నడిగూడెం : నాటుసారా తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు.. సిరిపురం గ్రామానికి చెందిన జంపాల బిక్షం(45) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, శుక్రవారం ఉదయం నుంచి నాటు సారా తాగుతుండటంతో దాహం వేసింది.
ఈ క్రమంలో అతనికి అందుబాటులో నీళ్లు లేకపోవడంతో మృతి చెందాడు. దీంతో గ్రామంలోని కొందరు వ్యక్తులు నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
దాహంతో వ్యక్తి మృతి
Published Fri, Feb 20 2015 11:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM
Advertisement
Advertisement