sridhar
-
ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రీరికార్డింగ్!
సాక్షి, అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పలువురు న్యాయవాదులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమతించలేదు.సీఆర్పీసీ 164 కింద శ్రీధర్ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు. -
పోర్టులో స్టెల్లా నౌక డెమరేజ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు. అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.సాగని అన్లోడ్ ప్రక్రియస్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
KSR Live Show: షాడో సీఎం.. చక్రం తిప్పుతున్న లోకేష్
-
ఫుట్బాల్కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్తో పాటు రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ
గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఏడాదిలో భూగర్భగనుల్లో 190 మస్టర్లు, ఉపరితలంలో 240 మస్టర్లు పనిచేసిన బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఎన్.బలరాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తొలిసారి 2017 అక్టోబర్లో ఒకేసారి 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు. 2022 డిసెంబర్ 31వ తేదీకి ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరినవారిలో కనీసం 190/240 మస్టర్ల అర్హత కలిగిన వారిని ఇప్పుడు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసినట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేసినట్లు వివరించారు. ఏరియాల వారీగా ఇలా.. జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరణ అయినవారిలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరాంపూర్లో 677 మంది, ఆర్జీ–1లో 522, ఆర్జీ–2లో 51, ఆర్జీ–3, అడ్రియాలలో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, బెల్లంపల్లిలో 32, ఇల్లెందు, కార్పొరేట్లో 38, కొత్త్తగూడెంలో 9 మందిని రెగ్యులరైజ్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పనిచేసే వారికి గుర్తింపు సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. గతంలో జనరల్ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్లు అందుకోవాలి. – ఎన్ బలరామ్, డైరెక్టర్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్లో ఆరుగురు, ట్రాన్స్కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఏపీలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం. పీపీపీ కింద ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్ పేరుతో ఐకానిక్ టవర్ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి. దుబాయ్ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ : స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా వైజాగ్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్లకు చేయూతనందిస్తాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆర్ అండ్ డీ సెంటర్స్ని ప్రోత్సహిస్తాం. పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు. లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్ షిప్పింగ్ ఎండీ సాంబశివరావు 2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణప్రసాద్ నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్జీఎస్టీ 100 శాతం రీయింబర్స్మెంట్ మంచి సంకేతం. పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్ ఏపీ వన్ యాప్ను తేవడం హర్షణీయం. పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్ల కోసం ఐ–స్పేస్ పేరుతో టవర్ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి. నూతన విధానంలో ప్రధానాంశాలు.. ♦ ప్లగ్ అండ్ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ ♦ వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ♦ వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ♦ పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ♦ తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ♦ ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ♦ ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం ♦ లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్ ♦ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ♦ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ♦ అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్ ♦ దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ♦ పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ ♦ తొలిసారిగా ఆపరేషనల్ గైడ్లైన్స్లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి -
పోలవరం ముంపు జాబితాలోకి మరో 36 గ్రామాలు
వేలేరుపాడు (ఏలూరు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్ ముంపు కాంటూర్ లెవల్స్తో సంబంధం లేకుండా గత ఏడాది వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో 36 గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 20,946 మంది నిర్వాసితులు ఉండగా.. కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు సంబంధించిన మరో 13,937 మంది నిర్వాసితులను చేర్చనున్నారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 34,883కు పెరుగుతోంది. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్తగా చేరిన గ్రామాలివీ కొత్త జాబితాలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, తూర్పుమెట్ట, టేకూరు, కాకినూరు, కాచారం, ఎర్రమెట్ట, ఎడవల్లి, టేకుపల్లి గ్రామాల్లో 901 మంది నిర్వాసితులను జాబితాలో చేరనున్నాయి. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, చీరవల్లి మాధవరం, బెస్తగూడెం, ఆంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, రావిగూడెం, ఎల్లప్పగూడెం, ఎర్రబోరు, గుడంబోరు, ముత్యాలంపాడు గ్రామాల్లో 2,123 మంది కొత్త నిర్వాసితులు చేరతారు. చింతూరు మండలంలోని చింతూరు, రామవరంపాడు, ప్రతిపాక, గుండుగూడెం, వడ్డిగూడెం, వీఆర్పురం మండలంలోని వీఆర్పురం, ధర్మతాళ్లగూడెం, రాజ్పేటకాలనీ, ఎ.వెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కూనవరం మండలంలోని టేకుబాక, కూనవరం, టేకులబోరు, కొడ్రాజుపేట, పెద్దార్కూరు, పండురాజుపల్లి, శబరికొత్తగూడెం తదితర గ్రామాలను కొత్త జాబితాలో చేరుస్తున్నారు. కాంటూర్ లెవల్స్తో సంబంధం లేదు కొత్త జాబితాలో చేర్చే గ్రామాలకు, పోలవరం ప్రాజెక్ట్ కాంటూర్ లెవల్స్కు సంబంధం లేదు. ఏటా వచ్చే వరదలకు వల్ల నిర్వాసితులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెండు జిల్లాల్లో 36 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రారంభించాం. మొదటి ప్రాధాన్యతగా ఆర్ అండ్ ఆర్ పరిహారం అందిస్తాం. – చెరుకూరి శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ -
రాజస్తాన్లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్లోని కాల్ సెంటర్ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
ఈడీ విచారణకు హాజరైన PSR గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్
-
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
కథ: ‘నేను’... సుందర్ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది నాకు. టైమ్ చూద్దును కదా అర్ధరాత్రి ఒకటిన్నర. ఇది కాస్త అసహజమైన విషయమే. ఒకసారి పడుకున్నానూ అంటే మళ్లీ తెల్లారేవరకూ వొకపట్టాన లేచే రకం కాదు నేను. నా నిద్రని డిస్టర్బ్ చేయగలిగే శబ్దాలు కూడా ఏమీ బయట్నించీ లోపలికి రాలేదని బల్లగుద్ది చెప్పగలను. ఇలా మధ్యరాత్రిలో నిద్ర లేవడమన్నది ఊహ తెలిశాక ఎప్పుడూ జరగలేదు. ఒంటరిగా పడుకోవడం అలవాటు లేక మెలకువొచ్చిందని అనుకోడానికి కూడా లేదు. నాకంటూ అసలెవరున్నారని. ఆ ఫ్లాట్లో వుండేది నేనొక్కణ్నేగా. మరి నన్ను నిద్ర లేపింది ఏమైవుండొచ్చు? ఉన్నట్టుండి సడెన్గా వెలిగింది నాకు, ఆ గదిలో నేను వొంటరిగా లేను. ఇంకెవరో కూడా వున్నారు. నా పడకగదిలో కనీసం బెడ్లైట్ కూడా వేసి లేదు. కిటికీల్లోంచీ బయటి వెలుతురేమీ లోపలికి రావట్లేదు. ఎంత చీకటిగా వుందంటే, అసలు కళ్లు తెరవడానికీ మూయడానికీ తేడా ఏం తెలీడం లేదు. అయినా సరే అర్థమైపోయింది నాకు, ఆ రూములో ఎవరో వున్నారని. నేను భయపళ్లేదు. నాకు ఎలాంటి హానీ తలపెట్టే వుద్దేశం ఆ వ్యక్తికి లేదని నాకు తెలిసిపోతోంది. ఎలా తెలుస్తోందీ అని అడగొద్దు. చిమ్మచీకటిలో కూడా యింకొక మనిషి అక్కడున్నట్టు నాకెలా తెలిసిందో, యిదీ అలాగే. ఆఫీసుల్లో పెట్టినట్టు నా బెడ్రూమ్ బయట కూడా ఒక లాగ్ రిజిస్టర్ పెట్టాలి. ఇంట్లో నేనొక్కణ్నే వుండి, నిద్రలో మునిగిపోయి వున్నప్పుడు నా గదిలోకి రావాలనుకున్నవాళ్లు ‘పర్పస్ ఆఫ్ విజిట్’ ఏంటో అందులో రాసిన తర్వాత మాత్రమే లోపలికి రావాలి. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఆ వొచ్చిన మనిషికి నాకేదో చెప్పాలన్న వుద్దేశం లేదు. నన్నేదైనా అడిగే ఆలోచనా లేదు. కాస్త యెడంగా నిలబడి నేనేం చేస్తున్నానో పరిశీలించడమే అతను (ఆమె?) చేయదల్చుకున్న పని అని అనిపించింది నాకు. అసలైనా అంత చీకట్లో, అందునా నిద్రపోతున్న నన్ను గమనించడం ద్వారా నా గురించి ఏం తెలిసే అవకాశం వుంది? ఆ వచ్చిన మనిషి చనిపోయిన మా నాన్న గానీ, అమ్మ గానీ అయ్యుండే చాన్సుందా? వాళ్లు వదిలెళ్లిన పాత పెంకుటిల్లు బాగోగులు నేను చూస్కోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడానికి వచ్చారా? అయ్యుండకపోవచ్చు. మరి? నాలుగేళ్ల క్రితం చనిపోయిన నా బెస్టు ఫ్రెండు ఆత్మ అయ్యుండొచ్చా? ‘నాగ్గానీ ఏమైనా అయితే, మా ఫ్యామిలీ మేటర్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాల్రా’ అని చేతిలో చెయ్యేయించుకొని, మాట తీసుకొని మరీ కన్ను మూశాడు. నేను వాళ్లింటి ఛాయలకి పోయి ఎన్నాళ్లయ్యింది? తనకి నేనిచ్చిన ప్రామిస్ని గుర్తు చేయాలనుకుంటున్నాడా? ఆత్మలకి అన్నీ తెలిసిపోయే ప్రొవిజన్ వుంటే వాడికి (వాడి ఆత్మకి) నా మీద భ్రమలు తొలగిపోయి వుండాలి. మొత్తమ్మీద యీ కొత్తమనిషి ప్రెజెన్సు, దాని వెనక వుండగల కారణాలు యివన్నీ ఆలోచిస్తుంటే నాకు మిగతా విషయాలేవీ గుర్తుకు రావట్లేదు. లెక్క ప్రకారం, యిలా అనుకోకుండా మెలకువ వచ్చిన ఎవరైనా ఏం చేయాలీ? ఆ ముందురోజు జరిగిన లేదా తర్వాతిరోజు జరగాల్సిన ముఖ్యమైన పనేదో చప్పున మైండులోకి వచ్చి, దాని గురించే కదా ఆలోచించాలి! నాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన విషయం అంటే లావణ్య తప్ప మరింకేదీ కాదు. పిచ్చెక్కించే అందం, అసాధారణమైన తెలివితేటలు, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలాంటి అమ్మాయి పార్టనర్గా దొరకడాన్ని మించిన అదృష్టం ఏ మగాడికైనా వేరే వుంటుందా? లక్కీగా పెళ్లి అనే సిస్టమ్లో యిరుక్కుపోవడానికి లావణ్య కూడా సిద్ధంగా లేదు. ‘లైఫ్ అంతా వొక్కడితోనే అనే ఆలోచనే సఫొకేటింగా వుంటుంది’ అని పైకే అనేస్తుంది. ఎవరైనా వింటే ఏం అనుకుంటారో అనే భయం కూడా లేదు ఆ పిల్లకి. ‘సీరియస్ కమిట్మెంట్లు అవసరం లేని క్యాజువల్ రిలేషన్ షిప్ ఎవరితో అయినా ఓకే’ అన్నట్లుగా ఉంటుంది. లావణ్య అలా ఉండడంత మొదట్లో నాకు పెద్దగా నచ్చలేదు. ఆమె నమ్మే ఫిలాసఫీలో నాకు లాభించగల కోణం ఏంటీ అన్నది నాకు తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. ఒకవేళ ఆమె కూడా అందరిలాగానే పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ కావాలనుకుంటే ఏమైవుండేది? అసలు నన్ను దగ్గరకి రానిచ్చేదేనా? మిగతావాళ్ల సంగతేమో గానీ, నాతో ఫిజికల్గా ఎఫైర్ పెట్టుకోడానికి లావణ్యకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగని దానికి లివిన్ రిలేషన్ అని పేరు పెట్టడం కూడా ఆమెకి యిష్టం వుండదు. ఏదీ ఒక అరేంజ్మెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా వుండకూడదనేది తన ఫిలాసఫీ. సమాజం ఎప్పుడైనా మార్పుని వ్యతిరేకిస్తుంది. కొన్నాళ్లకి చచ్చినట్టు రాజీపడుతుంది. ఏ మార్పుతో అయితే అయిష్టంగా రాజీపడిందో దాని తాలూకూ ఫలితాన్ని యిన్ఫ్లూయెన్స్ చేయాలని కొన్నాళ్లకి దానిలో ఆరాటం మొదలవుతుంది. అప్పుడు ఆ మార్పుకి విలువ లేకుండా పోతుంది. మళ్లీ కొత్త మార్పు కోసం కొత్తగా ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ లావణ్య చెప్పిన మాటలే. తన ఐడియాలజీతో నాకొచ్చిన పేచీ ఏమీ లేదనే అనిపించింది నాకు. ∙∙ ‘దబ్’ అన్న సౌండుకి మళ్లీ మెలకువొచ్చింది నాకు. కిటికీలో నుండీ విసరబడిన న్యూస్ పేపర్ చప్పుడన్నమాట. పేపర్ బాయ్ మీద భలే కోపం వచ్చింది. అయితే, ఆ కోపం ఎంతోసేపు ఆగలేదు. మూడో అంతస్తులో వున్న కిటికీలోంచీ కచ్చితంగా నా రూములో కొచ్చి పడేలాగా గురిచూసి విసిరే వాడి టాలెంట్ గుర్తొచ్చి ముచ్చటేసింది. అవునూ, మూడు రోజుల్నుండీ నేను పేపర్ చదవనే లేదా? రబ్బర్బ్యాండ్ కూడా తీయకుండా పేపర్లు కిటికీ పక్కనే పడున్నాయేంటి? సరే నా సంగతి వదిలేద్దాం. మరి నా రూముకి కొత్తగా వచ్చిన గెస్టు సంగతేంటి? అతను (ఆమె?) కి పేపర్ చదవాలనీ, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ లేదా? ఎవరో నా పక్కన వున్నారని తెలిసి కూడా నాకు మళ్లీ నిద్ర ఎలా పట్టింది? తెల్లారింది కాబట్టీ, వెలుతుర్లో ఆ మనిషి ఎవరన్నదీ స్పష్టంగానే కనబడొచ్చు. కానీ, నాకెందుకో అలా తెలుసుకోబుద్ధి కాలేదు. అవతలి మనిషి వల్ల నాకెలాంటి యిబ్బందీ లేనప్పుడు ఆరాలు తీయడం పద్ధతి కాదని అనిపించింది నాకు. అలా చేయడం ఎదుటివాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం కాదూ?! తాళం వేసున్న గదిలో, ఊహించని విధంగా వొక అగంతకుడు ప్రత్యక్షం అవ్వడం, అప్పుడే నిద్రలేచి మత్తుగా ఆవులిస్తున్న హీరోపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ప్లాన్ ముందే పసిగట్టిన హీరో లాఘవంగా అవతలికి గెంతడం, కత్తితో పొడవబోయిన క్రిమినల్ తూలి ముందుకి పడిపోవడం, వాడి చేతిలో వున్న ఆయుధం జారిపోవడం.. సినిమాల్లో చూసిన యిలాంటి సీన్లన్నీ గుర్తుకొచ్చాయి నాకు కాసేపు. నిజానికి నా బుర్ర చేస్తున్న తప్పు క్షమార్హం కాదు. ఎందుకంటే అసలు నా చుట్టూ వున్న వాతావరణం ప్రాస్పెక్టివ్ క్రైౖ మ్ సీన్లా లేనే లేదు. ముందుగా జరిగిన వొప్పందం ప్రకారం యిద్దరు మనుషులు స్నేహపూర్వకంగా ఒక వెన్యూని షేర్ చేసుకుంటున్నట్టుంది. అయినా, వర్రీ కావాల్సిన సీరియస్ యిష్యూస్ వదిలేసి, యింత అల్పమైన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? పట్టించుకోవాలే గానీ ఎన్ని సమస్యలు లేవు నాకు! లావణ్య విషయంలో నాకు పోటీ వస్తున్న కొలీగ్ సుందర్ విషయంలో ఏం చేయాలో ఆలోచించాలి ముందు. సుందర్..! ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. లేదా, వయసు పెరక్కుండా అడాలసెన్స్లోనే ఆగిపోయినట్టున్నాడు. లావణ్య మనసు మార్చగలననీ, ఆమెకి పెళ్లి మీద నమ్మకం కుదిరేలా చేస్తాననీ వాదిస్తాడు. ‘జీవితాంతం యితని చేయి వదలకూడదు అనిపిచేంత నమ్మకం కలిగించే మగాడు తారసపడకపోవడం వల్లే లావణ్య అలా మాట్లాడుతోందీ’ అంటాడు. ‘ఎన్ని రోజులు ఎదురుచూసైనా సరే, ఎంత కష్టపడాల్సివచ్చినా సరే.. లావణ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితాశయం’ అంటాడు. ఒకప్పుడు తను కూడా సుందర్ లాగానే వుండేవాడు. అచ్చం అలానే ఆలోచించేవాడు, ‘విధి యిద్దరు మనుషుల్ని దగ్గరగా తీసుకురావడం, వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకోలేకపోవడం, ఆ వెలితి వాళ్లని జీవితాంతం వేధించడం’. కాలేజీ రోజుల్లో యిలాంటి కథలు ఎంత కిక్కెక్కించాయో.. తనకి కూడా! చాలామంది గ్రాడ్యువల్గా ఆ ట్రాన్స్ నుండి బయటకి వచ్చేస్తారు. సుందర్ మాత్రం బయట ప్రపంచం ఎలావుందో చూడడానికి రెడీగా లేడు. అతని ప్రవర్తన చైల్డిష్గా వుందని చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం లేదు సరి కదా, కోపం తెచ్చుకొని అసహనంతో రగిలిపోతున్నాడు. ∙∙ ‘కావాలంటే నువ్వూ లావణ్యని ప్రేమించు. తనని పెళ్లి చేసుకోవాలని నాకు మాదిరిగానే కలలు కను. నాకేం అభ్యంతరం లేదు. మనిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటే లావణ్య వాళ్లనే ప్రేమిస్తుంది. అసలు లావణ్య వరకూ ఎందుకు?! నాకన్నా నువ్వే తనని ఎక్కువ సంతోషంగా ఉంచగలవు అని నమ్మకం కుదిరితే నేనే హ్యాపీగా మీ యిద్దరి లైఫ్లో నుండీ వెళ్లిపోతాను. కానీ, అసలు ప్రేమా పెళ్లీ అనే ప్రస్తావన లేకుండా, వొక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే చాలు అనుకోవడం తప్పు’ అన్నాడు సుందర్. ‘చెప్పేది వినవే. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవొద్దు, తనతో సంబంధం పెట్టుకుంటే చాలు’ అని జనరలైజ్ చేయడం లేదు నేను. ఇక్కడ డిస్కషన్ కేవలం లావణ్య గురించే. ఆ అమ్మాయికి కావాల్సిందేదో తనకి యివ్వడమే కదా ఆమెని ప్రేమించేవాడు చేయాల్సిన పని?’ లాజిక్ తీశాన్నేను. ‘అసలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్గా తెలీదు. ఏదో సరదాకి అలా మాట్లాడుతుందంతే. తన అమాయకత్వాన్నీ, వల్నరబిలిటీనీ క్యాష్ చేసుకోవడంలో తప్పు లేదని అంటున్నావ్ నువ్వు, అంతేగా?’, నన్ను విలన్ లాగా చూస్తూ అడిగాడు సుందర్. ‘లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్గా తెలియని అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకోవడం కూడా తప్పేగా మరి? కొన్నాళ్లయ్యాక ఆమె తన యిష్టాయిష్టాలేంటో తెలుసుకొని, అసలు పెళ్లెందుకు చేసుకున్నాన్రా దేవుడా అని వుసూరుమంటుందేమో?’ అన్నాను నేను. చెప్పొద్దూ, నన్ను చూసుకుంటే నాకే చాలా గర్వంగా అనిపించింది. ఈ దెబ్బకి సుందర్గాడి మాట పడిపోతుంది. ‘భవిష్యత్తులో లావణ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటే, అది లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నట్టు అవుతుందా? పెళ్లి చేసుకోవడం కంటే, దొరికినోడితో దొరికినట్టు ఉండడం బెటర్ అనే ఆలోచన తప్పు అని తెలుసుకోవడం కదా అల్టిమేట్ రియలైజేషన్ అంటే?!’ వీడంత తేలిగ్గా రాజీ పడే రకం కాదు. ‘సుందర్, నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను’ టెంపో మార్చి, సాఫ్ట్గా అన్నాను. ‘ఏంటి? అడుగు’ అనుమానంగా బదులిచ్చాడు. ‘పెళ్లి గురించి లావణ్య ఫిలాసఫీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకునేంత మెచూరిటీ వుందనే నమ్మకం లేదు. మరి, ఏం చూసి తనని ప్రేమించావు? ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు?’ నా నుండి ఈ ప్రశ్నని సుందర్ ఏమాత్రం వూహించలేదని తన ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సుందర్లో కాస్త నిజాయితీ లేకపోలేదు. అతని స్థానంలో ఎవరైనా వుంటే, నా ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఏదో వొక సమాధానం చెప్పివుండేవాళ్లు. కానీ సుందర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించాడు. నిజానికి సుందర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లావణ్యతో నేను సంబంధం పెట్టుకోడానికి అతని పర్మిషన్ తో పనేముంది? కానీ, ఎందుకోగానీ నేను చేసే పని రేషనల్గానే వుందని సుందర్ని నమ్మించాలని అనిపిస్తోంది. బహుశా, నేనూ వొకప్పుడు అతనిలాగానే ఆలోచించేవాడిని అని నాకు పదేపదే గుర్తుకు రావడం వల్ల అనుకుంటాను. వాదించడం ఆపేసి సుందర్ డిఫెన్సులో పడిపోవడం నాకు కాస్త వుత్సాహానిచ్చింది. సుందర్.. విషయం యిక్కడిదాకా వచ్చింది కాబట్టీ, నాకు ఏమనిపిస్తుందో చెపుతా విను. నీకూ నాకూ లావణ్య నుండీ కావాల్సింది వొక్కటే. మనిద్దరి అప్రోచ్ మాత్రమే వేరు. పెళ్లి అన్నమాట ఎత్తకుండా లావణ్యతో నేను ఎక్కడ తేలతానో, పెళ్లీ పెళ్లీ అని కలవరిస్తూ నువ్వు కూడా అక్కడే తేలతావ్. పచ్చిగా చెప్పాలంటే, లావణ్యతో ‘రిలేషన్షిప్’ కోసం నువ్వు పెళ్లి అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావ్, అంతే!’ మరీ యింత హార్ష్గా చెప్పకుండా వుండాల్సిందేమో. కానీ, యిక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈసారి కూడా సుందర్ ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి గదిలో అటూయిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేశాను. ఇక కొత్తగా జరగ్గలిగే డ్యామేజ్ అంటూ ఏం లేదు. సిగరెట్ పెట్టె, లైటర్ చేతిలోకి తీసుకొని, అప్పటిదాకా జరిగిన చర్చని కంక్లూడ్ చేస్తూ చెప్పాన్నేను.. ‘నా మాట విని నువ్వూ నా స్కూల్లోకొచ్చెయ్. ఇలా తర్జనభర్జన పడుతూ పోతే, చివరికి నువ్వూ నేనూ తప్ప అందరూ వాడతారు దాన్ని’ లావణ్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. కానీ ఆమెని వుద్దేశించి ‘దానిని’, ‘అది’ లాంటి పదాలు నేను వాడడం అదే మొదటిసారి. కుండబద్దలు కొట్టేసి, నా పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, మాటలకి మరీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు అని నా యిన్స్టింక్ట్ చెపుతోందన్నమాట. హాల్లోంచీ బాల్కనీలోకి వెళ్లే తలుపు బోల్ట్ తీస్తూ నేను పై మాటలు అంటున్న సమయానికి సుందర్ వేరేౖ వెపు తిరిగి వున్నాడు. అతని ఫేస్ నాకు కనబడుతూ వుండివుంటే కనీసం చివరి రెండు వాక్యాలైనా మాట్లాడకుండా నిగ్రహించుకొని వుండేవాణ్నేమో. సుందర్ ఆవేశంగా నా మీదకి రావడం అర్థమయ్యి చప్పున వెనక్కి తిరగబోయాను నేను. అప్పటికే అతను నా కాలర్ పట్టుకుని విసురుగా వెనక్కిలాగి, నా తలని పక్కనే వున్న గోడకేసి కొట్టాడు. అతని పట్టు నుండి విడిపించుకోడానికి నా శక్తికొద్దీ ప్రయత్నించాను. చూడ్డానికి అర్భకుడిలా వున్నాడనే కానీ గట్టిపిండమే. ∙∙ నా గదిలో ఎవరో వున్నారని నేను గ్రహించడం దగ్గర కదా ఈ కథ మొదలైంది. నేను పడుకోడానికి ముందు ఏం జరిగిందీ అన్నది గుర్తు చేసుకున్నాక నాకు యిప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. సుందర్ని నేను చంపేశానన్నమాట. నాకు నిద్రాభంగం అవడానికి కారణమైంది సుందర్ శవం కానీ లేదా అతని ఆత్మ కానీ అయ్యుండాలి. సెకండ్ ప్రాబబిలిటీ ప్రకారం, సుందర్ నన్ను చంపేసి వుంటే, ఆ గదిలో వున్న యిద్దరూ నేనే అవ్వడానికి కూడా అవకాశం వుంది. సుందర్కీ నాకూ మధ్య జరిగిన పెనుగులాటలో ఎవరు గెలిచారు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది నిజం ఏంటన్నది. అన్నట్టు మీకు యింకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుందర్ నన్ను చంపడానికి ప్రయత్నించడం, అంత కంగారులోనూ, నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. నన్ను ఆశ్చర్యపోయేలా చేసిందేంటంటే, సుందర్ మొహంలో కోపం కాకుండా భయం కనిపించడం. తన గురించి తాను తెలుసుకోవడంలో మనిషికి వుండే భయం. ప్రాణాలు వదలడానికి ముందు ఏబర్డీన్ లోయల్లో మాక్బెత్ని వేధించిన భయం. నిజం బారి నుండి పారిపోలేని నిస్సహాయత దెయ్యంగా మారి వెంటాడుతున్నప్పుడు కలిగే భయం. ఫైనల్గా సుందర్ని నేను కన్విన్స్ చేశానా? ఒకవేళ నా ప్రవర్తనని సమర్థించుకోడానికి నేను సుందర్ మొహంలో భయాన్ని కాకుండా ఆశ్చర్యాన్నే చూసినట్టు నటిస్తున్నానా? ఈ చివరి ఆలోచన రాగానే నా వొళ్లు వొక్కసారిగా జలదరించింది. తల పక్కకి తిప్పి, నా గదిలో వున్నదెవరో చూడాలంటే నాకిప్పుడు భయంగా వుంది. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్కూ డిస్కమ్లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు
సాక్షి,అమరావతి: గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయని, గత సర్కారు హయాంలోనే మొదలయ్యాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్తో కలసి ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుదిబండల్లా పీపీఏలు.. బకాయిలు ఆర్టీపీపీలో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు 2009లోనే మొదలయ్యాయని ఇంధనశాఖ కార్యదర్శి వెల్లడించారు. 2014 నాటికి దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు 8,000 మెగావాట్ల పీపీఏలు కుదుర్చుకోవడంతో పాతికేళ్ల పాటు ఏటా రూ.3 వేల కోట్లు భారం డిస్కంలపై పడుతోందన్నారు. గత సర్కారు హయాంలో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకుని 2018–19 నాటికి రూ.62 వేల కోట్లకు చేర్చారని, ఏటా రూ.8 వేల కోట్లు చొప్పున ఇవ్వాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా రూ.2 వేల కోట్లే ఇవ్వడం వల్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను (విద్యుత్ కొనుగోలు ఖర్చులు) ఏపీఈఆర్సీకి సమర్పించకుండా, తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఆర్థిక భారం పడిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు, బకాయిలకే రెండున్నరేళ్లలో రూ.36 వేల కోట్లు ఇచ్చిందన్నారు. నెలలోపే కృష్ణపట్నం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో 960 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తోందని, 2024 నుంచి దశలవారీగా ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు చేపట్టామని, మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. కృష్ణపట్నం యూనిట్ నెలలోపే ప్రారంభిస్తామన్నారు. నెడ్ కాప్ ద్వారా 6600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, డీపీఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. సాగుకు సౌర విద్యుత్తుతో భరోసా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేశారని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి సెకీ ద్వారా తక్కువ ధరకే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కే సేకరిస్తోందని, తద్వారా 2024లో వ్యవసాయ మిగులు విద్యుత్ను గృహ, పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం సగటున విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 చొప్పున ఉందన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత సర్కారు హయాంలో విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీలు రూ.21,497 కోట్లు అని శ్రీధర్ వెల్లడించారు. బొగ్గు సంక్షోభంతో.. దేశంలో విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగం డిమాండ్, బొగ్గు సంక్షోభం విద్యుత్ కోతలకు ప్రధాన కారణాలని శ్రీధర్ తెలిపారు. 2014–15 మధ్య కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్) 2020–21లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014–19లో కెపాసిటీ ఎడిషన్ జరగడం వల్ల డిస్కంలపై, వినియోగదారులపై భారం పడిందని, విద్యుత్ కొరతకు ఇది కూడా ఓ కారణమన్నారు. మే నెలలో మొదలై జూన్, జూలై వరకు మాత్రమే విండ్ పవర్ తక్కువ సమయం అందుబాటులో ఉంటుందన్నారు. తాత్కాలిక సమస్యలే.. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు తక్షణమే తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలు, వ్యవసాయానికి ఆదివారం రోజు విద్యుత్ కోతలను తగ్గించగలిగామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. సాగు విద్యుత్ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి బకాయిలు లేవు.. గత అక్టోబర్ నుంచి బొగ్గు సంక్షోభం నెలకొన్నా కోల్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి నిరంతరాయంగా సరఫరా జరుగుతోందని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. శనివారం రోజు కోల్ కంపెనీలకు రూ.150 కోట్లు చెల్లించామన్నారు. కోల్ ఇండియా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోందని, రైల్వేలు కూడా క్రమం తప్పకుండా ర్యాక్లు సమకూరుస్తున్నాయని చెప్పారు. విశాఖలోని హిందూజా పవర్కు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగితే పీపీఏ ప్రకారం మనకు 1000 మెగావాట్లు అందుతుందని తెలిపారు. విద్యుత్ సమస్యలపై కేంద్రం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. బాబు దూరదృష్టితోనే దేశమంతా మెరుగైందా? రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత నెలకొనగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సమస్య తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అయితే, ఇంధన కొరత తగ్గడం అనేది దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్లే కానీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కాదన్నారు. 2014 జూన్ 3న 16 రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా 2016 జూన్ 3 నాటికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ కొరత ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే దేశం మొత్తం విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి 90 శాతం కంటే ఎక్కువ అభివృద్ధి దశలో ఉన్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది లోపు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాల ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది కానీ టీడీపీ సర్కారు గొప్పతనమేమీ కాదన్నారు. డిస్కమ్లపై తీవ్ర ఒత్తిడి టీడీపీ పాలనలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా అభివర్ణించుకునే అవకాశం లేదన్నారు. వాస్తవానికి విభజన తర్వాత మొదటి సంవత్సరానికి 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ను ఏపీఈఆర్సీ ఆమోదించిందని, 54,867 మిలియన్ యూనిట్ల లభ్యతను అంచనా వేయడం విద్యుత్ కొరత లేదని సూచిస్తుందన్నారు.ఆ సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,43,028 మెగావాట్లు ఉంటే, గరిష్ట డిమాండ్ 1,35,918 మెగావాట్లేనన్నారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రాతిపదికన భారీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిక ఖర్చులతో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పీపీఏలను అధిక ధర (యూనిట్ రూ. 4.84 చొప్పున)లకు కుదుర్చుకుందని గుర్తుచేశారు. రెట్టింపు అప్పులు.. భారీ బకాయిలు టీడీపీ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.58,596 కోట్లకు చేరాయన్నారు. విద్యుదుత్పత్తిదారులకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర పంపిణీ, వినియోగాల నికర విలువ రూ.4,315.72 కోట్ల ప్రతికూల విలువ నుంచి రూ.19,926.27 కోట్ల ప్రతికూల విలువకు క్షీణించిందన్నారు. కనీసం నెట్వర్త్ సానుకూలంగా ఉంటే చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అనే వాదనను కొంతవరకు సమర్థించవచ్చని, కానీ ఆయన హయాంలో నెట్వర్త్ గణనీయంగా క్షీణించిందన్నారు. -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి
సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిమాండ్కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. -
చార్జీల పెంపు స్వల్పమే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ చార్జీలు ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. కామన్ టెలిస్కోపిక్ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొత్త టారిఫ్ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. ► టెలిస్కోపిక్ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్సీ ఈ శ్లాబ్లను తెచ్చింది. ► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. ► ట్రూ అప్ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్కు ఏపీఎస్పీడీసీఎల్ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్ ఫైల్ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది. ► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. ► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ థర్మల్ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్(తెలంగాణ)పై ఆధారపడి కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది. గుదిబండల్లా పీపీఏలు గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. 2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్ చార్జీలను ఫైల్ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు
ఆకలితో జరిగిన యుద్ధంలో ఓడిన ప్రతిసారి తనను తాను రక్షించుకున్నాడు. ఈ క్రమంలో మనసుకు గాయమైనా లక్ష్యం కోసం భరించాడు. తనను వేధిస్తున్న సమాజానికి సరైన సమాధానం చెప్పాలన్న కాంక్షతో అడుగు ముందుకేశాడు. తరుముకొచ్చే అవసరం నుంచి.. సృజనాత్మక ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరిసింది. అదే అతన్ని విజయతీరాలకు చేర్చింది. తన ప్రతిభతో ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు కోడిని చంపి.. చికెన్ డెలివరీ చేసిన అతనే.. ఈ రోజు ప్రపంచ వాణిజ్య విభాగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు. ఆకలి, ఆవేదనలో నుంచి పుట్టికొచ్చిన అక్షరాలను ఆకళింపు చేసుకుని ప్రపంచస్థాయి రచయితగా ఎదిగాడు. పేదరికంతో మొదలైన అతని జీవన ప్రస్థానం.. నేడు పదుగురికి సాయం చేసే స్థాయికి చేరింది. మేధో శ్రమకే అంకితమైన ఒక అసమాన యాత్రికుని ప్రయాణమిది. ఆ యువకుడి పేరే శ్రీధర్ బెవర. సాక్షి, విశాఖపట్నం: శ్రీధర్ బెవర పుట్టింది శ్రీకాకుళం జిల్లా రాజాం. కుటుంబాన్ని పేదరికం వెక్కిరించడంతో తల్లి శ్రీధర్తో పాటు తన నలుగురు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో బంధువు ఇంట్లో పెట్టింది. అక్కడైనా తన పిల్లలకు కష్టాలు లేకుండా మూడు పూటలా తిండి దొరుకుతుందనీ.. చక్కగా చదువుకుంటారనీ.! అలా ఒకే గూటి పక్షులను వేర్వేరు ప్రాంతాలకు పంపించేసింది. శ్రీధర్ను గుంటూరులో, శ్రీధర్ అక్క శైలజను వాళ్ల పెదనాన్న ఇంట్లో, అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ను విశాఖలోని బంధువుల ఇంటికి అప్పగించింది. శ్రీధర్ గుంటూరులోని పెద్దమ్మ వాళ్ల అబ్బాయి ఇంట్లో ఆశ్రయం పొందారు. పదో తరగతి వరకు అక్కడే కాలం వెళ్లదీశారు. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజున.. ఇక నుంచి ఇక్కడ ఉండొద్దని బంధువులు ఆయనకు తెగేసి చెప్పేశారు. అక్కడే.. కొత్త ఆలోచనలకు బీజం ఏదైనా పనిలో చేరి సమస్యల నుంచి బయటపడాలని భావించాడు శ్రీధర్. విశాఖ డెయిరీలో పాల ప్యాకెట్లు తీసుకుని టీ దుకాణాలకు డెలివరీ బాయ్గా ప్రస్థానం ప్రారంభించారు. కష్టపడుతున్నా.. ఆదాయం రాకపోవడంతో చికెన్ దుకాణంలో మాంసం కొట్టేందుకు పనికి కుదిరాడు. కోడిని చంపడం వంటి దృశ్యాలతో చూసిన శ్రీధర్ బెదిరిపోయి జ్వరం బారిన పడ్డారు. కూటి కోసం ఆ పనిలోనే కొనసాగాడు. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలకు బీజం పడింది. అపార్ట్మెంట్లు, ఇంటింటికీ వెళ్లి ముందు రోజే చికెన్ ఆర్డర్ తీసుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్డర్లు సరఫరా చేసేవాడు. అక్క శైలజ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాడు. మంచి లాభాలొచ్చినా.. రేయింబవళ్లు పని చేయడంతో శ్రీధర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఆ వ్యాపారానికి కూడా మధ్యలోనే స్వస్తి చెప్పాడు. కుంగదీసిన అన్నయ్య మరణం ఇంతలో అన్నయ్య మురళీధర్ క్యాన్సర్ బారిన పడి 2017లో కన్నుమూశాడు. దీంతో అందరూ ఉన్నా ఒంటరిగా మారిపోయిన శ్రీధర్.. ఆ బాధ నుంచి కోలుకుని అన్నయ్య పేరుతో బీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు విద్యాదానం, ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆకలి ముందు చదువు ఓడిపోయింది పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యారు శ్రీధర్. గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత విశాఖలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరారు. ఆకలి కారణంగా చదువులో వెనకబడిపోయాడు. అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ కూడా బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఒకే రూమ్లో జీవనం ప్రారంభించారు. అన్నయ్య మురళి తండ్రిగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే అన్నయ్య మురళి పెద్దింటి అమ్మాయి లక్ష్మీ భారతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుని రూమ్కు తీసుకొచ్చేశారు. ఆ ముగ్గురితో పాటు లక్ష్మీభారతి కూడా అదే చిన్న రూమ్లో తలదాచుకుంది. తల్లిలా వారిని లాలించింది. ఆర్థిక సమస్యలు.. ఆకలి బాధలతో చదువుపై దృష్టి సారించలేకపోయారు శ్రీధర్. ఇంటర్లో తప్పారు. దీంతో తను కన్న కలలన్నీ కల్లలయ్యాయ్. తాజ్లో వెయిటర్.. డిగ్రీలో ఫెయిల్ విశాఖలోని తాజ్ హోటల్లో వెయిటర్ ఉద్యోగాలు పడటంతో శ్రీధర్ అక్కడ పనికి చేరాడు. బ్యాంకెట్ వెయిటర్గా 14 గంటల పాటు నిలబడి పనిచేసేవాడు. ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పని పూర్తి చేసి.. ఆ సమయంలో వాహనాలు లేక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్కు వెళ్లేవాడు. ఆ సమయంలో పోలీసులు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమంగా వెయిటర్గా మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్కు ప్రముఖులు ఎవరొచ్చినా సర్వ్ చేసేందుకు శ్రీధర్నే ఎంపిక చేసే వారు. వెయిటర్గా చేస్తూనే బీకామ్లో చేరాడు. పని ఒత్తిడితో మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యే సరికి 15 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. కొత్త జీవితం వైపు అడుగులు ఎదుగు బొదుగూ లేని జీవితంతో పోరాటం చేస్తున్న శ్రీధర్కు అన్నయ్య మురళీ మాటలు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేశాయి. అప్పటికే దుబాయ్లో స్థిరపడ్డ మురళీ.. శ్రీధర్ను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని సూచించాడు. ఆయన మాట ప్రకారం వాటిని పూర్తి చేసిన శ్రీధర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అంతే.. అక్కడి నుంచి శ్రీధర్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం మొదలు పెట్టిన ఆయన.. ఎల్జీ, పానాసోనిక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇండియా వచ్చి ఐఐఎం–అహ్మదాబాద్లో అడ్వాన్స్డ్ బిజినెస్ కోర్సు చదివి.. 