
'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'
నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన కళ్లను మనవాళ్లతోనే చంద్రబాబు పొడిపిస్తారని ఆమె అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. ఇది వాస్తవమయితే.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.