నేడు ‘మిషన్ కాకతీయ’పై సమీక్ష | Mission Kakatiya take as a movement | Sakshi
Sakshi News home page

నేడు ‘మిషన్ కాకతీయ’పై సమీక్ష

Published Fri, Dec 19 2014 11:53 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై...

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై శనివారం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి టి.హరీష్‌రావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జెడ్పీలో జరిగే ఈ సమావేశంలో జెడ్పీ పాలకవర్గం పాల్గొననుంది. తొలివిడత 545 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం జరిగే సమావేశంలో ప్రణాళికపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటారు.

ఈ క్రమంలో సమావేశంలో చర్చించే అంశాలపై శుక్రవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీసిన అనంతరం ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చెరువుల సర్వే త్వరితంగా పూర్తిచేసి అంచనాలకు వెంటనే మంజూరు తీసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు భీంప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement