'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్‌ వేధిస్తోంది' | Jerusalem Mattaiah slams Telangana Govt over Vote for note case | Sakshi
Sakshi News home page

'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్‌ వేధిస్తోంది'

Published Mon, Jan 16 2017 3:01 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్‌ వేధిస్తోంది' - Sakshi

'ఓటుకు కోట్లు కేసులో టీ-సర్కార్‌ వేధిస్తోంది'

ఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని నిందితుడు జెరూసలెం మత్తయ్య ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో రక్షించాల్సిన ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు రాజీకొచ్చినా తనను బలిపశువును చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ వేయడంలో ఆంతర్యమేంటని మత్తయ్య ప్రశ్నించారు.  
 
ఈ కేసులో స్టీఫెన్‌సన్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. మత్తయ్యను రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement