కిడ్నీని నారాయణ ఆసుపత్రికి , మరో కిడ్నీని కిమ్స్ ఆసుపత్రికి, కళ్లను మోడరన్ ఐ బ్యాంక్కు తరలించనున్నారు. -
మరణిస్తూ.. ప్రాణం పోశాడు..
• విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో 29 ఏళ్ల యువకుడి బ్రెయిన్డెడ్ • అవయవ దానానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు • హైదరాబాద్కు విమానంలో గుండె... అంబులెన్స్ లో కాలేయం తరలింపు సాక్షి, హైదరాబాద్: తను కన్నుమూస్తూ.. కొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఓ యువకుడు. ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన గంగుల వంశీకృష్ణ(29) ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పని చేస్తున్నాడు. అతనికి ఇటీవల తీవ్రమైన తలనొప్పి, జ్వరం వచ్చింది. చికిత్స కోసం మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే పరిస్థితి విషమించి మెదడులో రక్తం గడ్డకట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. చికిత్సకు స్పందించకపోవడంతో వైద్యులు బ్రెరుున్డెడ్గా ప్రకటించారు. వంశీకృష్ణ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో వెంటనే జీవన్దాన్కు సమాచారం ఇచ్చారు. వైద్య బృందం వెంటనే ఆస్పత్రికి చేరుకుని దాత నుంచి గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. ఇలా సేకరించిన అవయవాల్లో గుండెను జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితునికి అమర్చగా, కాలేయాన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి, కిడ్నీలను మంగళగిరి ఎన్ఆర్ఐ, విజయవాడ ఆయుష్ ఆస్పత్రులకు, కళ్లు వాసన్ ఐ కేర్కు తరలించారు. తమ బిడ్డ భౌతికంగా తమ ముందు లేకున్నా మరో ఆరుగురిలో సజీవంగా ఉన్నాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. యశోదలో కాలేయ మార్పిడి... లూథియానాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా, కాలేయం మార్చాలని సూచించారు. వంశీకృష్ణ వివరాలు వీరికి కూడా అందడంతో విజయవాడ చేరుకుని దాత నుంచి కాలేయాన్ని సేకరించి అంబులెన్స(ప్రత్యేక గ్రీన్ఛానల్)లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. సుమారు పది మందితో కూడిన వైద్య బృందం పది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత కాలేయాన్ని అమర్చింది. అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి విశాఖకు చెందిన చెందిన 25 ఏళ్ల యువకుడు కొంత కాలంగా తీవ్రమైన ఆయాసం, ఛాతిలో నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. మంగళవారం అపోలో ఆస్పత్రిని ఆశ్రరుుంచగా.. కార్డియోమయోపతి అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండెమార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. ఇదే రోజు సాయంత్రం వంశీకృష్ణ అవయవదాన వివరాలు అందాయి. బాధితుడు చికిత్సకు అంగీకరించడంతో డాక్టర్ ఏజీకే గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం మంగళవారం అర్ధరాత్రి విజయవాడకు వెళ్లి దాత నుంచి గుండెను సేకరించింది. బుధవారం ఉదయం గన్నవరం ఎరుుర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంది. ఆస్పత్రికి చేరుకున్నాక ఎనిమిది గంటల పాటు శ్రమించి బాధితునికి దాత గుండెను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం బాధితుని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గోఖలే స్పష్టం చేశారు. -
హెలికాప్టర్ సమకూర్చిన కృష్ణపట్నం పోర్టు
నెల్లూరు రూరల్ : అవయవదానంలో గుండెను తరలించేందుకు కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక హెలికాప్టర్ను సమకూర్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన సుబ్బారెడ్డి అవయవదానం ఆపరేషన్ నారాయణ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించారు. గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ జిల్లా పోలీసు కవాతు మైదానంలో ల్యాండ్ కావాల్సి ఉండగా గ్రౌండ్లో దుమ్ము వల్ల ల్యాండ్ కాకుండా నేరుగా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లింది. అక్కడ వరకు గుండెను అంబులెన్స్లో తీసుకురావడం కష్టం అవుతుందని నారాయణ మెడికల్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో దిగింది. నారాయణ ఆస్పత్రి నుంచి గుండెను అంబులెన్స్లో హెలిప్యాడ్ వరకు తీసుకురాగా అక్కడ నుంచి హెలికాప్టర్లో వైద్యులు తీసుకెళ్లారు. అవయవదానానికి తమ వంతు సాయంగా కృష్ణపట్నం పోర్టు సొంత హెలికాప్టర్ను పంపించినట్లు పోర్టు పీఆర్ హెడ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విజయకుమార్రెడ్డి, భాస్కర్రెడ్డి, మీడియా మేనేజర్ శీనయ్య పాల్గొన్నారు. -
మానవత్వానికి మతం లేదని చాటారు!
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటుండగా మత సామరస్యం వెల్లివిరిసే ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు మతాలకు అతీతంగా మానత్వం ప్రదర్శించారు. తమ మతం కాని మహిళలకు మూత్రపిండాలు దానం చేసి మానవత్వానికి హద్దులు లేవని నిరూపించారు. రెండు వేర్వేరు మతాలకు చెందిన అనితా మెహ్రా, తస్లీమ జహానే అనే మహిళలకు మూత్రపిండాలు పాడైపోవడంతో ఆస్పత్రిలో చేరారు. తమ భర్తలు కిడ్నీలు దానం చేసేందుకు ముందు వచ్చినా వీరి బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాలేదు. అనిత బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ కాగా, ఆమె భర్త వినోద్ మెహ్రాది ఏ పాజిటివ్. తస్లీమ బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ కాగా, ఆమె భర్త అహ్మద్ ది బి పాజిటివ్. పరిస్థితిని గుర్తించిన డాక్టర్లు మూత్రపిండాల పరస్పర మార్పిడికి వినోద్, అహ్మద్ ను ఒప్పించారు. అహ్మద్ భార్యకు వినోద్ కిడ్నీ దానం చేయంగా, వినోద్ భార్యకు అహ్మద్ కిడ్నీ ఇచ్చాడు. సెప్టెంబర్ 2న ఆపరేషన్ చేసి కిడ్నీలు అమర్చారు. విభిన్న మతాలకు చెందిన వ్యక్తుల మధ్య కిడ్నీల మార్పిడి తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి వైద్యులు తెలిపారు. వినోద్, అహ్మద్ పరస్పరం ధన్యవాదాలు తెలుపుకోవడం విశేషం. -
అవయవ దానం ప్రాణదానంతో సమానం
ఎచ్చెర్ల: అవయవ దానం ప్రాణ దానంతో సమానమని సావిత్రి బాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధి జి.సీతామహాలక్ష్మి అన్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలలు, చిలకపాలేంలోని శ్రీ శివానీ గ్రూప్ ఆఫ్ కళాశాలల్లో శుక్రవారం అవ య దానంపై అవగాహన కల్పించారు. రోడ్డు, ఇతర ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలు ఇతర వ్యక్తులకు ఉపయోగపడతాయన్నారు. వారికి పునర్జమ్మ లభిస్తుందని తెలిపారు. కాలేయం, మూత్ర పిండాలు, కాళ్లు, గుండె వంటి అనేక అవయవాలు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రస్తుతం కిడ్నీ, లివర్ సమస్యలు ఎక్కువవుతున్నాయన్నారు. విద్యార్థులందరూ అవయవ దానంపై పల్లెల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ మురళీ కృష్ణలు పాల్గొన్నారు. -
అమరజీవి విజయభాస్కర్
యువకుడి బ్రెయిన్ డెత్ అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు ఆరుమందికి కొత్తజీవితం నెల్లూరు రూరల్ : ఓ యువకుడు మరణించినా, అతడి అవయవాలతో ఆరుగురి జీవితాలకు వెలుగును ప్రసాదించిన సంఘటన నెల్లూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. నగరంలోని వెంకటేశ్వరపురంలో నివాసముంటున్న డక్కా విజయభాస్కర్(37) నాలుగు రోజుల క్రితం కళ్లు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు పరీక్షలు చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారు సింహపురి ఆసుపత్రికి తీసుకెళ్లి సోమవారం ఆపరేషన్ చేయించారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడి డాక్టర్లు విజయభాస్కర్ బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బంధుమిత్రుల సలహా మేరకు పుట్టెడు బాధను గుండెల్లో దాచుకుని తన బిడ్డ అవయవాలను దానం చేసేందుకు తండ్రి రమణయ్య నిర్ణయించుకున్నాడు. వెంటనే బంధువుల సహకారంతో నారాయణ ఆస్పత్రికి తరలించాడు. తమ బిడ్డ మరణించినప్పటికీ మరో ఆరుమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరాడు. దీంతో నారాయణ ఆస్పత్రివారు జీవన్ దాన్ ట్రస్టును సంప్రదించి అవయవదానానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైజాగ్ కేర్ ఆస్పత్రికి లివర్, చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి గుండె, ఊపిరితిత్తులును ప్రత్యేక ఆంబులెన్స్లో తరలించారు. చెన్నై నుంచి వైజాగ్కు విమానంలో లివర్ను తీసుకెళ్లారు. పోలీసుల సహకారంతో చెన్నై వరకు ట్రాఫిక్ లేకుండా గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. నేత్రాలను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి తరలించారు. -
నా కిడ్నీ అమ్మాలి.. ఎలా?
ఆర్థికపరమైన కష్టనష్టాల వల్లో, కుటుంబ సమస్యల కారణంగానో.. మరేదైనా ఇబ్బంది ఉందో గానీ కిడ్నీలు అమ్ముకోడానికి మన దేశంలో చాలామంది సిద్ధంగా ఉన్నారు. అయితే అది ఎలాగో వారికి అర్థం కావడం లేదు. అందుకే, దాదాపు రెండు దశాబ్దాలుగా అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ మోహన్ ఫౌండేషన్ను ఈ ప్రశ్నతో ముంచెత్తుతున్నారు. తమ ఫేస్బుక్ పేజిలోను, ఈమెయిల్కు, టోల్ఫ్రీ నంబర్లకు పదే పదే చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారని ఫౌండేషన్కు చెందిన డాక్టర్ సునీల్ ష్రాఫ్ చెప్పారు. తమ సోషల్ సైట్లలో వచ్చే ఈ ప్రశ్నలను తొలగించడానికి ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుక్కోడానికి డబ్బు కోసం అమ్మడానికి సిద్ధంగా ఉన్న వస్తువుల్లో కిడ్నీ ఒకటన్నది వాళ్ల భావన అయి ఉండొచ్చని ఆయన చెప్పారు. అలా అమ్మడం చట్టవిరుద్ధమన్న సంగతి వాళ్లకు తెలియకపోవచ్చని తెలిపారు. మానవ శరీర అవయవాలను ఎవరైనా అమ్మినా.. కొన్నా కోటి రూపాయల వరకు జరిమానా, పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. ఓ వ్యక్తి ఒక వెబ్సైట్లో ''నా పేరు గణేశ్. నాకు పాస్పోర్టు కూడా ఉంది. నా ఏబీ పాజిటివ్ కిడ్నీ అమ్ముతాను. నేను సిగరెట్లు కాల్చను, మద్యం తాగను. ఆసక్తిగల వారు ఫోన్ చేయండి'' అని పోస్ట్ చేశాడు. విచిత్రం ఏమిటంటే, దానికి ముగ్గురు వ్యక్తులు స్పందించారు కూడా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమ కిడ్నీని రూ. 9 లక్షల నుంచి రూ. 45 లక్షల వరకు ధరకు అమ్ముతున్నారట. విపరీతమైన పేదరికం కూడా ఇందుకు కారణం అవుతోంది. ముంబైలోని ఎల్హెచ్ హీరానందాని ఆస్పత్రిలో జూలై 14 నుంచి ఇప్పటివరకు ఐదుగురు డాక్టర్లు, తొమ్మిది మంది ఇతరులు అరెస్టయ్యారు. వీళ్లంతా కిడ్నీ రాకెట్లో సభ్యులే. భారతదేశంలో తొలిసారిగా డాక్టర్లు, మధ్యవర్తులతో పాటు దాత, గ్రహీత కూడా అరెస్టయ్యారని డాక్టర్ ష్రాఫ్ చెప్పారు. అవయవ దానానికి సంబంధించిన నిబంధనల గురించి చాలామంది డాక్టర్లకు కూడా సరిగా తెలియదట. దీంతో ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. -
అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పునర్జన్మను పొందవచ్చని జేసీ 2 రాజ్కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పుర స్కరించుకుని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, సెట్నల్ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్క్రాస్ సొసైటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు జేసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాల బారిన పడి బ్రెయిన్డెడ్ అయిన వారు అవయవదానంతో 8 మందికి పునర్జన్మను ఇవ్వొచ్చని తెలిపారు. అవయవదానాన్ని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం అవయవ దానం చేసిన నారాయణమ్మ, సుభాషిణి కుటుంబసభ్యులకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ ఏవీ సుబ్రహ్మణ్యం, డాక్టర్ చక్రవర్తి, సెట్నెల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు. -
తాను చనిపోతూ... మరికొందరి జీవితాల్లో వెలుగులు
- బ్రెయిన్ డెడ్తో మృతి చెందిన ప్రవీణ్ - అవయవదానం చేసిన కుటుంబ సభ్యులు - మృతుని అవయవాలు ఇతర రాష్ట్రాలకు చిగరపల్లె(చిత్తూరు): ప్రమాదవశాత్తు తాను చనిపోతూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాడు ఐరాల మండలం చిగరపల్లెకు చెందిన ప్రవీణ్. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన భాస్కర్రెడ్డి, కుమారి దంపతుల కుమారుడు ప్రవీణ్(37). పూతలపట్టు మండలం అనంతాపురానికి చెందిన భవ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరు గ్రామంలోని ప్రవీణ్ తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ప్రవీణ్ కాలుజారి కిందపడ్డాడు. వెంటనే అతడిని అరగొండ అపోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించినా ఫలితం లేదు. రెండు రోజుల వరకు చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం ఉదయం ప్రవీణ్ మృతిచెందాడు. తల్లిదండ్రులు, భార్య స్పందించారు. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సంకల్పించారు. చెన్నై వైద్యులను సంప్రదించి అక్కడే అవయవాలు దానం చేయాలని కోరారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవీణ్ మృత్యదేహన్ని శుక్రవారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ప్రవీణ్ గుండెను దిల్లీకి, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు ఇతర రాష్ట్రాలకు పంపినున్నట్లు వైద్యులు తెలిపారు. -
అవయవదానంపై ముస్లింల నిరాసక్తత