37 ఏళ్లకే జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. పానాసోనిక్ మిడిల్ ఈస్ట్–ఆఫ్రికా విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. రచయితగా.. రికార్డు.. ఆకలి, ఆవేదన నుంచే అక్షరాలు ధ్వనిస్తాయన్నది అక్షర సత్యమని శ్రీధర్ కవిత్వం వింటే అర్థమవుతుంది. చిన్నతనం నుంచి కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్న శ్రీధర్.. క్రమంగా మంచి రచయితగా మారారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నేళ్ల కిందట మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్లో రచించారు. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలతో పాటు సాహితీ విమర్శకులు.. ఈ పుస్తకానికి ప్రశంసల జల్లు కురిపించారు. నాయకత్వ లక్షణాలపై శ్రీధర్ రాసిన ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ వ్యక్తిత్వ వికాస నవల చరిత్ర సృష్టించింది. ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిర్వహించిన పాపులర్ బుక్స్ ఆఫ్–2021లో శ్రీధర్ ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాల చొప్పున పోటీ నిర్వహించింది. ఇందులో ది రోరింగ్ ల్యాంబ్స్ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రచయిత శ్రీధర్ కావడం విశేషం. కొన్నేళ్లుగా బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో అమెరికాకు చెందిన రచయితల పుస్తకాలే మొదటిస్థానంలో నిలిచేవి. తొలిసారిగా ఓ భారతీయ రచయిత ఆ రికార్డుని తుడిచిపెట్టేసి నంబర్ వన్గా అవతరించారని అమెజాన్ సంస్థ ప్రశంసించింది. అంతే కాదు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ శ్రీధర్ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమస్యలు చుట్టిముట్టినా.. పడిలేచిన కెరటం లా పైకెగిరిన అతని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. పారిశ్రామికవేత్తగా పయనం తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించాడు శ్రీధర్. అన్నయ్య పేరుతో బీఎంఆర్ ఇన్నోవేషన్స్ అనే ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీ కార్పొరేట్ సంస్థను ప్రారంభించాడు. రుణం పొందేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించి.. రుణ మంజూరుకు సహాయం చేసేదే ఈ సంస్థ. పలు దేశాలకు ఈ సంస్థ రుణాలు మంజూరు చేసింది. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం అందించడం విశేషం. ఇటీవలే గోవా ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ స్థాపించేందుకు రుణ మంజూరు ప్రక్రియ శ్రీధర్ కంపెనీతోనే జరిగింది. దీంతో శ్రీధర్ను గోవా ప్రభుత్వం స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్కు మెంటర్గా నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా సంస్థతో కలిసి దేశానికి వివిధ పనులకు సంబంధించి రుణాల మంజూరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీధర్తో భేటీ అయ్యింది. ఒకప్పుడు ఆకలి తీర్చుకునేందుకు పని దొరుకుతుందని ఎదురు చూడగా... ఇప్పుడు అనేక దేశాలు శ్రీధర్ బెవర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదీ కదా.. అసలైన విజయమంటే.! -
సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం. -
7 నెలల్లో రూ.868 కోట్ల లాభం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి మళ్లీ సిరుల రాణిగా మారింది. బొగ్గు గనుల్లో లాభాల పంట పండింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా గతేడాది ఏర్పడిన నష్టాల ఊబి నుంచి గట్టెక్కింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2021–22లో గత ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలను ఆర్జించింది. 2020–21 తొలి ఏడు నెలల్లో రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ.14,067 కోట్ల విక్రయాలు జరిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలవ్యవధిలో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గి రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాతోపాటు విద్యుత్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలను సింగరేణి సమకూర్చుకుంది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.6,678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా, ఈ ఏడాది 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల అమ్మకాలు నిర్వహించింది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.1,860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 18 శాతం వృద్ధితో రూ.2,182 కోట్ల మేర విద్యుత్ విక్రయించింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి గతేడాదితో పోల్చితే గడిచిన ఏడునెలల్లో 65 శాతం అభివృద్ధిని కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో టర్నోవర్, లాభాలు ఆర్జిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ పురోగతిపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించి గత ఏడు నెలల్లో సాధించిన ఫలితాలను వెల్లడించారు. పెరిగిన బొగ్గు, విద్యుదుత్పత్తి... గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి 7నెలల్లో బొగ్గు ఉత్పత్తి 220 లక్షల టన్నుల నుంచి 60% వృద్ధితో 352 లక్షల టన్నులకు పెరిగింది. బొగ్గు రవాణా 218 లక్షలటన్నుల నుంచి 68% వృద్ధితో 367 లక్షల టన్నులకు పెరిగింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గతేడాది అక్టోబర్ వరకు 3,819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5,291 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా టర్నోవర్, లాభాలు గణనీయంగా పెరిగాయి. -
నెల రోజుల్లో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
దేవీపట్నం: అర్హులైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నెలరోజుల వ్యవధిలోనే గ్రామాల వారీగా ప్యాకేజీ సొమ్మును అందజేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ సి. శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఒ.ఆనంద్తో కలసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు పునరావాస కాలనీలను సందర్శించారు. ఇందుకూరు పంచాయతీలో నిర్మించిన పెదభీంపల్లి3, ఇందుకూరు2, ముసుళ్లకుంట కాలనీలను సందర్శించారు. ఇళ్లు, మరుగుదొడ్లు, రహదారులు, డ్రెయిన్లు, పాఠశాల, అంగన్వాడీ, గ్రామసచివాలయం, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దాదాపు రూ.90 కోట్ల మేర బిల్లులు నిర్వాసితులకు అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అనర్హుల జాబితాలో ఉన్నవారి వాస్తవాలను పరిశీలించి.. 10 రోజుల్లో ప్యాకేజీ పొందేందుకు అర్హులా కాదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. అనంతరం కొండమొదలు పంచాయతీలోని కొంతమందికి గంగవరం మండలం నేలదోనెలపాడు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని: శ్రీధర్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ ముప్పు ఉందని ఎన్ఆర్ఐ విద్యాసంస్థల తాజా మాజీ సీఈవో శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సీఈవోగా రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. వచ్చిన లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామని తానను మోసం చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఫీజులు తగ్గించమని చెప్పినా పూర్తిగా వసూలు చేశారని.. తనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనకేదైనా జరిగితే టీడీపీ నేత ఆలపాటిదే బాధ్యత అని శ్రీధర్ స్పష్టం చేశారు. చదవండి: రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..! -
‘సువర్ణభూమి’ కొత్త లోగోను ఆవిష్కరించిన రాంచరణ్
రాయదుర్గం: ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతన లోగోను ఆవిష్కరించింది. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో కొత్త లోగో, యాడ్ ఫిల్మ్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్తో కలిసి శుక్రవారం సాయంత్రం సినీ హీరో రాంచరణ్ ఆవిష్కరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను, వినియోగదారుల మన్ననలను పొందుతున్న సంస్థగా సువర్ణభూమి నిలుస్తోందని రాంచరణ్ ప్రశంసించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సువర్ణభూమి సంస్థతో పనిచేయడం, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం సంతోషం కలిగిస్తోందన్నారు. అందుబాటు ధరలలో అపార్ట్మెంట్లు, విల్లాలను వినియోగదారులకు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న సువర్ణభూమి సంస్థను అభినందించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక సకల సౌకర్యాలతోపాటు సరసమైన ధరలకు ఫ్లాట్స్, విల్లాలతో పాటు స్థలాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. -
కరోనా బారిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
లండన్: లండన్లో ఉన్న భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్లు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
69 పట్టణాల్లో 54,056 ఇళ్లు
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టులు ఖరారు చేసిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) వేగవంతం చేసింది. 69 పట్టణాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో చేపట్టిన 54,056 ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో అత్యధిక రేట్లకు ఖరారు చేసిన యూనిట్లకు ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తిచేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం 12 దశల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.392.23 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. వీటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.3,239.39 కోట్లకు టెండర్లు కట్టబెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.2,847.16 కోట్లకు టెండర్లు ఖరారు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీకి) రూ.1,815 వ్యయంగా నిర్ణయించగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1,593కే ఖాయం చేసింది. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టుల్లో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు కూడా సమకూర్చనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ 54,056 ఇళ్ల నిర్మాణ పనుల్ని నాలుగు కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఇళ్లను మూడుదశల్లో ఏడాదిన్నరలో పూర్తిచేయాలని ఇటీవల కాంట్రాక్టు సంస్థల వారితో సమావేశమైన టిడ్కో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. టిడ్కో క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇళ్ల నిర్మాణ నాణ్యతను తరచు పరీక్షిస్తున్నారు. (చదవండి: స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..) టిడ్కో నిర్మించే ఇళ్లలో మూడు రకాలు టిడ్కో నిర్మిస్తున్న 54,056 ఇళ్లల్లో మూడు రకాలున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల వంతున ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. 300 ఎస్ఎఫ్టీ ఇళ్లు 47,832 ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్టుగా ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందిస్తారు. 365 ఎస్ఎఫ్టీ ఇళ్లు 288 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు వాటా రూ.50 వేలు భరిస్తే మిగిలినది బ్యాంకు లోన్గా నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.50 వేలలో సగం అంటే రూ.25 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.25 వేలు చెల్లిస్తే చాలు. ప్రభుత్వం రూ.25 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. 430 ఎస్ఎఫ్టీ ఇళ్లు 5,936 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారు వాటా రూ.లక్ష చెల్లించాలని, మిగిలినది బ్యాంకు లోన్ అని నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.లక్షలో సగం అంటే రూ.50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.50 వేలు భరిస్తే చాలు. ప్రభుత్వం రూ.50 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. ఆ విధంగా ఖరారు చేసిన 54,056 ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశించాం. - శ్రీధర్, టిడ్కో ఎండీ -
మనవైపు శ్రీశైలం ప్లాంట్లు సురక్షితం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో భద్రతను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) క్షుణ్నంగా పరిశీలించింది. ఏపీ జల విద్యుత్ కేంద్రాలు నూటికి నూరుపాళ్లు సురక్షితమని నివేదిక రూపొందించింది. ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని జనరేటర్లు పోలికే లేదు... ► ఏపీ జెన్కో పరిధిలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలు 1960లో ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిధిలో ఉన్నవి 1990లో డిజైన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వీటికి పోలిక లేదు. ► తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా భూగర్భంలో (భూ ఉపరితలం నుంచి కిలో మీటరున్నర) ఉన్నాయి. ఏపీ జల విద్యుత్ కేంద్రం భూ ఉపరితలంపైనే ఉన్నందున విపత్కర సమయంలో పొగ, విషవాయువులు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ► తెలంగాణ విద్యుత్తు కేంద్రం జనరేషన్, నీళ్ల పంపింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భూగర్భంలో నిర్మాణం చేశారు. ఏపీ వైపు ఉన్న ప్లాంట్లు కేవలం జనరేషన్ మాత్రమే చేస్తాయి. నీటిని రివర్స్ పంప్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రమాదానికి అంతగా ఆస్కారం లేదు. ► కుడివైపు జల విద్యుత్ కేంద్రాలు ఒక్కొక్కటి 110 మెగావాట్ల (మొత్తం 7) సామర్థ్యంతో కూడుకున్నవి. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి అయిన విద్యుత్ను బయటకు పంపి ట్రాన్స్మిషన్ వ్యవస్థకు లింక్ చేశారు. తెలంగాణలో భూగర్భంలోనే (ఇండోర్) ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంది. ఇండోర్ ట్రాన్స్మిషన్ వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కాపర్ వైర్ అతి వేడిని పుట్టించే వీలుంది. దురదృష్టవశాత్తూ ప్రమాదం.. ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తెలంగాణ విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. అక్కడి టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. భూగర్భ బొగ్గు గని తరహాలో తెలంగాణ ప్లాంట్లు ఉంటే ఏపీ వైపు ఉన్నవి ఓపెన్కాస్ట్ మాదిరిగా ఉంటాయి. ఏపీ జల విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా సురక్షితం’ – శ్రీధర్, జెన్కో ఎండీ -
నా చావుకి భార్య 'జల'నే కారణం
పెద్దపల్లి, వెల్గటూరు(ధర్మపురి): భార్య కాపురానికి రావడం లేదని మానసిక వేదనకు గురై మండల కేంద్రం వెల్గటూరుకు చెందిన గంట్యాల శ్రీధర్(35) అనే యువకుడు ఇంట్లో బుధవారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా..గ్రామానికి చెందిన శ్రీధర్కు రామడుగు మండలకేంద్రానికి చెందిన జలతో 2011లో వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రాగా పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఫలితంగా యువకుడు తాగుడుకు బానిసయ్యాడు. పదిరోజులక్రితం భార్య అతడిని వదిలేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మరింత తాగుడుకు బానిసై తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేవాడు. (నువ్వులేని లోకం నాకెందుకని..!) ఈక్రమంలో రెండురోజులక్రితం అతడి భార్య మరో మహిళను వెంట తీసుకొచ్చి పిల్లలు పుట్టడం లేదని వైద్యపరీక్షలు చేయించుకోవాలని బెదిరింపులకు గురిచేశారు. రెండు రోజుల్లో కరీంనగర్ వచ్చి వైద్యపరీక్షలు చేసుకోవాలని లేదంటే నీ సంగతి చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారని మృతుడి తల్లి పేర్కొంది. అప్పటినుంచి తీవ్రంగా భయపడుతున్నాడు. భార్య తరపు బంధువులు బెదిరింపులకు గురి చేశారని ఫిర్యాదు చేయడానికి పోలీ స్స్టేషన్కు వెళ్లగా ఎస్సై సాయంత్రం రావాలని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. భార్యతరపు బంధువులతో ప్రాణహాని ఉందనే భయంతోపాటు భార్య కాపురానికి రావడంలేదనే మానసిక వేదనతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తల్లి రాజేశ్వరి తెలిపారు. బెదిరింపులకు గురి చేసిన వారు వచ్చేదాకా మృతదేహాన్ని తీసేది లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎస్సై శ్రీనివాస్ సముదాయించి శవాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్రావు సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ‘తనకు చెందిన ఆస్తుల్లో భార్యకు ఎలాంటి వాటా ఇవొద్దని..అన్నీ తల్లికే చెందాలని.. నా మృతికి నా భార్య జలనే కారణమని ఆమెపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అలా అయితేనే నా ఆత్మ శాంతిస్తుందని’ శ్రీధర్ రాసిన సూసైడ్నోట్ అతడి జేబులో లభించింది. -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్లోనే ఓ హోటల్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
కళాకారుడు వస్తున్నాడు
శ్రీధర్, దుర్గ జంటగా కిరణ్ దుస్సా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాకారుడు’. శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ దుస్సా మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. దర్శకునిగా అవకాశం ఇచ్చిన శ్రీధర్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ప్రతి సాంకేతిక నిపుణుడు సొంత సినిమాలా భావించి ఈ సినిమా కోసం పనిచేశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు శ్రీధర్. ‘‘కథ వినగానే నచ్చింది’’ అన్నారు దుర్గ. ‘‘5 పాటలు చక్కగా కుదిరాయి. శ్రీధర్గారికి సినిమా పిచ్చి’’ అన్నారు సంగీత దర్శకుడు రఘురామ్. -
