అప్పుల బాధ భరించలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అస్వాపురం మండలం తుమ్మలచెరువు పంచాయతి పరిధిలోని భీమవరం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జంపయ్య(28) ఇదే గ్రామానికి చెందిన మరో రైతు నుంచి ఐదెకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.