రంగారెడ్డి (చేవెళ్ల రూరల్) : చేవెళ్ల మండలం కేసారం వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి కాంక్రీట్ ట్యాంకర్ను ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తూ దాని కింద పడి చనిపోయాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి శరీరం గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలంలో భయానక వాతావరణం నెలకొంది. కాగా వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.