సింగరేణిలో 10,446 కొలువుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ 10,446 కొలువులను భర్తీ చేసింది. 2014 నుంచి 2019 మే వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 3,025 మంది, డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పథకం కింద మరో 7,421 మందిని నియమించింది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, పర్సనల్, అకౌంట్స్, తదితర విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇంత పెద్ద మొత్తంలో నియామకాలు జరపడం ఇదే తొలిసారని సంస్థ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఖాళీల భర్తీలో ప్రత్యేక చొరవ చూపారని తెలిపింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రాత పరీక్ష ద్వారానే నియామక ప్రక్రియ జరిపామని పేర్కొంది. కొత్తగా ఉద్యోగాలు పొందిన నాన్ కేడర్ వర్కర్ కేటగిరీలో క్లర్కులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, సర్వేయర్లు తదితర టెక్నీషియన్ల నియామకం జరపగా, అధికారుల విభాగంలో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీర్లు, సివిల్, ఫైనాన్స్, అకౌంట్స్, పర్సనల్, ఫారెస్ట్, సెక్యూరిటీ అధికారులు, స్పెషలిస్టు డాక్టర్లు తదితరులను నియమించినట్లు వెల్లడించింది. చనిపోయిన, అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలిచ్చే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపింది. గతంలో నెలకు 20 లేదా 30 మందికి మాత్రమే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తుండేవారని, ప్రస్తుతం నెల కు 150 నుంచి 200 మందికి ఉద్యోగాలిస్తున్నామని పేర్కొంది. 2014లో 674 మందికి ఉద్యోగాలివ్వగా 2015లో 1,989 మందికి, 2018లో 1,663 మందికి, 2019లో మే వరకు 1,378 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. 4,728 మందికి కారుణ్య నియామకాలు కారుణ్య నియామక ప్రక్రియ 2018 ఏప్రిల్ నుంచి ముమ్మరంగా సాగుతోందని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు నిమ్స్, గాంధీ ఆసుపత్రి తదితర ప్రభుత్వ వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరీక్షించి అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారు సూచించిన వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 38 మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించగా 4,728 మంది కార్మికులు కారుణ్య నియామక ప్రక్రియలో తమ వారసులకు ఉద్యోగం లభించే అవకాశం పొందారని వెల్లడించింది. ఇంతమంది సింగరేణిలో ఉద్యోగాలు పొందడంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. -
నాన్న కల నెరవేర్చేందుకు క్రికెట్లోకి వచ్చా..
క్రికెట్.. ప్రపంచమంతా క్రేజీ ఉన్న క్రీడ. మైదానంలో ఆటగాళ్లు ఆడుతుంటే క్రీడాభిమానులు, ప్రేక్షకులకు ఒకటే ఉత్కంఠ. మన జట్టు గెలవాలని ఆరాటం. అటువంటి ఆటలో నెగ్గాలంటే ఫీల్డింగ్లో రాణించాలి. బ్యాటింగ్లో ఎంతటి నైపుణ్యం కనబరిచినా ఫీల్డింగ్లో విఫలమైతే పరాజయం తప్పదు. మరి అలాంటి ఫీల్డింగ్ కోచ్గా భారత జట్టుకు సేవలందిస్తున్నాడు మన హైదరాబాదీ. ఓ సాధారణ క్రికెటరైన అతను ప్రస్తుతం ప్రపంచ క్రికెట్నే శాసిస్తున్న భారత జట్టుకు ఫీల్డింగ్లో మెలకువలు నేర్పించే స్థాయికి ఎదిగాడు. తండ్రి ఆశయం కోసం అహరహం తపించి ఉన్నత స్థానానికి చేరాడు. అతడే రామకృష్ణన్ శ్రీధర్. శనివారం ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. – చైతన్య వంపుగాని సికింద్రాబాద్లోని సిఖ్విలేజిలోని ఎస్సీహెచ్బీ కాలనీలో నివాసం ఉండే రామకృష్ణ, పార్వతి దంపతుల కుమారుడు రామకృష్ణన్ శ్రీధర్. తండ్రి రామకృష్ణకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. శ్రీధర్ను క్రికెట్లో మంచి ఆటగాడిగా చూడాలనేది ఆయన స్వప్నం. 1985లో బేగంపేటలోని ‘రాజాజితేంద్ర’ స్కూల్లో శ్రీధర్ 10వ తరగతి పూర్తి చేశాడు. వెస్లీ కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యాడు. 1986లో క్రికెట్ కోచ్ సంపత్కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెరిగింది. ‘హైదరాబాద్ బ్లూస్’ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1989లో ఎస్బీహెచ్లో క్యాషియర్ ఉద్యోగంలో చేరాడు. ఆ బ్యాంకు తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడి ప్రతిభను కనబరిచాడు. రంజీ ప్లేయర్గా గుర్తింపు 1989లో కేరళలో జరిగిన రంజీ ట్రోఫీ లీగ్లో శ్రీధర్ ఎస్బీహెచ్ తరఫున బరిలోకి దిగాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గాయాలపాలై కొన్ని రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. రంజీ ప్లేయర్గా ఆడుతున్న సమయంలో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా ఫీల్డింగ్ కోచ్గా.. సాదాసీదాగా వెళ్తున్న శ్రీధర్ జీవితంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2014లో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్)లో ‘కింగ్ లెవన్ పంజాబ్’ జట్టుకు కోచ్గా చేసే అవకాశం వచ్చింది. ఇదే ఏడాది భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ అరుణ్ అర్ధరాత్రి ఫోన్ చేసి.. ‘శ్రీధర్ ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా చేస్తావా? అని అడిగాడు. నేను వెంటనే సరేనన్నాను. ఆ మరుసటి రోజు ఉదయం బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా చేయాలని అడిగారు. వెంటనే ఒప్పుకొన్నా’ అన్నాడు శ్రీధర్. భుజం తట్టిన ధోని.. క్రికెట్ ప్రపంచంలో ధోని, విరాట్ కోహ్లీ ఎంతో అరుదైన ఆటగాళ్లు. వీరికి ఫీల్డింగ్ నేర్పించడమంటే కత్తిమీద సామే. ‘మొదటి రోజు ధోని వద్దకు వెళ్లి నేను కొత్త కోచ్ని కదా. మీకు నేను ఎలా ఉపయోగపడగలనో చెప్పండి, ఆ విధంగా ఉంటా అని చెప్పాను. ఆయన నా భుజం తట్టాడు. ఇప్పుడెలా ఉన్నావో ఇకముందు కూడా అలాగే నీ ప్రయాణం సాగించు అని ధైర్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని నేనెప్పుడూ మరిచిపోను’ శిష్యుడు.. విహారీ ‘2003లో 20 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకువచ్చి నా చేతిలో పెట్టారు. ఆ పిల్లల్లో ప్రస్తుత ఇండియన్ ప్లేయర్ హనుమ విహారీ కూడా ఉన్నాడు. 20మందిని మంచి క్రీడాకారులుగా చేశా. ఇప్పుడు విహారీ భారత్ జట్టు తరఫున ఆడటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను బ్యాట్ పట్టించిన వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం.. విహారీ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది’ అన్నాడు శ్రీధర్. ఫీల్డింగ్ స్టాటిటిక్స్ వచ్చుండాలి.. ‘క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉంటాయి కానీ.. ఫీల్డింగ్కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉండవు. నేను కోచ్గా ఉన్నప్పటి నుంచి ఫీల్డింగ్లో అనేక మార్పులు వచ్చాయి. ఫీల్డింగ్లో మనోళ్లు ది బెస్ట్గా ఉంటున్నారు. ఫీల్డింగ్లో స్టాటిటిక్స్ అనేవి ప్రేక్షకులు చూపిస్తే ఆటగాళ్లకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ.. నేను చెప్పగలను, ఏ ఆటగాడు ఎన్ని బాల్స్ ఆపాడు, ఎన్ని క్యాచ్లు పట్టాడు, ఎన్ని రన్ అవుట్స్ చేశాడని. వచ్చే వరల్డ్కప్ సమయానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో రాణించి విజయం సాధిస్తాం’ అంటూ ముగించాడు శ్రీధర్. ‘కొన్ని మ్యాచుల్లో ఆటగాళ్లను చాలా దగ్గరగా గమనించాను. వారిలో ఉన్న లోపాలను గుర్తించాను. వాటిని పాయింట్ అవుట్ చేశా. ఇవి విజయానికి దారి తీస్తున్నాయి’. -
కూర్చోనివ్వని సినిమా
మనుషులతో వాస్తవం నిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. కళ్లకు కట్టిన గంతలు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందోనని భయం. చేదు నిజంలో కంటె, తియ్యని అబద్ధంలో జీవించడమే మనిషికి ఆనందం. అయితే ఒక చేదు నిజాన్ని విని గుండె ఆగినంత పనైంది ఆ తల్లికి! అయినప్పటికీ కుమారుడిని అర్థం చేసుకుంది. భర్తతో పోరాడింది. కొడుకుకు, భర్తకు మధ్య నలిగిపోయింది. ఈ థీమ్తో ఒక సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు క్వీర్ సినిమాలు (హోమో సెక్సువల్) తీయడంతో సిద్ధహస్తుడైన శ్రీధర్ రంగాయన్. ఆ చిత్రం పేరు ‘ఈవెనింగ్ షాడోస్’. జనవరి 10న మెట్రో నగరాల్లోని పరిమిత థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అబ్బాయి ఊరి నుంచి రాగానే వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయికి విషయం చెప్పారు. అయితే ఆ అబ్బాయి.. ‘‘అమ్మా! ఎందుకో నాకు అమ్మాయిల మీద మనసు పోవట్లేదు’ అన్నాడు. తల్లి షాకయ్యింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ‘ఈవెనింగ్ షాడోస్’ చిత్రంలోని సీన్ ఇది. ముంబైకి చెందిన ఒక యువకుడు కర్ణాటకలోని తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని చూడటానికి తనకు మనస్కరించడం లేదని, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తాను ‘గే’ అని తల్లికి చెప్పుకుంటాడు. ఆవిడకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ యువకుడి పేరు కార్తిక్ (దేవాంశ్ దోషి). మోనా అంబేగాన్కర్ కార్తిక్ తల్లిగా నటించారు. అనంత్ మహదేవన్, అర్పిత్ చౌదరీ, యామినీ సింగ్, అభయ్ కులకర్ణి, వీణా నాయర్, దిశా ఠాకూర్ ఇందులో నటించారు. 2018, జనవరి 11న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించి, అవార్డులు అందుకున్నారు. చాలామంది గేలను కలిసి, వారి జీవితాల గురించి స్వయంగా తెలుసుకున్న అనుభవంతో ఈ చిత్రం తీశారు రంగయాన్. బెంగళూరు ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇబ్బందిపడడం గమనించారు రంగాయన్. ముఖ్యంగా మగవారు ఇబ్బంది పడటం ఆయనకు కనిపించింది. కొందరు హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడటం వలన చిత్రం గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు రంగాయన్. ఈ కథను రంగాయన్ 2009లో రాయడం ప్రారంభించారు. సినిమా తీయడానికి తగినంత డబ్బు దొరకడంలో ఆలస్యం జరగడంతో, ఏడు సంవత్సరాల తరవాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. బాలారిష్టాలు దాటుకుని 2016లో చిత్ర నిర్మాణం ఊపందుకుంది. తియ్యడం వరకు బాగానే ఉంది కానీ, విడుదల చేయడం ఇబ్బందికరంగా మారింది. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అందువల్ల ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. 200 థియేటర్లలో శుక్రవారం నాడు విడుదల చేసే పద్ధతి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. అన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎవ్వరూ వెళ్లి చూడరు. తక్కువ స్క్రీన్లు ఉన్నచోట విడుదల చేసి, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వస్తుందో చూడాలనుకుంటున్నారు రంగాయన్. – జయంతి -
విశాఖ ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఏడీ కొత్తరోడ్డులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణాన్ని చలార్చడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్తో పార్టీకి చెందిన ఇతర నాయకులు.. శ్రీధర్కు సంఘీభావంగా ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకుడిని విడిచిపెట్టాలని స్థానికులు, కార్యకర్తలు ఉదయం నుంచి పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ.. పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నందువల్లే శ్రీధర్ను అరెస్ట్ చేసి ఉంటారని అన్నారు. గతరాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్లోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులు చేతబడి ప్రమోగించి పలువురి మరణానికి కారణం అవుతున్నారంటూ ఆరోపిస్తూ స్థానికులు వారిపై దాడికి దిగారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయారని.. దీనికి ఆ దంపతులే కారణమని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు. స్థానికులు ఆ దంపతులను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలలకొంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జియ్యాని శ్రీధర్తోపాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అనుకోకుండా అల్లరి చెలరేగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మహిళలను అని కూడా చూడకుండా చితకబాదారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. -
మహాకూటమిలో కాంగ్రెస్ టిక్కెట్ల గోల
-
2 గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ.. టాప్ స్వీట్ షాప్స్ నుంచే.. హైదరాబాద్లో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం. విదేశాలకు అయిదు రోజుల్లో.. ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 48 గంటల్లో కస్టమర్కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం. స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి. -
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
నాగర్కర్నూల్ క్రైం: ఎన్నికల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబం ధిం చిన వీడియోలు, సీసీ కెమెరా పుటేజీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి అధికారి ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వీవీ ప్యాట్లపై పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ట్రబుల్ మంగర్స్(ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారు) ను బైండోవర్ చేయాలని, రిటర్నింగ్ అధికారుల తో కలిసి రూట్ మ్యాప్ను తయారు చేయాలని సూచించారు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు డీఎస్పీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, వారి నిర్వర్తించే బాధ్యతలను వీడియోలలో చిత్రీకరించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ఇష్టం వచ్చిన వారికే ఓటు వేసుకునేలా ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వేసుకోవడానికి రెవెన్యూ అ«ధికారులతో కలిసి వర్ణలేబుల్టీ మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన శాంతిభద్రతల నివేదికను ప్రతిరోజూ ఎన్నికల అధికారికి , కలెక్టరేట్కు పంపాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ప్రతి నియోజకవర్గంలోమూడు చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు వీడియోలు తీయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హైపర్ క్రిటికల్, క్రిటికల్ , నార్మల్ పోలింగ్ బూత్లను వెంటనే గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పని తీరు గురించి గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఓటింగ్ మిషన్ ,వీవీ ప్యాట్ల పనితీరు గురించి తెలియజేస్తూ సందేహ నివృత్తి చేయాలన్నారు. వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం వీవీ ప్యాట్ల పనితీరు గురించి కలెక్టర్ శ్రీధర్ మాక్ పోలింగ్ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన ఉండాలి ఈవీఎం, వీవీ ప్యాట్ల గురించి ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండి.. క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఎస్పీ సాయిశేఖర్ ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చి సమాచారం అడిగిన ఓటరుకు వివరాలు సవివరంగా తెలిపేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల మ్యాన్యువల్ చదివి ఉండాలని సూచించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహులు, పుష్పారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
గోప్యత పేరుతో అడ్డుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ.. ‘సమాచార హక్కును గోప్యత పేరుతో అడ్డుకోరాదు. గోప్యత హక్కును దుర్వినియోగం చేసి సమాచారాన్ని నిరాకరించరాదు. ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించా. గోప్యత పేరుతో ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారాన్ని నిరాకరించే ఆఫీస్ మెమోరాండంను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి. అడిగిన వివరాలు వెల్లడించాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ డీవోపీటీగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మరో ఆఫీస్ మెమోరాండంను విడుదల చేయాలి. అప్పుడే గోప్యత హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. -
స.హ.చట్టం బాగా పనిచేస్తోంది: మాడభూషి
హైదరాబాద్: దేశంలో సమాచార హక్కు(స.హ)చట్టం సక్రమంగా పనిచేస్తోందని ప్రతీ ఏడాది 60– 70 లక్షల మంది చట్టాన్ని విని యోగించుకుంటున్నారని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, యుగాంతర్ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. అంతకుముందు యూఆర్టీఐ.ఇన్ వెబ్ సైట్ను ఆవిష్కరించారు. వ్యవస్థల పనితీరు, అందులోని లోటుపాట్లు ప్రశ్నించేందుకు ఆర్టీఐను ఉపయోగించుకోవాలన్నారు. ఒక పత్రికలో వార్తను చూసి వంద ఆర్టీఐలు వేయవచ్చన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి ఉం దని, కాని కమిషనర్కు జీతం అంశా న్ని మాత్రం కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే దీన్ని ఏ రాష్ట్రం ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంస్థలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలుండాలని, జాతీయ మహిళా కమిషన్లో ఆ కమిటీ ఉందా? అని ప్రశ్నించారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు శిక్షణ, పరిశోధనకు ఒక సంస్థ ఉండాలనే దీన్ని ఏర్పాటు చేశా మని త్వరలోనే మరికొన్ని కోర్సుల్ని ప్రారం భించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెబ్సైట్ నిర్వాహకుడు సుశీల్, యుగాంతర్ డైరెక్టర్ శశికుమార్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనికేషన్ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం, కార్మికులకు మధ్య సరైన కమ్యూనికేషన్ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు, గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు, సాధించలేక పోవడానికి గల కారణాలు, ఓపెన్కాస్ట్(ఓసీ) గనుల యంత్రాల పనితీరు వంటివాటిపై కార్మికులకు వివరించాలని నిర్ణయించారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా భారీ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. సదస్సులు, సమావేశాలకు ఐఈడీ విభాగం ఏరియా జనరల్ మేనేజర్లు సారథ్యం వహించనున్నారు. సింగరేణిలో మొత్తం 19 ఓసీ గనులు, 29 భూగర్భ గనులు, వర్క్షాపులు, తదితర విభాగాల నుంచి 54 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక స్థితి, ప్రణాళికలు, ఉత్పత్తి వంటి విషయాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం ఆయా అంశాలపై కార్మికుల అభిప్రాయాలు సేకరించనున్నారు. కార్మికుల ఇబ్బందులను తొలగించేలా వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. గతంలో ఇలాంటి సమావేశాల్లో కార్మికుల సలహాలు, సూచనలపై శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గనుల్లో క్యాంటీన్ల పరిశీలన, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని భారీ పరస్పర ప్రయోజనకర కమ్యూనికేషన్స్ ప్రక్రియగా సీఎండీ శ్రీధర్ భావించి ఏటా సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. యంత్రాల వినియోగం, గనుల్లో నష్ట నివారణ చర్యలు వంటి అంశాలను పొందుపరిచిన సీఎండీ లేఖను ఆదివారం నుంచి అన్ని ఏరియాల్లో పంపిణీ చేయనున్నారు. టీంలు సంసిద్ధం ప్రతి ఏరియాలో ఈ సమావేశాల కోసం ఏరియా జీఎం అధ్యక్షతన పర్సనల్, ఫైనాన్స్, ఐఈడీ, సేఫ్టీ అధికారులతో కూడిన మల్టీ డిపార్ట్మెంట్ టీంలను సిద్ధం చేశారు. సమావేశాలు, సదస్సుల్లో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరాలను వివరిస్తారు. మొత్తం 250కిపైగా సమావేశాలు నిర్వహించి సింగరేణిలోని ప్రతి కార్మికుడికి సందేశం చేరేలా ఏర్పాటు చేశారు. -
షకలక శంకర్పై శ్రీరెడ్డి ఫైర్..