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీవన్ దాన్' స్కీమ్ తెలంగాణలో విజయంసాధించినంతగా మరెక్కడా సాధించలేదు. అవయవదానం కోసం ప్రత్యకంగా తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన 241 మంది వ్యక్తులు తమ అవయవాలను సేకరించి 1,000మందికి ప్రాణదానం చేశారు. అయితే అవయవదానం ఆవశ్యకతను ముస్లింలకు తెలియపర్చడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందని తాజాగా వెల్లడయింది. ముస్లిం కుటుంబాలకు చెందిన చాలా మంది అవయవదానానికి సరేమీరా అంటున్నారు. వీరిలో గ్రహీతల కుటుంబాలు కూడా ఉండటం గమనార్హం. 2013లో ప్రారంభమైన జీవన్ దాన్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకూ 39మంది ముస్లింలు అవయదానాన్ని పొందారు. కానీ దానం చేసుందుకు మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదని జీవన్ దాన్ కో-ఆర్డినేటర్ డా.జీ స్వర్ణలత చెప్పారు. ఈ విషయంలో ముస్లిం మత పెద్దల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మైనారిటీలు నడుపుతున్న రెండు ఆసుపత్రులు జీవన్ దాన్ లో చేరేందుకు నిరాసక్తతను ప్రదర్శించాయని, ఆ రెండు ఆసుపత్రుల్లో 2,849 మందికి అవయవాల అవసరం ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, మతపరమైన అడ్డంకుల వల్లే ముస్లింలు అవయవదానాలకు ముందుకు రాకపోవడానికి గల కారణం అయిఉండొచ్చని డాక్టర్ స్వర్ణలత అంటున్నారు. -
ఇతడు చిరంజీవి
► తిరుపతి స్విమ్స్లో చిరంజీవిరెడ్డి బ్రెయిన్డెడ్ ► అవయవదానానికి కుటుంబసభ్యుల అంగీకారం ► గుండె, కాలేయం, మూత్రపిండాలు సేకరించిన వైద్యులు ► హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి గుండె.. ► విశాఖ అపోలోకు కాలేయం తిరుపతి : బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబసభ్యులు ఆదివారం దానం చేశారు. నలుగురికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తి చిరంజీవిగా నిలిచాడు. వివరాలు.. తిరుపతి గాంధీపురంలో నివసించే పెద్దపాపమ్మ కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) నగరంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అవివాహితుడైన చిరంజీవి తీవ్రమైన జ్వరం, అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఈనెల 27న స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరంజీవి శనివారం బ్రెయిన్ డెడ్కు గురైనట్లు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. దీంతో చిరంజీవి అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. స్విమ్స్ వైద్యులు, జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం మధ్యాహ్నం వరకు దశల వారీ శస్త్ర చికిత్సలు చేసి 4 అవయవాలు తీశారు. అందులోగుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి విమానం ద్వారా తరలించారు. ఒక కిడ్నీని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నా రాయణ ఆసుపత్రికి చేర్చారు. మరొక దానిని స్విమ్స్ ఆసుపత్రిలోనే ఓ రోగికి అమర్చారు. చిరంజీవి మృతదేహానికి స్విమ్స్ సి బ్బంది పూ లమాలలు వేసి నివాళులర్పించారు. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన గుండెను హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో ఓ మహిళకు, కాలేయాన్ని విశాఖ అపోలో మరో వ్యక్తికి ఆదివారం విజయవంతంగా అమర్చారు. మహబూబ్నగర్ జిల్లా వట్టివర్లపల్లికి చెందిన పరమేశ్వర్ భార్య విజయలక్ష్మి(36) పదేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నెం గోపీచంద్ను ఆశ్రయించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు గుండె మార్పిడి అవసరమని తేలింది. దీంతో దాత కోసం జీవన్దాన్లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవిరెడ్డి గురించి తెలుసుకున్న స్టార్ వైద్య బృందం వెంటనే తిరుపతి చేరుకుని గుండెను సేకరించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.05 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి, అంబులెన్స్లో అక్కడి నుంచి ‘గ్రీన్చానల్’ద్వారా 15 నిమిషాల్లో స్టార్ ఆస్పత్రికి గుండెను చేర్చింది. అనంతరం వైద్య బృందం విజయవంతంగా విజయలక్ష్మికి గుండెను అమర్చింది. అలాగే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాలేయ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కాలేయ మార్పిడి అవసరమని తేల్చిన వైద్యులు.. బ్రెయిన్డెడ్ అయిన చిరంజీవిరెడ్డి నుంచి కాలేయాన్ని ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్లో సాయంత్రం 7.25 గంటలకు ఆస్పత్రికి చేర్చి ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు. -
మహిళ ప్రాణాలు నిలబెట్టిన బాలుడు
కొచ్చి: తాను చనిపోతూ ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడో కేరళ టీనేజర్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 15 ఏళ్ల విశాల్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతడి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను 27 ఏళ్ల మహిళకు దానం చేశారు. విశాల్ దేహం నుంచి వేరు చేసిన గుండెను తిరువనంతపురం నుంచి నావికాదళానికి చెందిన ఎయిర్ అంబులెన్స్ లో బుధవారం కొచ్చిలోని లీసీ ఆస్పత్రికి తరలించారు. అరుదైన గుండె జబ్బుతో బాధ పడుతున్న త్రిశూర్ కు చెందిన సంధ్య అనే మహిళకు వైద్యులు 5 గంటల పాటు ఆపరేషన్ చేసి దీన్ని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయిందని వైద్యులు తెలిపారు. తిరువనంతపురంలోని ముక్కోల ప్రాంతానికి చెందిన విశాల్ స్కూల్ కు వెళుతుండగా జూలై 16న ప్రమాదానికి గురైయ్యాడు. వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. అతడు బెయిన్ డెడ్ అయినట్టు తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్యులు ధ్రువీకరించారు. 'మృతసంజీవని' అధికారుల చొరవతో విశాల్ అవయవాలు దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అతడి గుండెను కొచ్చికి తరలించగా, మూత్రపిండాలను ఇద్దరు రోగులకు దానం చేశారు. -
ఆమె లేదు.. ఆమె కళ్లు ఉన్నాయి!
కోల్కతా: పుట్టెడు విషాదంలోనూ తోటివారికి సహాయం చేయాలని భావించింది ఆ కుటుంబం. తమకు వచ్చిన కష్టం మరొకరికి రాకూదన్న ఉద్దేశంతో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. కోల్కతాకు చెందిన సుతాప బోస్ అనే 36 ఏళ్ల మహిళ మంగళవారం కన్నుమూశారు. ఆమె అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే సమయం మించిపోవడంతో ఆమె అవయవాలు పనికిరాకుండా పోయాయి. ఆమె కళ్ల నుంచి కార్నియాలను మాత్రం వైద్యులు సేకరించారు. వీటితో ఇద్దరికి చూపు ప్రసాదించనున్నారు. పుట్టెడు బాధలోనూ పరులు కోసం ఆలోచించిన సుతాప కుటుంబ సభ్యులను చెమర్చిన కళ్లతోనే అభినందిస్తున్నారు. సుతాప రెండు కిడ్నీలు పాడైనట్టు ఏడాదిన్నర క్రితం డాక్టర్లు గుర్తించారు. ఆమెకు మూత్రపిండ్రం అమర్చాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి డయాలసిస్ చేయించుకుంటూ అవయవదాత కోసం ఆమె ఎదురు చూశారు. సుతాప కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆమెకు కిడ్నీ దొరకలేదు. బిరతిలో తన తండ్రి నివాసంలో ఉండగా గుండెపోటు రావడంతో సుతాప మంగళవారం కన్నుమూశారు. అంత బాధలోనూ సుతాప కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేయాలనుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని డాక్టర్ ప్రతిమ్ సేన్గుప్తా చెప్పారు. సుతాపకు భర్త అమితాబ, ఐదేళ్ల కుమార్తె శ్రేష్ట ఉన్నారు. -
ఆ బాధను కళ్లారా చూశా.. అందుకే ఈ యాప్
లక్షలమంది ఐ ఫోన్ యూజర్లను అవయవ దానానికి ప్రోత్సహించడానికి యాపిల్ కొత్త సాప్ట్ వేర్ ను తీసుకొచ్చింది. అవయవ దానాన్ని తేలికగా చేయడానికి యాపిల్ తన హెల్త్ యాప్ సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసింది. అప్ డేట్ చేసిన ఈ హెల్త్ యాప్ ను ఐఓఎస్ 10 యూజర్లందరికీ అందుబాటులో ఉంచనుంది. ఈజీ సైన్-అప్ బటన్ తో ఆర్గాన్ లు డొనేట్ చేసేలా కంపెనీ ఆ యాప్ ను రూపొందించింది. ఈ నెలలో లిమిటెడ్ గా ఈ కొత్త సాప్ట్ వేర్ ను యాపిల్ విడుదల చేయనుంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న అవయవ దాత కొరత ఇబ్బందిని, ఈ యాప్ ద్వారా యాపిల్ తగ్గించగలదని కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, 2009లో లివర్ మార్పిడికి, అవయవం దొరకక ఎంతో బాధను భరించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన స్నేహితుడు ఎంతగా బాధపడ్డాడో కళ్లారా చూశానని, ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని కుక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను లివర్ దానం చేస్తానన్న స్టీవ్ జాబ్స్ అంగీకరించలేదని తెలిపారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తో 2011లో జాబ్స్ చనిపోయారని, సరియైన సమయానికి అవయవ దాత దొరకక ఇబ్బందిపడుతున్న వారికి ఈ యాప్ ఎంతో సహకరించగలదని టిమ్ కుక్ చెప్పారు. ఆన్ లైన్ లావాదేవీలన్నింటికీ స్మార్ట్ ఫోన్లు వాడే యువతకు, ఈ కొత్త సైన్-అప్ విధానంతో అవయవాలు దానం చేయడం కూడా సులభతరం అవుతుందని అన్నారు. 2014లో యాపిల్ ఐఫోన్ యూజర్లకు హెల్త్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ టూల్ తో యూజర్ల హెల్త్, ఫిట్ నెస్ డేటాను రికార్డు చేసుకునేలా పొందుపరిచింది. అయితే ప్రస్తుతం అప్ డేట్ చేసిన ఈ యాప్ తో, ఆర్గాన్ డొనేషన్ సమాచారం కూడా అందుబాటులోకి రానుంది. అవయవ దాతగా నమోదు చేసుకున్న యూజర్ల సమాచారం, డొనేట్ లైఫ్ అమెరికాను నిర్వహిస్తున్న నేషనల్ డొనేట్ రిజస్ట్రీకి వెళ్తుంది. ఎవరికైనా అవయవం కావాల్సి వస్తే, ఫోన్ లాక్ లో ఉన్నా సరే ఎమర్జెన్సీ సమాచారంగా ఫోన్ పై డిస్ ప్లే అవుతుంది. ప్రస్తుతం డెవలపర్స్ బీటా ఐఓఎస్ 10 యూజర్లకు అందుబాటులో ఉంటుంది. దీన్ని మరింత వ్యాప్తి చేయడానికి కొత్త ఐఓఎస్ వెర్షన్ కంపెనీ ఆవిష్కరించనుంది. అమెరికాలో 12వేలకు పైగా ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం అవయవదానానికి వేచిచూస్తున్నారు. వారిలో అవయవం అందక రోజుకు సగటున 22 మంది చనిపోతున్నారు. -
నలుగురి జీవితాల్లో అశోక దీపం
అతడు జీవితాన్ని ఎంత ఆరాధించాడో తెలియదు కానీ, చనిపోతూ ఆరిపోతున్న దీపాలకు ఆరో ప్రాణమయ్యాడు. అతడు అతడ్ని ఎంతగా ప్రేమించాడో తెలియదు గానీ, నలుగురికి పునర్జన్మ ప్రసాదించి ప్రాణానికి అసలైన అర్థం చెప్పాడు. కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ కుప్పకూలిపోతే.. మరణానికి చేరువైతే.. కూలబడి కూర్చోకుండా కన్నీటిని దిగమింగుతూనే కొడుకు అవయవాలను దానంచేసి ఆదర్శమూర్తులుగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. కన్నీటికే కన్నీరు తెప్పించే ఈ విషాద గాథ గుంటూరు నెహ్రూనగర్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు నెహ్రూనగర్ తొమ్మిదో లైనుకు చెందిన సూరగాని శివలక్ష్మయ్య, గోవర్ధన లక్ష్మికి ఇద్దరు సంతానం. పెద్దకుమారుడు మహేష్కుమార్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు అశోక్కుమార్ (25) అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆర్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కుమారులిద్దరూ మంచి భవిష్యత్తు పొందడం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. గత మంగళవారం తమ చిన్న కుమారుడు నిద్రలోనే పెద్దగా గురకపెడుతూ అపస్మారక స్థితిలోకి చేరు కున్నాడు. భయాందోళనతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన ఆ తల్లిదండ్రులు చేదువార్త విన్నారు. అశోక్ కోమాలోకి వెళ్లిపోయాడని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే, మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల అనంతరం శస్త్ర చికిత్సల వల్ల స్పందన లేదని, అశోక్ బ్రెయిన్డెడ్ అయ్యాడని అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుని అవయవదానానికి ముందుకొచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈ క్రమంలో జీవన్ దాన్ను ఆశ్రయించారు. జీవన్ దాన్లో అప్పటికే అవయవాల కోసం నమోదు చేసుకున్న వారి జాబితాను అనుసరించి అశోక్ అవయవాలను దానం చేశారు. ఆదివారం వేకువజామున ఈ అవయవ దాన ప్రక్రియను మణిపాల్ వైద్యులు పూర్తిచేశారు. లివర్, ఒక కిడ్నీ మణిపాల్ ఆస్పత్రిలోని ఇద్దరు రోగులకు అమర్చగా, కళ్లు శంకర్ కంటి ఆస్పత్రికి, మరొక కిడ్నీ ఆయుష్ ఆస్పత్రికి అందజేశారు. తాను చనిపోతూ నలుగురిలో తిరిగి జీవించాడు అశోక్. ఈ సందర్భంగా అశోక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ అవయవ దానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పడం విశేషం. - తాడేపల్లి రూరల్ -
మరణిస్తూ ప్రాణదానం
పంజగుట్ట: రోడ్డు ప్రమాదానికి గురై... తాను మరణిస్తూ... తన అవయవాలు దానం చేసి మరో ఏడుగురికి ప్రాణం పోశాడు సింగరేణి ఉద్యోగి. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం ... వరంగల్ జిల్లా భూపాల్పల్లికి చెందిన ఎం.నర్సయ్య(55) సింగరేణి ఉద్యోగి. ఈ నెల 23నద్విచక్ర వాహనంపెవైళుతుండగా భూపాల్పల్లిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని మెరుగైన చికిత్స కోసం నగరంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు బ్రైయిన్డెడ్కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. నర్సయ్య భార్య పద్మ, ఆయన పిల్లలకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారు. అతనికి శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, కాలేయం, కళ్లు, రెండు హార్ట్వాల్వ్లను తొలగించి అవసరమైన వారికి అమర్చారు. మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన విద్యార్థిని యశోద(20) ఈ నెల 22నసోదరునితో ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలు కావడంతో ఆమెను అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలిం చారు. 23నఆమె బ్రెయిన్డెడ్కు గురైనట్టు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల అనుమతితో రెండు కిడ్నీలు, కాలేయం, కళ్లు, రెండు హార్ట్ వాల్వ్లను తొలగించి అవసరమైనవారికి అమర్చారు. మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన కొర్ర శంకర్(44) ప్రభుత్వ ఉద్యోగి. ఈ నెల 22న ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం అతన్ని జూబ్లీహిల్స్ అపోలోకు తరలించారు. 23న బ్రెయిన్డెడ్కు గురయ్యాడు. అతని భార్య శాంతాబాయి అవయవ దానానికి అంగీకరించారు. దీంతో ఆయన రెండు కిడ్నీలు, కాలేయం తొల గించి అవసరమైనవారికి అమర్చారు. -
స్పందిస్తున్న హృదయాలు
అవయవ దానంపై పెరుగుతున్న ఆసక్తి పేర్ల నమోదులో దక్షిణాదిలోనే కర్ణాటక ముందంజ యువతలో స్ఫూర్తి నింపుతున్న హరీష్ చివరి కోరిక సగటున రోజూ 20 మంది జెడ్సీసీకే వద్ద పేర్ల నమోదు బెంగళూరు: అవయవ దానంపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. తాము చనిపోయిన తర్వాత తమతో పాటు విలువ కట్టలేని అవయవాలు మట్టిలో కలిసిపోకూడదని రాష్ట్ర యువత భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో అవయవ దానం చేయడానికి యువత ముందుకు వస్తున్నారు. 2015లో 60 మంది అవయవ దానం చేయగా వారి ద్వారా సేకరించిన 158 అవయవాలు ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇతరులకు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అవయవదానం విషయమై దాతలకు, గ్రహీతలకు మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్న జోనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ట్రాన్స్ప్లాన్టేషన్ (జెడ్సీసీకే) సంస్థ వద్ద 10 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అవయవదానం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవడం కర్ణాటకలోనే ఎక్కువ ని జెడ్సీసీకే సంస్థ చెబుతోంది. అంతేకాకండా అవయవదానం కోసం ముందుకు వచ్చేవారిలో ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు కావడమే గమనార్హం. ఇదిలా ఉండగా నెలమంగళ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన శరీరం రెండు ముక్కలు అయినా తన కళ్లను దానం చేయాలని హరీష్ చెప్పిన సంగతి తెలిసిందే. అ ఘటన జరిగినప్పటి నుంచి అవయవదానం కోసం ముందుకు వ చ్చేవారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున 20 మంది జెడ్సీసీకే వద్ద తమ పేర్లను అవయవదానం కోసం నమోదు చేయించుకుంటున్నారు. అవయవదానం అంటే... ఏదేని వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు బ్రెయిడ్డెడ్ స్థితికి చేరుకుంటే సదరు వ్యక్త్తి నుంచి (జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా బంధువులు అనుమతితో) కళ్లు, మూత్రపిండాలు, లివర్ తదితర అవయవాలను సేకరిస్తారు. అటుపై వాటిని అవసరమైన వారికి శ స్త్ర చికిత్స ద్వారా అమరుస్తారు. దీనినే వైద్య పరిభాషలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. దీని వల్ల అత్యంత విలువైన మానవ అవ యవాలు మరోకరికి జీవం పోస్తాయి. జెడ్సీసీకే పాత్ర ఏంటంటే... ప్రతి రాష్ట్రంలో అవయవదానంపై జాగృతి కోసం ఒక సంస్థ పనిచేస్తుంటుంది. అంతేకాకుండా ఈ సంస్థ అటు వ్యాధిగ్రస్తులకు, ప్రభుత్వంతో పాటు అవయవదానం కోసం ముందుకు వచ్చే వారి మధ్య సంధానకర్తగా పనిచేస్తుంటుంది. కర్ణాటకలో జెడ్సీసీకే సంస్థ ఈ విధులను నిర్వర్తిస్తోంది. ఇదిలా ఉండగా ఆయా అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు మొదట రూ.2వేలు చెల్లించి జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో జెడ్సీసీకే సంస్థ సదరు వ్యక్తి బ్లడ్గ్రూప్, వ యస్సు తదితర విషయాలన్నీ (హెల్త్ హిస్టరీ) నమోదు చేస్తారు. ప్రమాద సమయంలో బ్రెయిడ్డెడ్ అయిన వ్యక్తులు ఎవరైనా వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తే వారి వయస్సు, బ్లడ్గ్రూప్ తదితర విషయాలను అప్పటికే సదరు అవయవాల కోసం తమ వద్ద పేర్లు నమోదు చేసుకొన్న వ్యక్తుల వివరాలతో జెడ్సీసీకే సిబ్బంది పోల్చి చూస్తారు. అన్నిరకాలుగా ఇరువురి హెల్త్హిస్టరీ సరిపోతే సదరు అవయవాలను పేషెంట్కు ఉచితంగా అందజేస్తారు. ఇక శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును (ప్రైవేటు ఆస్పత్రుల్లో) వ్యాధిగస్తుడే భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధ ఆర్గాన్ట్రాన్స్ప్లాంట్ విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఎంత మంది ఎదురు చూస్తున్నారంటే... ప్రస్తుతం కిడ్నీ, లివర్ తదితర అవయవ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న 2,502 మంది... జెడ్సీసీకే వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో కిడ్నీ కోసం 1,834 మంది, లివర్ కోసం 600, హృదయం కోసం 40, ఊపిరితిత్తుల కోసం 6 మంది, కిడ్నీ, లివర్ రెండింటీ కోసం 11 మంది, హృదయం, ఊపిరితిత్తుల కోసం 8 మంది, ప్యాంక్రియాస్ కోసం ముగ్గురు ఎదురు చేస్తున్నారు. పేర్ల నమోదు ఇలా... అవయవదానంతో పాటు కిడ్నీ, లివర్ తదితర అవయవసంబంధ వ్యాధులతో బాధవపడుతూ సదరు అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారు 9845006768, zcckbangalore@gmail.com, www.zcck.in లో సంప్రదించవచ్చు. -
అవయవదానంపై కాలినడకన ప్రచారం
గుంటూరు : ప్రజల్లో అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొవ్వూరు రమేష్రెడ్డి కాలినడకన మంగళవారం గుంటూరు వచ్చారు. ఫిబ్రవరి 12న తిరుపతిలో బయలుదేరిన ఆయన 460 కిలోమీటర్లు నడుచుకుంటూ గుంటూరు రావడంతో మంగళవారం పలువురు వైద్యులు రమేష్రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా రమేష్రెడ్డి మాట్లాడుతూ.. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ 2003లో లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని, నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. 2009లో కిడ్నీమార్పిడి ఆపరేషన్ కూడా చేయించుకున్నానని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, ప్రజలు అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు తొలిసారి 2014 సెప్టెంబర్ 4న ప్రొద్దుటూరు నుంచి తిరుపతి వరకు 230 కిలోమీటర్లు కాలినడకన ప్రజలకు అవయవదానంపై అవగాహన పత్రాలను అందజేసి వివరించానన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లక్షలాది మంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, వారందరినీ అవయవదానం ద్వారా బతికించవచ్చని వెల్లడించారు. సన్మాన కార్యక్రమంలో వేదాంత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ చింతా రామకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి, న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, ఆర్ఎంవో డాక్టర్ యనమల రమేష్, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ శాంతి తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ వర్సిటీ ఉద్యోగి బ్రెయిన్ డెడ్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొత్తపల్లి హేమప్రసాద్ (55) శుక్రవారం గుండెపోటుకు గురై వెంటనే కోమాలోకి వెళ్లారు. యూనివర్సిటీలో విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురవ్వడంతో ఉద్యోగులు బందరు రోడ్డులోని రమేష్ హాస్పిటల్కు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్డెడ్ (జీవన్మృతుడు) గా నిర్ధారించారు. బ్రెయిన్డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబం సభ్యులు ముందుకొచ్చారు. ప్రస్తుతం ఏయే అవయవాలు జీవన్దాన్కు పనికొస్తాయో డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని అరుణ్ కిడ్నీ సెంటర్, సన్రైజ్ ఆసుపత్రులకు ఒక్కో మూత్రపిండం దానం చేయనున్నట్లు జీవన్దాన్ అధికారులు తెలిపారు. నేత్రాలను శంకర్ నేత్రాలయం, కాలేయం హైదరాబాద్, విశాఖపట్నం గాని పంపుతామని డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. హేమప్రసాద్ అవయవాలు ఏమేమి పనిచేస్తాయి?, ఎక్కడెక్కడికి పంపించాలనే దానిపై శనివారం తుదినిర్ణయం తీసుకోనున్నారు. బ్రెయిన్డెడ్కు గురైన హేమప్రసాద్ భార్య అరుణకుమారి ప్రభుత్వాస్పత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. హేమప్రసాద్ను యూనివర్సిటీ, ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు సందర్శించారు. ఆయన 1988లో టైపిస్ట్గా యూనివర్సిటీలో చేరారు. అందరితో కలివిడిగా, సౌమ్యంగా ఉండే హేమప్రసాద్ బ్రెయిన్ డెడ్కు గురికావడం పట్ల వర్సిటీ ఉద్యోగులు విచారం వెలిబుచ్చారు. -
మరణించినా.. చిరంజీవులే
కర్ణాటకలో ఇద్దరి అవయవదానం సాక్షి, బెంగళూరు:అవయవ దానం చేసి మరణానంతరం కూడా చిరంజీవులుగా మిగిలారు మంగళూరుకు చెందిన వినీత్ రాజ్(19), హాసన్కు చెందిన సంజనా(18). ప్రమాదాల్లో గాయపడిన వీరు అవయవదానం ద్వారా మరో ఎనిమిది మందికి జీవం పోయగలిగారు. వివరాలు...... మంగళూరులోని మంజేశ్వర ప్రాంతానికి చెందిన కృష్ణమూల్య, గీతా దంపతుల కుమారుడు వినీత్ రాజ్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం ఓ బిల్డింగ్పై వైరింగ్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై కిందికి పడిపోయారు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎస్.జె.ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్డెడ్ అయినట్లుగా వైద్యులు బుధవారం ప్రకటించారు. తమ బిడ్డ లేకపోయినా అతని అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని భావించి అవయవదానానికి అంగీకరించారు. దీంతో బెంగళూరుకు చెందిన వైద్యుల బృందం ఎస్.జె.ఆస్పత్రికి చేరుకొని కాలేయం, కిడ్నీలు, కళ్లను సేకరించారు. ఈ అవయవాలను ప్రత్యేక విమానంలో గురువారం బెంగళూరుకు తీసుకొచ్చారు. మరో ఘటనలో..... హాసన్కు చెందిన సంజనా ఇంజనీరింగ్ విద్యనుఅభ్యసిస్తోంది. ఈనెల 21న మైసూరులోని కేఆర్ఎస్ను సందర్శించేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురవ్వగా హాసన్లోని ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల పాటు చికిత్స అందించిన హాసన్ వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంజనా తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడంతో ఆమెను గురువారం బెంగళూరులోని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి త రలించారు. ఆస్పత్రి చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్.కె.వెంకటరామణ్ణ నేతృత్వంలోని వైద్యులృబందం సంజనా నుంచి ఆమె ృదయం, కాలేయం, కిడ్నీలు, కళ్లను సేకరించారు. -
హరీష్ది విశాల హృదయం
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కుటుంబ ఖర్చుల కోసం రూ.5లక్షల అందజేత అన్ని విధాల ఆదుకుంటానని హామీ తుమకూరు : తాను మరణిస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి మానవతాను చాటుకున్న హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ అన్నారు. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా, కడబ సమీపంలోని కరెగౌడనహళ్లికి చెందిన హరిష్ (22) మంగళవారం సాయంత్రం జాతీయ రహదారిలో జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణం పోతుందని తెలుసుకొని కళ్లను సేకరించాల్సిందిగా వైద్యులకు తెలపాలని స్థానికులకు సూచిస్తూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మృతుడి కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ పరామర్శించి హరీష్ మానవతను శ్లాఘించారు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో కూడా మంచి మనుసుతో మరొకరి జీవితంలో వెలుగు నింపి వెళ్లారని కొనియాడారు. ఈ ప్రమాదం విషయం టీవిలో చూసి బాధపడ్డానని, ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నందున ఆ సమయంలో రాలేకపోయానన్నారు. ఇరుకైన ఇంటిలో నివాసం ఉంటున్న హరీష్కు దేవుడు విశాలమైన మనస్సు ఇచ్చారన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న హరీష్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. హరిష్ అన్న శ్రీధర్కు ఉద్యోగ అవకాశం కల్పించి దగ్గరుండి వివాహం చేయిస్తానని, తల్లికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం కుటుంబ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుమొత్తం సొంతంగా భరిస్తానన్నారు. -
'ఈ రోజుకీ ఆమె బతికే ఉంది'
లండన్: ఆ చిన్నారి పుట్టిన 74 నిమిషాలకే కన్నుమూసింది. ఆ కొద్ది నిమిషాల్లో ఒక మంచిపని చేసి అమరజీవిగా నిలిచిపోయింది. తాను చనిపోతూ అయవయదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించింది. బ్రిటన్ లో యంగెస్ట్ ఆర్గాన్ డోనర్ గా తన పేరు లిఖించుకుంది. ఆ నవజాత ఆడశిశువు పేరు హోప్ లీ. గర్భంలో ఉండగానే ఆమె అమస్తిష్కత(అనిసెఫలే)తో బాధపడుతున్నట్టు హోప్ లీ తల్లిదండ్రులు ఎమ్మా, ఆండ్రూ గుర్తించారు. అమస్తిష్కత కారణంగా మెదడు, పుర్రే సరిగా అభివృద్ధి చెందవని, పుట్టిన తర్వాత ఆమె బతకదని వైద్యులు తెలపడంతో హోప్ లీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెను దిటువుచేసుకుని అవయవదానికి అంగీకరించారు. కేంబ్రిడ్జి ఆస్పత్రిలో తన ట్విన్ సోదరుడు జోష్ కంటే రెండు నిమిషాలు ముందు పుట్టిన హోప్ లీ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. ఆమె మాత్రపిండాలను సేకరించి పెద్దాళ్లకు అమర్చారు. ఆమె కాలేయం నుంచి సేకరించి కణాలను భద్రపరిచారు. కాలేయ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి వీటిని వినియోగించనున్నారు. హోప్ లీ అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తమ గుండెలను పిండేసిందని, కానీ తప్పలేదని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. 'మరొకరికి అవయవాలు దానం చేయడం ద్వారా ఈరోజుకీ(హోప్) బతికేవుంది. తీవ్ర దుఃఖంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే హోప్ ద్వారా మరొకరికి ప్రాణదానం చేశామన్న సంతృప్తి మా బాధను కొంతవరకు తగ్గించింది' అని అన్నారు. -
విశాఖలో మరో యువకుడి అవయవ దానం
-
అవయవ దానం చేద్దాం.. మరణానంతరం జీవిద్దాం..
