sorry
-
అలా అన్నందుకు నన్ను క్షమించండి.. YSRCPకి సారీ చెప్పిన పృద్విరాజ్
-
క్షమించండి.. మళ్ళీ ఇలా జరగదు: జొమాటో సీఈఓ
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ 'జొమాటో' (Zomato) సీఈఓ 'దీపిందర్ గోయల్' (Deepinder Goyal) వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గోయల్ ఎందుకు సారీ చెప్పారు? దీనికి కారణం ఏమిటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జొమాటో వెజిటేరియన్ ఫుడ్ డెలివీలపై ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ రంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'వెజ్ మోడ్ ఎనేబుల్మెంట్ ఫీ' పేరుతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. అంతే కాకుండా.. ఈ రోజుల్లో భారతదేశంలో శాఖాహారిగా ఉండటం శాపంలా అనిపిస్తుందని లింక్డ్ఇన్లో పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించడం మాత్రమే కాకుండా.. ఫీజుకు సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు జొమాటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్విగ్గీలో శాకాహార డెలివరీలపై ఎటువంటి ఛార్జీలు వసూలుచేయడం లేదని.. వెజిటేరియన్లను కూడా సమానంగా చూస్తున్నందుకు స్విగ్గీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కొత్త ఛార్జ్ సమస్యపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి ప్లాట్ఫామ్ ఫీజులను ఎందుకు వసూలు చేస్తున్నారు. ఇలా ఎన్ని రకాలుగా ఫీజులు వసూలు చేస్తారని ఆగ్రహించారు. ఈ పోస్టుపై జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్పందిస్తూ.. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. తప్పు జరిగినందుకు క్షమించండి. ఈ ఫీజును ఈ రోజు నుంచే తొలగిస్తున్నామని, ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూస్తామని ఆయన అన్నారు.ఇదీ చదవండి: జొమాటో సీఈఓ కీలక ప్రకటన.. మరో రెండేళ్లు జీతం తీసుకోను -
మాధవీలతకు ‘జేసీ’ బహిరంగ క్షమాపణ
సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ -
నేటి సాక్షి కార్టూన్
-
సరిపోదా శనివారం టీమ్కు సారీ చెప్పిన ఎస్జే సూర్య.. ఎందుకంటే?
కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు.ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్టైన్మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు. Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024 -
‘సారీ’ చెప్తారా? ఎదుగుతారా?
‘ఐయాం సారీ’... తప్పులు, పోరపాట్లు చేసి సారీ చెప్పడం అందరూ చేసే పని. కాని జీవితంలో ‘సారీ’లు కొనసాగుతూ ఉంటే మనం ఇంకా ఎదగలేదని, తప్పుల నుంచి నేర్చుకోవడం లేదని అర్థమంటారు ప్రియా కుమార్.‘అలవాటుగా తప్పు చేయడం దుర్లక్షణం’ అనే ప్రియా కుమార్ తనవైన సూత్రీకరణలతో మోటివేషనల్ స్పీకర్గా మారారు. పర్సనాల్టీ డెవలప్మెంట్ రచనలు చేస్తూనే దేశంలో టాప్ 10 మహిళా వ్యక్తిత్వ వికాస నిపుణులలో ఒకరిగా ఎదిగారు. విజయానికి ఆమె చెప్తున్న సూత్రాలు. ‘నెగెటివ్ థింకింగ్ ఉన్నవాళ్లు సమస్యలను ఊహించుకుంటూ భయపడుతుంటారు. వాళ్లు ఊహించి ఎదురు చూసే సమస్యలు చాలామటుకు ఎదురుపడవు. కాని ఇలా నెగెటివ్ థింకింగ్ వల్ల నిజంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని ఎదుర్కొందాం అనే కుతూహలం నశిస్తుంది. సమస్య మీద ఫోకస్ నిలువదు. సమస్యను పరిష్కరించాల్సింది ΄ో దాని వల్ల నష్టపోతారు’ అంటుంది ప్రియా కుమార్. ఈమెది చండీగఢ్.47 ప్రపంచ దేశాలలో ప్రియా కుమార్ కార్పొరేట్ సంస్థలకు మోటివేషనల్ స్పీకర్గా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డులను ΄చెందాయి. బయోగ్రఫీలు రాయడం మరో ఆసక్తిగా కలిగిన ప్రియా కుమార్ తాజాగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ ‘షట్లర్స్ ఫ్లిక్’ను వెలువరించిచారు. డ్రీమ్, డేర్, డెలివర్ అనేది ఆమె నినాదం. ఇలా గెలవండి: ఒక వ్యక్తి కెరీర్ సఫలం కావాలంటే అతని కుటుంబ జీవనం సరిగ్గా ఉండాలని అంటుంది ప్రియా. ‘మీరు ఇల్లు విడిచి ఆఫీసుకు వస్తారు. మీరు విడిచి వచ్చిన ఇల్లు తిరిగి మీరు చేరే సమయానికి మీకు ఆహ్వానం పలికేలా ఉండాలి. అది మీ బడలిక తీర్చి మరుసటి రోజు మిమ్మల్ని కార్యోన్ముఖులను చేసేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మీరు ఇంటిని, ఆఫీసును వేరు చేయకూడదు. అంటే మీ పనిలో ఏం జరుగుతున్నదో, మీరేం చేస్తున్నారో, మీరు ఎక్కడకు వెళుతున్నారో, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారో కొద్దిగా అయినా ఇంటి సభ్యులకు తెలియచేయాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే మీ పనిని మీ ఇంటి సభ్యులతో జత చేయాలి. అప్పుడే వారు మీ ఉద్యోగ జీవితాన్ని సరిగా అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు’ అంటుందామె. ‘ఒక ఉద్యోగంలో మీరు చేరితే జీవితాంతం ఆ ఉద్యోగం చేయాలని లేదు. అక్కడ కొందరు రాజకీయాలు చేసి మీరు పని చేయలేని స్థితి వస్తే అలాంటి టాక్సిక్ వాతావరణం నుంచి బయటపడేయడానికి వారు మీకు సాయం చేస్తున్నారని అర్థం. అక్కడి నుంచి బయటపడి కొత్త జీవనాన్ని మొదలెట్టండి. మీకు ఉద్యోగం మీ సామర్థ్యాన్ని చూసి ఇస్తారు. మీరు ఉద్యోగంలో ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఈ సామర్థ్యానికి– దాని ప్రదర్శనకు మధ్య ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడంలోనే మీ విజయం ఆధారపడి ఉంది’ అని తెలుపుతుంది ప్రియ కుమార్. సారీలు మానండి: ‘జీవితంలో ఏదో ఒక దశలో సారీలు చెప్పలేని స్థితికి చేరుకోవాలి. సారీ చెప్తున్నామంటే ΄÷ర΄ాటో, త΄్పో చేస్తున్నామని అర్థం. చేసిన తప్పుల నుంచి ΄ాఠాలు నేర్చుకుని ఎదగలేక΄ోవడం వల్ల మళ్లీ మళ్లీ సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ చెయవచ్చా. కాని దానినొక అలవాటుగా చేసుకుని అలాగే నెట్టుకొద్దామంటే ముందుకు పోలేరు’ అంటుంది ప్రియ కుమార్. ‘మీ గురించి ఎవరైనా మంచిగా మాట్లాడుతున్నారంటే మీరు వారి నుంచి మంచి ఆశించి, వారితో మంచిగా వ్యవహరిస్తున్నారని అర్థం. అలాగే మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నారంటే వారిలోని మంచి కాకుండా చెడు బయటకు వచ్చేలా వారితో మీరు వ్యవహరిస్తున్నారని అర్థం’ అంటుందామె. ‘కొందరు సమస్యలను ఆహ్వానించడమే పనిగా పెట్టుకుంటారు. లేదా సమస్యలను సృష్టిస్తారు. మీలోని సామర్థ్యాలను గుర్తించి వాటి కోసం మీ శక్తిని ΄పాజిటివ్గా ఉపయోగిస్తే సమస్యల్లో కాకుండా విజయాలలో ఉంటారు’ అని గెలుపు సూత్రాలు తెలుపుతోందామె. -
వాచ్మెన్కు ఇప్పుడే సారీ చెప్పు.. ఆకాశ్ను ఆదేశించిన ముకేశ్ అంబానీ - ఎందుకంటే?
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన అంబానీ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే కుటుంబం మొత్తం అన్యోన్యంగా ఉంటూ.. జీవితం గడుపుతున్న వీరు ఎప్పుడూ ఏదో ఒక వార్తలో కనిపిస్తూనే ఉంటారు. అయితే ఒక సందర్భంగా 'ముఖేష్ అంబానీ' తన కొడుకు 'ఆకాశ్ అంబానీ' మీద కోప్పడినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆకాశ్ అంబానీ ఒక సారి వాచ్మెన్తో కొంత గట్టిగా మాట్లాడాడని, ఆ సమయంలో పక్కనే ఉన్న ముఖేష్ అంబానీ ఆకాశ్ను మందలించి వాచ్మెన్కు సారీ చెప్పమని చెప్పారని, తండ్రి చెప్పినట్లే ఆకాశ్ వాచ్మెన్కు సారీ చెప్పాడని నీతా అంబానీ వెల్లడించింది. ఎప్పడూ సౌమ్యంగా కనిపించే ముఖేష్ అంబానీ.. ఆకాశ్ చేసిన పనికి కొంత కోపగించుకున్నట్లు నీతా అంబానీ చెప్పింది. పిల్లలను సక్రంగా పెంచే క్రమంలో గారాబం చేయకూడదని, తప్పు చేస్తే తప్పకుండా చక్కదిద్దాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. ఇదీ చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త - ఏడో రోజు తగ్గిన ధరలు! వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంలో ప్రస్తుతం ముఖేష్ అంబానీ పిల్లలు ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు కూడా పనిచేస్తున్నారు. జియో ఇంత గొప్ప విజయం పొందటానికి, సక్సెస్ మార్గంలో నడవడం వెనుక తన పిల్లల పాత్ర చాలా ఉందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో ముకేష్ అంబానీ స్వయంగా వెల్లడించారు. -
రవితేజకు సారీ చెప్పిన అనుపమ్ ఖేర్.. ఎందుకంటే?
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలుగువారికి కూడా సుపరిచితమే. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వంశీకృష్ణనాయుడు దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించారు. ఇటీవలే ముంబయిలో ఈవెంట్కు రవితేజ హాజరయ్యారు. అయితే ఈవెంట్లో అనుపమ్ ఖేర్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: బిగ్బాస్ 7: మళ్లీ గ్రాండ్ లాంచ్.. హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లు.. కానీ..) ఈవెంట్కు హాజరైన అనుపమ్.. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి చిన్న వయసులో రవితేజ తన స్టూడియోకి వచ్చి నాతో ఫోటో దిగాలని అడిగాడు. కానీ నేను కుదరదని చెప్పా.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆయన సినిమాలోనే నటిస్తున్నా.. ఆ రోజు అలా అన్నందుకు రవితేజకు నవ్వుతూ సారీ అన్నారు. దీంతో వెంటనే రవితేజ.. సార్ అంటూ దండం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రంలో నుపుర్ సనన్, గా యత్రి భరద్వాజ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1970లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని స్టువర్టుపురానికి చెందిన ఒకనాటి గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్నే ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) 1988 :- #AnupamKher rejected to click a photo with #RaviTeja 😢💔 2023 :- #AnupamKher is doing a key role in Mass Maharaja @RaviTeja_offl most anticipated Project #TigerNageswaraRao 🥵🔥 True definition of Success 💥💯 pic.twitter.com/z3GY4rPEc7 — Neeraj Kumar (@73forever_) October 4, 2023 -
వీడేం లవర్రా బాబు..! దొంగకే సానుభూతి కలిగింది..