సాక్షి, సినిమా: ఇటీవల టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమెడియన్ షకలక శంకర్ను ఉద్దేశించి తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా, కారుణ్య కథానాయికగా, శ్రీధర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’. సినిమా ఈ నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నేను ఎవరిని పొగుడుతూ.. వారిని ఓరేంజ్కి ఎత్తేసి వాళ్ల పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. అయితే ఇటీవల కొంత మంది భక్తులు.. ఓ హీరో భక్తులు.. ఆ హీరోకి తెలియంది ఏంటంటే అతని పేరు చెప్పుకొని అతన్ని దేవుడు.. మా కోసం ఎంతో చేస్తున్నాడు అంటూ.. మొత్తం మీద బతికేస్తున్నారు.. బతకండీ.. ఆ హీరో ఫ్యాన్స్ని వాడుకోండి. మీ సినిమా ఓపెనింగ్స్కి కావాలి కదా.. వాడుకోండి.. ఓపెనింగ్స్ కోసం ఆ హీరోని పొగడటం.. మీ ఊరు వచ్చినపుడు ఆయన్ని నెత్తిన పెట్టుకొవడం.. మీరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించడం తప్పులేదు.. కానీ నా పేరు అనవసరంగా మద్యలో తీశారంటే మాత్రం పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా... ఓ కమెడియన్వి హీరోగా ఇంట్రడ్యూజ్ అయ్యావు.. నీ పని ఏదో నువ్వు చూసుకో.. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. అందరికీ ఒకటే చెబుతున్నాను.. మీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు..నువ్వేం పెద్ద గొప్పోడివి కాదు.. కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర.. సమయం వచ్చినపుడు అందరి కథలు బయటికొస్తాయి. నీ సినిమా ఓపెనింగ్స్ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడం మంచింది కాదు.. దాని కోసం నన్ను మద్యలో లాగటం కరెక్ట్ కాదు. నీ లాంటి పిచ్చ సినిమాలు నేను చూడను అని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
32 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
సాక్షి, కొత్తగూడెం: వచ్చే ఏడాది రూ.32 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రూ.18 వేల కోట్లు, ఈ ఏడాది రూ.23 వేల కోట్ల టర్నోవర్ సాధించి నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం 52 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ.. ఈ ఏడాది 66 మిలియన్ టన్నుల రవాణాకు ప్రణాళికలు రూపొందించుకుందని, ఈ విషయంలో గత మూడేళ్లలో వరుసగా 11.5శాతం, 4శాతం, 10శాతం వృద్ధి సాధించిందని వివరించారు. 2015లో రూ.1,050 కోట్లు, 2016లో రూ.800 కోట్ల లాభాలు గడించామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 12 కొత్త గనులు ప్రారంభిస్తున్నామని, ఇందులో 6 ఓసీలు, 6 భూగర్భగనులు ఉన్నాయని తెలిపారు. సింగ రేణి ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోందన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ను తీసుకున్నామని, రెండు, మూడేళ్లలో నైనీ బ్లాక్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టామని, 11 ఏరియాల్లో ఒక్కొక్కటి 500 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. జైపూర్లో ఏర్పాటుచేసిన థర్మల్ ప్లాంట్తో పాటు సోలార్ ప్లాంట్ల ద్వారా 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు వేతనంతో కూడి న సెలవులు ఇస్తూ సర్క్యులర్ జారీ చేశామన్నారు. -
సౌతిండియా మాఫియా డాన్ ఆత్మహత్య..
సాక్షి, చెన్నై: నిన్నటి వరకూ దక్షిణ భారతాన్ని గడగడలాడించిన డాన్ ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు పోలీసులతో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన డాన్ శ్రీధర్ ధనపాలన్(44) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన శ్రీధరన్ గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే దక్షిణ భారత దావూద్ ఇబ్రహీంగా పేరుపొందాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 43కేసులు నమోదయ్యాయి. ఇందులో 7హత్యారోపణలు కూడా ఉన్నాయి. అనంతరం పోలీసుల తనిఖీలు పెరిగిపోవడం, పెద్ద మాఫియా డాన్గా ఎదగాలనే కోరికతో పోలీసుల కన్ను కప్పి కంబోడియాకు పారిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మద్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో విసుగు చెంది తన నివాసంలో సైనేడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం 6.30 ప్రాంతంలో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2013లో భారత్ నుంచి తప్పించుకొని కంబోడియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. శ్రీధర్కు భార్య, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే శ్రీధర్ మరణ వార్త విని అతని స్వస్థలం కాంచీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాల్లేవు
జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ హైదరాబాద్: ఉద్దానం నీటిలో ఎలాంటి ప్రమాదకర మూలకాల్లేవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ తెలిపారు. ఇటీవల తాము జరిపిన పరిశోధనల్లో ఈ అంశం స్పష్టమైనట్లు పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి వేలాది మంది మృతి చెందడానికి కారణం అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షల్లో తేలిందనడం అవాస్తవమని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆగస్టులో ఉద్దానం నుంచి సేకరించిన 12 నీటి నమూనాలను పరీక్ష కోసం అందజేసినట్లు తెలిపారు. వాటితో పాటు మరో 8 నమూనాలను తమ సిబ్బంది సేకరించారని, వాటితో కలిపి మొత్తం 20 నమూనాలను పరీక్షించగా ఎలాంటి హానికరమైన మూలకాలు అందులో లేవని తేలిందని వివరించారు. ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాలు ఉన్నాయని జీఎస్ఐ నిర్ధారించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రాజారెడ్డి చెప్పారని పేర్కొనడం సరైంది కాదన్నారు. ఆయనను ఫోన్లో సంప్రదించగా ఉద్దానం నీటిలో ప్రమాదకరమైన మూలకాలు ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదని చెప్పినట్లు వివరించారు. కాడ్మియం, క్రోమియం, సిలికా, లెడ్ మూలకాలు అధికంగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే రాజారెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ఉద్దానం పరిసర ప్రాంతాలపై అధ్యయనానికి జీఎస్ఐ 2018–19 సంవత్సరంలో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో ఆర్ఎంహెచ్–3 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రేమ్చంద్, డైరెక్టర్ కె.రవి, కెమికల్ ల్యాబ్ డైరెక్టర్ శోభారాణి, అజయ్కుమార్, కామేశ్వర్ పాల్గొన్నారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో విశేషంగా కృషి చేసిన డాక్టర్ రాజారెడ్డి చెప్పిన అంశాల మేరకే సమావేశంలో చెప్పామని, జీఎస్ఐ అధికారుల ప్రకటనపై ఆయనే స్పందించాల్సి ఉందని, శాస్త్రీయ అంశాల్లో తమకు ప్రవేశం లేదని కె.రామచంద్రమూర్తి తెలిపారు. -
ఆ ఇద్దరు సబలలకు సలాం
విశ్లేషణ ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్ల కోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశ పాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటే సుదీర్ఘ పోరాటాన్ని తలచుకుంటూ రాంరహీం బాబా అత్యాచార బాధితులు అన్నమాట ఇది: ‘‘డబ్బున్న అత్యంత శక్తిమంతులపైన యుద్ధం ఎంతో కష్టం, న్యాయం దాదాపు అసాధ్యం, అయినా ‘‘ఉమీద్ కీ కిరణ్ హై’’ (ఆశాకిరణం ఉంది). నేరగాడికి శిక్ష తప్పదని నమ్మాం’’. దారుణమైనదంటూ పాత ప్రభుత్వాన్ని ఓడిస్తే, కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రిమండలి రేప్ కేసులలో ప్రథమ నిందితుడికి మోకరిల్లింది. సార్వభౌమత్వాన్ని అతని పాదాక్రాంతం చేసిన దశలో, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ఈ ముఠా నాయకుడికి దాసోహం అంటున్న దుర్దశలో ఏటికి ఎదురీదుతూ, పోలీసులకు, న్యాయస్థానానికి నిజాన్ని నివేదిస్తూ, సాక్ష్యాలు చూపుతూ, చాలా సులువుగా వచ్చి పడుతున్న అపారమైన మురికి డబ్బు లక్షలకు లక్షలు తీసుకుని నేరగాడిని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల అవమానకరమైన క్రాస్ ఎగ్జామినేషన్తో పాటు అనేక దుర్మార్గాలను సహిస్తూ బోనులో కూలిపోకుండా నిలబడి న్యాయ పోరాటం చేసిన ఆ ఇద్దరు సాధ్వీల సాహసాన్ని ఏ విధంగా ప్రశంసించాలి? సరిహద్దులో నిలబడి, భయానకమైన చలిలో చలించకుండా, ఆకాశం నుంచి పిడుగులు కురిపిస్తున్నా, ఎదురుగా శత్రువు ఫిరంగులు పేలుతున్నా పోరాడుతున్న సైనికుని ధైర్యం కన్న గొప్ప ధైర్యం వారిది. అధికార పార్టీ ఏజెంట్ అన్న నిందను భరించే సీబీఐ ఈ కేసు పరిశోధనలో చూపిన నిజాయితీ వల్లనే న్యాయం బతికింది. పేరు దాచి రాసిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోరు. కాని సాధ్వి నాటి ప్రధానికి, పంజాబ్ హరియాణా చీఫ్జస్టిస్కు రాసిన ఉత్తరం పనిచేసింది. సిర్సా జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నుంచి నివేదిక తెప్పించుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కీలకమైన మలుపు. 150 మంది బాధితులున్నారని తేల్చి, వారిలో 130 మందిని కనిపెట్టినా ఇద్దరు సాధ్వీలు మాత్రమే నిజం చెప్పే సాహసం చేశారు. 2008లో సీబీఐ కోర్టు రేప్ ఆరోపణలు నిర్ధారించింది. ఉత్తరం అజ్ఞాతంగా రాయడమే సాహసం. కాని బహిరంగంగా సాక్ష్యం చెప్పడం మరింత సాహసం. తరువాత వారి జీవితం దుర్భరమైంది. బతకడమే సాహసమైంది. డేరా బాబా అనుమతి లేకుండా ఏదీ జరగని రాష్ట్రం, ఏదీ చేయని రాజ్యం. మరోవైపు నేర డేరాను ఒక్క మాటన్నా చంపి పారేసే లక్షల నేరభక్తులు. ఒక నేరగాణ్ణి దేవుడనీ, వాడు చెప్పేది దైవ సందేశమనీ నమ్మే పిచ్చి జనం. కూతుళ్లు చెప్పే నిజాలు నమ్మక డేరాబాబాను మాత్రమే నమ్మి, బాబా దుర్మార్గాలను వివరిస్తే తప్పు చేస్తున్నావని మందలించే తల్లిదండ్రులు. పారిపోవాలనుకున్నా వెళ్లనీయని టెర్రర్. డేరా నడిపే పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలు. 1999లో అమాయక బాలికలపై బాబా అత్యాచారాలు ఆమెకు అర్థమయ్యాయి. బాబాకు ఒక గుఫా (గుహ) ఉంటుంది. గుఫా ప్రవేశ ద్వారానికి కాపలాగా ఈ ఆడవారిని నియమిస్తారు. ఈ టీచర్ బాధితురాలు కూడా ఒక కాపలాదారు. లోపలికి వెళ్లి కొంతసేపటికి ఏడుస్తూ వచ్చిన అమ్మాయిలను ఈ టీచర్ గమనించారు. ఆమెపై కూడా అత్యాచారాలు జరిపారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను సొంత గ్రామానికి పంపించారు. చివరకు మొత్తం కుటుంబం 2001లో వెళ్లి పోయింది. అప్పటి నుంచి బెదిరింపుల మధ్య భయం భయంగా బతుకుతున్నారు. 2002లో డేరా గూండాలు ఆమె తమ్ముడిని కాల్చి చంపారు. దుర్మార్గాన్ని వెల్లడించిన జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతిని డేరా మనుషులే చంపేశారు. ఇది నేరగాళ్లు–రాజ్యం కలిసి పన్నిన పద్మవ్యూ హం, అభిమన్యుడివలె అందులోనే చావకుండా పోరాడి బతికి బయటపడి, ఎలుగెత్తి అన్యాయాన్ని చాటిన ఆ ఇద్దరిలో ఒకరు ధైర్యలక్ష్మి, మరొకరు సాహసలక్ష్మి (అసలు పేర్లతో పనిలేదు). ఈ కీచకబాబా వందలాది మహిళలపై అత్యాచారం చేశాడు. కుటుంబంలో కుల సమాజంలో పరువుపోతుందని భయపడి నోరువిప్పని వారే అందరూ. ‘‘2002 నుంచి రాజకీయ ప్రభుత్వాలన్నీ నేరవిచారణను, ప్రాసిక్యూషన్ను నీరు గార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కనుక ఈ డేరాబాబా దేన్నయినా మాయచేయగలడనుకున్నాం, అయినా న్యాయం గెలిచింది’’ అని సాధ్వి అన్నారు. 28 మంది సాక్షులు, 14 పత్రాల వల్ల నేరం రుజువైంది. అవతార్ సింగ్, ఇందర్ సింగ్, కిషన్ లాల్ అనే బాబా ఆంతరంగికులైన సహ నిందితులు లై డిటెక్టర్ పరీక్షలో అసంబద్ధంగా మాట్లాడడం, పాలిగ్రాఫీ పరీక్షలో బాబా ప్రేలాపన నేరగాడిని పట్టించింది. ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్లకోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశపాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
కామెడీ థ్రిల్లర్
తెలుగు, హిందీ, మలయాళంలో పలు చిత్రాలకు స్వరాలందించిన సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ కీలక పాత్రలో నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘రావోయి.. మా ఇంటికి’. ఆయనే స్వరకర్త. శ్రీధర్, కావ్యా సింగ్, అవంతిక ముఖ్యతారలు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేసి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు. ‘‘కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కథే మా చిత్రంలో హీరో. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉంటుంది. పాటలు, సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాకేత్ సాయిరామ్. ‘‘కామెడీ చిత్రమైనా నా పాత్రలో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి’’ అన్నారు హీరో శ్రీధర్. అవంతిక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె. దిలీప్ కుమార్ రెడ్డి, డి.కె. గోయల్ పాల్గొన్నారు. -
నిజ జీవితంలోనూ మున్నాభాయ్లేనా?
ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, అక్రమార్కులను శిక్షించలేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది. మున్నాభాయ్ సినిమాలో ఎవడో ప్రవేశ పరీక్ష రాస్తాడు, హీరోకు మెడికల్ కాలేజిలో సీటు వస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని వేలమంది మేధావులు డబ్బు తీసుకుని వేరే వ్యక్తులకోసం పరీక్షలు రాసారు. ఉద్యోగాలకు ఎంపికై అనేక విభాగాల్లో చేరిపో యారు. వ్యాపం కుంభకోణం అని ప్రసిధ్ధి చెందిన ఈ అక్రమాల పుట్ట ఎంత లోతుగా ఉందో ఇంకా తెలియడం లేదు. అటువంటి అక్రమం ఒకటి కార్మిక భీమా సంస్థలో ఆర్టీఐ జవాబుల్లో తేలింది. కాని విచిత్రమేమంటే పట్టిం చుకునే వారెవరూ లేరు. కార్మిక జీవిత భీమా సంస్థలో గుమాస్తా ఉద్యో గానికి నిత్యానంద్ అనే వ్యక్తి పోటీ పరీక్ష రాసినప్పుడు ఇచ్చిన హాజరు పత్రం, ప్రవేశపత్రం (అడ్మిట్ కార్డ్) ప్రతులు ఇవ్వాలని హరీందర్ దింఘ్రా ఆర్టీఐ దర ఖాస్తులో కోరారు. అతనికి ఆ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పమన్నాడు. ఈఎస్ఐసీ వారు అతను క్లర్క్ ఉద్యోగానికి ఎంపిక కాలేదని జవాబిచ్చి ఫైలు మూసేశారు. సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీలు చేరింది. 2009 సెప్టెంబర్ 20 వ తేదీన జరిగిన గుమాస్తా ఉద్యోగ కంప్యూటర్ నైపుణ్యపోటీ పరీక్షలో పాల్గొన్న 17 మంది అభ్యర్థులు అడ్మిట్ కార్డుపైన చేసిన సంతకాలకు ఆ తరువాత పరీక్ష హాజరు పత్రం మీద చేసిన సంత కాలకు చాలా తేడా ఉంది. తాను చేతిరాత నిపుణుడు కాకపోయినా తేడా చాలాస్పష్టంగా తెలుస్తున్నదనీ. ఈ తేడాలున్నప్పటికీ 17 మందిని ఎంపిక చేశారనీ, వారు గుమాస్తాలుగా పనిచేస్తున్నారనీ హరీందర్ వివరిం చారు. పరీక్ష రాసే తెలివి లేని వారికి ఉద్యోగాలు ఇప్పిం చడానికి వేరెవరో తమ తెలివిని అమ్ముకున్నారన్నమాట. ఎనిమిది మంది ఎల్డీసీలుగా చేరి యూడీసీలుగా ప్రమోషన్ కూడా పొందారు. ఇది కేవలం ఎనిమిది మంది సమస్య కాదని, కొన్ని వందల మందిని అక్రమంగా నియమించిన పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్పారు. ఈ విషయంలో హరీందర్ అడిగిన పత్రా లన్నీ ఇచ్చారు. కాని అభ్యర్థుల బొటన వేలి ముద్రలున్న కాగితాల నకళ్లు ఇవ్వలేదన్నారు. తాము అభ్యర్థుల వేలి ముద్రలు సేకరించలేదని అధికారి వివరించారు. అడిగిన సమాచారం చాలావరకు ఇచ్చినా తీవ్రమైన స్థాయిలో జరిగిన అక్రమాన్ని ప్రభుత్వ సంస్థ గుర్తించకపోవడం ఆశ్చర్యం. సమాచారం కేవలం తెలుసుకోవడంకోసమే అడగరు. దాని వెనుక ఒక బాధ, ఫిర్యాదు, లంచగొండి తనం, అక్రమం, అన్యాయం, ప్రభుత్వాల నిష్క్రియ ఉంటాయి. ఆర్టీఐ వీటిని ప్రశ్నిస్తుంది. విభిన్న హోదాలకు రకరకాల పరీక్షలు నిర్వహించి నియమించిన కనీసం 800 మంది వ్యవహారంలో వారి బదులు వేరే అభ్యర్థులు పరీక్ష రాసారని, 11 ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా ఈ గందరగోళం వెల్లడయిందని హరీందర్ కమిషన్కు వివరించారు. ఈ ఆర్టీఐ జవా బులు వచ్చిన తరువాత తాను అనేక పర్యాయాలు అధి కారుల దృష్టికి ఈ అక్రమాలు తెచ్చానని కాని ఎవరూ పట్టించుకోలేదని హరీందర్ వివరించారు. ఈ విధంగా అనర్హులైన వారు ఉద్యోగాలు చేస్తుంటే, కార్మికుల హక్కులు రోజూ భారీ ఎత్తున భంగపడుతూనే ఉంటా యని అన్నారు. ఈ అక్రమాలపైన దర్యాప్తు జరిపితే తాను సేకరించిన ఈ పత్రాల ద్వారా రుజువు చేయ గలనన్నారు. అన్ని ప్రతులను జతచేసి సమగ్రమైన ఫిర్యాదు పత్రాన్ని విజిలెన్స్ శాఖకు సమర్పించిన తరువాత కూడా ఏ కదలికా లేదన్నారు. ఆర్టీఐ ప్రశ్నలు వచ్చిన వెంటనే లేదా వివరమైన ఫిర్యాదు అందగానే దర్యాప్తు జరిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇటువంటి అన్యాయాలను వెలికి తీయడానికే సమాచార చట్టాన్ని తెచ్చారు. ప్రజాప్రయోజనం అధికంగా ఉన్న ఆర్టీఐ అప్పీలు ఇది. ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన ఈ సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, ఏదో ఒక జవాబిస్తు న్నారే గాని అక్రమార్కులను శిక్షించే పని చేయక పోవడం చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు అవి నీతిలో ఎంతగా కూరుకుపోయాయో ఊహించవచ్చు. ఎల్డీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థు లకు కంప్యూటర్లో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన పరీక్షలలో కనీసం 40 మార్కులు రావా లని నిర్ణయించారు. దరఖాస్తు దారులకు బదులుగా రాసిన నకిలీ వ్యక్తుల తెలివి తేటలు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే వీరికి 42, 43కు మించి మార్కులు రాలేదు. వీరి నైపుణ్యం ఆధారంగా ఈ మాత్రం కంప్యూటర్ తెలివి లేని మహానుభావులు ఉద్యో గాలు చేస్తున్నారు. కార్మిక జీవిత బీమా సంస్థలలో వీరు ఏం చేస్తున్నారో? హరీందర్ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలించా లని, లేదా ఈ రెండో అప్పీలునే ఫిర్యాదుగా పరిగణించి దర్యాప్తు చేసి రెండు నెలలోగా ఏ చర్యతీసుకున్నారో వెల్ల డించాలని సమాచార కమిషన్ ఈఎస్ఐసీ సంస్థ ఉన్న తాధికారులను ఆదేశించింది. సంస్థ డైరెక్టర్ జనరల్, కార్మిక ఉపాధికల్పనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా ప్రతులు పంపాలని, కేంద్ర కార్మిక ఉపాధికల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు కూడా ఒక ప్రతి పంపాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఉద్యోగాల నియామక అక్రమాల విషయంలో తగిన చర్య తీసు కోవాలని సూచించింది. (హరీందర్ దింఘ్రా వర్సెస్ పీఐఓ, ఈఎస్ఐసీ ఫరీదాబాద్ కేసులో సమాచార కమిషన్ 24 మార్చి 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా. http://www.cic.gov.in సీఐసీ వెబ్సైట్ లో CIC/BS /A/2016/001489 తీర్పు పూర్తి వివరాలు చూడవచ్చు) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com విశ్లేషణ మాడభూషి శ్రీధర్ -
భారత క్రికెట్ కోచ్ను కలిసిన అఖిల్
బెంగుళూరు: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ను నటుడు అక్కినేని అఖిల్ కలిశాడు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్.. అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ను కలిసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. అఖిల్ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో అఖిల్, శ్రీధర్లు కలిసిదిగిన ఫోటో ఇన్స్టాగ్రాంలో షేర్ అవుతోంది. ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్లలో విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించాడు అఖిల్. It was pleasant surprise to catch up with @akkineniakhil & @rcratul indeed a surprise to meet such well behaved up boys in today's world!! A post shared by R Sridhar (@coach_rsridhar) on Mar 5, 2017 at 7:01am PST -
ఉన్నత విలువలతోనే ఉత్తమ పౌరులు
ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు ఎదుర్కొన్నాను సదస్సులో ఉత్తరాఖండ్ కలెక్టర్ శ్రీధర్బాబు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పిల్లల్లో నిజాయితీ, మానవీయ విలువలు కోల్పోకుండా పెంచితే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తాను ఆ బాటలో నడిచినందునే తన ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగానని ఉత్తరాఖండ్ కలెక్టర్ అద్దంకి శ్రీధర్బాబు అన్నారు. మోరంపూడి సమీపంలోని నామవరం రోడ్డులోనున్న బార్లపూడి కళ్యాణ మండపంలో శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ‘తల్లుల సదస్సు’ (ఎయిమ్స్) మంగళవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వీయ గౌరవం, సమగ్రత అనే రెండు మానవీయ విలువలు పిల్లల్లో పెంపొందించి రాజీపడకుండా జీవించేటట్లుగా పెంచాలన్నారు. అప్పుడే వారు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారన్నారు. తన బదిలీల్లో అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయన్నారు. గ్లోబల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ కేఎస్.రత్నాకర్ మాట్లాడుతూ బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే పిల్లలపై తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ సైకాలజిస్ట్ పి.స్వాతి మాట్లాడుతూ పిల్లలతో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ కారణాలను వివరించారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాతృమూర్తుల సహకారం అవసరమన్నారు. ఈ సదస్సును ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నామన్నారు. విద్యాసంస్థల డైరక్టర్ టి.శ్రీవిద్య, టి.పాలేశ్వరరావు, టి.నాగమణి పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
► 13 మందికి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ► వైరస్ వల్లేనన్న చొప్పదండి ఎస్పీహెచ్వో రవీందర్ చొప్పదండి/కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్లో పదమూడు మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యాలయంలో ప్రార్థన అనంతరం ఒకరి వెంట ఒకరికి విపరీతమైన దగ్గు రావడంతో వారిని ఆటోలలో చొప్పదండి పీహెచ్సీకి తరలించారు. వైద్యులు చంద్రశేఖర్, శ్రీకర్ ప్రాథమిక చికిత్స జరిపారు. విద్యార్థులకు చికిత్స చేసే సమయంలో అక్కడ ఉన్నవారికి కూడా దగ్గు మొదలైంది. ఏదో వైరస్ వ్యాపిస్తోందని గ్రహించి ఆస్పత్రిలో ఉన్న అందరికి మాస్కులు ధరింపజేశారు. విద్యార్థులు దగ్గుతూ ఆయాసపడటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యాధికారులు రెండు అంబులెన్సలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. వారందరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యచికిత్స అందిస్తున్నట్లు ఇన్చార్జి ఆర్ఎంవో శ్రీధర్ తెలిపారు. పలువురు విద్యార్థులు సాయంత్రం వరకు కోలుకోగా వారి తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. మరో ఇద్దరు ముగ్గరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వారాల క్రితం శిరీష, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులకు ఆస్తమా సోకిందని, వారిని వైద్యం కోసం ఇంటికి పంపించామని, పూర్తిగా నయం కాకుండానే తిరిగి కళాశాలకు రావడంతో మిగిలిన వారికి సోకిందని ప్రిన్సిపాల్ వరప్రసాద్చారి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీహిత, శిరీష, పూజ, సమత, శైలజ, సమత, శిరీష, సమత, అక్షిత, అఖిల, అంజలి, తొమ్మిదవ తరగతి విద్యార్థి కావేరి, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి సుష్మిత ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీహెచ్వో రవీందర్ మాడల్ స్కూల్ను సందర్శించి వైరస్ ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. శిరీష, అంజలి ఎక్కువ అస్వస్థకు గురయ్యారని, వారి ద్వారా వైరస్ ఇతరులకు సోకిందని చెప్పారు. శీతాకాలం కావడం, డార్మెటరీలో అపరిశుభ్రత ఉండటం, విద్యార్థులకు సరైన పోషకాలు అందక బలహీనంగా ఉండటం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో అన్వర్, ఎంఈవో రాజాస్వామి, సీఐ లక్ష్మిబాబు విద్యార్థులకు అందుతున్న చికిత్సను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. -
ప్రభుత్వానికి పతనం తప్పదు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ కన్వీనర్ శ్రీధర్ హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరి ష్కరించకపోతే ప్రభుత్వానికి పత నం తప్పదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బుధవారం హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర స్థారుు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ సమస్యలు విన్నవించుకుందామనుకుంటే సీఎం కేసీఆర్ అపారుుంట్మెంట్ ఇవ్వరన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చైనాకు పారిపోతున్నారని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిరాహారదీక్ష చేపట్టనున్నామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతామన్నారు. ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మనది, సీఎం కేసీఆర్ మనోడు, మన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామని, కానీ, అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. -
ఆర్టీఓగా శ్రీధర్ నియామకం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం డివిజన్ రోడ్డు రవాణా అధికారి(ఆర్టీఓ)గా శ్రీధర్ నియమితులైనట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పరిపాలన అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై అనంతపురం ఆర్టీఓగా వస్తున్నారు. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న ప్రతాప్ రిటైర్డ్ అయ్యారు. -
రాజీనామా