మాదాపూర్: అవయవ దానం ద్వారా ఒకరు మరణించిన తర్వాత పది మందిలో జీవించవచ్చని, ఇలా కొన్ని కుటుంబాలలో ఆనందం నింపవచ్చని ప్రముఖ సినీనటి సమంత పేర్కొన్నారు. మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో మాక్స్క్యూర్ ఆస్పత్రి, ప్రత్యూష సపోర్ట్ అండ్ జీవన్దాన్ సంస్థ సంయుక్తంగా అవయదానంపై శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా హాజరైన సమంత మాట్లాడుతూ.. దేశంలో ఏటా అవసరమైన సమయానికి అవయవాలు దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అవయదానంపై ప్రతి ఒక్కరు అవ గాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ డాక్టర్ ఎం.రమణి, బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్, మ్యాక్స్క్యూర్ వైద్యులు శరణ్ రెడ్డి, కృష్ణప్రసాద్, ఎంఎస్ఎస్ ముఖర్జీ, అనిల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవయదానంపై ప్రతిజ్ఞ చేశారు. -
స్టార్ హీరోయిన్ అవయవ దానం
టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా స్టార్ హీరోల సరసన నటించటమే కాదు. సామాజిక సేవలోను స్టార్ అనిపించుకుంటుంది చెన్నై ముద్దుగుమ్మ సమంత. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత, ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన ఆమె అవయవ దానానికి సిధ్దమవుతోంది. హీరోయిన్గా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న సమంత అవయవ దానం చేస్తున్నట్టుగా ప్రతిజ్ఞ చేయనుంది. అంతేకాదు తన అభిమానులు కూడా అవయవధానం చేయాలంటే కోరుతోంది. ఈ నెల 7న ప్రత్యూష ఫౌండేషన్తో పాటు, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన చేయనుందట. ఆ తరువాత కూడా అవయవ దానానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటి మహేష్ హీరోగా తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' సినిమాతో పాటు, నితిన్ సరసన 'అ.. ఆ..' సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు తమిళ్లోనూ బిజీగా ఉంది. -
ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
-
ఇంటర్ విద్యార్థి బ్రెయిన్ డెడ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ విద్యార్థి అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి దానం చేశారు. ఈ ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. విశాఖకు చెందిన మండల హరనాథ్(17) నగరంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా అతడు అమ్మమ్మ గారి ఊరు పెబ్బవరం వెళ్లాడు. అక్కడే ఈ నెల 21న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావటంతో విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ఈనెల 23న హరనాథ్ను బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. అతని తండ్రి లేకపోవటంతో తల్లి పుష్పలత, తాత అప్పలనాయుడుతో స్థానిక జీవన్దాన్ కోఆర్డినేటర్ ఇందిర మాట్లాడి అవయవదానానికి ఒప్పించారు. ఇండస్ ఆస్పత్రిలో అవయవ దానానికి సరైన సదుపాయాలు లేక పోవడంతో పక్కనే ఉన్న మణిపాల్ ఆస్పత్రికి మార్చారు. ఈ మేరకు గుండెను చెన్నైలోని ఫోర్టిస్ ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని వైజాగ్లోని కేర్ ఆస్పత్రికి, మరో కిడ్నీని మణిపాల్ ఆస్పత్రిలో పేషెంట్కు, నేత్రాలను స్థానిక ఐ బ్యాంక్కు ఇచ్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. -
బ్రెయిన్డెడ్ మహిళ అవయవదానం
విశాఖపట్నం: బ్రెయిన్డెడ్ అయిన మహిళ అవయవాలు దానం చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వివరాలు.. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన వారణాసి సూర్యలక్ష్మి (52) వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బైక్పై నుంచి కిందపడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో ఆమెను విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఆమెకు బ్రెయిన్డెడ్ అయిందని వైద్యులు గుర్తించారు. దీంతో ఆమె అవయవాలు దానం చేయాలని సూర్యలక్ష్మీ భర్త రమణమూర్తి నిర్ణయించారు. ఆ విషయాన్ని ఆయన వైద్యులకు వెల్లడించారు. అయితే హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కాలేయం అవసరమైంది. ఈ విషయాన్ని యశోదా వైద్యులు కేజీహెచ్ ఆసుపత్రి వైద్యులకు తెలిపారు. దాంతో స్థానిక మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఆమె అవయవాలను సేకరించి హైదరాబాద్కు కాలేయాన్ని ఇండిగో ఫ్లైట్లో తరలించారు. -
పాత్రికేయుడి అవయవదానం
తమ ఎదుట కొండంత కష్టం కనపడుతున్నా, పది మందికీ సాయపడాలనుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీయూడబ్ల్యుజే నాయకుడు చేరాల కృష్ణ (30)కు బ్రెయిన్ డెడ్ కావడంతో.. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. సాక్షి దినపత్రిక అబ్దుల్లాపూర్ మెట్ విలేకరిగా పనిచేస్తున్న కృష్ణ గత గురువారం రాత్రి విధులు ముగించుకుని రాత్రి 11గంటల ప్రాంతంలో బైక్పై ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం ఆటోనగర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిన కృష్ణను ఎల్బినగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. తల లోపలి భాగంలో బలమైన గాయాలు కావడంతో బ్రెయిన్లో అంతర్గతంగా తీవ్ర రక్తస్రావం జరిగింది. చిన్నమెదడుకు బలమైన గాయాలు కావడంతో.. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో కృష్ణ భార్య గౌతమి, తల్లి , సోదరుడు లింగస్వామి తదితరులు అవయవ దానానికి అంగీకరించారు. కృష్ణ అకాల మరణం పట్ల టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కృష్ణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం ఉదయం జరుగుతాయి. -
అవయవదానానికి 103 మంది విద్యార్థుల సుముఖత
విజయనగరం(చీపురుపల్లి): ఒకేసారి 103 మంది విద్యార్థులు అవయవదానికి ముందుకొచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీహర డిగ్రీ కళాశాలలో మానవీయత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందించిన విద్యార్థులు మరణాంతరం తమ అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ అక్కడికక్కడే పత్రాలపై సంతకాలు చేసి మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులుకు అందజేశారు. అంతకుముందు కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గోవిందరాజులు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవయవదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశంలో కేవలం 0.16 శాతం మాత్రమే అవయవదానం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజిన్ కార్యదర్శి ఐ.శ్రీను, శ్రీహర డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఎమ్.రాము, ప్రిన్సిపాల్ ఎమ్.శంకర్, అకడమిక్ కోఆర్డినేటర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మ
లబ్బీపేట: అవయవదానంపై నగర ప్రజల్లో చైతన్యం వచ్చింది. తమ బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారని తెలిశాక, పుట్టెడు దుఖఃలోను మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారనే ఆత్మసంతృప్తితో అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న మణికంఠ, నేడు సుధీర్ మృత్యువులోనూ తమ అవయవాలతో మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు. ఎనికేపాడుకు చెందిన ధనేకుల శివరామప్రసాద్, విజయలక్ష్మి ఇద్దరూ ప్రయివేటు ఉద్యోగులే. వారి పెద్దకుమారుడు సుధీర్ సరోజిని ఇంజినీరింగు కళాశాలలో ఈ ఏడాది మార్చిలో ఇంజినీరింగు పూర్తి చేశారు. చిన్నకుమారుడు సీఏ చేస్తున్నారు. సుధీర్ ఉద్యోగావకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందుతూ సర్టిఫికెట్ల కోసం ఈ నెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొలుత ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుధీర్ బ్రెయిన్డెత్కు గురయ్యాడని నిర్ధారిం చారు. కుమారుడిని మంచి ఇంజినీర్కు చూడాలనుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. సుధీర్ ప్రాణాలను నిలిపే అవకాశం లేనందున అవయవదానం ద్వారానే మరో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వవచ్చని అతని స్నేహితులు సలహా ఇవ్వడంతో తండ్రి శివరామ్ప్రసాద్ అంగీకరించారు. ఈ విషయంలో ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమణమూర్తి కూడా చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని జీవన్దాన్ సంస్థకు సమాచారం తెలపడంతో వారి సూచన మేరకు ఆంధ్రా హాస్పిటల్లోనే సుధీర్ గుండె, ఊపిరి తిత్తులు, లివర్, కళ్లు, కిడ్నీలను సేకరించి వివిధ ప్రాంతాలకు తరలించారు. ఆస్పత్రి నుంచి ఆ అవయవాలను తరలిస్తుండగా, సన్నిహితులు, బంధువులు పూలు చిమ్ముతూ అంజలి ఘటించారు. సుధీర్ తరచూ రక్తదానంచేసే వాడని, అదే స్ఫూర్తితో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వాలని అవయవాలు దానం చేశామని అతని తండ్రి శివరామప్రసాద్ తెలి పారు. మట్టిలో కలిసిపోయే కన్నా, మరో ఐదుగురికి పునర్జన్మను ఇస్తాయనే దానం చేశామని పేర్కొన్నారు. అవయవదానం చేసిన శివరామప్రసాద్, విజయలక్ష్మి దంపతులను ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు, న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. -
అవయవ దానంతో ఐదుగురికి వెలుగు
పంజగుట్ట (హైదరాబాద్): బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనురాధ దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వల్లోల గణేశ్ (56) చిక్కడపల్లిలో నివసిస్తూ స్థానికంగా కెమెరా సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న గణేశ్కు హైబీపీతో ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. గణేశ్ బ్రెయిన్డెడ్ అయినట్లు 14వ తేదీన వైద్యులు నిర్ధరించారు. అవయవ దానం గురించి జీవన్దాన్ ప్రతినిధులు గణేశ్ కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవ దానానికి వారు ఒప్పుకోవడంతో గణేశ్కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు కళ్లు తొలగించి అవసరమైన వారికి అమర్చినట్టు అనురాధ మీడియాకు తెలిపారు. -
అవయవదానంపై అవగాహన ర్యాలీ
కృష్ణా: విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వరకు గురువారం అవయవదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ వీర పాండ్యన్ ప్రారంభించారు. అవయవదానం చేయండి-ప్రాణాలు కాపాడండి అంటూ ప్లకార్డులు పట్టుకొని వైద్య విద్యార్థులు నగర వీధులలో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజుతో పాటు వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
ఐదుగురికి పునర్జన్మనిచ్చిన మనస్విని
- రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోరుు..తానూ బ్రెరుున్డెడ్ అరుు - సజీవంగా బాలిక అవయవాలు చేర్యాల : రోడ్డు ప్రమాదంలో తానేకాదు.. తన తల్లిదండ్రనీ కోల్పోరుున బాలిక మనస్విని తన అవయవాల దానంతో ఐదుగురు చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది. పుష్కర స్నానాలకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తనువు చాలించినా అవయవాల రూపంలో సజీవంగానే ఉంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ముక్క(గంగిశెట్టి) గోపీనాథ్ నాలుగున్నరేళు ్లగా చేర్యాలలో నివాసం ఉంటూ వీరన్నపేట శివారులో లక్ష్మి ఇండస్ట్రీస్ పారాబారుల్డ్ రైస్ మిల్లు నడిపిస్తున్నారు. అతడి కూతురు మనస్విని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. గోపీనాథ్ తన కూతురు మనస్విని, బావమరిది అరుత రాజేశ్ కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నా నాల కోసం నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు వెళ్లారు. తిరుగు ప్రయూణంలో ఈ నెల 22న డిచ్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యూరు. ఈ ఘటనలో గోపీనాథ్, రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీనాథ్ కూ తురు మనస్విని,ఆయన భార్య రూప తీవ్రం గా గాయపడ్డారు. వీరిని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మనస్విని బ్రెరుున్ డెడ్కు గురైంది. దీంతో ఆమెను బంజారాహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధుల విన్నపం మేరకు బాలిక తాత య్య ముక్క ముక్క రాజయ్య బాలిక అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. జీవన్దాస్ సంస్థ ఆధ్వర్యంలో మనస్విని కళ్లు, లివర్, కిడ్నీలు, గుండె యవరాలు సేకరించారు. వీటిని వైద్యులు ఐదుగురు చిన్నారులకు అమర్చారు. మనస్విని మృతదేహాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి దానం చశారు. ఈసందర్భంగా తాత రాజయ్య, బంధువు అయిత రవి మాట్లాడుతూ, మనస్విని మృతి చెందినా ఆమె అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. ఆమె లేని లోటును వీరిలో చూసుకుంటున్నామని అన్నారు. -
మనసున్న మనస్విని...
* అవయవదానం చేసిన ఎనిమిదేళ్ల చిన్నారి * మరణిస్తూ మరో నలుగురికి పునర్జన్మ హైదరాబాద్: మరణాన్ని ఆహ్వానిస్తూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది ఓ చిన్నారి... తన కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, గుండె రక్త నాళాలతో పాటు మొత్తం శరీరాన్ని దానం చేసి పిన్న వయసులోని పెద్ద మనసు చూపింది ఎనిమిదేళ్ల మనస్విని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గంగిశెట్టి గోపీ నాథ్, రూప దంపతుల కుమార్తె మనస్విని. గత బుధవారం గోదావరి పుష్కరాల కోసం గోపీనాథ్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు కారులో వెళ్లారు. అక్కడ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా డిచ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని సోంపేట వద్ద ప్రమాదవశాత్తు వీరి కారు ముందున్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో గోపీనాథ్, ఆయన బావమరిది రాజేశ్లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రూప, మనస్వినిలను స్థానికులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మనస్వినిని అదేరోజు జూబ్లిహిల్స్ అపోలోకు తరలించారు. రెండు రోజుల పాటు వైద్యసేవలు అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలిక అప్పటికే బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బంధువులకు తెలుపగా, వారు బాలిక అవయవాలను దానం చేయడానికి ముందుకువచ్చారు. ఈ మేరకు జీవన్దాన్కు సమాచారం ఇచ్చారు. అపోలో వైద్యులు శనివారం ఉదయం మనస్విని శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కళ్లు, గుండె కవాటాలను సేకరించి అక్కడే చికిత్స పొందుతున్న మరో నలుగురు బాధితులకు అమర్చారు. మనస్విని మృతదేహాన్ని గాంధీ వైద్యకళాశాలకు అప్పగించారు. -
'అవయవ దానంపై అవగాహన అవసరం'
నల్గొండ: డాక్టర్స్ డే సందర్భంగా నల్గొండ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాధాన్యత గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. -
అవయవదానం- జీవనదానం
హైదరాబాద్: ఓ యువకుడు తాను మరణిస్తూ తన అవయవాలు దానంచేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. నిమ్స్ జీవన్దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాలప్రకారం...నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన సోమేష్ చారి (35) ప్రవేట్ఉద్యొగి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 4వ తేదీన నల్లగొండలో తన ద్విచక్రవాహనంపై వెలుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అక్కడి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న సోమేష్ చారి ఈ నెల 11వ తేదీన బ్రైయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి జీవన్దాన్ ప్రతినిధులు చారి కుటుంబసభ్యులకు అవయవదానం గురించి వివరించారు. వారు ఒప్పుకోవడంతో సోమేష్ చారికి శస్త్రచికిత్స నిర్వహించి అతని శరీరంలోనుండి రెండు కిడ్నిలు, కాలేయం, రెండు హార్ట్వాల్వ్స్ తొలగించి అవసరమైన వారికి అమర్చారు. -
పెంచుకున్న ప్రేమను పంచిపెట్టిన అమ్మ
కన్నీటితో కూడా చెట్టుకు ప్రాణం పోయొచ్చు అనుకున్నది ఈ అమ్మ. సేవను మాటల్లోకన్నా చేతల్లోనే చూపించాలనుకుంది ఈ అమ్మ. దండ వేసి పరిమళాల్ని తనకే పరిమితం చేయకూడదనుకుంది ఈ అమ్మ. దీపం పెట్టి ఆ వెలుగుని తన ఇంటి గోడల్లోనే బంధించకూడదనుకుంది ఈ అమ్మ. కొడుకైనా సరే మట్టిపాలు చేయకూడదని... వాడి ఉనికి బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని...పెంచుకున్న మమకారాన్ని పంచిపెట్టింది ఈ అమ్మ. ‘‘నా ఆయుష్షు 60 ఏళ్లే. కానీ నా కొడుకు ఆయుష్షు 480 ఏళ్లు’’ అని చెప్పారు రత్నమాల. కొడుకు గొప్పతనాన్ని తెలియజేస్తుంటే ఆమె కంఠం జీరబోయింది. కనుకొలుకుల్లో నీరు నిలిచింది. ఎనిమిది మందికి పునర్జన్మను తన కొడుకు ప్రతీన్ కుమార్ ద్వారా ఇచ్చిన రత్నమాల వరంగల్ జిల్లా వాసి. రత్నమాల భర్త ఏడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు పిల్లల పెంపకం కోసం తను ఓ చిన్న ఉద్యోగంలో చేరింది. పిల్లలే లోకంగా బతికింది. వారిని చదివించింది. ‘నాన్నలేడని బాధపడకమ్మా! నిన్నూ, చెల్లిని బాగా చూసుకుంటాను’ అని చెప్పిన కొడుకు అర్ధంతరంగా దూరమయ్యాడు. సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన వాడు మరణాన్నే తన కానుకగా ఇచ్చాడు. ‘వస్తానమ్మా’ అని చెప్పాడు... కొడుకు బి.టెక్, కూతురు బి.డి.ఎస్ చదువుతున్నారు. ఇంకో ఏడాది కష్టపడితే చాలు బిడ్డలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడతారు అనుకుంది. కానీ, దేవుడు మరొకటి తలచాడు. కిందటేడాది నవంబర్ 25న స్నేహితున్ని కలవడానికని వెళ్లిన ప్రతీన్ అర్థరాత్రి ఫోన్ చేసి అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ‘ఇంకా మేల్కొనే ఉన్నావా, ఇంటికి ఎప్పుడు వస్తున్నావ్’ అని అడిగితే ‘నీకు విషెష్ చెప్పడానికే మేల్కొన్నాను. ఇప్పుడు పడుకుంటానమ్మా! ఈ రోజు ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాగా. రేపు పొద్దున్నే వచ్చేస్తాను. నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను..’ అన్నాడు. ‘నీకన్నా నాకు గిఫ్ట్లు ఏముంటాయిరా’ అంటే ‘థాంక్యూ అమ్మా’ అంటూ ఫోన్లో అమ్మకు ముద్దిచ్చాడు. ఆమె నవ్వుతూనే గుడ్నైట్ చెప్పి ఫోన్ పెట్టేసింది. సర్ప్రైజ్ ఇస్తానన్నాడు... ఉదయాన్నే రత్నమాలకు ఫోన్ వచ్చింది ‘మీ అబ్బాయికి రోడ్డు ప్రమాదం జరిగింద’ని. హతాశురాలైంది రత్నమాల. ఉన్నఫళాన ఆసుపత్రికి చేరుకుంది. అయ్యప్పదుస్తుల్లో రక్తసిక్తమైన ప్రతీన్. మాట మాత్రమైనా చెప్పకుండా మాల వేసుకున్నాడు. ‘‘పై చదువులకు అమెరికా వెళ్లడానికి పరీక్షకు సిద్ధపడుతున్నాడు. కుదురుగా కూర్చోని చదవడానికి దీక్ష అవసరం అనేవాడు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న దైవభక్తి, చదువుకు ఎక్కడా ఆటంకం కలగకూడదని తీసుకున్న నిర్ణయమ’’దని తర్వాత తెలిసింది. ఏమీ మాట్లాడలేని స్థితి నాది. ప్రతీన్ను పరీక్షించిన వైద్యులు వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రతీన్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. పుట్టిన రోజుకు తన మరణాన్ని సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇస్తాడని ఊహించని నా ... జీవితంలో ఎన్ని ఒడిదొడుకులనైనా తట్టుకోవచ్చు. కానీ, కన్నబిడ్డను కోల్పోవడం అంటేనే...’’ వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ వివరించారు రత్నమాల. సేవే పరమావధిగా.... నలుగురికి సాయపడటం అంటే ఎప్పుడూ ముందుండే ప్రతీన్ తల్లి పుట్టిన రోజున తప్పక రక్తదానం చేసేవాడు. తన స్నేహితులచేతనూ రక్తదానం చేయించేవాడు. ‘‘23 ఏళ్ల కొడుకు... ఎంతో జీవితం చూడాల్సిన వాడు. అంతలోనే కనుమరుగైపోతున్నాడు. ఎంతో ఆపురూపంగా ఈ చేతులతో పెంచుకున్నాను. అలాంటిది, ఆ శరీరాన్ని నిప్పు పాల్జేయ్యాలా, మట్టిలో కలిపేయాలా.. ఆ ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. వాడు ఈ లోకంలో బతికే ఉండాలి... అందుకే అక్కడి వైద్యులతో మాట్లాడాను. నా కొడుకు అవయవాలు మరొకరికి ఉపయోగపడితే వాడి సేవా నిరతికి ఓ అర్థం చేకూరుతుందని చెప్పాను. అంగీకార పత్రాలతోపాటు అన్ని ఏర్పాట్లూ సిద్ధమయ్యాయి. గుండె, కాలేయం, కళ్లు.... ఇలా ఎనిమిది అవయవాలు మరో ఎనిమిది మంది చావుబతుకులతో పోరాడుతున్నవారికి కొత్త జన్మను ఇచ్చాయి. వారెవరో నాకు తెలియదు. కానీ, నా కొడుకు ఎనిమిది అవతారాలు దాల్చి ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నాడు. ఒక్క జన్మలోనే 8 జన్మలు... అంటే 480 ఏళ్లు అన్నట్టే కదా! గతంలో నేను ఇద్దరు బిడ్డలకు తల్లిని మాత్రమే. ఇప్పుడు మరో ఎనిమిది మందికీ తల్లినయ్యాను. వారెక్కడ ఉన్నా నన్నూ, నా కొడుకును తలుచుకుంటూనే ఉంటారు’’ అంటూ ఉబికివస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పారు రత్నమాల. అమ్మ గొప్పతనాన్ని, ఆమె త్యాగనిరతిని చాటి చెప్పాలని మళ్ళీ మళ్లీ ఆమె కడుపున పుడుతూనే ఉన్నాడు దేవుడు. ఒక బిడ్డగా ఆమెకు పుట్టి, మనందరికి దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో మనమూ వెళదాం. అవయవదానం అంగీకారపత్రంపై నేడే సంతకం చేద్దాం. - నిర్మలారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ అవగాహనలో ముందంజ... ⇒ మొట్టమొదటి అవయవదానం (కార్నియల్ ట్రాన్స్ప్లాంట్) 1905లో జరిగింది. ⇒ ప్రపంచ దేశాల్లో అవయవదానం అవగాహనలో స్పెయిన్ ముందంజలో ఉంది. ఇక్కడ కోటికి 34 మంది అవయదాతలుగా ఉన్నారు. ⇒ అమెరికాలో కిందటేడాది 18 ఏళ్ల వయసున్న వారు 5,538 మంది అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ⇒ మనదేశంలో ప్రతియేటా 90 శాతం మంది అవయవదాతలు లేని కారణంగా మరణిస్తున్నారు. ⇒ మనదేశంలో 25,000 వేల మందికి కాలేయ మార్పిడి అవసరం ఉంటే ప్రస్తుతం 800 మందికే ఆ అవకాశం ఉంది. ⇒ మనదేశంలో అవయవదానం చేసేవారి జాబితాలో వరుసగా ముందు వరసలో తమిళనాడు ఉండగా ఐదో స్థానంలో తెలుగురాష్ట్రాలు ఉన్నాయి. ⇒ ఆర్థిక, అవగాహన లేమి కారణంగా భారత్, ఆఫ్రికాలు చివరిస్థానంలోఉన్నాయి. ⇒ ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం (2013) భారతదేశంలో కోటికి 10 మంది మాత్రమే అవయవదానం చేశారు. కానీ యేటా 5 లక్షల మంది అవయవలోపం కారణంగా మరణిస్తున్నారు. ప్రతి ఏడు సంవత్సరాలకు మన శరీరంలోని కణాలన్నీ కొత్తవిగా మారిపోయినంత మాత్రాన మన అస్థిత్వం ఒరిజినాలిటీ కోల్పోతుందా? ‘షిప్ ఆఫ్ థీసియస్’లో పాడైపోయిన చెక్కల్ని తొలగించి కొత్త చెక్కల్ని అమర్చినంతమాత్రాన దాని ఉనికి లేకుండా పోతుందా? అవయవదానం థీమ్తో ఆమిర్ఖాన్ భార్య కిరణ్రావు సమర్పించిన సినిమానే ‘షిప్ ఆఫ్ థీసియస్’. 2013లో ఈ సినిమా బ్రోచర్ విడుదల సందర్భంగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికపదుకొనె, షారూఖ్ఖాన్.. మొదలైన 15 మంది బాలీవుడ్ నటీ నటులు అవయవదానం పత్రాలపై తమ అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల ఎయిడ్స్ అవగాహనకు భారీ ప్రచారం కల్పించారు. అదేవిధంగా అవయవదానం పట్ల అంగీకారాన్ని తెలుపుతూ పత్రాలపై సంతకం చేశారు. మరణానంతరం నా శరీరంలోని అవయవాలన్నీ దానం చేసేలా, ఇప్పటికే వాగ్దానపత్రంపై సంతకాలు చేశాను. అలాగే, మా ఇంట్లో అందరూ ఆర్గాన్ డొనేషన్ చేస్తూ, పత్రాలు రాసిచ్చారు. - త్రిష, నటి మోహన్ఫౌండేషన్ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న నేనూ అవయవదానం చేశాను. మానవత్వంగల ప్రతి ఒక్కరూ అవయవదానం తప్పనిసరిగా చేయాలి. - నవదీప్, నటుడు -
అవయవ దాతలు.. చిరంజీవులు!