ప్రేమంటే ఏంటో నాకు నీ వల్లే తెలిసింది.., గుండె మాత్రం నాదే.. కానీ అది చేసే చప్పుడు నీది.., ఒకటా రెండా.. ఎన్ని కబుర్లు చెబుతారో ప్రేమలో ఉన్నప్పుడు. బాబోయ్.. వీళ్ల మాటలను కుప్పేస్తే.. కాళిదాసుకు కూడా కన్నీరొస్తుంది! కానీ అసలు పరీక్ష ఎదురైనప్పుడు కదా..! ఆ ప్రేమకు కడదాక అండగా నిలబడగలిగేదెవరో తెలిసేది. ప్రాణ సంకటం ఎదురైనప్పుడు కదా..! ప్రేమికురాలికి నిజం తెలిసేది. సరిగ్గా ఇలాంటి సంఘటన గురించే మీరు తెలుసుకోబోతున్నారు. ఓ ప్రేమ జంట చేతిలో చేయి వేసుకుని రోడ్డు వెంట నడుస్తున్నారు. బహుశా.. తమ మనసులు మ్యాచ్ అయ్యాయని చెప్పడానికనుకుంట.. మ్యాచింగ్ డ్రస్లు వేసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కత్తితో బెదిరించి ఆ అమ్మాయి వద్ద ఉన్న బ్యాగ్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో భయపడిన ప్రియుడు పలాయనం చిత్తగించాడు. దిక్కుతోచని స్థితిలో ఆ అమ్మాయి.. దొంగపై ఏ మాత్రం ప్రతిఘటన చేయకుండా ప్రియుని వైపు, దొంగ వైపు చూస్తూ దీనంగా ఉండిపోయింది. బ్యాగును దొంగ కొట్టేయడం కంటే ప్రియుడి స్వభావమే ఎక్కువగా బాధ కలిగించినట్లు అతని వైపే చూసింది. ఈ ఘటనతో బైక్ ఎక్కి పారిపోయే ప్రయత్నం చేసిన దొంగ మనసు కరిపోయింది. ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్య మాల్లో తెగ వైరల్ అయింది. Her lover ran away but the robber felt sorry for her. 😂pic.twitter.com/owFtEGVHPE — The Best (@Figensport) June 27, 2023 వీడియోపై నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. ప్రేమ పరీక్షలో ప్రియుడు విఫలమయ్యాడని కొందరు కామెంట్ చేశారు. లవర్ పారిపోకపోతే.. ఆ దొంగకు సానుభూతి కలిగేది కాదని మరికొందరు స్పందించారు. ఈ క్రెడిట్ కూడా ప్రియుడిదే అని కొందరు చెప్పుకొచ్చారు. మరికొంత మంది నెటిజన్లు దొంగ స్వభావాన్ని మెచ్చుకున్నారు. ఇదీ చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
Delhi Lodge Murder Case: హనీ ట్రాప్లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్'..
ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు. ఈ ప్లాన్తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్ల్కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్హౌస్కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఉష నెంబర్ సంత్గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: బార్లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు) -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
‘సారీ మీ ఫుడ్ తినేశా’.. డెలివరీ బాయ్ మెసేజ్తో కస్టమర్ షాక్
లండన్: ప్రస్తుత రోజుల్లో ఇంటికే ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి పలు ఆన్లైన్ సంస్థలు. రోజుకు లక్షల మంది ఆయా యాప్ల ద్వారా తమకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. మంచి ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాక.. ఇంటి కాలింగ్ బెల్ మోగితే డెలివరీ బాయ్ వచ్చాడేమోనని ఆత్రుతగా పరుగెడతాం. కాదని తెలిస్తే ఒక్కసారిగా కోపం పెరిగిపోతుంది. ఫుడ్ డెలివరీ బాయ్ ఆలస్యంగా వచ్చినా చికాకుతో ఊగిపోతాం. అలాంటి సంఘటనే యూకేలోని ఓ వ్యక్తికి ఎదురైంది. అయితే, ఇక్కడ ఆలస్యం కాలేదు. అసలు తాను ఎదురుచూస్తున్న ఫుడ్ తీసుకురాలేదు కదా తాపీగా సారీ అంటూ ఓ మెసేజ్ చేశాడు ఫుడ్ డెలివరీ బాయ్. ఆ తర్వాత ఏం జరిగింది? లియమ్ బ్యాగ్నాల్ అనే వ్యక్తి ‘డెలివెరూ’ అనే ఫుడ్ డెలివరీ యాప్లో తనకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ కోసం ఎదురుచూడశాగాడు. కొద్ది సేపటి తర్వాత తన ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అది ఫుడ్ డెలివరీ ఏజెంట్ ‘సారీ’ అంటూ పంపించాడు. దానికి బ్యాగ్నాల్ ఏం జరిగిందని రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ‘ఈ ఫుడ్ చాలా రుచికరంగా ఉంది. దానిని నేను తినేశాను. మీరు డెలివెరూ కంపెనీకి రిపోర్ట్ చేయండి’అని రిప్లై ఇచ్చాడు డెలివరీ బాయ్. ఆ తర్వాత నువ్ భయంకరమైన మనిషివి అని లియామ్ పేర్కొన్నాడు. దానికి ‘ఐ డోంట్ కేర్’ అంటూ షాకిచ్చాడు. ఈ సంభాషణ స్క్రీన్ షార్ట్స్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు లియామ్. ట్విట్టర్ పోస్ట్కు 192వేల లైక్స్ వచ్చాయి. వేలాది మంది కామెంట్లు చేశారు. Deliveroo driver has gone rogue this morning pic.twitter.com/sFNMUtNRrk — Bags (@BodyBagnall) October 28, 2022 ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
అందుకు క్షమాపణలు చెప్పిన కమల్ హాసన్..
చెన్నై సినిమా: ఇకపై ప్రజల కోసం పెట్టుబడి పెడతానని నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ తెలిపారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'విక్రమ్'. రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ మూవీ. విజయ్సేతుపతి ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం జూన్ 3వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం (మే 25) సాయంత్రం కమలహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీడియాతో ముచ్చటించారు. తన గత చిత్రం విడుదలై నాలుగేళ్లు అయిందని అందుకు అభిమానులకు క్షమాపణ చెబుతున్నట్లు కమలహాసన్ పేర్కొన్నారు. తాను సంపాదించింది తిరిగి చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నానని, ఇకపై ప్రజల కోసం కూడా పెట్టుబడి పెడుతానని చెప్పారు. కరుణానిధి జయంతి అయిన 3వ తేదీన విక్రమ్ చిత్రాన్ని విడుదల చేయడమన్నది యాదృచ్ఛికమే అన్నారు. అయితే ఆయన తనకు ఇష్టమైన నాయకుడని పేర్కొన్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్ర మ్-3 చేయడానికి తాను సిద్ధమని తెలిపారు. కాగా పీఆర్ఓగా 600 చిత్రాలను పూర్తి చేసిన డైమండ్ బాబును కమలహాసన్ ఘనంగా సత్కరించారు. చదవండి: కమల్ హాసన్ పాడిన పాట విన్నారా ! -
‘సారీ’లు ఇన్ని రకాలుగా చెప్పవచ్చు!
ఏదో ఒక సమయంలో ఎవరికో ఒకరికి సారీ చెబుతూనే ఉంటాం మనం. ‘ఐయామ్ సారీ’ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇది మాత్రమే కాదు.. సందర్భాన్ని బట్టి ఇలా రకరకాలుగా సారీ చెప్పవచ్చు... ఐ అపాలజీస్: ఉదా: ఐ అపాలజీస్ ఫర్ ది డిలే ఇన్ రిప్లైంగ్ టు యువర్ ఇమెయిల్ ఐ బెగ్ యువర్ పర్డన్: ఉదా: పర్డన్ మై ఇగ్నోరెన్స్ మెయ కుల్ప: ‘మెయ కుల్ప’ అనేది లాటిన్ మాట. మోడ్రన్ ఇంగ్లీష్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మై బ్యాడ్: లైట్గా సారీ చెప్పాల్సిన సందర్బంలో వాడుతారు. ఉదా: మై బ్యాడ్. ఇట్ వోన్ట్ హ్యాపెన్ అగేన్ వూప్స్: మైల్డ్ సారీ, సర్ప్రైజ్... ఉదా: వూప్స్! ఐ బ్రోక్ యువర్ కాఫీ మగ్ -
సారీ.. తప్పు జరిగింది.. కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఫ్లిప్కార్ట్
ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్కార్ట్.. చిన్న తప్పిదం కారణంగా తమ కస్టమర్లకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్లిప్కార్ట్ కిచెన్ అప్లెయెన్స్ను ప్రమోట్ చేసుకుంది. మార్చి 8వ తేదీన(అంతర్జాతీయ మహిళా దినోత్సవం) రూ.299 నుంచి కిచెన్ అప్లెయెన్స్ను పొందవచ్చునని ప్లిప్కార్ట్ తెలిపింది. అయితే, ఈ ఆఫర్ను బేస్ చేసుకొని కొంత మంది మహిళలు ప్లిప్ కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం రోజున వంట గదికి సంబంధించిన ఆఫర్ను మాత్రమే ఎందుకు ప్రకటించారు. వంట గది మాత్రమే మా ప్రపంచం కాదంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే మీ ఆఫర్కు నో థ్యాంక్స్ అంటూ కామెంట్ చేశారు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ప్లిప్కార్ట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తమ తప్పును తెలుసుకున్న ప్లిప్ కార్ట్.. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. తాము ఎవరి మనోభావాలను కించపరచాలని అనుకోవడంలేదని, ఆందోళన చెందుతున్నామని తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కిచెన్ సామాగ్రిని ప్రమోట్ చేస్తూ వార్త ప్రచురించిన ఈ-కామర్స్ సైట్ మార్కెటింగ్ విభాగం తప్పు చేసిందని ఫ్లిప్కార్ట్ కస్టమర్లను క్షమాపణలు కోరింది. మరోవైపు.. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ప్లిప్కార్ట్ హోలీ పండుగ సందర్బంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 12-16వ తేదీ వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ను ప్రారంభించనుంది. హోలీ పండుగ సేల్స్లో భాగంగా పలు ప్రొడక్ట్లపై 80 శాతం డిస్కౌంట్, యాపిల్, శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్లపై 60 శాతం వరకు భారీ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. It's offensive Why women are being identified with kitchen appliance..only ?? Whole world is ours & certainly kitchen is not our whole world!! No thanks!! — Harmeet Kaur (@iamharmeetK) March 8, 2022 We messed up and we are sorry. We did not intend to hurt anyone's sentiments and apologise for the Women's Day message shared earlier. pic.twitter.com/Gji4WAumQG — Flipkart (@Flipkart) March 8, 2022 -
‘అతను’ నాతో మాట్లాడాడు
కింగ్స్టన్: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యానంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ ఇప్పుడు ఆ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సన్రైజర్స్ జట్టు సహచరుడొకరు తనను కాలూ (నల్లోడు) అన్నాడని, ఇప్పటికైనా అతను తనతో మాట్లాడి క్షమాపణ చెప్పాలని ఇటీవల డిమాండ్ చేశాడు. తాజాగా స్యామీ శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశాడు. సదరు క్రికెటర్ తనతో అభిమానంగా మాట్లాడాడని, ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘వివాదంలో భాగమైన ఆ క్రికెటర్ నాతో మాట్లాడాడు. మా సంభాషణ బాగా సాగింది. ఈ అంశంలో చెడును చూడటంకంటే వివక్షపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించాం. నా సోదరుడు ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పాడు. అతని మాటలు నమ్ముతున్నాను. ఉద్దేశపూర్వంగా చేయలేదని అర్థమైంది. ఇక నేను క్షమాపణ కోరుకోవడం లేదు. అతని పేరు కూడా నేను చెప్పను. ఇకపై అలాంటిది జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే’ అని స్యామీ పేర్కొన్నాడు. -
‘వికలాంగులకు మోదీ క్షమాపణ చెప్పాలి’
నాగర్కర్నూల్ క్రైం: రూర్కి ఐఐటీలో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హకధన్లో కార్యక్రమంలో విద్యార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికలాంగులను కించపరిచే విధంగా డైస్లెక్సియా పదాన్ని ఉపయోగించారని, వికలాంగులను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లా ఎస్పీ సాయిశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలీశ్వర్ మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగానే వికలాంగులను అవమానపరుస్తున్నారని, 2014 లోక్సభ ఎన్నికల సమయంలో మూగ, చెవిటి, గుడ్డి లాంటి పదాలను ఉపన్యాసాల్లో ఉపయోగించి వికలాంగులను కించపరిచారన్నారు. వికలాంగుల మనోభావాలను దెబ్బతినకుండా రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చేసుకోవాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసులు, కొములయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అవమానపర్చడం తగదు నాగర్కర్నూల్ రూరల్: వికలాంగులను అవమానపర్చేవిధంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడటం సరికాదని, వారికి క్షమాపణ చెప్పాలని ఎంపీఆర్డీ తెలంగాణ రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బహిరంగ సమావేశాల్లో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అవమానించినా.. బెదిరించినా శిక్షార్హులు అవుతారని, జరిమానా కూడా విధించవచ్చని, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పదాలు వాడుకోవడం తప్ప మరొకటి కాదని, తక్షణం వికలాంగులకు క్షమాపణ చెప్పాలని కుర్మయ్య, శశిధర్, పరమేశ్వర్, రామస్వామి, స్వామి, నిర్మల, రాములు, శివ తదితరులు పేర్కొన్నారు. -
సారీ సన్నీ!
రాఖీ సావంత్.. సన్నీ లియోన్. ఇద్దరూ ఇద్దరే. హాట్ గర్ల్స్కి కేరాఫ్ అడ్రస్ అన్నంత హాట్గా ఉంటారు. సన్నీ హాట్ అయినా కూల్గా ఉంటారు. రాఖీ మాత్రం ఎప్పటికప్పుడు హాట్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఎవరినైనా విమర్శించేటప్పుడు చాలా ఘాటుగా మాట్లాడతారామె. ఆ మధ్య వరుసగా సన్నీ లియోన్పై అవాకులు చెవాకులు పేలారు రాఖీ. ‘‘సన్నీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలి. తనలాంటి పోర్న్ స్టార్ వల్ల భారతీయ చిత్ర పరిశ్రమ చెడిపోతోంది. ఆమెను తక్షణమే బాలీవుడ్ నుంచి బహిష్కరించాలి. ఆమె ఇండియాని, బాలీవుడ్ చిత్ర పరిశ్రమని వదిలి వెళ్లిపోవాలి’’ అంటూ రాఖీ నోరు పారేసుకున్నారు. మరి.. ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో.. ‘సారీ.. సన్నీ’ అన్నారు. ‘‘సన్నీ లియోన్ గురించి నేను చాలా తప్పుగా మాట్లాడా. ఆమె గురించి నాకేం తెలుసని అలా మాట్లాడానో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది పూర్తిగా నా తప్పే. ఆమె వ్యక్తిగత జీవితం, గత చరిత్ర నాకు అనవసరం. ఇప్పుడు ఆమె ఏంటన్నది ముఖ్యం. ఓ భారతీయ పాపని దత్తత తీసుకోవడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సన్నీ మనస్తత్వం చాలా గొప్పది. ఆమె గురించి గతంలో అలా మట్లాడినందుకు సిగ్గు పడుతున్నా. ఇప్పుడు సన్నీకి సారీ చెబుతున్నా’’ అన్నారు రాఖీ సావంత్. -
ఐయామ్ వెరీ సారీ...
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’ టీఎస్ ఇలియట్ రాసిన ‘ది వేస్ట్ ల్యాండ్’ కవిత్వంలో మొదటి వ్యాక్యం ఇది. ఆ వ్యాక్యం వెనక ఆయన ఉద్దేశం ఏమిటో గుర్తు లేదుగానీ ఈసారి ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో ‘సారీ’లు చెబుతున్నందున నిజంగా ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’యే. సారీ చెప్పడం అంత సులభమైన విషయం కాదని, సారీ చెప్పడం చాలా కష్టమని మానసిక శాస్త్రవేత్తలు చెప్పడమే కాకుండా ‘సారీ సీమ్స్ టు బీ ది హార్డెస్ట్ వర్డ్’ అంటూ 1970లో ఎల్టాన్ జాన్ పాటగా పాడారు. భారత దేశంలో ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ‘సారీ’ చెప్పారు. ఆయన సారీల పర్వంలో అది మూడవది. అంతకుముందు ఆయన పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీథియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీలకు సారీ చెప్పారు. ఏప్రిల్ నాలుగవ తేదీన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ విలేఖరులతో మాట్లాడుతూ ఫేస్బుక్ నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు వచ్చినందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినందుకు ‘సారీ’ చెప్పుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఏప్రిల్ పదవ తేదీన అమెరికా సెనేట్కు సారీ చెప్పారు. ఫేస్బుక్ను ప్రారంభించిందీ తానని, అందులోని వ్యవహారాలకు తాను బాధ్యుడినని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, అందుకు సారీ అని చెప్పారు. రాజకీయాల్లో నిర్లక్ష్యానికి గురైన దళిత సోదర సోదరీ మణులకు అమిత్ షా క్షమాపణలు చెప్పారు. ఇంజన్ లేకుండా ప్రయాణికులు రైలు పరుగెత్తినందుకు భారతీయ రైల్వే ప్రయాణికులకు సారీ చెప్పింది. ఏ రోగికి తప్పుడు ఆపరేషన్ చేసినందుకు ఢిల్లీలోని ఏయిమ్స్ సారీ చెప్పింది. గురుపూరబ్ శుభాకాంక్షలను ఏడు నెలలు ముందుగా చెప్పినందుకు ఉత్తరప్రదేశ్ నేతలు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను వినియోగించుకున్నందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్, సీబీఎస్ఈ ఫలితాలు లీకయినందుకు, బ్యాంకు కుంభకోణాలు పెరిగినందుకు, ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని సడలించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పాలంటూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్కు ఇంకా స్పందన రావాల్సి ఉంది. ఇంకా క్విడ్ప్రో కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చార్, కథువా లాంటి దారుణ హత్యా, అత్యాచారాలు పెరిగినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పదేళ్లలో కూడా హిందూ టెర్రరిస్టుల కేసుల్లో దోషులను నిరూపించలేకపోయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పడక సుఖం ఇస్తేనే పాత్రలిస్తామంటూ విలువల వలువలూడదీసిన తెలుగు సినీ పరిశ్రమ ‘సారీ’ చెప్పాల్సి ఉంది. -
పవన్ ఒక్కరికే ఫ్యాన్స్ ఉన్నారా..
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు పవన్ కల్యాణ్పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్పై ఘాటు విమర్శలు చేశారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. పవన్ ఒక్కరికే అభిమానులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఫ్యాన్స్ను అదుపులో ఉంచుకోవాలంటూ సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, అభిమానుల పేరుతో కొందరు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, కో ఆర్డినేటర్ల విధానాన్ని నిర్మూలించాలని, అప్పుడే మహిళా ఆర్టిస్టులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. -
పరువు తీసిన విశ్వసనీయత
ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవర్నర్ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనాలను ప్రత్యర్థులు కేజ్రీవాల్ క్షమాపణలతో సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకు పోయింది. తెలుగుదేశం కుట్రపన్నుతోం దని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు 1980ల ఆరంభంలో ఆరోపించారు. దానికి సంబంధించిన లిఖిత పూర్వక వివరాలు ‘తగిన సమయంలో’ వెల్లడిస్తానని తర్వాత ముఖ్యమంత్రి, గవ ర్నర్ పదవులు చేపట్టిన ఈ నేత ప్రకటించారు. అయితే, తర్వాత ఆయన ఆ పని చేయ లేదు. ‘‘ మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఇప్పుడే ఈ ఆరోప ణను నిరూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని కర్నూలు విలేకరుల సమావేశంలో ప్రశ్నించాను. ఈ విషయం నేతల విశ్వసనీయతకు సంబంధించినది. అనేక పత్రికలు ఆయన ఆరోపణను ప్రచురించాయి. కానీ, ఆయన చెప్పిన విషయాన్ని నేను పనిచేస్తున్న ‘ద హిందూ’ పత్రికలో రాయడానికి నేను ఇష్టపడలేదు. అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. పుకార్లు వ్యాప్తి చేసే సంస్థలు కూడా నెమ్మదిగానే పనిచేసేవి. ఇప్పటిలా ఇంటర్నెట్లో నిరాధార ఆరోపణలు, వార్తలు వ్యాప్తి చేయడం నాడు ఊహించడానికి కూడా అసాధ్యం. అబ ద్ధాలు, అవాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని విజయవం తంగా కోరుకున్న విధంగా మలచుకోవడం ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతోందనే వాస్తవం మనకు తెలుసు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నేడు ఏది సత్యమో కనీసం నమ్మదగిన సమాచారంగా కూడా మనకు తెలియడం లేదు. అంటే, నిజం అనేది నిర్ధారిం చుకోదగిన లేదా అందుబాటులో ఉన్న వాస్తవం స్థాయికి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకుని, నిర్ణయించుకునే సమాచారం ఇలా పంపిణీ అవుతోంది. ఇక వాట్సాప్ ద్వారా వాయు వేగంతో వచ్చిపడే అంశాల్లో ఏది సమాచారం? ఏవి గాలి కబుర్లో తేల్చుకోవడం కష్టం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు తప్ప మొత్తం సీట్లను కైవసం చేసుకున్నాక దేశంలో అత్యంత నమ్మదగిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. అన్ని పార్టీలూ ఆప్కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయనే కారణంగా ప్రజలు కేజ్రీవాల్ మాటలు నమ్మారు. అప్పట్లో ఆప్ను అప్రదిష్ట పాల్జేయడానికి స్టింగ్ ఆపరేషన్ పేరిట రూపొందించిన వీడియోలను ఇష్టారాజ్యంగా మార్చేసి అన్ని రాజకీయపక్షాలూ చేయని ప్రయత్నాలు లేవు. సామాన్యుడికి నిర్ణాయక శక్తి ఉండే కొత్త తరహా రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న రోజులవి. కేజ్రీవాల్ అప్పుడు చేసిన ఆరోపణలన్నిటినీ జనం విశ్వ సించారు. రాజకీయనాయకులు, పార్టీలు మోసపూరిత కుయుక్తులతో ఓట్లు సంపాదించి అధికారంలో కొన సాగుతూ ఆటలాడుకుంటారన్న విషయం మనలాంటి సామాన్య ప్రజానీకానికి తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను దెబ్బదీయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ తన ఆరోపణలను రుజువు చేసు కోలేకపోయారు. ఫలితంగా వీటికి సంబంధించి దాఖ లైన పరువునష్టం దావాలపై విచారణ ముగియక ముందే ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సివచ్చింది. సామాన్య ప్రజానీకం ముఖ్య విషయాలను రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయకుండా తామే స్వయంగా నిర్ణ యించే వేదికలా ఆమ్ఆద్మీ పార్టీ నాకు కనిపించింది. కేజ్రీవాల్ నేడు విశ్వసనీయత కోల్పోవడంతో ఓ ఆదర్శ రాజకీయ వేదికగా ఆప్ బలహీనమైంది. ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్ను పూర్తిగా లొంగిపోయిన నేతగా చిత్రిస్తున్నారు. నలుగురికి క్షమాపణలతో కేజ్రీవాల్ పరువు పోయింది! ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ క్షమా పణ చెప్పారు. అంతకు ముందు పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీఠియాకు, మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, కాంగ్రెస్ నేత కపిల్ సిబ్బల్ కొడుకు అమిత్ సిబ్బల్కు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. జైట్లీ–ఢిల్లీ క్రికెట్ క్లబ్ సంబంధంపైన, పంజాబ్లో మాదకద్రవ్యాలకు మజీఠియాకు ఉన్న వ్యవహారంపైన తాను చేసిన ఆరోపణలను కేజ్రీవాల్ నిరూపించు కోలేకపోయారు. ఆయనపై ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నందున పరిపాలనపై దృష్టి పెట్టడానికే ప్రత్య ర్థులకు కేజ్రీవాల్ క్షమాపణ చెప్పారని సమర్థించు కోవడం తేలికే. ఆప్లో నానాటికీ పెరుగుతున్న అంతర్గత కీచు లాటలను అదుపు చేసి పార్టీని సమైక్యంగా ఉంచ డానికి పరువునష్టం కేసుల నుంచి త్వరగా బయటపడితే మేలని కేజ్రీవాల్ భావించి ఈ పనిచేశారని కూడా వివరించ వచ్చు. అయితే, కేజ్రీవాల్ ఇతర రాజకీయ నాయకుల మాదిరి ఎదిగిన నేత కాదు. ఆయన అనుసరించిన కొత్త తరహా రాజకీయాలను ఓడించడానికి అన్ని పార్టీలూ రహస్యంగా చేతులు కలిపాయి. ఆయన అందరికీ సవా లుగా, ముప్పుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కేజ్రీ వాల్ క్షమాపణల కారణంగా అన్ని పక్షాలూ లబ్ధిపొందు తాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్ గవ ర్నర్ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనా లను ఆయన క్షమాపణలతో ప్రత్యర్థులు సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకుపోయింది. మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు mvijapurkar@gmail.com -
కోహ్లి సారీ.. ఎందుకో తెలుసా?
బెంగళూరు: ఐపీఎల్ 10లో చెత్త ప్రదర్శన చేసినందుకు క్రికెట్ అభిమానులకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి క్షమాపణ చెప్పాడు. అంచనాలకు తగ్గినట్టు ఆడడంలో విఫలమయ్యామని, అభిమానులను నిరాశకు గురి చేశామని పేర్కొన్నాడు. ‘మాపై అంతులేని ప్రేమ కురిపించి వెన్నంటి నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మేము స్థాయికి తగినట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాన’ని కోహ్లి ట్వీట్ చేశాడు. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి మాట్లాడుతూ.. ఈ సీజన్ను త్వరగా మర్చిపోవాలకుంటున్నట్టు చెప్పాడు. ఐపీఎల్-10లో తమకు ఏదీ కలిసి రాలేదని వాపోయాడు. బ్యాటింగ్లో రాణిస్తే బౌలింగ్లో విఫలమయ్యామని, ఇలా రెండిట్లో డీలా పడ్డామని చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి వైదొలగిన కోహ్లి సేన 5 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం రెండింటిలో మాత్రమే నెగ్గింది. 10 మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. తన చివరి లీగ్ మ్యాచ్ను ఈనెల 14న ఢిల్లీ డేర్ డెవిల్స్తో ఆడనుంది. -
కుంభకోణంపై శాంసంగ్ క్షమాపణలు
సియోల్: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన వాటాదారులకు క్షమాపణలు చెప్పింది. దేశంలో అతిపెద్దకుంభకోణంలో తమ సంస్థ అధిపతిపైఅవినీతి అభియాగాలు రావడంపై సంస్థ వాటాదారులకు వివరణ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో అవినీతి కేసులో సంస్థ అధ్యక్షుడు జే ఓలీ అరెస్టు కావడంపై శాంసంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్ వాటాదారులను క్షమాపణ కోరారు. కుంభకోణంలో తాము చిక్కుకున్నందుకు క్షమించాలని కోరారు. విరాళాల రూపంలో తాము ఎలాంటి లంచాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ సంస్థ కార్పొరేట్ పాలన మెరుగుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దీంతో హోల్డింగ్ కంపెనీగా మార్చడానికి ఇన్వెస్టర్లనుంచి ఒత్తిడి పెరుగుతోందని కానీ,కార్పొరేట్ నిర్మాణం ఎప్పటికీ మార్చుకోలేమని శుక్రవారం నాటి సమావేశంలో క్వాన్ ప్రకటించారు హోల్డింగ్ కంపెనీ ద్వారా పరిణామాలు ప్రతికూల ప్రభావాలుంటాయని పేర్కొన్నారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యంపై కూడా మరోసారి క్షమాపణలు కోరింది. కొత్త టెక్నాలజీ ప్రయోగంలో లోపం తలెత్తినట్టు క్వాన్ వివరించారు. ఈ వైఫల్యాన్ని 6 బిలియన్ డాలర్ల మేర అంచనా వేసినట్టు చెప్పారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ గ్రూప్ చీఫ్ జె.వై. లీని అక్కడి విచారణ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి లీ జైలుకి వెళ్లక తప్పలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ కొనసాగనుంది. దక్షిణ కొరియా అధ్యక్షునికి 38 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని లీపై ప్రధాన అభియోగం. రెండు కంపెనీల వివాదానికి సంబంధించి దేశ అధ్యక్షుడి మద్దతు కోసం శాంసంగ్ చీఫ్ లంచాన్ని ఎరగా చూపారని చార్జ్ షీట్ నమోదైంది. అటు ఈ అవినీతి ఆరోపణలు దక్షిణ కొరియాను కుదిపేయడంతో ఆ దేశ అధ్యక్షుడు మహాభియోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని శాంసంగ్ వర్గాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
నా వ్యాఖ్య బాధ కలిగిస్తే క్షమించండి: కోడెల
స్పీకర్ వంటింటి వ్యాఖ్యలపై మహిళాలోకం ఆగ్రహం సాక్షి, అమరావతి: మహిళా లోకానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవన్న తన వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలన్నారు. ‘ఒక వాహనం కొని షెడ్లో ఉంచితే ప్రమాదాలు జరగవు. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు..‘ అని కోడెల బుధవారం విజయవాడ ‘మీట్ ది ప్రెస్’లో వ్యాఖ్యానించడం దుమారం రేపింది. (మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్) ‘మహిళా సాధికారత–సవాళ్లు’ పేరిట గురువారం విజయవాడలోని ఎంబీభవన్లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశం స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. సమావేశానికి హాజరైన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య తదితరులు ఈ వ్యవహారం సహా రౌండ్టేబుల్లో ప్రస్తావనకొచ్చిన అంశాల్ని వెంటనే స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కోడెల... తానలా అనలేదని, ఎవరైనా అలా అర్థం చేసుకుని బాధపడి ఉంటే సారీ అని అన్నట్టు మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చెప్పారు. -
ఐ యాం సారీ!
క్షమాపణ కోరడానికి చాలా పెద్ద కారణం కావాలి. నటి త్రిష తన అభిమానులను ఇలాంటి క్షమాపణే కోరారు. అయితే తను అంత పెద్ద తప్పు ఏం చేశారన్నదే ఆసక్తికరమైన అంశం. ఇంతకుముందు చక్కగా పుత్తడిబొమ్మలా ప్రేమకథా చిత్రాల్లో నటించి కమర్శియల్ చిత్రాల నాయకిగా ఎదుగుతూ వచ్చిన త్రిష ఆ మధ్య ప్రేమ,పెళ్లి అంటూ కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం ఆ రెండింటికీ దూరంగా నటనపైనే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు నటిగా త్రిష తన బాణీని మార్చేశారు.ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకే ప్రాధాన్యత నిస్తున్నారు.అలా నటించిన తొలి చిత్రం నాయకి. తాజాగా మోహిని అనే చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండూ హారర్ కథా చిత్రాలే అన్నది గమనార్హం. ద్విభాషా చిత్రంగా తరపైకి వచ్చిన నాయకి చిత్రం ముందు తెలుగులో విడుదలై ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. ఇక ఇటీవలే తమిళంలోనూ తెరపైకి వచ్చి అదే రిజల్ట్ను చవి చూసింది.ఇందుకు నటి త్రిష కూడా ఒక కారణం అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వస్తోంది.నాయకి చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా విడుదలైందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నటి త్రిష కూడా నాయకి చిత్రానికి ఎలాంటి ప్రచారం చేయలేదని ఆమె అభిమానులే ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన త్రిష తన అభిమానులను క్షమించండి అని కోరుకున్నారు. కారణం లేనిదే ఏ విషయం జరగదు. అందుకే నాయకి చిత్ర ప్రచార కార్యక్రమాలకు పూనుకోలేదు. ఆ వివరాలన్నీ తరువాత వెల్లడిస్తాను అని త్రిష తన ట్విట్టర్లో పేర్కొనడం చర్చనీయంశంగా మారింది. త్రిషకు ఆ చిత్ర నిర్మాత పారితోషికం పూర్తిగా చెల్లించలేదని, దాని గురించి అడిగిన్నప్పుడు తమిళ వెర్షన్ విడుదలైనప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తానని ఆ నిర్మాత చెప్పినట్లు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. త్రిష నాయకి చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడానికి ఇదే కారణమా? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇక అసలు కారణాలు ఏమిటన్నది ఈ చెన్నై చిన్నది నోరు విప్పితే కానీ తెలియదు. -
పవన్కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉంగరాల చినబాబు బోట్క్లబ్ (కాకినాడ) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుపై చేసిన విమర్శలకు జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉంగరాల వెంకటరమణ (చినబాబు) డిమాండ్ చేశారు. కాకినాడలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై ఎలాంటి అవగాహన లేకుండా బీజేపీ ప్రభుత్వంపైన, వెంకయ్యనాయుడుపైన కాకినాడ సభలో చేసిన విమర్శలు ఏమాత్రం సమంజసం కాదన్నారు. విభజన చట్టంలో లేని పోలవరం ముంపు మండలాలను మొదటి క్యాబినెట్లో సమావేశంలో చర్చించి ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి, భారతీయ జనతాపార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా పథకానికి దేశంలో మూడు రాష్ట్రాలను ఎంపిక చేయగా, అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ అని ఆయన తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పిఠాపురం–కాకినాడ మెయిన్లైన్ కోసం రూ.50 కోట్లను, కోటిపల్లి–నర్సాపురం మధ్య గోదావరి, దాని ఉపనదులపై మూడు బ్రిడ్జిల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిందన్నారు. విభజన బిల్లులో ఉన్న హామీల నిమిత్తం వెంకయ్యనాయుడు 35 మంది మంత్రులతో చర్చించి, ఆంధ్రప్రదేశ్కు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థల కేటాయించడమే కాకుండా వాటిని తక్షణమే అద్దె భవనాలలో నిర్వహించేటట్టు చేశారన్నారు. ఆయనను పవన్కల్యాణ్ విమర్శించడం తగదన్నారు. ఏపీని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్యాకేజీ ఇచ్చిందన్నారు. -
క్షమాపణ చెప్పిన సీనియర్ నటుడు
లాస్ ఏంజెలెస్: గతంలో చేసిన తప్పులకు హాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మెల్ గిబ్సన్ క్షమాపణ కోరాడు. తాను గతంలో చేసిన వివాదస్పద ప్రకటనలు, చర్యలకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నాడు. 60 ఏళ్ల మెల్ గిబ్సన్ 2006లో పోలీసు మహిళా అధికారిపై చేసిన వ్యాఖ్యలతో అపఖ్యాతి పాలయ్యాడు. మద్యం మత్తులో జాతివివక్ష వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైయ్యాడు. మరొపక్క తనను గృహహింసకు గురిచేశాడని అతడి మాజీ సహచరి ఒక్సనా గ్రీగోరివా ఆరోపించడంతో మెల్ గిబ్సన్ ఇమేజ్ పాతాళానికి పడిపోయింది. దురలవాట్ల నుంచి బయటపడ్డానని, తన గత ప్రవర్తనకు బాధ పడుతున్నానని గిబ్సన్ చెప్పాడు. గత పదేళ్లలో తనలో చాలా మార్పు వచ్చిందన్నాడు. మద్యం అలవాటు మానేశానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని వెల్లడించాడు. చేసిన తప్పులకు తనకు తానుగా క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. -
సల్మాన్ క్షమాపణ చెప్పలేదు..