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ సి.ఆర్.డి.ఎ. (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారి సంస్థ) కమిషనర్ రాజీనామా..? క్వశ్చిన్ మార్క్తో వెలువడ్డ ఈ వార్త సంచలనం కల్గించింది. సి.ఎం. విశ్వేశ్వరనాయుడు కమిషనర్ శ్రీధర్ రాజినామాను తిరస్కరిస్తూ తొక్కిపెట్టాడు. ఉదయాన్నే కమిషనర్ కలవడానికి వస్తే, రాజధాని నిర్మాణ ప్రాంతంలోని విషయాలను అప్డేట్ చేయడానికి అనుకున్నాడు సి.ఎం. విశ్వేశ్వరనాయుడు. ‘‘మీరు మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే ఈ బాధ్యత అప్పగించాను శ్రీధర్గారూ’’ అన్నాడు నాయుడు. శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు. ఇబ్బందిగా కదిలాడు. ‘‘మనది మహా సంకల్పం ఆఫీసర్. భావితరాల కోసమే ఈ మహా నిర్మాణం’’ చెప్పాడు. ‘‘కాదనలేదు సర్. నేను మీరు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేని అశక్తుడ్ని’’ చెప్పాడు. నాయుడు ఒక నిమిషం సుదీర్ఘంగా శ్వాస పీల్చి ‘‘ఓ...కే. నౌ యు కెన్ గో’’ చెప్పాడు. బంగ్లాకొచ్చిన భర్త శ్రీధర్ని, ఆయన భార్య సుచిత్ర ‘‘ఏమైంది మీ రిజిగ్నేషన్’’ అడిగింది. ‘‘సి.ఎం.గారికి లెటర్ ఇచ్చాను. నాది కేంద్ర సర్వీస్ కాబట్టి ఆల్ రెడీ ఢిల్లీకి ఫ్యాక్స్ చేశా’’ చెప్పాడు. ‘‘ఏకంగా ఉద్యోగానికే రాజినామా చేశారు. ఇప్పుడు మనకు బతుకు తెరువు ఎలా?’’అడిగింది. ‘‘నువ్వు బీఈడీ చేశావుగా. టీచర్ ఉద్యోగానికి ట్రై చేద్దాం. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తా’’ చెప్పాడు. ‘‘పిల్లలిద్దరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మన సంపాదన ఎలా సరిపోతుంది?’’ నిలదీసింది సుచిత్ర. ‘‘నువ్వు వర్క్ చేయబోయే స్కూల్లో మన పిల్లల్ని వేద్దాం. బహుశా స్కూల్ ఫీజులో కన్సెషన్ రావచ్చు. కొంత సేవింగ్స్ వున్నాయ్గా. పిల్లలు ఎదిగే కొద్దీ అవి ఉపయోగపడతాయి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘అయినా సమస్యలకు భయపడి జాబ్ వదులుకోవడం ఏంటండీ’’ అంది నిర్వేదంగా. ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేక నవ్వాడు. నెల వ్యవధిలో ఆరు వేల ఇంట్లో చేరారు శ్రీధర్ దంపతులు. ‘‘పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో. నిన్నటి వరకూ నౌకర్లూ, కార్లూ. ఇప్పుడు మోటార్ బైక్ స్థాయికి వచ్చారు’’ అంది సుచిత్ర నవ్వుతూ. ‘‘అవి ప్రభుత్వం నా పొజిషన్కి ఇచ్చిన ప్రివిలేజస్. ఇది మన కష్టార్జితం’’ చెప్పాడు. స్కూల్లో జాయిన్ అయింది సుచిత్ర. ముందు కాస్త గౌరవించేవాళ్లూ... తర్వాత కలిసిపొయ్యారు. ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ వంటా వగైరా పూర్తి చేసేశాడు. ‘‘మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు. నే వచ్చి చేసుకుంటా కదా’’ అంది బాధగా. ‘‘ఇప్పుడా మాట అంటున్నావ్ గానీ కొద్దికాలం అయ్యాక ఇంట్లో ఖాళీగా వున్నావు కదా. వంటా వార్పూ చెయ్యొచ్చు కదా అంటావ్. నీకెందుకు ఆ అవకాశం ఇవ్వాలని నేనే ‘నలభీముడ్ని’ అయ్యా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘చాల్లే జోకులు ఆపండి. నా భర్త, నా పిల్లలు నాకు భారమవుతారా’’ అంది కోపంగా. ‘‘సాయం చెయ్యడంలో తప్పేం వుంది డియర్’’ భార్య బుగ్గపై చిటికేశాడు. వారం క్రితం సుచిత్ర ‘స్కూటీ’ కొన్నది. దాంట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని పక్కవీధిలో వున్న తన కొలీగ్ వీరశంకర్ దగ్గరకు ట్యూషన్కి తీసుకెళ్లింది. ‘‘ఖాళీగా వున్నాను కదా సుచీ. పిల్లలకు ట్యూషన్ చెబుతాగా’’ అన్నాడు శ్రీధర్. భర్త ముఖంలో చూసి, ‘‘అసలే పిల్లలంటే మీకు ప్రేమ. గారంతో ఏం చెబుతారు. గట్టిగా కూడా కోప్పడరు’’ అంది నవ్వుతూ. ‘‘భర్తని అర్థం చేసుకొనే భార్య దొరకడం కంటే మరో అదృష్టం లేదు’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఎక్కడర్థమయ్యారు మీరు? రాజీనామా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు గదా. బంగారం లాంటి జాబ్’’ అంది. ‘‘నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం నా లోపమే’’ అన్నాడు. ‘‘ఆర్టికల్స్ అన్నా రాయండి. చదువుకుంటా’’ అంది. ‘‘ఆ పనిమీదే వున్నా. కలం మొరాయిస్తుంది’’ చెప్పాడు. నమస్కారం పెట్టి, ‘‘మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి’’ అంది నవ్వుతూ సుచిత్ర. శ్రీధర్ నవ్వి కంప్యూటర్లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ‘‘నేనూ సామాన్యుడనే లక్ష్మయ్యా. ఇంతకంటే ఏం చేయగలను’’ గొణుక్కున్నాడు శ్రీధర్. ‘‘ఎవరతను?’’ అడిగారు శ్రీధర్ అటెండర్ సత్తెయ్యను. రోజూ కారు ఎక్కేప్పుడూ దిగేప్పుడూ కన్పిస్తున్న అతడ్ని చూస్తూనే వున్నాడు. ‘‘మన ల్యాండ్ ఆక్విజేషన్లో భూమి కోల్పోయిన రైతు సర్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘మనం ఇప్పుడు చేసేది ఏం ఉంది? నష్టపరిహారం ఇచ్చాంగా’’ చెప్పాడు శ్రీధర్. ‘‘తన భూమి తనకి కావాలంట సార్’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘అది మన చేతుల్లో ఏముంది? ప్రభుత్వ ఆదేశాలని అమలు చేయడం మన డ్యూటీ కదా’’ అని... క్యాంప్ క్లర్క్ని లైన్లోకి పిలిచి ‘‘ఆ రైతుని కన్విన్స్ చేసి పంపండి’’ చెప్పాడు. సి.సి.శర్మ... ‘‘అలాగే సర్’’ చెప్పాడు. రోజూ డ్యూటీకి వచ్చి కార్లోంచి దిగి అటువైపు చూడ్డం అలవాటైంది శ్రీధర్కి. అతడు కన్పించలేదు. ‘‘ఏం చెప్పి పంపారు’’ అడిగాడు. ‘‘ఏమో సార్. మన సి.సి.గారు చెప్పారు’’ చెప్పాడు సత్తెయ్య. మరో వారం గడిచింది. లక్ష్మయ్య కన్పించలేదు. సి.సి.ని పిలిచి ‘‘నన్ను కలవాలని ట్రై చేశాడే రైతు. అతడెక్కడున్నాడు?’’అడిగాడు శ్రీధర్. ‘‘అతడిది ఏ గ్రామమో తెలీదు సర్. కానీ కమిషనర్గారి చేతిలో ఏమీ లేదు. ఎన్నిసార్లు వచ్చినా ఫలితం లేదని చెప్పా. అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇక రావడం లేదు’’ చెప్పాడు. శ్రీధర్కి అసంతృప్తిగా ఉంది. ఒక్కసారైనా తను మాట్లాడి వుండాల్సింది. తప్పు చేశానా? అతడి అంతరాత్మ నిలదీసింది. రెండ్రోజుల తర్వాత సి.సి. ఒక రిజిష్టర్ కవర్ ఓపెన్ చేసి తెచ్చి, శ్రీధర్ ముందు పెట్టాడు. ‘‘ఏంటి?’’ అన్నట్టు నొసలు ముడివేసి చూశాడు శ్రీధర్. ‘‘లక్ష్మయ్య రాసుకున్న చివరి లేఖ సర్’’ అన్నాడు సి.సి.. టపాల్ ఓపెన్ చేసి కమిషనర్ ముందు పెట్టడం సి.సి.కి అలవాటు. వణికే చేతుల్తో లెటర్ అందుకున్నాడు శ్రీధర్. వచ్చీరాని తెలుగులో అక్షరాలు కూడబలుక్కొని రాసినట్టుంది ఆ ఉత్తరం. చదవడం పూర్తయ్యేలోపు శ్రీధర్ వళ్లంతా చమట్లు పట్టినట్లైంది. సి.సి.ని పిలిచి ‘‘లక్ష్మయ్య బతికి ఎక్కడైనా వుంటే తీసుకురండి. పోతే కనీసం అతడి డెడ్ బాడీనైనా ట్రేస్ చేయండి’’ చెప్పాడు. ‘‘ఎస్ సర్’’ చెప్పాడు క్యాంప్ క్లర్క్ శర్మ. పోలీసుల సహాయంతో జల్లెడ పట్టారు. ప్రకాశం జిల్లా గుడ్లకమ్మవాగులో లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ శవాలు బయటపడ్డాయి. ఎందుకు చనిపోయారన్న కారణాలు తెలీక వ్యక్తిగత కారణాలతో చనిపోయినట్టు రాసుకొని కేసు క్లోజ్ చేశారు పోలీసులు. ఆ రోజు నుండి వరుసగా పది రోజులు శ్రీధర్కి నిద్రపట్టలేదు. అన్యమనస్కంగానే విధులకు హాజరవుతున్నాడు. ఆ రోజ తెల్లవారుజామున వచ్చిన కలతో దిగ్గున లేచాడు. లక్ష్మయ్య వీధిగుమ్మాన నిలిచి వున్నాడు. ‘‘నాకు చనిపోయేంత ధైర్యం వుంది సామీ. అందుకే నా భార్యని కలుపుకొని పోయాను. చావుకూ బతుక్కీ మధ్య తేడా తెలీక అక్కడ చాలామంది ఊగిసలాడుతున్నారు. వెళ్లండి వాళ్లనైనా కాపాడండి’’ లక్ష్మయ్య అదృశ్యమయ్యాడు. చెమట్లు పడుతూ లేచాడు. అతడి భార్య దిగ్గున లేచి కూర్చొని, ‘‘ఏమైందండీ’’ అని అడిగింది. ‘‘ఏం లేదు... ఏం లేదు’’ అని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగాడు. ఆఫీస్కి వెళ్లాడు. క్యాంప్ క్లర్క్ శర్మ ముఖంలో కూడా దిగులు కన్పిస్తూ వుంది. ‘‘మనం... ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు సర్. అంతా అయోమయంగా వుంది. మూడు పంటలు పండే పొలాల్ని తీసుకున్నాం. కౌలు రైతుల్ని అనాథల్ని చేశాం. ఒక్కొక్కర్లో ఒక్కో లక్ష్మయ్య కన్పిస్తున్నాడు సర్’’ అన్నాడు. ‘‘మనం... ప్రభుత్వ ఉద్యోగులం శర్మా. ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేయడం మన విధి’’ చెప్పాడు. ‘‘మనది తలారి పోస్ట్లా వుంది సర్’’ అన్నాడు శర్మ. ‘‘మరణశిక్ష పడ్డ ఖైదీకి ఉరి తలారి ఉరి తీస్తున్నట్టు... వుంది సర్ మన నిర్వాకం’’ అన్నాననుకున్నాడు శర్మ. గొంతు పెగల్లేదు. కానీ శ్రీధర్కి అర్థమైంది. రైతుకి పడింది మరణశిక్షేనా? ఏ నేరం చేయకుండా? ఇంటికి వచ్చాడు. తన సేవింగ్స్ చూసుకున్నాడు. ఆ తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రాజధాని నిర్మాణ ప్రాంతంలోని భూమి కోల్పోయిన వారి పక్షాన వెళ్లాడు శ్రీధర్. గత నెల నుండి ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది. జన జీవనం స్తంభించిపోయింది. ఆర్.డి.ఎ. మాజీ కమిషనర్ ఉద్యమానికి నాయకత్వం వహించడం ‘మీడియా’లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించడమే కాక ఉద్యమంలో సింహ భాగం నిలిచాయి... ‘‘శ్రీధర్ నువ్వు బాధ్యతగల ఉద్యోగిగా చేశావ్. ప్రజల్ని పక్కదారి పట్టిస్తే ఎలా?’’ ప్రశ్నించాడు సి.ఎం. ‘‘వాళ్లు సరైన రీతిలోనే ఆలోచిస్తున్నారు సర్. వాళ్ల భ్రమలన్నీ తొలగిపోయాయి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘నువ్వు ప్రతిపక్షం నేతలతో కుమ్మక్కై ఉద్యమం నడిపిస్తున్నావ్’’ సి.ఎం. పక్కనే వున్న మున్సిపల్ మంత్రి రాజధాని ప్రాధికార నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్న మంత్రి ఉమామహేశ్వరరావు అన్నాడు. ‘‘బహుశా ప్రతిపక్ష నేత తన ప్రభుత్వం వస్తే ఏ ఎం.ఎల్.సి.నో, రాజ్యసభ సభ్యత్వమో ఇస్తానని హామీ ఇచ్చాడా?’’ మరో మంత్రి చక్రపాణి అన్నాడు వ్యంగ్యంగా. ‘‘మీరు చర్చలకు పిల్చారా? నన్ను అవమానించడానికి పిల్చారా?’’ అడిగాడు శ్రీధర్. మిగతా మంత్రుల్ని సంభాళించి... ‘‘సారీ శ్రీధర్. నీమీద మాకెలాంటి కోపం లేదు. ప్రజాస్వామ్యంలో పోరాటం ప్రజల హక్కు. దాన్ని కాదనే హక్కు కూడా మాకు లేదు. కానీ అన్ని తెలిసిన వ్యక్తిగా నువ్విలా రైతుల్ని రెచ్చగొట్టడం బాధాకరం’’ చెప్పాడు విశ్వేశ్వరనాయుడు. ‘‘సర్. రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో వేలాదిగా నిరుపయోగకరంగా వుండే భూములున్నాయ్ సర్. అభివృద్ధి అంటే అన్నీ ఒక దగ్గరే వుండడం కాదు సర్. వికేంద్రీకరించడం. మీరు గీసింది చందమామ... బాలమిత్ర లాంటి కథల్లోని ‘కథ’ లాంటి ఊహాచిత్రం సార్. మీరు అందులో తేలిపోయే ప్రజల్ని కూడా అదే భ్రమలో బతకమంటున్నారు. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు. ఎందుకు సార్... వీరి బతుకుల్తో ఆడుకుంటారు. మీరొక పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారు. సి.ఎం.గారూ రోడ్డు విస్తరణకు భూమి అవసరమైతే అక్వెర్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్మాణానికి భూమి అవసరమైతే తీసుకోవచ్చు. కానీ ఇలా రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు తీసుకోవడమేంటి? ఒకే దగ్గర ఆకాశ హార్మ్యాలు నిర్మించాల్సిన అవసరం ఏంటి? అభివృద్ధి అనేది కేంద్రీకరణ కాకూడదు. అది అన్నివైపులా ‘అక్టోపస్’లా విస్తరించాలి. మన రాష్ట్రం చాలా సుందరమైంది. ప్రతి జిల్లాకి ఒక అస్థిత్వం ఉంది. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయండి. ప్రతి ప్రాంతాన్ని సుసంపన్నం చేయండి. భగవంతుడు మీకిచ్చిన అధికార హోదాని దుర్వినియోగం చేయకండి. ప్రపంచంలో ప్రజలను ఖాళీ చేయించి రాజధాని నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున చేసిన చరిత్ర ఎవరికీ లేదు. ఇలా చేసిన ఘన చరిత్ర... హీన చరిత్ర కూడా మీకే దక్కుతుంది’’ అన్నాడు శ్రీధర్. సి.ఎం. ముఖంలో కోపం ప్రజ్వరిల్లుతుంది. ‘‘షటప్... మేన్... నీలాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా అభివృద్ధి ఉండదు. వారికి అభివృద్ధి చేసిన భూములిస్తున్నాం’’ అన్నాడు. ‘‘మీ లెక్కలే కరెక్టు అనుకుందాం. మీరిచ్చే కమర్షియల్ ప్లేస్ ఎప్పటికి ఉపయోగపడుతుంది. కనీసం చెప్పగలరా?’’ అడిగాడు శ్రీధర్. సి.ఎం.తో సహా ఎవరి ముఖాల్లోనూ వెలుగు లేదు. ‘‘భూములు కోల్పోయిన సన్న చిన్నకారు రైతులు అప్పటివరకూ ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎలా బతగ్గలుగుతారు? మీకు ముఖ్యమంత్రి పదవీ రాజకీయం తప్ప మరో పని చేయడం ఎలా తెలీదో... రైతుకు వ్యవసాయం తప్ప మరో పని చేయడం రాదు. రాజధాని ప్రాంతం సింగపూరో మలేషియాగానో మారితే అప్పటివరకూ వీరిలో బతికేది ఎవరూ పోయేది ఎవరూ?’’ అన్నాడు. ‘‘రాజకీయ ఉపన్యాసం అవసరం లేదు. మీ డిమాండ్స్ ఏమిటి?’’ అడిగాడు మంత్రి ఉమామహేశ్వరరావు. శ్రీధర్లో ధర్మావేశం పెల్లుబికింది. ‘‘మీ భూదాహానికి బలైన లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ ప్రాణాలు తిరిగి తీసుకురండి’’ అని తన జేబులోంచి ఒక లేఖ తీసి ముఖ్యమంత్రి, మంత్రులకిచ్చి వెనుదిరిగాడు శ్రీధర్. అతడ్ని అనుసరించారు మిగతా నాయకులు. వస్తూ వుంటే లక్ష్మయ్య రాసుకున్న ఆఖరి లేఖ శ్రీధర్ కళ్లముందు కదలాడింది. ‘‘సామీ... ప్రాణం విలువైందో కాదో నాకు తెలియదు. పాతికేళ్లు నాతో బతికిన నా ఇంటి ఆడదానికి పెద్ద జబ్బు వచ్చిందట. దాని పేరు కేన్సరని డాక్టర్లు చెబితే తెలిసింది. జబ్బు ఖరీదైందే కానీ మేము ఖరీదైనవాళ్లం కాదు. వున్న ఐదు ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. కూసింత నష్ట పరిహారం ఇచ్చారు. అదేదో ‘కీమో థెరపీ’కే ఆ డబ్బు సరిపోదన్నారు. అయ్యా, భవిష్యత్లో నేను షాపులు పెట్టుకోవడానికి కూసింత స్థలమిస్తారు. అది కోట్ల విలువ చేస్తుందిట. అదేమీ నాకు వద్దు సామీ. మా ఇంటి ఆడదాన్ని బతికించుకుంటా. నా భూమి నాకిప్పించండి’’ ఇంతవరకే ఈ ఉత్తరం రాద్దామనుకున్నాను. మా ఆడది ఒక మాటంది. ‘‘శుభమా... అని రాజధాని కడుతుంటే... నీ ఏడుపుగొట్టు యవ్వారం ఏంటయ్యా’’ అని గదమాయించింది. బతికినంతకాలం బతకాం. బతికి సాధించేదేముంది? మన బిడ్డల భవిష్యత్ కోసం భూమి దానం చేశావనుకో’’ అంది. ‘‘నిజమే. రాజధాని విలువేంటో ఐదో క్లాసు వరకూ చదివిన నాకు తెలియకపోవచ్చు. బిడ్డల్లేని మాకు రాష్ట్రంలోని ప్రజలే... మా బిడ్డలు అనుకుంటాం. అందుకే ఊరుదాటి వెళ్లిపోతున్నాం. బతుకు మీద ఇక ఆశల్లేవు కాబట్టి, చావుకి కూడా సిద్ధమే. ఎలాగూ... నా ఇంటి ఆడది పోయాక ఇక నేను బతికి వుండి చేసేది ఏం... ఉంది సామీ. భూమి పోయాక నేను చేయడానికి ఏముంది? ఇక కనిపించను కమిషనర్ సామీ. మిమ్మల్ని విసిగించను. చిన్నప్పుడు తప్పిపోయిన నా కొడుకులా వున్నావ్. అచ్చు పోలికలు కూడా. అలాగే వున్నాయ్. వీలైతే... దగ్గర నుండి నిన్ను చూసుకుందాం అనుకున్నా ఒక పాలి. ఆ సెక్యూరిటీవాళ్లు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు సామీ. సర్లే. వుంటా. ఇక కనిపించను. లక్ష్మయ్య రాజధాని రైతు శ్రీధర్ కళ్లు మరోసారి చెమర్చాయి. శ్రీధర్ నవ్వి కంప్యూటర్లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు. -
గ్యాంగ్స్టర్ నయూమ్ గురించి.....