అవయవదానం చేసిన కుటుంబసభ్యులకు నిమ్స్లో సన్మానం హైదరాబాద్: తాను కన్నుమూస్తూ మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన అవయవ దాతలు చిరంజీవులని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్చంద అన్నారు. 2013-14లో ‘జీవన్దాన్’కు అవయవాలు దానం చేసిన 50 మం ది బ్రెయిన్డెడ్ బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం హైదరాబాద్ నిమ్స్లో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, అవసరమున్నవారికి అందించడంలో జీవన్దాన్ బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. డీఎంఈ పుట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మీయులను కోల్పోతూ పుట్టెడు దుఃఖంలోనూ తమవారి అవయవాలను దానం చేయాలనే సామాజిక స్పృహ కుటుంబసభ్యుల్లో ఉండటం గొప్ప విషయమన్నారు. నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ మాట్లాడుతూ స్వీకర్తల పూజాగదుల్లో దేవుని ప్రతిరూపాల సరసన దాతల ఫొటోలు చేరాయని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో మహత్తర దానం చేయడం అభినందనీయమన్నారు. జీవన్దాన్ ప్రోగ్రామ్ ఇన్చార్జీ డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ 2012లో నిమ్స్ వేదికగా జీవన్దాన్ నెట్వ ర్క్ను ఏర్పాటు చేసినా 2013 నుంచి ఆర్గాన్ డొనేషన్ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటివరకు 105 మంది బ్రెయిన్డెడ్ బాధితుల నుంచి 1050 అవ యవాలు సేకరించి, 551 మందికి ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. మొదట్లో బాధపడ్డా.. నా భర్త ఫ్రాన్సిస్ గత సెప్టెంబర్ 20న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గ్లోబల్ ఆస్పత్రిలో 4 రోజులపాటు చికిత్స చేసినా.. బ్రెయిన్డెడ్ స్థితికి చేరుకున్నారు. అవయవదానం చేస్తే మరో పదిమందికి పునర్జన్మను ప్రసాదించవ్చని వైద్యులు చె ప్పడంతో ఇష్టంలేకపోయి నా అవయవాలు దానం చేసేందుకు అంగీ కరించాను. తప్పు చేశానేమోనని చాలా రోజులు బాధపడ్డాను. కానీ అవయవదానం గొప్పతనం తెలిసిన తర్వాత గర్వపడుతున్నా. - విజయ, దాత ఎస్పీ ఫ్రాన్సిస్ సతీమణి నలుగురికి పునర్జన్మ ఇచ్చారు గత అక్టోబ ర్ 24న ఇంట్లో ప్రమాదవశాత్తూ రాధాకృష్ణ కిందపడిపోయాడు. తలకు దెబ్బతగిలి మెదడులో రక్తం గడ్డ కట్టింది. నాలుగు రోజులుగా పౌలోమీ ఆసుపత్రిలో వైద్యమందించినా ఫలితంలేకపోయింది. 28న బ్రెయిన్డెడ్గా వైద్యులు నిర్ధారించారు. అవయవ దానానికి తాను అంగీకరించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి గుండె, గుండె రక్తనాళాలు, కాలేయం, కిడ్నీలు సేకరించారు. కన్నుమూస్తూ కూడా ఆయన మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించారు. - శిరీష, దాత రాధాకృష్ణ సతీమణి -
ఆ ఆరుగురిలో ‘ఆమె’
అవయవదానం చేసి చిరంజీవిగా మారిన శారద హైదరాబాద్: అప్పటి దాకా చక్కగానే ఉన్న ఆమె ఒక్క సారి కుప్పకూలిపోయింది. తాళలేని తలనొప్పి, కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందనీ..‘బ్రెయిన్ డెడ్’ అయిందని వైద్యులు వెల్లడించారు. అమె కొడుకు సురేష్ స్పందించాడు. తన తల్లి చిరంజీవి కావాలని కోరుకున్నాడు. కానరాని లోకాలకు వెళ్లినా మరికొందరిలో ఆమె బతకాలని భావించాడు. మిగతా కుటుంబీకులు అందుకు సరే అన్నారు. ఇలా అనుకోని రీతిలో ఆమె మరో ఆరుగురికి కొత్త జీవితాన్నిచ్చింది. అవయవదానంతో చిరంజీవిగా నిలచిపోయింది. ఇదీ నిజాంబాద్ జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగంపేట శారద(45) కథ. ఎందరికో చూపిన స్ఫూర్తి బాట. శారద భర్త గంగా గౌడ్ గీత కార్మికుడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో పనిచేస్తూ కుప్పకూలిపోయింది. స్థానికంగా చికిత్సలందించినా ఫలితం లేక పోవడంతో శనివారం నగరంలోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’గా తేల్చారు. కొడుకు చొరవతో... దీంతో ఆమె కుమారుడు సురేష్ తన తల్లి భౌతికంగా లేకపోయినా పది మందిలో బతికుండాలనే కోరికతో ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చాడు. మోహన్ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవన్దాన్ కోఆర్డినేటర్ అనురాధ సహకారంతో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారు జామున డాక్టర్ల బృందం శారద అవయవాలను సేకరించింది. ఆమె లివర్ను గ్లోబల్ హాస్పిటల్లో ఢిల్లీకి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి డాక్టర్ బల్భీర్సింగ్ నేతృత్వంలోని బృందం అమర్చి ఆయనకు కొత్త బతుకు నిచ్చారు. ఒక కిడ్నీని పాతబస్తీకి చెందిన 31ఏళ్ల మహిళకు డాక్టర్ జి.శ్రీధర్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేసి అమర్చారు.గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రసిడెంట్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ హీరేంద్రనాధ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో కిడ్నీని దక్కన్ హాస్పిటల్, గుండె వాల్వ్స్ను ఇన్నోవా హాస్పిటల్, కళ్లను ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్కు ఇచ్చారు. అవయవాల సేకరణ అనంతరం శారద మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి అంబులెన్స్లో కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కుటుంబీకుల చొరవను పలువురు ప్రశంసించారు. -
ఒకరిగా బతికి.. ముగ్గురిలో జీవించి..
ముగిసిన అవయవదాన శస్త్ర చికిత్సలు ఇద్దరికి కిడ్నీలు, మరొకరికి కాలేయం విశాఖ మెడికల్ : విశాఖనగరంలో మంగళవారం ఉదయం సెవెన్హిల్స్, కేర్ ఆస్పత్రుల్లో రెండు అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన బ్రెయిన్డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ అవయవదానంతో ముగ్గురిలో సజీవంగా నిలిచారు. ఈనెల 26న రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని అదే రోజు నగరంలోని సెవెన్హిల్స్ ఆస్పత్రిలో చేర్చగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోవడంతో వైద్యులు బ్రైయిన్డెడ్ రోగిగా ప్రకటించిన విషయం విధితమే. అతని అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు రావడంతో మంగళవారం ఉదయం జీవన్ధాన్ సంస్థ అనుమతి మేరకు రెండు కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. ఒక కిడ్నీని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి డాక్టర్ రవిశంకర్, అమిత్ సాప్లేలు అవయవ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. మరోకిడ్నీని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి డాక్టర్ క ళ్యాణచక్రవర్తి, మురళీమోహన్ శస్త్రచికిత్స చేసి అమర్చారు. కాలేయాన్ని మాత్రం హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో తరలించారు. రాత్రి వరకు ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స కొనసాగుతున్నట్లు జీవన్ధాన్ విశాఖ కో-ఆర్డినేటర్ ఇందిర తెలిపారు. అతని శరీరంలోని కళ్లు, ఇతర శరీర అవయవాలు దెబ్బతినడంతో సేకరించేందుకు అవకాశం లేకుండా పోయిందని వెల్లడించారు. -
అవయవ దానంతో ఆదర్శం
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బ్రెయిన్ డెడ్ రోగి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 25న శ్రీకాకుళంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పట్నాన సత్యనారాయణ (53) తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను అదే రోజు సాయంత్రం విశాఖలోని సెవెన్హిల్స్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించారు. ఆయన కోలుకోకపోవడంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రి వైద్యులు సత్యనారాయణను బ్రెయిన్డెడ్ గా నిర్ధారించారు. ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేసి అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రి వైద్యులు అవయవ దానానికి ఒప్పించారు. దానికి వారు కూడా సంసిద్దత వ్యక్త పరిచినట్లు సెవెన్ హిల్స్ ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ దినకర్ తెలిపారు. ఇది కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు బ్రెయిన్డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ శరీరం నుంచి అవయవ దానానికి అర్హత ఉన్న రెండు కిడ్నీలను, కాలేయాన్ని డాక్టర్లు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ సంస్థకు సమాచారాన్ని అందించారు. జీవన్దాన్ సంస్థ ఆదేశం మేరకు రోగి శరీరం నుంచి పలు అవయవాలను సేకరించేందుకు మంగళవారం తెల్లవారు జామున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రోగి శరీరం నుంచి సేకరించిన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని సెవెన్హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ ఫెయిల్ అయిన రోగికి, రెండో కిడ్నీని కేర్ ఆసుపత్రిలో మరో రోగికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాలేయాన్ని హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చేందుకు మంగళవారం తెల్లవారుజామున విమానంలో పంపించనున్నారు. -
అవయవ దానంలో అగ్రస్థానం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అవయవదానం చేయడం ద్వారా పునర్జన్మను ప్రసాదించిన దయార్ద్ర హృదయులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. గత ఆరేళ్లలో బ్రెయిన్డెడ్కు గురైన 620 మంది తమ అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణం పోసిన ఘనతను చాటుకున్నారు. 2008లో తిరుక్రున్రంకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్డెడ్ స్థితికి వెళ్లా డు. అతని అవయవాలను దానం చేసేం దుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. హితేంద్రన్ గుండె 9 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో అవయవదానంపై చైతన్యాన్ని రగిల్చింది. ఈ సంఘటన తరువాతనే ఆవయవదాన పథకం అదే ఏడాది అక్టోబరులో అవిర్భవించింది. చెన్నై రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదానికి గురైనా వారి కళ్లు, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు వంటివి దానం చేయడంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో అవయవదానాలు చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అవయవదానంలో దేశంలోనే తమిళనాడు ప్రథమస్థానంలో నిలిచినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. 2008 అక్టోబరు నుంచి గత ఏడాది మార్చి 31వ తేదీ వరకు అంటే ఈ 78 నెలల్లో 620 మంది అవయవదానం చేసి రికార్డు సృష్టించారు. వారి నుంచి 125 మంది గుండె, 60 మంది ఊపిరితిత్తులు, 573 మంది కాలేయం,1113 మంది మూత్రపిండాలు, నలుగురు ప్యాంక్రియాస్, ఇద్దరు చిన్నప్రేవులు, 590 మంది హృదయకవాటాలు, 938 మంది నేత్రాలు, ఒక రక్తకుళాయి, 13 మంది చర్మాన్ని మొత్తం 3,464 మందికి అమర్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పునర్జన్మను ప్రసాదించారు. -
చనిపోతూ... జీవం పోస్తూ..