రేప్ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని జాతీయ మహిళా కమిషన్ పంపిన నోటీసులకు ప్రముఖ సినీనటుడు సల్మాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా నోటీసులకు సమాధానం పంపారు. నోటీసుపై స్పందించిన మహిళా కమిషన్ చైర్మన్ లలిత కుమారమంగళం రేప్ వ్యాఖ్యలపై సల్మాన్ క్షమాపణ చెప్పలేదని తెలిపారు. మిగతా వివరాలను పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వచ్చే నెలలో విడుదల కాబోతున్న సల్మాన్ కొత్త సినిమా 'సుల్తాన్' సినిమా గురించి ఇచ్చిన ఇంటర్వూలో సినిమాకు తాను చేసిన కసరత్తుల వల్ల రేప్ కు గురైన మహిళల తన శరీరం తయారైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు సల్మాన్ ను సమర్ధించగా, మరికొందరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సల్మాన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ క్షమాపణ చెప్పాలని గతంలో కోరింది. ఈ మేరకు నోటీసులు పంపగా, సల్మాన్ తన లాయర్ ద్వారా తిరిగి మహిళాకమిషన్ నోటీసులను పంపించారు. -
ధనుష్కి సారీ చెప్పాలి!
ఎవరైనా ఇంకొకరికి ‘సారీ’ చెప్పారంటే... కచ్చితంగా ఏదో తప్పు చేసే ఉంటారు. మరి.. నయనతార ఏం తప్పు చేశారో ఏమో? హీరో ధనుష్కి సారీ చెప్పాలనుకుంటున్నారు. ఆ విషయంలోకి వస్తే... ఇటీవల జరిగిన సౌతిండియా ఫిల్మ్ఫేర్ పురస్కారాల్లో తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’లోని నటనకుగాను నయనతారను ఉత్తమ కథానాయిక పురస్కారం వరించింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘కాక్కా ముట్టై’ ఎంపికైంది. ఈ రెండు చిత్రాలను నిర్మించింది ధనుషే. ‘కాక్కా ముట్టై’ పురస్కారం అందుకున్న తర్వాత, ఆ చిత్రంలో కథానాయిక ఐశ్వర్యా రాజేష్ డీ-గ్లామరస్ పాత్రలో బాగా నటించిందని ధనుష్ ప్రశంసించారు. చాలాసేపు మాట్లాడిన ధనుష్.. నయనతార గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. ‘నానుమ్ రౌడీదాన్’లో నయనతార చెవిటి యువతిగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ, ధనుష్ ఏం చెప్పకపోవడంతో నొచ్చుకున్నట్లున్నారు. ‘‘నేను ధనుష్కి సారీ చెప్పాలి. ‘నానుమ్ రౌడీదాన్’లో తనకు నా నటన నచ్చలేదనుకుంటా. అందుకే నా గురించి మాట్లాడలేదేమో! తర్వాతి చిత్రంలో బాగా నటించి అతణ్ణి మెప్పిస్తాను’’ అని నయన సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు విని, నయన తెలివిగా ధనుష్ని విమర్శించిందని విశ్లేషకులు అంటున్నారు. -
కామెరాన్.. క్షమాపణ చెప్పండి!
భారత స్వాతంత్ర్య సమర చరిత్రలో చెరిగిపోని రక్తపు మరకగా మిగిలిన 1919 జలియన్ వాలాబాగ్ దురాగతానికి బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ క్షమాపణలు చెప్పాలని యూకే భారతీయ కార్మికుల సంఘం అధ్యక్షుడు హార్స్ వెన్ కోరారు. 1914 కొమగాట మారు సంఘటనకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని, అందుకు యూకే మొత్తం ఈ విషయంపై పోరాటం చేస్తామని అన్నారు. బ్రిటన్ క్షమాపణలు చెప్పడం వల్ల ప్రపంచదేశాలకు దాని మీద అభిప్రాయం మారుతుందని యూకే సిక్కు హక్కుల గ్రూప్ అధ్యక్షుడు జస్దేవ్ సింగ్ రాయ్ అన్నారు. 1919, 1925 దురాగతాలు సిక్కుల గుండెలపై ఎప్పటికీ చెరగని మచ్చలని అన్నారు. ఓ వైపు కెనడా తన తప్పిదాన్ని గుర్తించి క్షమాపణలు చెబితే, బ్రిటన్ మాత్రం తన తప్పును గుర్తించకపోవడం బాగాలేదని వాపోయారు. మేయర్ ఎన్నికలలో సిక్కుల మద్దతు కోరిన కామెరాన్.. బ్రిటన్ తప్పిదాన్ని ఒప్పుకుని ఇప్పుడైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జలియన్ వాలా బాగ్ దురాగతంలో దాదాపు వెయ్యి మందికి పైగా భారతీయులు మరణించారు. -
హోమో సెక్సువల్స్ కు క్షమాపణ చెప్పనున్న దేశం!
మెల్ బోర్న్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించి అందుకు శిక్షగా 15 ఏళ్ల కాలాన్ని విధించినందుకు గాను.. మంగళవారం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ అధికారి డానియెల్ ఆండ్రూస్ పార్లమెంట్ లోఅధికారికంగా క్షమాపణ చెప్పనున్నారు. ఇందుకోసం గతంలో జైలు శిక్షను అనుభవించిన కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించనున్నారు. ఇలా కొంతమంది స్వలింగసంపర్కులను పార్లమెంటులోనికి అనుమతించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వం 1981 నుంచి స్వలింగసంపర్కానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి గే, లెసిబియన్స్ లపై లింగ వివక్ష కారణంగా నమోదు చేసిన కేసులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం వివరాలను సేకరిస్తోంది. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక గ్రూప్ కు చెందిన వారికి క్షమాపణ తెలపడం ఇది మొదటిసారేం కాదు. 2008లో ఆస్ట్రేలియా అప్పటి ప్రధానమంత్రి కెవిన్ రుడ్ ఫెడరల్ గవర్నమెంట్ తరఫున ఐస్ లాండ్ లలో నివసించే ఆస్ట్రేలియన్లకు క్షమాపణ తెలిపారు. -
రోజా ‘సారీ’చెప్పాల్సిందే
నాని ‘సారీ’ని పట్టించుకోం.. - సభ నిర్ణయమే ఫైనల్.. స్పీకర్కే సర్వాధికారాలు - న్యాయస్థానాలు సైతం గౌరవించాల్సిందే: యనమల - రోజా జీతభత్యాలను ఆపే అధికారం సభకు ఉందన్న మంత్రి - ‘ప్రివిలేజ్’కు క్షమాపణ చెబితే రోజా సస్పెన్షన్పై పునఃపరిశీలన - జ్యోతుల, కోటంరెడ్డి, చెవిరెడ్డి వివరణలు పరిగణనలోకి - విపక్షం లేకుండానే శాసనసభ తీర్మానం సాక్షి, హైదరాబాద్: విపక్షం లేకుండా ఏకపక్షంగా సాగిన శాసనసభ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ను కొనసాగించాల్సిందేనని తీర్మానించింది. ఆమె తన వివరణ తెలిపేందుకు మరో అవకాశం ఇవ్వాలని, ప్రివిలేజ్ కమిటీకి రోజా క్షమాపణలు చెబితే సస్పెన్షన్ను పున:పరిశీలించాలని నిర్ణయించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇచ్చిన వివరణలను సభ పరిగణనలోకి తీసుకుంది. మరో ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వివరణతో సభ విభేదించింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంపై సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికను శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సభ ముందుంచారు. దీనిపై నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షంపై విమర్శల దాడి కొనసాగించారు. ఎంతకాలమైనా సస్పెండ్ చేయొచ్చు: యనమల సభ్యులను సస్పెండ్ చేసే విషయంలో స్పీకర్కు సర్వాధికారాలున్నాయని మంత్రి యనమల చెప్పారు. దీన్ని ప్రశ్నించే హక్కు ఏ వ్యక్తులకు, వ్యవస్థలకూ లేదన్నారు. సభ్యుడిని/సభ్యురాలిని ఎంతకాలమైనా సస్పెండ్ చేయవచ్చని, దీనికి చట్టంలో ఎలాంటి కాలపరిమితి లేదని పేర్కొన్నారు. తాము హౌస్ ఆఫ్ కామన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని, దాని ప్రకారం రోజాను సస్పెండ్ చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. ఆమె ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ ప్రజల సమస్యలు సభ దృష్టికి వచ్చే అవకాశం లేకపోవడం సరికాదన్న కొంతమంది సభ్యుల సూచనలను యనమల తోసిపుచ్చారు. అసలీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని చట్టాలు చెబుతున్నాయన్నారు. శాసనసభ నిర్ణయాలను న్యాయస్థానాలుసైతం గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అసెంబ్లీయే సుప్రీం కాబట్టి, స్పీకర్ అధికారాలను కోర్టులు ప్రశ్నించజాలవన్నారు. అనారోగ్య కారణాల వల్ల ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కాలేకపోతున్నట్టు రోజా తెలిపారని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ సభకు నివేదిక ఇస్తే పరిశీలించవచ్చని చెప్పారు. అప్పటివరకు ఆమెపై సస్పెన్షన్ను కొనసాగించాల్సిందేనని పేర్కొన్నారు. రోజా జీతభత్యాలను నిలిపివేసే అధికారమూ సభకు ఉందని చెప్పారు. జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి చెప్పిన క్షమాపణలను కమిటీ సూచనల మేరకు పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. కొడాలి నాని క్షమాపణతో మాత్రం విభేదిస్తున్నట్టు తెలిపారు. అయితే, ఆయనపై చర్యల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి చర్చ దురదృష్టకరం: స్పీకర్ కోడెల ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా యనమల చేసిన సవరణ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ... డిసెంబర్ 18న జరిగిన సంఘటనలు బాధాకరమైనవని, దీనిపై ఇలాంటి చర్చ జరగడం దృరదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం కూడా ఈ చర్చలో పాల్గొని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. శాసనసభ సార్వభౌమత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ఈ దిశగా సభ్యులందరూ కృషి చేయాలని కోరారు. సాధారణంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు మూడు మార్గాలున్నాయని, పశ్చాత్తాపపడటం, రాజీ చేసుకోవడం, యుద్ధం చేయడమేనని వివరించారు. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం నేరం కాదన్నారు. ఇదే సభలో ఎంతో మంది తమ తప్పును ఒప్పుకున్నారని గుర్తు చేశారు. కొంతమంది లిఖితపూర్వకంగానూ క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని తెలిపారు. విపక్షమే లక్ష్యంగా విమర్శలు శాసనసభలో విపక్షం లేకపోవడంతో అధికార పార్టీ సభ్యులు విమర్శలకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కోర్టు తీర్పును పట్టుకుని ఎమ్మెల్యే రోజా హైడ్రామా సృష్టించారని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. విపక్షాన్ని అదుపు చేయడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలమవుతోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. దీనికోసమైనా రోజాను కఠినంగా శిక్షించాలని, ప్రతిపక్ష సభ్యులను నిలువరించాలని సూచించారు. రోజా తీరు వల్ల దళితులకు మానసిక క్షోభ కలుగుతోందని యామిని బాల, ఆనందరావు పేర్కొన్నారు. చర్చ అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
ఆమెను క్షమాపణ అడిగా!
నటి రాయ్లక్ష్మిని క్షమాపణ అడిగానంటున్నారు వర్ధమాన నటుడు లింగేష్. ఎందుకు క్షమాపణ అడిగారు? ఆమెను ఏమి చేశారు? ఏమాకథ తెలియాలంటే ఆయనే పలకరిద్దాం. నా పేరు లింగేష్. నేను మెకానిక్ ఇంజినీరింగ్ పట్టబద్రుడిని. అయితే సినిమా నా కల. చదువుకునే రోజుల నుంచే నటన, డాన్స్ అంటే ఆసక్తి. ఇంటర్ చదువుకునే రోజుల్లోనే స్టేజ్ ప్రోగ్రామ్లో డాన్స్ చేసి బహుమతులు అందుకున్నాను.ఇంజినీరింగ్ పూర్తి అయిన తరువాత నటన, డాన్స్ మరీ ఫ్యాషన్గా మారిపోయింది. ఇక లాభం లేదని రాడాన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందాను. అదే విధంగా శోభి మాస్టర్తో పాటు మరికొంత మంది వద్ద డాన్స్ నేర్చుకున్నాను.ప్రముఖ నృత్యకళాకారుడు మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను. ఇంకా వెస్ట్రన్ డాన్స్తో పాటు, కుంగ్ఫూలో కూడా శిక్షణ పొందాను. నటుడికి ఇవన్నీ అవసరం అని తెలుసు. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించాను.ప్రఖ్యాత దర్శకులు కే.బాలచందర్, కే.విశ్వనాథ్ల సన్మాన వేదికపై స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రశంసలు పొందాను. ఇక నటుడిగా నిరూపించుకునే తరుణం వచ్చింది. ప్రముఖ నటి కుట్టిపద్మిని భక్తవిజయం అనే సీరియల్లో హీరోగా నటించే అవకాశం కల్పించారు. అందులో కృష్ణ చైతన్య మహాప్రభుగా నటించాను. నా కల ఇది కాదు అనుకుంటున్న సమయంలో షావుకార్పేట్టై చిత్రంలో నటించే అవకాశం వరించింది. శ్రీకాంత్,రాయ్లక్ష్మి హీరోహీరోయిన్లగా నటించిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించడం జీవితంలో మరచిపోలేని అనుభవం. ఇందులో సీనియర్ నటుడు సుమన్కు కొడుకుగా నటించాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక శ్రీకాంత్ నన్ను చిన్నవాడిగా భావించకుండా చాలా ఫ్రెండ్లీగా చూసుకున్నారు. నటి రాయ్లక్ష్మి పెద్ద మనసుకు థ్యాంక్స్ చెప్పాలి. ఆమెతో ఫైట్ చేసే సన్నివేశంలో తన చేతిని తాను మెలివేసి తిప్పాలి. ఆ సన్నివేశాన్ని నాలుగైదు సార్లు చేయాల్సివచ్చింది. అప్పుడు రాయ్లక్ష్మిని క్షమాపణ కోరాను. ఆమె అదేమీ పట్టించుకోకుండా నటించడం మన వృత్తి అని చాలా తేలిగ్గా తీసుకున్నారు. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆకాంక్ష. -
ఐఫోన్ యూజర్లకు యాపిల్ సారీ!
తమకు తెలిసిన మెకానిక్ తో హోమ్ బటన్ ను మార్పిడి చేసుకున్న ఐఫోన్ యూజర్లకు తాజాగా 'ఎర్రర్ 53' వస్తుండటంతో వారికి యాపిల్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఐఫోన్ల హోమ్ బటన్లో యాపిల్ 'టచ్ ఐడీ ఫింగర్ప్రింట్ రీడర్' ఉంటుంది. పాస్వర్డ్ అవసరం లేకుండానే ఫోన్ను అన్లాక్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే, హోమ్ బటన్లు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇటీవల ఐఫోన్, ఐప్యాడ్ లలో వాటిని స్థానిక మెకానిక్ల ద్వారా మార్చుకున్న వినియోగదారులకు.. ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేసుకునేటప్పడు.. 'ఎర్రర్ 53' అని వస్తుంది. దీంతో ఐఫోన్ షట్డౌన్ అయి.. ఎంతకూ రీస్టార్ట్ కావడం లేదు. వేలమంది వినియోగదారులు ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు. అయితే యాపిల్ కంపెనీ మాత్రం డివైస్ సెక్యూరిటీ కోసమే ఈ ఫీచర్ను ప్రవేశపెట్టామని చెప్పింది. ఈ ఫీచర్ విషయంలో ఎర్రర్ వస్తే యాపిల్ సపోర్ట్కు కాల్ చేసి.. సమస్య పరిష్కరించుకోవచ్చునని సలహా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించామని, అప్డేటెడ్ వెర్షన్ ఐవోఎస్లో ఈ సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని యాపిల్ తాజాగా ప్రకటించింది. ఈ సమస్య వల్ల ఇబ్బందిపడిన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. -
రేప్ అనంతరం సారీ అంటూ మెసేజ్..
డెర్బి: ఆన్లైన్ డేటింగ్ సైట్లో పరిచయమైన ఐదుగురు మహిళలను ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఆరో మహిళపై సైతం లైంగిక దాడికి ప్రయత్నించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్లోని డెర్బీ ప్రాంతానికి చెందిన జాసన్ లారెన్స్(50).. ప్రముఖ డేటింగ్ వెబ్ సైట్ మ్యాచ్ డాట్ కామ్లో వేరు వేరు ప్రొఫైల్స్తో అమాయక మహిళలకు వల వేశాడు. తనతో సంభాషణలు ప్రైవేట్ మెయిల్ లేదా ఫోన్ ద్వారా చేయాలని డేటింగ్ వెబ్సైట్ ద్వారా పరిచయం అయిన మహిళలను కోరేవాడు. అలా తనతో ప్రైవేటు సంభాషణలు జరిపిన వారిని కలుసుకొని వారిపై లైంగిక దాడి పాల్పడ్డాడు. వ్యక్తిగత సంభాషణల ద్వారా తన నిజస్వరూపాన్ని మ్యాచ్ డాట్ కామ్ సైటు దృష్టిలో పడకుండా జాసన్ జాగ్రత్త పడ్డాడని ప్రాసిక్యూటర్ షాన్ స్మిత్ తెలిపారు. మూడు మిలియన్ల సభ్యులతో మ్యాచ్ డాట్ కామ్కు బ్రిటన్లో అతి పెద్ద డేటింగ్ సైటుగా పేరుంది. ఈ సైట్ ద్వారా మొదటగా 2013 నవంబర్లో పరిచయమైన ఓ మహిళను జాసన్ తన ఇంట్లోనే రేప్ చేశాడు. ఇక మరో ఘటనలో తనను కలుసుకోవడానికి వచ్చిన మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇలా రేప్లు చేసిన అనంతరం తాపీగా క్షమించమని మెసేజ్లు పెట్టడం జాసన్కున్న మరో అలవాటు. డెర్బీ క్రౌన్ కోర్టులో జాసన్ అకృత్యాలపై విచారణ జరుగుతోంది. -
చోరీ... రెండో‘సారీ’
* ఒకే ఇంట్లో మళ్లీ దొంగతనం * క్షమించమని రాసి ఊడ్చుకెళ్లిన దొంగ హైదరాబాద్: ఒకసారి దొంగతనం చేసిన ఇంటికే మళ్లీ కన్నం వేశాడో దొంగ. అందుకు ‘సారీ’ అంటూ గోడపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి... ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని బీఎన్రెడ్డి కాలనీ ప్లాట్ నెం.36లో వ్యాపారి ప్రదీప్ రంగనాథన్ దంపతులు ఉంటున్నారు. గతనెల 31న వీరింట్లో దొంగ జొరబడి... బీరువాలో ఉన్న అమెరికన్ డాలర్లు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, ఐఫోన్లు దోచుకెళ్లాడు. గోడపై ‘సారీ’ అంటూ రాసి ఉడాయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే... బుధవారం రాత్రి దొంగ మళ్లీ అదే ఇంట్లోకి ప్రవేశించాడు. విలువైన ఆభరణాలతో పాటు రూ.6 వేల నగదు ఎత్తుకెళ్లాడు. సరిగ్గా మొదటిసారి రాసిన చోటే మరోసారి ‘సారీ’ అంటూ రాసి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన క్రైమ్ పోలీసులు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను సరిచూడగా రెండుసార్లు వచ్చిందీ ఒకే దొంగని తేలింది. -
బ్లెయిర్ 'పరివర్తన'
యుద్ధమంటే విమానాలు, ద్రోన్లు కురిపించే బాంబుల వర్షం... శతఘ్నుల మోతలు, క్షిపణి దాడులు...ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రమే కాదు. యుద్ధమంటే సమాజాన్ని నడిపించే సకల వ్యవస్థలపైనా దాడి చేయడం. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ వ్యవస్థలన్నిటినీ రూపురేఖల్లేకుండా ధ్వంసం చేయడం. ఒక్క మాటలో- జీవితాన్ని నిర్మించే, నిలబెట్టే వాటిన్నిటినీ నాశనం చేయడం. మనుషులందరినీ అమానవీకరించడం. ఇరాక్లో పన్నెండేళ్లక్రితం ఇంతటి ఘోరకలికి కారకులైనవారిలో ఒకరైన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ తొలిసారి ఆ దురాక్రమణ యుద్ధానికి క్షమాపణ చెప్పారు. ఇరాక్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయన్న తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల కారణంగా ఆ దేశంపై యుద్ధం ప్రకటించామని ఆయన ప్రకటించారు. అయితే అది బేషరతు క్షమాపణ కాదు. అమెరికాతో కలసి సాగించిన ఆ యుద్ధంవల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారని... తాము రాజేసిన మంట ఇప్పటికీ ఇరాక్ను దహించివేస్తూ నిత్యం అక్కడి పౌరులను బలిగొంటూనే ఉన్నదన్న చింత ఆయనకేమీ లేదు. తమ ప్రణాళికలో... ముఖ్యంగా సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని కూలదోశాక ఏం జరిగే అవకాశం ఉందో అంచనా వేయడంలో విఫలమైనందుకు ఆయన బాధపడుతున్నారు. సద్దాంను కూలదోయడం సరైందేనని ఇప్పటికీ బ్లెయిర్ విశ్వసిస్తున్నారు. తమ చర్య పర్యవసానంగా ఇరాక్లో తొలుత అల్-కాయిదా, ఆ తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదం వేళ్లూనుకున్నాయన్న వాదనతో ఆయన పూర్తిగా ఏకీభవించడంలేదు. నాలుగేళ్లక్రితం అరబ్ ప్రపంచాన్ని ఊపేసిన ప్రజాస్వామిక ప్రభంజనం కూడా అందుకు దోహదపడిందని వాదిస్తున్నారు. ఐఎస్ పుట్టింది సిరియాలో తప్ప ఇరాక్లో కాదని తర్కిస్తున్నారు. జార్జి బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంతో కలిసి బ్రిటన్, ఇతర పశ్చిమ దేశాలూ సాగించిన దురాక్రమణ యుద్ధం మానవేతిహాసంలోనే భయానకమైనది. 2003లో ప్రారంభమైన ఆ యుద్ధం పర్యవసానంగా పది లక్షలమందికిపైగా దుర్మరణం చెందారు. మరిన్ని లక్షలమంది వికలాంగులుగా, అనాథలుగా మిగిలారు. మెరుగైన జీవనప్రమాణాలతో ప్రశాంతంగా ఉండే ఇరాక్ ఆ యుద్ధం తర్వాత నిత్య సంక్షుభిత దేశంగా మారిపోయింది. అక్కడ ప్రభుత్వాలు ఏర్పడినా అవి నామమాత్రంగా మిగిలాయి. రెండు ప్రధాన తెగలైన షియా, సున్నీల మధ్య భీకర సంగ్రామం...అందులో భాగంగా చోటుచేసుకునే ఆత్మాహుతి దాడులు ప్రతిరోజూ జనం ఉసురు తీస్తున్నాయి. ఈ తెగల పోరులో పుట్టుకొచ్చిన ఐఎస్ దేశంలో గణనీయమైన ప్రాంతాన్ని తన గుప్పిట బంధించింది. ఇరుగుపొరుగు దేశాలకు సైతం పాకుతూ అందరినీ భయభ్రాంతుల్ని చేస్తోంది. బుష్, బ్లెయిర్ ద్వయం చేసిన నేరాలెలాంటివో, వాటి పర్యవసానాలేమిటో ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలుసు. 2003లో దురాక్రమణ యుద్ధానికి పూనుకున్నప్పుడే అనేకులు దాన్ని నిరసించారు. అందుకు చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ నిజం కాదని ఎలుగెత్తారు. కేవలం ఇరాక్ చమురు బావులపై కన్నేసి, ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఆ దేశంపై దండెత్తుతున్నారని చెప్పారు. అయినా ఆ మారణహోమాన్ని బుష్, బ్లెయిర్లు ఆపలేదు. యుద్ధం చేయకపోతే ఎప్పుడైనా కేవలం 45 నిమిషాల వ్యవధిలో సద్దాం హుస్సేన్ బ్రిటన్పై జన హనన ఆయుధాలను ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ఊదరగొట్టారు. సామూహిక జన హనన ఆయుధాల విషయంలో బ్రిటన్కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్(ఎంఐ)6 నివేదికలు తమను పక్కదోవ పట్టించాయని ఇప్పుడు బ్లెయిర్ చెబుతున్నది వాస్తవం కాదు. ఆ నివేదికలు రావడానికి ఏడాది ముందే బ్లెయిర్ ఈ యుద్ధానికి సిద్ధమయ్యారని ఈమధ్యే అమెరికాలో వెల్లడైన నోట్ చెబుతోంది. 2002లో ఆనాటి అమెరికా విదేశాంగమంత్రి కోలిన్ పావెల్ బుష్కు పంపిన నోట్ అది. ఈ దురాక్రమణ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనదని, దేశ చట్టాల ప్రకారం కూడా చెల్లుబాటు కాదని బ్రిటన్ న్యాయ విభాగం అధికారులు ఆరోజున మొత్తుకున్నారు. ఆ దేశ పార్లమెంటు సంగతలా ఉంచి, తన కేబినెట్కి సైతం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా బ్లెయిర్ దురాక్రమణకు సై అన్నారు. దురాక్రమణకు దిగితే యుద్ధ నేరాల కింద బోనెక్కే పరిస్థితి ఏర్పడవచ్చునని హెచ్చరిస్తూ ఆ దేశ అటార్నీ జనరల్ లార్డ్ గోల్డ్ స్మిత్ సమర్పించిన నోట్ను బ్లెయిర్ కేబినెట్ కంటపడనీయలేదు. ఇంతకూ ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా ఆ యుద్ధం పొరబాటేనని పాక్షికంగానైనా బ్లెయిర్ ఎందుకు ఒప్పుకున్నట్టు? అదీ తమ దేశ మీడియాకు కాక అమెరికాకు చెందిన సీఎన్ఎన్ చానల్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడంలోని ఆంతర్యమేమిటి? ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ పాత్రపై ఏర్పాటైన జాన్ చిల్కాట్ నేతృత్వంలోని కమిషన్ నివేదిక కోసం బ్రిటన్లో అన్ని వర్గాలూ... మరీ ముఖ్యంగా యుద్ధ వ్యతిరేక ఉద్యమకారులు ఎదురుచూస్తున్నారు. నివేదిక సమర్పణలో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఏడాది మొదట్లో వెల్లడికానున్న ఆ నివేదికలో బ్లెయిర్ వ్యవహార శైలిపై...ముఖ్యంగా పలు వాస్తవాలను ఆయన తొక్కిపెట్టడంపై నిశితమైన విమర్శలుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ నేరస్తుడిగా ఆ నివేదిక నిర్ధారించిన పక్షంలో నలువైపులనుంచీ తనపై దాడి తప్పదని గ్రహించబట్టే పాక్షిక క్షమాపణకైనా బ్లెయిర్ సిద్ధపడ్డారు. ఆ సంగతిని కూడా తమ మీడియాకు చెబితే ప్రస్తుత పరిస్థితుల్లో కాకుల్లా పొడుస్తారన్న భయంతో అమెరికా చానెల్ సీఎన్ఎన్ను ఆశ్రయించారు. యుద్ధమూ, దాని పర్యవసానాలూ క్షమాపణలతో ముగిసిపోయేవి కాదు. అలాంటి నేరానికి పాల్పడేవారు విచారణను ఎదుర్కొనవలసిందే. శిక్షకు సిద్ధపడాల్సిందే. బ్లెయిర్ అయినా, మరొకరైనా అందుకు మినహాయింపు కాదు. -
సారీ... బరువెక్కువైతే ఆస్పత్రిలో చేర్చుకోం!
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అంటూ ఎందుకు పాడుకుంటారో ఢిల్లీ వాసులకు ఇప్పుడు తెలుస్తోంది. ఢిల్లీలోని సర్కారు దవాఖానాల్లో ప్రసిద్ధ లోక్నాయక్ జయప్రకాష్, జీబీ పంత్ ఆస్పత్రులు తీసుకున్న ఓ నిర్ణయం రోగులనే కాదు.. దేశ ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో డాక్టర్లు... ఊబకాయులకు సారీ చెప్పేస్తున్నారు. 80 కేజీల కంటే ఎక్కువ బరువున్న పేషెంట్లకు సర్జరీలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ బరువుకు... ఆస్పత్రిలో చేర్చుకోపోవడానికి లింకేంటో అనుకుంటున్నారా? ఆయా ఆస్పత్రుల్లోని ఆపరేషన్ టేబుల్స్ మరీ పాతవైపోవడమే అందుకు కారణమట.. ఇటీవల ఆస్పత్రిలో ఓ రోగికి ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి టేబుల్ ఊగిందట. వైద్యులు అప్రమత్తమయ్యేలోపే టేబుల్ విరిగిపోయి... మత్తులో ఉన్న రోగి నేలపై పడిపోయాడట. ఎలాగో శస్త్రచికిత్స పూర్తయి రోగి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఎపిసోడ్తో మౌలానా అజాద్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ జిబి పంత్ ఆస్పత్రి వైద్యులు షాకయ్యారు. ఇక ఊబకాయులకు చికిత్స చేయడం ప్రమాదమేనని నిర్ణయించుకొన్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల్లోని సర్జరీ డిపార్ట్ మెంట్లు అన్నీ కలసి ఓ ఉత్తర్వును జారీ చేశాయి. 80 కేజీలకు పైబడి బరువున్న వారిని ఆస్పత్రిలో చేర్చుకొనేందుకు తిరస్కరించాలని నిర్ణయించారు. 2012 లో ఎల్ఎన్జెపి ఆస్పత్రి బేరియాట్రిక్ శస్త్రచికిత్స విభాగాన్ని ప్రారరంభించింది. అప్పటినుంచి వైవిధ్య సేవలు అందించడంలో దేశంలోనే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ విభాగం.. లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సను అందించడంలో ఎంతో పేరు గడించింది. ఒక్క రోజులోనే 100కు పైగా ఆపరేషన్లు ఇక్కడ నిర్వహిస్తుంటారు. అయితే ఆపరేషన్ టేబుల్స్ కొనుగోలుకు ఆమోదం లేకపోవడం, నిర్వహణా లోపం కూడా ప్రస్తుత దుస్థితికి కారణమైంది. ఇప్పుడు రోగి భద్రతే ధ్యేయంగా మేం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం అంటున్నారు సర్జరీ విభాగం హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ సంజీవ్ కుమార్ తుడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉంటాయని, ప్రభుత్వాసుపత్రుల్లో కూడా అలాంటివి అప్ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ తుడు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని దాదాపు 13 శాతం మంది ప్రజలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. -
క్షమాపణ చెప్పిన క్లింటన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ క్షమాపణ చెప్పారు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు న్యూయార్క్ లోని తన నివాసంలో ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వినియోగించినందుకు ఆమె క్షమాపణ కోరారు. 'తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. దీనికి క్షమాపణ చెబుతున్నా. దీనికి పూర్తి బాధ్యత నాదే' అని ఏబీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వివాదస్పద ఈమెయిల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడంపై క్షమాపణ చెప్పేందుకు అంతకుముందు ఇచ్చిన రెండు ఇంటర్వ్యూల్లోనూ ఆమె నిరాకరించారు. ప్రభుత్వం అనుమతి మేరకే ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ పెట్టుకున్నట్టు తెలిపారు. మార్చిలో ఈ విషయం వెలుగు చూడడంతో అన్నివర్గాల నుంచి ఆమెపై ఒత్తిడి పెరిగింది. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చినా చివరకు క్షమాపణ చెప్పారు. ఈ సర్వర్ ద్వారా ఏదైనా కీలక సమాచారం దుర్వినియోగం అయిందా అనే దానిపై ఎఫ్ బీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే క్లాసిఫైడ్ సమాచారం కోసం తన ప్రైవేట్ సర్వర్ వాడలేదని అంతకుముందు హిల్లరీ క్లింటన్ తెలిపారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొమొక్రటిక్ పార్టీ తరపు అభ్యర్థిగా నిలిచేందుకు హిల్లరీ ముందజలో ఉన్నారు. -
ట్రాఫిక్ అంతరాయానికి సీఎం క్షమాపణలు
బెంగళూరు: ట్రాఫిక్ అంతరాయం కలిగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. తన వల్ల బెంగళూరు వాసులకు ట్రాఫిక్ చిక్కులు ఏర్పడినందుకు చింతిస్తున్నానని అన్నారు. త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో బెంగళూరు వాసులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై విమర్శలు రావడంతో సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పారు. ఇదిలావుండగా బీబీఎంపీ ఎన్నికల ప్రచారంలో సొంత రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన సినీ తారలను ఉపయోగించుకునేందుకు కేపీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించడంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని రమ్యా, భావనతో పాటు చిరంజీవి, ఖుష్భును ఆహ్వానించినట్లు కేపీసీసీ చీఫ్ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. -
తప్పు జరిగింది.. క్షమించండి!