కూతురు పరీక్ష కోసం వచ్చి మృత్యుఒడిలోకి వెళ్లిన బెన్సన్ బ్రెయిన్డెడ్ కావడంతో అవయవాల దానం దుండగుల దాడిలో గాయపడి బ్రెరుున్డెడ్ అరుున వరంగల్ కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురానికి చెందిన కొమ్ము బెన్సన్ (47) కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్న కాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను... మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి దాతృత్వాన్ని చాటుకుంది. - కాశిబుగ్గ కాశిబుగ్గ : దుండగుల దాడిలో గాయపడి బ్రెరుున్ డెడ్ అరుున ఓ వ్యక్తి కుటుంబం పుట్టెడు దుఃఖంలోనూ పెద్దమనసుతో ఆలోచించింది. తాను బతికి ఉన్నకాలంలోనూ నలుగురికి ఉపయోగపడిన ఆయనను మరో ఐదుగురిలో చూసుకునేందుకు ముందుకొచ్చింది. బ్రెరుున్ డెడ్ అరుు పూర్తి అచేతన స్థితిలోకి వెళ్లిన ఆయన అవయవాలను ఐదుగురికి దానం చేసి పుణ్యం కట్టుకున్నారు. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ 22వ డివిజన్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కొమ్ము బెన్సన్(47) కర్ణాటక రాష్ట్రానికి ఆరేళ్ల క్రితం తన కుటుంబ సభ్యులతో వెళ్లి కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రస్తుతం లక్ష్మిపుర ంలో వాళ్ల నాన్నమ్మ వద్ద ఉంటూ పదో తరగతి చదువుకుంటోంది. కూతురికి పరీక్షలు ఉండడంతో మార్చి 27న లక్ష్మిపురంలోని ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అదేరోజు సాయంత్రం రూ.500 చిల్లరకోసమని లక్ష్మిపురం సమీపంలోని ఏఎం వేబ్రిడ్జి కాంటా వద్దకు వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న ఇబ్రహీం, అతని స్నేహితుడు శ్రీకాంత్తో ఆయనకు మాటమాట పెరిగి గొడవపడ్డాడు. ఈ క్రమంలో వారిద్దరు బెన్సన్పై దాడిచేసి ఇనుప రాడ్లతో తీవ్రంగా బాదగా కోమాలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు మృతుడిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు హైదరాబాద్కు పంపించారు. ఈ క్రమంలో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో మృత్యువాత పడ్డాడు. కాగా, మృతుడు బతికున్న సమయంలో వెలిబుచ్చిన కోరిక మేరకు అతని భార్య సరిత, తల్లి మేరమ్మ, కుటుంబ సభ్యులు బెన్సన్ అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చి కాలేయం, కిడ్నీలు, రెండు గుండె కవాటాలను దానం చేసి మరో ఐదుగురికి పునర్జన్మ కల్పించారు. బెన్సన్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమైనా గొప్ప మనసుతో శరీర భాగాలను కంటతడి పెడుతూనే ఇతరులకు దానం చేయడాన్ని స్థానికులు, జిల్లా అధికార యంత్రాంగం ఎంతగానో అభినందించింది. స్థానికులు కంటతడి పెడుతూనే దహన సంస్కారాలు నిర్వహించారు. బెన్సన్ లక్ష్మిపురంలోని చర్చి లో చాలా ఏళ్లు సహాయ కార్యదర్శిగా పనిచేస్తూనే పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాల్గొనేవాడని, ఇతరులకు సేవ చేయడం, సహాయ సహకారాలు అం దించడంలో ఎప్పుడు ముందుండేవాడని స్థానికులు చర్చించుకుంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు. బతికున్న సమయంలో ఎప్పుడు అనే వాడు.. నా భర్త ఎక్కువ చదువుకోకపోయినా విశాలమైన మనస్థత్వం కలిగినవాడు. అతను బతికున్న సమయంలో ఎప్పుడు కూడా రక్తదానం, నేత్రదానం కన్నా అవయవదానం చేయాలని అంటుండేవాడు. అతని మాటే నిజమైంది. - సరిత, మృతుడి భార్య అందరి బాగోగులను ఆకాంక్షించేటోడు.. తన కుమారుడు దూరప్రాంతంలో బ్రతుకుతూ బిడ్డ పరీక్ష కోసమని నగరానికి వచ్చిండు. ఎప్పుడు ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు. అందరి బాగోగులను ఆకాంక్షించే నా కొడుకు మరణించడం చాలా బాధగా ఉంది. అతడి కోరిక మేరకే అవయవదానంతో ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టి సంతోషపడ్డాం. - మేరమ్మ, మృతుడి తల్లి -
అలా చేస్తే చిరంజీవులవుతాం!
మనం ఏం సాధించాం? అందుకు గుర్తుగా ఏం వదలి వెళ్తున్నామన్నది ప్రతి మనిషికి చాలా ముఖ్యం. ఈ లోకం విడిచి వెళ్తున్నప్పుడు మన అవయవాలు అవసరమైన వారికి దానం చేయడం ఓ మంచి పని. అందుకే నా పుట్టినరోజు (మార్చి, 13) సందర్భంగా అవయవ దాన పత్రాల మీద సంతకం పెట్టాను. నేనీ లోకంలో లేకపోయినా, ఈ దానం ద్వారా బతికే ఉంటాను. ఇక, నా పుట్టినరోజు విషయానికొస్తే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నాను. విందులు, వినోదాలు అస్సలు నచ్చదు. ఆ ఖర్చుతో ఇతరులకు సాయం చేయొచ్చన్నదే నా భావన. - పార్వతీ ఓమనకుట్టన్ (బిల్లా-2, మరియన్ తదితర తమిళ చిత్రాల కథానాయిక) -
అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగు
బ్రెయిన్ డెడ్ వ్యక్తి కుటుంబ సభ్యుల ఆదర్శం రాష్ట్రం విడిపోయిన తరువాత ఇది రెండో సంఘటన ఒక దీపం వెలిగింది. ఐదు కుటుంబాల్లో కాంతులు నింపింది. ప్రాణం పోయినా చిరంజీవిగా వర్థిల్లవచ్చని నిరూపించింది. బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ చంద్రరావు చనిపోతూ ఐదుగురు వ్యక్తులకు జీవన దానం చేశారు. ఈ అపురూప సన్నివేశానికి విశాఖ వేదికైంది. నవ్యాంధ్రప్రదేశ్లో ఇది రెండో అవయవదానం కావడం విశేషం. విశాఖ-మెడికల్: పుట్టెడు దుఃఖం... ఇంటి యజమాని కన్నుమూసిన క్షణాన తీరని శోకం... అయినా ఆ కుటుంబం స్పందించింది. ప్రజాప్రతినిధిగా సేవాభావం కలిగిన మతుని ఆశయం నెరవేరాలని కోరుకుంది. అవయవ దానానికి అంగీకరించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి పంచాయతీ అయ్యంవారిపేట వార్డు సభ్యుడు రౌశో కష్ణచంద్రరావు (54) గురువారం రక్తపోటు పెరిగి నడుస్తుండగానే అకస్మాత్తుగా పడిపోయారు. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళిపోయారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న అతడు బ్రెయిన్డెడ్ అయినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం ప్రకటించారు. ఆస్పత్రి అవయవదాన కౌన్సెలర్ సీహెచ్ ఇందిర అతని కుటుంబ సభ్యులతో చర్చించి అవయవ దానానికి ఒప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ అవయవదాన సాధికారక సంస్థ జీవనదాన్ అనుమతి రావడంతో ఆదివారం మధ్యాహ్నం కృష్ణచంద్రరావు కాలేయాన్ని కేర్ ఆస్పత్రిలోనే కాలేయం దెబ్బతిన్న మరో రోగికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేశారు. అదే ఆస్పత్రిలో రెండో కిడ్నీలు పూర్తిగా పాడై చికిత్స పొందుతున్న మరో రోగికి కిడ్నీని అమర్చారు. రెండో కిడ్నీని నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కిడ్నీ బాధితునికి అమర్చారు. రెండు కళ్లను నగరంలోని మొహిసిన్ ఐ బ్యాంకు అందచేశారు. గ్రామస్తులు వద్దన్నారు చనిపోయిన నా భర్త కృష్ణచంద్రరావు కండక్టర్గా పనిచేస్తూనే వార్డు సభ్యునిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలుకగా సేవలు చేసేవారు. ఆయన లేని లోటు మా కుటుంబానికి తీరకపోయినా ఆయన అవయవదానంతో ఐదుగురికి ఆయుష్షుపోశారు. అదే నాకు సంతోషం ఇచ్చింది. మొదట మా గ్రామస్తులంతా అవయవదానం చేయవద్దని, కులాచారానికి కట్టుబడి దహన సంస్కారం చేయాలని చెప్పినా, ఆస్పత్రి వైద్యుల కోరిక మేరకు అవయవ దానానికి మనస్ఫూర్తిగా అంగీకరించాం. - శారద (అవయవ దాత భార్య) గర్వంగా ఉంది కృష్ణచంద్రరావు కుమారునిగా నాకెంతో గర్వంగా ఉంది. ప్రత్యక్షంగా మా నాన్న మాకు దూరమైనా, పరోక్షంగా ఐదుగురు వ్యక్తుల్లో సజీవంగా ఉండటం మానసికంగా మాకెంతో సంతోషాన్ని మిగిల్చింది. అందుకే అవయవ దానానికి అంగీకరించాం. ప్రజాప్రతినిధిగా ఉన్న మా నాన్న అందరికీ ఆదర్శంగా నిలవడం నాకు గర్వంగా ఉంది. - జగదీష్ (కుమారుడు) స్ఫూర్తి దాయకం.. అవయవ దానం ఇచ్ఛాపురం: కృష్ణచంద్రరావు మృతి ఇచ్ఛాపురంలో తీవ్ర విషాదాన్ని నింపినప్పటికీ అతని అవదానం స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అవయవ దానం ప్రాధాన్యంపై స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది. చనిపోయినా బతికే ఉండాలంటే అవయవ దానం చేయడం ఉత్తమమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మృతుడి స్వగ్రామం మండలంలోని అయ్యవారిపేటలో గ్రామస్తులంతా గ్రామ మండపం వద్దకు చేరుకుని విలపించారు. నేడు అంత్యక్రియలు కృష్ణ మృత దేహం సోమవారం విశాఖ నుంచి గ్రామానికి చేరుకుంటుంది. గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్విహ స్తామని గ్రామస్తులు చెప్పారు. -
బ్రెయిన్ డెడ్ కాదు... భరత్ కుమార్ క్షేమం
ఇబ్రహీంపట్నం :బ్రెయిన్ డెడ్ అయి అవయదానానికి వచ్చిన భరత్ కుమార్ అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడని మంగళగిరి ఎన్నారై డాక్టర్లు నిర్థారించారు. దాంతో అతనికి డాక్టర్లు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. భరత్ కుమార్ క్షేమంగా ఉన్నాడని వైద్యులు చెప్పటంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గురువారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన భరత్కుమార్ అవయవాలను దానం చేసేందుకు వారి కుటుంబసభ్యులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన కనకమెడల భరత్కుమార్(45) మూడు లారీల ఓనర్. వాటితో వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం కంచికచర్ల వెళ్తుండగా వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన అతన్ని వెంటనే కంచికచర్లలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తరలించారు. బ్రెయిన్ డెడ్ అయిందని అతన్ని గుంటూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు మృతి చెందాడని చెప్పడంతో.. భరత్కుమార్ తమ్ముడు అశోక్కుమార్ , చెల్లెలు కృష్ణవేణిలు అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులను ఒప్పించారు. వారి అంగీకారంతో భరత్ కుమార్ అవయవాలను మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి దానం చేశారు. భరత్ కుమార్కు భార్య , ఇద్దరు కుమారులు యశ్వంత్ సాయి(10), ఆజాద్(7)లు ఉన్నారు. కాగా, ఎన్నారై ఆస్పత్రి వైద్యులు భరత్ కుమార్ బ్రెయిన్ డెడ్ కాలేదని.. సరైన వైద్యం అందిస్తే.. బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో చనిపోయాడునుకున్న తమ కుమారుడు బ్రతికే ఉన్నాడనే వార్త తెలియడంతో తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. -
గణనీయంగా పెరుగుతున్న అవయవ దానాలు
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 మంది దానం - 24 మందికి అవయవాల మార్పిడి సాక్షి, ముంబై: రెండు వారాల్లో 10 మంది అవయవ దానం వల్ల ఈ ఏడాది దానం చేసిన వారి సంఖ్య 15కు చేరుకుంది. వీరి ద్వారా 24 మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఇటీవల 55 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ హ్యూమరేజ్కు గురవ్వడంతో ఆ వ్యక్తి బంధువులు తన రెండు కిడ్నీలు, లివర్ దానం చేశారు. అలాగే మరో 60 ఏళ్ల వృద్ధుడు బ్రెయిన్ హ్యూమరేజ్తో మృతిచెందడంతో తన అవయవాలు కూడా దానం చేశారు. గత రెండు వారాలుగా 10 మంది అవయవాలను మార్పిడి చేశామని, 24 మందికి కొత్త జీవితాలు పొందారని వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అవయవాలు ఎక్కువగాపొందుతున్నామని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా వస్తుంటారని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇంకా అవయవ దానంలో వెనుకబడి ఉన్నాయన్నారు. అవయవ దానంలో ప్రభుత్వ ఆస్పత్రులు వెనుకబడటానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఫోర్టిస్ ఆస్పత్రికి చెందిన లివర్ మార్పిడి సర్జన్ డాక్టర్ రాకేష్ రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది అవయవ దానం చేసిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం శుభ సూచకం అన్నారు. వివిధ ఆస్పత్రుల నుంచి దానం చేసిన అవయవాలను పొందుతున్నామని, అయితే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైందని అన్నారు. ముంబై జోనల్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ.. నగరంలో అవయవ దానం పట్ల మరింత అవగాహన పెంపొందించాలని నిర్ణయించింది. కాగా, 2012లో 26 మంది అవయవ దానం చేశారు. ఆ సమయంలో విలాస్రావ్ దేశ్ముఖ్ లివర్ విఫలం చెంది మరణించడంతో ఈ అంశం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అదేవిధంగా 2014లో 41మంది అవయవ దానం చేయగా 107 మంది ప్రయోజనం పొందారు. -
ఉసురు తీసిన అవయవదానం
రామకృష్ణాపూర్: తోడ బుట్టిన అక్కను ప్రాణాపాయం నుంచి కాపాడుకోవడానికి ఓ చెల్లెలు చేసిన అవయవదానం ఆమెనే బలి తీసుకుంది. వైద్యుల నిర్లక్ష్యమో.. మరేమో.. కారణమేదైనా చివరికి ఆ అక్క ప్రాణాలు కూడా నిలవలేదు. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోవడం ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్లో కలకలం సృష్టిం చింది. రామకృష్ణాపూర్కు చెందిన రాబర్ట్ డేవిడ్-విజయకుమారిలకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కూతురు దయూరాణి (52) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కాగా, పరీక్షలు చేసిన వైద్యులు లివర్ మార్చాలని సూచించారు. డిసెంబర్లోపు చికిత్స చేయకుంటే బతకడం కష్టమన్నారు. దీంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూ. 30 లక్షలు వెచ్చించి చికిత్స చేరుుంచేందుకు కుటుంబీకులు సిద్ధమయ్యూరు. దయూరాణి సోదరి నిర్మలారాణి(41) తన లివర్లోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో దాదాపు 40 పరీక్షలు చేసిన ఆస్పత్రి వైద్యులు నిర్మల అన్నివిధాలా అర్హురాలంటూ నిర్ధారించారు. ఇందుకు రూ. 2 లక్షల వరకు తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 22న నిర్మలారాణి నుంచి 65 శాతం లివర్ సేకరించి దయారాణికి అమర్చారు. అరుుతే.. అదే నెల 26న తీవ్ర అనారోగ్యంతో నిర్మలారాణి మృతి చెందింది. అయితే, కిడ్నీ ఫెరుులై మృతి చెందిందని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో ఇంకా దయారాణి ఆస్పత్రిలోనే ఉండడంతో కుటుంబసభ్యులు ఏం మాట్లాడలేకపోయారు. అయితే.. ఫిబ్రవరి 6న దయారాణి కూడా మృతి చెందిందంటూ బంధువులకు చెప్పారు. చాలా రోజుల క్రితమే చనిపోయినట్లుగా శరీరం కుళ్లిపోయి ఉంది. చేసేదేమీ లేక మృతదేహాన్ని ఖననం చేశారు. రూ.40 లక్షలు ఖర్చు చేసినా ఇద్దరూ మృతిచెందడంతో మృతుల సోదరుడు ఆల్ఫ్రెడ్, నిర్మలారాణి భర్త రెడ్డిమల్ల నర్సయ్య కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై రాష్ట్ర గవర్నర్, డీజీపీలకు ఫిర్యాదు చేశారు. -
కొండంత మనసు
అవయవదానంపై పలువురి అభినందన విజయవాడ సిటీ: వారేమీ ఉన్నత చదువులు చదువుకున్న వారు కాదు. అలాగని ఆర్థికంగా స్థితిమంతులూ కాదు. కాని వారి ఆశయం ముందు ఇవేవీ పనికిరావని నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోట మణికంఠ కుటుంబం చేసిన త్యాగాన్ని నగర ప్రజలు అభినందిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె సహా అవయవ దానం చేసిన వారి మంచి మనస్సుకు నగరవాసులు చలిం చారు. గుండెను సకాలంలో గన్నవరం విమానాశ్రయం చేర్చేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి పోలీసులు సహకరిస్తే.. మరో మనిషికి పునర్జన్మ ఇచ్చే గుండెను తీసుకెళుతున్న అంబులెన్స్కు మార్గం మధ్యలో రోడ్డుపై ప్రజలు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. గ్రీన్ చానల్తో సహకారం : నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ క్లిష్టమైనప్పటికీ.. గ్రీన్ చానల్ ఏర్పాటు ద్వారా గుండెను గన్నవరం ఎయిర్పోర్టు వరకు సజావుగా తీసుకెళ్లేందుకు గట్టి చర్యలు చేపట్టారు. జీవన్దాన్ ప్రతినిధుల కోరిక మేరకు సీపీ ఎ.బి. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి గ్రీన్చానల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మార్పులు చేర్పులు చేశారు. కనకదుర్గమ్మ వారధి నుంచి పశువుల ఆస్పత్రి జంక్షన్ మీదుగా బందరురోడ్డుపై బెంజిసర్కిల్ వరకు, అక్కడి నుంచి రామవరప్పాడు రింగ్ ద్వారా గన్నవరం విమానాశ్రయం వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో 27 నిమిషాల వ్యవధిలోనే గుండె విమానాశ్రయం చేరింది. సీపీ మాట్లాడుతూ..మంచి పనులకు పోలీసు సహకారం ఉంటుందన్నారు. కారు యజమాని నీరజ్ స్నేహితుడు ఉదయ్భాస్కర్ మాట్లాడుతూ.. మంచి పనులు చేసేం దుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. హాట్సాఫ్ నిజంగా మణికంఠ కుటుంబం చేసిన పనికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాలి. మణికంఠ రోడ్డు ప్రమాదం కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను. పెద్దగా చదువుకున్న కుటుంబం కాకపోయినా ఉన్నతంగా ఆలోచించారు. వారు అవయవాలను దానం చేసినట్టు తెలిసి ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యా. వారి నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేసింది. - గిరి అశోక్కుమార్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ సహాయ కార్యదర్శి -
మణిదీపం
బ్రెయిన్ డెడ్ అయిన రామవరప్పాడు యువకుడి అవయవాలు ఐదుగురికి దానం కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీల అందజేత చెన్నైలోని ఓ రోగి కోసం ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి గుండె తరలింపు ఇరవై రెండేళ్ల యువకుడు దేశంలోనే ఓ చారిత్రక ఘట్టానికి ఆద్యుడయ్యాడు. అవయవదానంతో మళ్లీ సజీవుడయ్యాడు. కళ్లు, గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇచ్చి ఐదుగురి ప్రాణాలను నిలిపాడు. మరో ఇద్దరికి కంటి వెలుగయ్యాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చిన ఆ కుటుంబం ఎదుట మానవత్వం అనే మాట సైతం చిన్నబోయింది. ఈ క్రతువుకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రి ఊపిరిలూదింది. రామవరప్పాడుకు చెందిన ఆ యువకుడి అవయవాల తరలింపులో శుక్రవారం ప్రముఖ వైద్యులు, రెండు జిల్లాల ఉన్నతాధికారులు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. మంగళగిరి/లబ్బీపేట/గన్నవరం : ఆ యువకుడి పేరు తోట మణికంఠ. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. రామవరప్పాడు నెహ్రూనగర్లో నివాసం. తండ్రి శ్రీనివాసరావు కొద్దికాలం కిందట మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి రాధమ్మను బాగా చూసుకోవాలని, సోదరి శివనాగజ్యోతిని ఉన్నత చదువులు చదివించాలని కారు డ్రైవర్గా మారాడు. ఈ నేపథ్యంలో ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి ఇంటికి వెళుతుండగా, సెట్విన్ ఆస్పత్రి వద్ద లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో అక్కడి నుంచి విజయవాడలోని మెట్రో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, విధి మణికంఠను చిన్నచూపు చూసింది. దేహానికి ప్రాణం ఉన్నా బ్రెయిన్డెడ్ అవడంతో తల్లి, సోదరి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి ఒకే ఒక్క ఆధారమైన మణికంఠను బతికించుకోవాలని తపన పడ్డారు. ఏ వైద్యుడిని కలిసినా లాభం లేదని చెప్పారు. అప్పటికే నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న మణికంఠ సోదరి జ్యోతి తన తల్లి, బంధువులతో మాట్లాడి తమ్ముడి అవయవాలను దానం చేయాలని, మరికొందరిలో మణికంఠను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన జీవన్దాన్ అనే సంస్థను సంప్రదించి మణికంఠను కెడావర్ ట్రాన్స్ప్లాంట్ (అవయవ మార్పిడి)కు అవకాశం ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. గ్రీన్ చానల్ ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి అత్యవసరంగా అవయవాలు కావాల్సిన వారి కోసం సమాచారం పంపారు. ఐదుగురికి అవయవదానం చెన్నైలోని రోగికి గుండె, ఎన్ఆర్ఐ ఆస్పత్రిలోని రోగికి ఒక కిడ్నీ, హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలోని రోగికి కాలేయం, గుంటూరు సిటీ ఆస్పత్రి రోగికి మరో కిడ్నీ, పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రికి కళ్లను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో చెన్నైలోని రోగికి మణికంఠ గుండెను అమర్చేందుకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం శుక్రవారం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గాన ఎన్ఆర్ఐ ఆస్పత్రికి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం మణికంఠ గుండెను సజీవంగా సాయంత్రం అదే విమానంలో చెన్నై తరలించారు. గుండెను తరలించే క్రమంలో ఇక్కడి వైద్యులతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సహకారం అందించింది. ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్లారు. రామవరప్పాడు సెంటర్లో ప్రజలు అంబులెన్సపై పూల జల్లులు కురిపించారు. వాహనదారులు ఎక్కడికక్కడ పక్కకు తప్పుకొని అంబులెన్స వెళ్లడానికి సహకరించారు. మణికంఠ మిగిలిన అవయవాలను కూడా ఆయా ఆస్పత్రుల్లోని రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లుచేశారు. మణికంఠ సోదరి శివనాగజ్యోతిని ఎన్ఆర్ఐ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు అక్కడికి వచ్చిన వైద్యులు, ప్రముఖులు, ప్రజలు అభినందించారు. అవయవదానంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మా తమ్ముడు సజీవం ‘మా తమ్ముడి మృతితో మా కుటుంబం అనాథగా మారింది. అయినా అవయవాలను దానం చేయడం ద్వారా మా తమ్ముడు సజీవంగా ఉంటాడనే ఆత్మ సంతృప్తి దక్కింది. మా మణికంఠ మా నుంచి భౌతికంగా దూరమైనా ఐదుగురి ప్రాణాలను నిలిపి సజీవంగా నిలిచాడు.’ అంటూ మణికంఠ సోదరి శివనాగజ్యోతి తీవ్ర ఉద్వేగానికి లోనైంది. -
అవయవదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడిన వృద్ధుడు
సాక్షి, ముంబై: తను మరణిస్తూ అవయవదానంతో మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టాడు ఓ వృద్ధుడు (66). వివరాలు... డోంబివలిలో నివాసముంటున్న జయంతిలాల్ భానుశాలి నవీముంబైలో క్యాషియర్, అకౌంటెంట్గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల కార్యాలయంలో పనిచేస్తూ కళ్లు తిరిగి పడిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగవకపోవడంతో కుటుంబ సభ్యులు మరో ఆస్పత్రికి తరలించారు. కాగా, నవీముంబైలోని ఆస్పత్రి వైద్యులు రోగి పరిస్థితి గురించి బంధువులకు వివరించారు. అవయవదానం పట్ల కూడా అవగాహన కల్పించారని రోగి బంధువులు తెలిపారు. భానుశాలిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జుపిటర్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు బ్రెయిన్ డెడ్గా గుర్తించారు. దీంతో అతని బంధువులు జుపిటర్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి కాలేయం, 62 ఏళ్ల వ్యక్తికి కిడ్నీని దానం చేశారు. మరో కిడ్నీని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి దానం చేశారు. ఈ సందర్భంగా జుపిటర్ ఆస్పత్రి వైద్యులు గౌతమ్ రమా కాంత్ మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ అయిన రోగిని కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశామన్నారు. అతను ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో పరిస్థితి గురించి రోగి బంధువులకు వివరించామన్నారు. అవయవ దానం గురించి చెప్పగానే రోగి బంధువులు వెంటనే ఒప్పుకున్నారని వైద్యులు పేర్కొన్నారు. అవయవదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని, నగర వాసులు అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యుడు అభిప్రాయపడ్డారు. -
ఆగమేఘాలపై చేరిన కిడ్నీ
ఓ వ్యక్తికి ప్రాణదానం విశాఖ మెడికల్ : కేవలం ఐదు గంటల వ్యవధిలో గుంటూరు నుంచి విశాఖకు కిడ్నీ తరలించి నగరవాసి ప్రాణాన్ని నిలిపారు పోలీసులు. మణిపాల్ ఆసుపత్రిలో ఈనెల 31న జరిగిన ఈ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో పోలీసులు పోషించిన పాత్ర అమోఘమని ఆసుపత్రి యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. గుంటూరుకు చెందిన 54 సంవత్సరాల వ్యక్తి గత నెల 31న మరణించాడు. అవయవధానం చేసిన అతని నుంచి అదే రోజు కిడ్నీని సేకరించి అంబులెన్స్ ద్వారా గుంటూరు-విజయవాడ మీదుగా విశాఖ నగరానికి కేవలం ఐదు గంటల వ్యవధిలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేసి రప్పించారు. ఆ కిడ్నీని విశాఖకు చెందిన 51 సంవత్సరాల వ్యక్తికి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స ద్వారా అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇందుకు సహకరించిన పోలీసు విభాగానికి కిడ్నీ గ్రహీత కుటుంబ సభ్యులు, మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. -
యువకుడి అవయవదానం
వేలూరు: ద్విచక్ర వాహన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో సీఎంసీ ఆస్పత్రి నుంచి చెన్నైకి అంబులెన్స్లో తరలించారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని మోర్థాంగల్ గ్రామానికి చెందిన అరుణ్(23) ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ నెల 13న ద్విచక్ర వాహన ప్రమాదంలో అరుణ్ తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చేర్పించా రు. చికిత్స చేసినా ఫలించక అరుణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందు కు వచ్చారు. చెన్నైలోని మద్రాసు మెడిక ల్ మిషన్ ఆస్పత్రిలోని ఒక రోగికి గుండె ఆపరేషన్ చేసేందుకు అత్యవసరం కావడంతో వేలూరు సీఎంసీలోని వైద్యులు అధునాతన పద్ధతిలో అరుణ్ గుండెను శస్త్ర చికిత్స ద్వారా వేరుచేసి సోమవారం సాయంత్రం 5.50 గంటల సమయంలో అంబులెన్స్లో చెన్నైకి తరలించారు. అరుణ్ కళ్లు, గుండె, వంటి అవయవాలను వివిధ రోగులకు అమర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.