ఉప రాష్ట్రపతిపై రామ్మాధవ్ వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్పథ్ వద్ద జరిగిన వేడుకల్లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొనకపోవడాన్ని బీజేపీ నేత రామ్ మాధవ్ తప్పుబట్టిన అంశం.. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టింది. దాంతో ఈ వివాదంపై కేంద్రం క్షమాపణలు కోరగా.. బీజేపీ అనుసరిస్తున్న విభజన రాజకీయాలకు రామ్మాధవ్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కాంగ్రెస్ మండిపడింది. అన్సారీపై రామ్ మాధవ్ చేసిన ట్వీట్లపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్న వ్యాఖ్యల నేపథ్యంలో.. ‘ప్రధాని ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా రాష్ట్రపతిని కానీ, ఉప రాష్ట్రపతిని కానీ ఆహ్వానించడం ప్రొటోకాల్కు విరుద్ధం. ప్రొటోకాల్ ప్రకారం వారిద్దరు ప్రధాని కన్నా పై స్థాయిలో ఉంటారు. అందుకే రాజ్పథ్ వద్ద యోగా డే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అన్సారీకి ఆహ్వానం పంపలేదు’ అని సోమవారం కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ వివరణ ఇచ్చారు. అన్సారీని విమర్శించడం తప్పేనని ఒప్పుకుంటూ.. దానికి క్షమాపణలు చెబుతున్నామన్నారు. పొరపాటును రామ్మాధవ్ కూడా అంగీకరించారని, క్షమాపణలు చెప్పారని తెలిపారు. నాయక్ వివరణతో ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ‘నా ట్వీట్ను ఉపసంహరించుకున్నాను. అక్కడితో అది ముగిసిపోయింది. లక్షలాది ప్రజలు పాల్గొన్న యోగా దినోత్సవాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి కానీ, ఈ వివాదాన్ని కాదు. దీనిపై మరింత చర్చ అనవసరం’ అని సోమవారం జమ్మూలో రామ్మాధవ్ స్పష్టం చేశారు. రామ్మాధవ్ వ్యాఖ్యలు బీజేపీ మతతత్వ ధోరణిని తేటతెల్లం చేస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ విమర్శించారు. అన్యాపదేశంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ.. యోగా ప్రక్రియ అత్యంత పురాతనమైనదని, జనసంఘ్, ఆరెస్సెస్, బీజేపీలకు చెందిన సీనియర్ నేతలు చాలామంది యోగాకు విశేష ప్రాచుర్యం కల్పించారని బీజేపీ నేత అద్వానీ అన్నారు. -
'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'
-
'తెలంగాణ ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి'
నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది దివాళకోరు రాజకీయమని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నిజామాబాద్ లో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మన కళ్లను మనవాళ్లతోనే చంద్రబాబు పొడిపిస్తారని ఆమె అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని ఆమె పేర్కొన్నారు. ఇది వాస్తవమయితే.. తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు. -
సోనియాపై వ్యాఖ్యలకు గిరిరాజ్ క్షమాపణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియాపై అవమానకర వ్యాఖ్య లు చేసిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం లోక్సభలో క్షమాపణలు చెప్పారు. ‘నేను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదు. అయినా నా వ్యాఖ్యలకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు పశ్చాత్తాపం ప్రకటిస్తున్నా’ అని పేర్కొన్నారు. అంతకుముందు సోనియా చర్మం రంగుపై గిరిరాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సభ దద్దరిల్లింది. కేంద్రమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింపజేశారు. ఆయన మాటలు స్త్రీజాతికే అవమానమని, తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని నినాదాలు చేశారు. కేంద్రమంత్రి అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కూడా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా డిమాండ్ చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్.. దీనిపై స్పందించాల్సిందిగా మంత్రికి సూచించారు. మంత్రి వ్యాఖ్యలు తననూ బాధించాయని, అలా మాట్లాడాల్సింది కాదని పేర్కొన్నారు. దీంతో మంత్రి పశ్చాత్తాపం ప్రకటించారు. రాజీవ్గాంధీ సోనియాను కాకుండా నైజీరియా మహిళను పెళ్లాడినట్లయితే, సోనియా చర్మం తెల్లగా కాకుండా నల్ల రంగులో ఉన్నట్లయితే కాంగ్రెస్ ఆమె నాయకతాన్ని ఆమోదించేదా అంటూ గిరిరాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. -
'సారీ' ఇంతకంటే బాగా ఎవరూ చెప్పరేమో!!
-
ఫ్యాన్స్కు సారి చెప్పిన అఖిల్
-
‘క్షమా’ రాజకీయం!
అధికార పగ్గాలు మీ చేతికే వస్తాయని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నవేళ... పర్యవసానంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతున్నవేళ క్షమాపణ చెప్పడంలాంటి అంశాలు చర్చలోకి చొరబడటం కమలనాథులకు కాస్తంత బాధగానే ఉంటుంది. కానీ 2002లో జరిగిన గుజరాత్ ఊచకోత ఘటనలపై ఈమధ్యకాలంలో రెండుసార్లు సమాధానం చెప్పుకోవాల్సిరావడం, క్షమాపణ ప్రస్తావన రావడం ఆ పార్టీకి తప్పలేదు. తాజాగా ఎలాంటి తప్పు జరిగినా క్షమాపణ కోరడానికి తాము సిద్ధమని పార్టీ మైనారిటీ మోర్చా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్ ప్రకటించారు. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మొన్నటి డిసెంబర్లో తొలిసారి గుజరాత్ మారణహోమంపై ఒక బ్లాగ్లో తన మనోవేదనను వ్యక్తపరిచారు. ఆనాటి ఘటనలపై తన భావాలు వ్యక్తంచేయడానికి భాషలోని ఏ పదాలూ సరిపోవని అన్నారు. దాదాపు పుష్కరకాలంనాటి ఆ దారుణంపై ఆయన నోరు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పడం అదే ప్రథమం. అంతవరకూ ఆయన ఆ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీని కొందరు దుండగులు సజీవదహనం చేసిన ఘటనలో నరేంద్ర మోడీ ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అందజేసిన నివేదికను మేజిస్ట్రేట్ కోర్టు అంగీకరించిన తర్వాత మోడీ ఆ బ్లాగ్లో గుజరాత్ మారణకాండపై తొలిసారి తన అభిప్రాయం చెప్పారు. అలాగని ఆయన నేరుగా క్షమాపణ కోరలేదు. పశ్చాత్తాపమూ వ్యక్తంచేయలేదు. ఆ ఘటనలతో సంబంధం ఉన్నదా, లేదా అనే సంగతి పక్కనబెట్టి అప్పుడు తానే సీఎం కనుక తనకు నైతిక బాధ్యత ఉంటుందని ఆయన అనుకోలేదు. ఆనాటి ప్రధాని, బీజేపీ అగ్రనేత వాజపేయి అప్పట్లో ‘రాజధర్మం’పాటించాలని బహిరంగంగానే మోడీకి సలహా ఇచ్చిన వైనం ఎవరూ మరిచిపోరు. రాజ్నాథ్సింగ్ మైనారిటీ మోర్చా సదస్సులో ముస్లింలతో మనసువిప్పి మాట్లాడారు. ‘ఎన్నడైనా, ఎప్పుడైనా ఏమైనా తప్పంటూ జరిగితే, మావైపునుంచి ఏమైనా లోటుపాట్లుంటే మీ ముందు తలవంచి క్షమాపణ కోరతామని హామీ ఇస్తున్నాను’ అని చెప్పారు. అంతేతప్ప గుజరాత్ ప్రస్తావన తీసుకురాలేదు. ‘మీ ఆశలకు అనుగుణంగా మేం పాలించలేకపోతే అటు తర్వాత మావైపు ఎప్పుడూ చూడనవసరంలేద’ని భరోసా ఇచ్చారు. ఈ మాటల సంగతలా ఉంచి తన క్షమాపణ దేనికోసమో ఆయన వివరించడానికి ప్రయత్నించలేదు. క్షమాపణ చెప్పేవారు సాధారణంగా అందుకు కారణమైన పరిస్థితులను వివరిస్తారు. ఎక్కడ తప్పు జరిగిందో చెబుతారు. అందుకు బాధ్యతవహిస్తారు. అటుతర్వాతే క్షమాపణ ప్రసక్తి వస్తుంది. ఇవేమీ లేకుండా చెప్పే క్షమాపణకు పెద్ద విలువేమీ ఉండదు. అసలు తన క్షమాపణకు ఇంత అస్పష్టతను ఎందుకు జోడించవలసివచ్చిందో రాజ్నాథ్ మాత్రమే చెప్పగలరు. కానీ, అదంతా అన్యుల ఊహాగానాలకే ఆయన వదిలేశారు. ఫలితంగా దానికి రకరకాల భాష్యాలు వెలువడుతున్నాయి. బీజేపీ దీనికి కొత్త అర్ధం లాగుతున్నది. ఆయన చెప్పిన క్షమాపణలు గత కాలానికి సంబంధించినవి కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా తప్పులు జరిగే పరిస్థితులు ఏర్పడితే క్షమాపణ చెబుతామన్నదే ఆయన మాటల్లోని ఆంతర్యమని వారు చెబుతున్నారు. ఆ ప్రసంగంలోనే గుజరాత్ మారణహోమం సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. తమ ఏలుబడిలో భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, ప్రపంచపటంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపుతామని నరేంద్ర మోడీ హామీ ఇస్తుంటే... భవిష్యత్తులో ‘ఏదైనా జరిగితే’ క్షమాపణ చెబుతామన్నదే రాజ్నాథ్ ఆంతర్యంగా అర్ధం చేసుకోమని చెప్పడం హాస్యాస్పదమవుతుంది. లోక్సభలో కనీస మెజారిటీ 272 స్థానాలకన్నా ఎక్కువ సాధించాలంటే అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ భావిస్తోంది. ఈ కృషిలో తమకున్న అవరోధాలేమిటో ఆ పార్టీ సరిగానే గుర్తించింది. గుజరాత్ ఘటనల అనంతరం ముస్లింలు తమకు దూరమయ్యారని, వారిని తిరిగి గెలుచుకోగలిగితే తమ జైత్రయాత్రకు తిరుగుండదని అనుకుంటున్నది. అందువల్లే ఆ విశ్వాసరాహిత్యాన్ని తగ్గించే క్రమంలో రాజ్నాథ్సింగ్ నోటివెంట ‘క్షమాపణ’ ప్రస్తావన వచ్చిందన్నది నిజం. ఆ పనిచేశాక కూడా బీజేపీ నేతలు దాన్ని దాచడానికి ప్రయత్నించడమే వింతగొలుపుతుంది. తమవైపుగా ఇంతవరకూ ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే తలెత్తదని బీజేపీ నేత షా నవాజ్ హుస్సేన్ అంటున్నారు. తాము అధికారంలోకొస్తే అంతా బాగుంటుందని, అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపే నాయకులు...ఒకవేళ తప్పులంటూ జరిగితే క్షమాపణ కూడా చెబుతామని ముందే హామీ ఇస్తున్నారంటే మన ప్రజాస్వామ్యం చాలా పరిణతి సాధించినట్టే లెక్క. వ్యక్తులైనా, సంస్థలైనా, దేశాలైనా జరిగిన ఘటనలపై పశ్చాత్తాపపడినప్పుడో, మనోవేదనకు గురైనప్పుడో క్షమాపణల ప్రసక్తి వస్తుంది. కానీ రెండునెలలనాడు నరేంద్రమోడీ అయినా, ఇప్పుడు రాజ్నాథ్సింగ్ అయినా... ఇలా అస్పష్టంగా మాట్లాడటంవల్ల ఆయా వర్గాలు సన్నిహితంకావడం మాట అటుంచి వారిలో మరిన్ని సంశయాలు పుట్టుకొస్తాయి. కనుక ఇలాంటి అంశాల్లో సూటిగా, స్పష్టంగా మాట్లాడటమే ఉత్తమమని బీజేపీ నాయకులు గ్రహించాలి. -
సో సారి...