నయీమ్ అనుచరుడి ఇంటరాగేషన్! రియూజ్ను ప్రశ్నించిన డీఎస్పీ? మునుగోడు: గ్యాంగ్స్టర్ నయూమ్ ముఖ్య అనుచరుడు, బెస్ట్ షూటర్గా పేరున్న రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రాత్రి మునుగోడు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నల్లగొండ డీఎస్పీకి అప్పగించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో పోలీసులను వెంటబెట్టుకుని డీఎస్పీ రాత్రి 1 గంట సమయంలో రియాజ్ను మునుగోడు పీఎస్కు తరలించి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ సమయంలో స్థానిక పోలీసులను కూడా దగ్గరికి రానివ్వలేదని సమాచారం. 3 గంటల 30 నిమిషాలకు డీఎస్పీ నల్లగొండకు వెళ్లగా ఉదయం 7 గంటల సమయంలో రియాజ్ను మరో చోటుకు తరలించినట్లు తెలియవచ్చింది. నయీమ్ ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం షాద్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం కాలనీలో నయీమ్ నివసించిన ఇంటి నుంచి పోలీసులు బుధవారం రెండు కార్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న ఈ వాహనాలు ఎవరివి, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నయీమ్కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, ఇతరత్రా అంశాలను పోలీసులు బయటకు పొక్కనివ్వడం లేదు. శ్రీధర్ ఆచూకీ సంగతేమిటి? పూర్తి వివరాలు సమర్పించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న నీలా శ్రీధర్గౌడ్ ఆచూకీ కోసం అతని భార్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. శ్రీధర్గౌడ్ అదృశ్యంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత పోలీసులు తన భర్తను పట్టుకెళ్లారని, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీధర్ భార్య శ్రీలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ సంజయ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా శ్రీలత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్, ఆమె భర్త ఈ నెల 8న హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో శ్రీధర్గౌడ్కు ప్రాణహాని ఉందన్నారు. నయీమ్ అనుచరులు వేధించారు ఆదిబట్ల గ్రామవాసి ఇబ్రహీంపట్నం రూరల్: ‘‘గ్యాంగ్స్టర్ నయీమ్ అనుచరులు మా భూమి కబ్జా చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారు దాడులు, దౌర్జన్యాలు చేసినా జంకలేదు’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామానికి చెందిన బురుగుల వెంకట్రెడ్డి పేర్కొన్నాడు. వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2013లో ఆదిబట్ల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 289లో 8 ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. కాగితాలు ఉన్నా దానికి సరిపోయేంత భూమి అక్కడ లేకపోవడంతో పక్కనే 490, 410 సర్వే నంబర్లోని మా భూమిని కబ్జా చేశారని వెంకట్రెడ్డి చెప్పాడు. సర్వే నంబర్ 289లోని భూమిని యజమానులు నయీమ్ అనుచరుడు శ్రీహరికి అమ్మారని, అతను చాలాసార్లు తమ కుటుంబ సభ్యులను బెదిరించాడని వెంకట్రెడ్డి తెలిపాడు. ప్రత్యక్ష దాడులకు కూడా దిగాడని, తమ భూమిలో ఉన్న దొండ తోటను కూడా ధ్వంసం చేశాడని చెప్పారు. శ్రీహరి భార్య మాధవి కూడా తమ ఇంటికి వచ్చి మహిళలపై దాడికి దిగిందన్నాడు. ఈ వ్యవహారంపై గతంలో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు వారి వైపే మొగ్గు చూపారని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ స్థల వివాదం భూపరిపాలన శాఖలో పెండింగ్లో ఉందన్నాడు. నయీమ్తో సంబంధాలపై విచారణ జరపండి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు నయీమ్ ముఠాతో ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాలు, పోలీసుల అండదండలతో అరాచకాలు, హత్యలు చేస్తూ వేల ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదును నయీమ్ కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. నయీమ్ను అడ్డం పెట్టుకుని చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కోట్లు సంపాదించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి బహిష్కృతుడైన నయీమ్ను పోలీసులు చేరదీసి ఆ ముఠా ద్వారా ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలను హత్య చేయించారని ఆరోపించారు. చివరకు వారికే సవాల్గా మారడంతో నయీమ్ను మట్టుపెట్టారని వెల్లడించారు. నేరస్తులను మొగ్గలోనే తుంచివేసే పద్ధతిలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు భరోసానివ్వాలని ఆయన సూచించారు. -
వచ్చే నెలాఖరుకు రైతుల చేతికి ప్లాట్లు
సాక్షి, అమరావతి : రాజధాని గ్రామాల్లోని రైతులందరికీ సెప్టెంబర్ నెలాఖరుకల్లా వారి వాటా ప్లాట్లు పంపిణీ చేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. ఆ సమయానికి ప్లాట్ల కేటాయింపుతోపాటు వారికి భూసమీకరణ యాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. దీనివల్ల ప్లాట్లను అమ్ముకునే హక్కు రైతులకు ఉంటుందని వివరించారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటికే తుళ్లూరు మండలం నేలపాడు రైతులకు ప్లాట్లు కేటాయించామని, త్వరలో వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ గ్రామంతోపాటు మరో ఏడు గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు ముసాయిదా నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నాలుగు గ్రామాలు, 20వ తేదీన మరో నాలుగు గ్రామాలు, 26వ తేదీన ఎనిమిది గ్రామాలకు ముసాయిదా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయా గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెలరోజుల సమయం ఇస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను బట్టి తుది ప్లాట్ల కేటాయింపు చేపడతామన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా విడతల వారీగా 29 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపుతోపాటు భూయాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యాజమాన్య హక్కు పత్రాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ఎనిమిది భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్లను ఇకపై ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి బ్యాంకు అకౌంట్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. జూన్, జూలై పెన్షన్ మొత్తాలు ఒకేసారి వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. -
పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం
భవానీపురం : విజయవాడను వాల్పోస్టర్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుదామని నగర మేయర్ కోనేరు శ్రీధర్ పిలుపునిచ్చారు. నలంద కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లోబ్రిడ్జి వరకు ఇరువైపులా గోడలకు ఉన్న పోస్టర్లను తొలగించి పెయింటింగ్స్ వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే యాత్రీకులకు కనువిందుగా, అహ్లాదభరితంగా ఉండే చిత్రాలను గీయాలని సూచించారు. పెయింటింగ్ వేస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. -
మడ్తపల్లిలో విషాదం
ఇంకా తెలియని గల్లంతైన శ్రీధర్ ఆచూకీ మూడు రోజులుగా గాలింపు రేగొండ : మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది. వరంగల్లో వడ్రంగి పనిచేస్తున్న శ్రీధర్ అలియాస్ శ్రీనివాస్ (36) శనివారం తోటి కార్మికులతో కలిసి మేడారం వెళ్లి, వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం మూడు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు మేడారం వెళ్లి వెదుకుతున్నారు. ఇంతవరకూ కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా శ్రీధర్
శంషాబాద్ రూరల్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా మండలంలోని తొండుపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బైతి శ్రీధర్యాదవ్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఈమేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా, శంషాబాద్ బాగ్ కన్వీనర్గా, జిల్లా కో-కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా పని చేసిన శ్రీధర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. జిల్లాలో 2019 సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. -
కార్ల చోరీ ఇతివృత్తంగా బొంగు
కార్ల దొంగల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం బొంగు అని ఆ చిత్ర దర్శకుడు తాజ్ తెలిపారు. ఈయన ప్రముఖ కళాదర్శకుడు సాబు శిరిల్ వద్ద పలు చిత్రాలకు సహయ కళాదర్శకుడిగా పనిచేసి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టారు. ఆర్టీ.ఇన్ఫినిటీ డీల్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై రఘుకుమార్ అనబడే తిరు, రాజరత్నం, శ్రీధర్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న చిత్రం బొంగు. చతురంగం తదితర విజయవంతమైన చిత్రాల ఫేమ్ నటరాజ్(నట్టి) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. 2014లో మిస్ ఇండియా పట్టం గెలుచుకున్న రూహీసింగ్ నాయకిగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు.ఈ బ్యూటీ ఇప్పటికే హిందీతో పాటు ఇతర భాషల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. మాధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో నటించి ప్రాచుర్యం పొందిందీ భామ. బొంగు చిత్రంలో ఇతర పాత్రల్లో అతుల్కులకర్ణి, ముండాసుపట్టి రాందాస్,అర్జున్, పావలా లక్ష్మణన్, మయిల్సామి,శ్యామ్ నటిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక రాయపేటలోని ఓల్డ్ ఉడ్ల్యాండ్ హోటల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నలుగురు కార్ల దొంగల ఇతివృత్తం తెరకెక్కిస్తున్న చిత్రం బొంగు అని అన్నారు. అయితే వారు ఎందుకు దొంగలుగా మారారు. ఆ తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న సంఘటనలో కథ, కథనం జెట్ స్పీడ్లో నడుస్తుందన్నారు. ఇందులో ఒక రేస్ కారు ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకు ఖరీదైన రేస్ కారును ఉపయోగించామని చెప్పారు. ఆ కారు షోరూమ్ కోసం దేశం అంతా శోధించామనీ చివరికి అహ్మదాబాద్లో కనిపించిందని, అక్కడ అనుమతి తీసుకుని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై,అహ్మదాబాద్, మధురై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి శ్రీకాంత్దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!
సహాయక పదవులకు బంగర్, అరుణ్, శ్రీధర్ కూడా... న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది పదవులకు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనున్నారు. మరో రెండు రోజుల్లో బోర్డు కోచ్ పదవులకు ప్రకటన జారీ చేయనున్న నేపథ్యంలో ఆ నలుగురు దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘శాస్త్రి, అరుణ్, బంగర్, శ్రీధర్లు తమ గత పోస్ట్లకు మళ్లీ దరఖాస్తులు పంపుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడి నుంచి వీళ్లకు సానుకూల సంకేతాలు అందాయి. అయితే ప్రతి అభ్యర్థి ప్రత్యేకమైన ఫార్మాట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ నలుగురు బోర్డు జారీ చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నారు’ అని సదరు అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్ను ఇటీవలే ఢిల్లీలో సహాయక సిబ్బంది కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కోచ్ ఎంపికకు లెవల్-3 డిగ్రీతో పాటు సీనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే ఎంపికయ్యే అభ్యర్థి తమ దేశం తరఫున కనీసం 50 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఉండాలి. అనవసరమైన దరఖాస్తులు రాకుండా ఈ రెండు నిబంధనలను విధించారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్(29) అనే యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రిగారిని ఎక్కడ కలవాలి?
విశ్లేషణ కేంద్ర మంత్రిగారిని కలవాలని ఉంది. ఎక్కడ ఏవిధంగా కలవవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ లేకుండానే కలవవచ్చా? సామాన్యులను కలిసే వేళలను ఏవైనా నిర్ధారించారా? అపాయింట్మెంట్ తీసుకోవడానికి మార్గ మేమిటి? ఎవరిని సంప్రదించాలి? అని హేమంత్ ధాగే మన న్యాయశాఖ మంత్రిని సమాచార హక్కు దరఖాస్తు ద్వారా అడిగాడు. అటువంటి సమా చారమేమీ లేదు. ఎప్పటికప్పుడు ఎవరయినా కలవాలని అనుకుంటే మంత్రి గారి లభ్యతను బట్టి అపాయింట్మెంట్ ఇస్తారు అని కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది అరకొర సమాచారం. నిజానికి చెప్పిందేమీ లేదు. అసలు మంత్రిని కలిసే హక్కు పౌరుడికి లేదా? ఉంటే ఏ విధంగా కలిసే అవకాశాలు ఉంటాయో తెలియజెప్పే బాధ్యత మంత్రిగారికి లేదా వారి కార్యాలయానికి లేదా? మంత్రిగారి ప్రయివేటు కార్యదర్శిని అడిగిన సమా చారాన్ని మంత్రిత్వ శాఖ ఏవిధంగా ఇస్తుంది? ఇరుపక్షాల వారు రెండో అప్పీలు విచారణ రోజు రాలేదు. అయినా దరఖాస్తు లోతుగా పరిశీలించి చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలో కూడదో తేల్చవలసిన బాధ్యత కమిషన్ పైన ఉంది. చట్టం కింద పబ్లిక్ అథారిటీ మంత్రిని గుర్తించవచ్చా? ఒకవేళ అథారిటీ అయితే మంత్రి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ఉందా? మంత్రి అనే అధికార పీఠం రాజ్యాంగం సృష్టించింది. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ర్టపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రి వర్గం ఉండాలి. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిని రాష్ర్టపతి నియమిస్తారు. రాష్ర్టపతి ఇష్టపడినంతకాలమే మంత్రి పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు ఆమోదించిన చట్టం 1954 ప్రకారం ఎంపీకి జీతాలు ఇస్తారు. మంత్రికి కూడా. రాష్ట్రాలకు సంబంధించి 163, 164 ఆర్టికల్స్ రాష్ర్ట మంత్రులకు ఈ విధమైన నియమావళినే రూపొందించాయి. ఈ నియమాలన్నీ సెక్షన్ 2(హెచ్) పబ్లిక్ అథారిటీ నిర్వచనానికి అనుగుణంగా ఉన్నాయి. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్ణయాలకు పరిమితమవుతుంది. కాని ఒక్కో మంత్రి తనకు ఇచ్చిన శాఖలకు అధిపతిగా ఉంటారు. ఆ శాఖలో నిర్ణయాలకు మంత్రే బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ విధులను అధికారాలను ప్రభుత్వ నిధులను నిర్ణయించేది మంత్రి. కనుక కేంద్ర రాష్ర్ట మంత్రివర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పబ్లిక్ అథారిటీ అవుతారు. మంత్రిగారికి సరైన సిబ్బంది సౌకర్యాలు లేవు కనుక పబ్లిక్ అథారిటీగా సహ చట్టం కింద సమాధానాలు ఇవ్వాలనడం సమంజసం కాదనే వాదన చెల్లదు. మంత్రులకు సహాయక సిబ్బంది, వ్యక్తిగత సహాయకులుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వమే కార్యాలయాన్ని అధికారిక నివాసాన్ని కల్పిస్తుంది. ఒకే వ్యక్తిగా ఉన్నప్పటికీ అటార్నీ జనరల్ ప్రభుత్వ అథారిటీ అయినప్పుడు, మంత్రి కూడా అథారిటీ అయి తీర వలసి ఉంటుంది. మంత్రులంతా పబ్లిక్ అథారిటీలేనని 2015 సెప్టెంబర్ 25న మహారాష్ర్ట సమాచార కమిషన్ నిర్దేశించింది. వేలకోట్ల రూపాయల ప్రజానిధిని ఖర్చుచేసే నిర్ణయాలు తీసుకునే అధికారమున్న మంత్రి పబ్లిక్ అథారిటీ అవుతారు. రెండో ప్రశ్న.. మంత్రిని కలుసుకునే హక్కు పౌరులకు ఉందా? రామరాజ్యంలో తన ఇంటిముందు గంట మోగించిన వారెవరయినా రాముడు బయటకు వచ్చి వారి బాధలను విని న్యాయం చేసే వారని, మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజులు దర్బారులో జనాన్ని కలుసుకునే వారని కథలు విన్నాం. కొందరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా జనాన్ని రోజూ ఉదయం కలిసే వారు. ఇప్పటికీ కొందరు కలుస్తూనే ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఎన్నికైన ఎన్ యతిరాజారావు మంత్రి పదవిలో ఉన్నా, మామూలు ఎమ్మెల్యేగా ఉన్నా జనం ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు ఉత్తరాలు ఒక సూట్ కేసునిండా వెంట పెట్టుకుని అధికారులను కలుస్తూ, ఆ తరువాత సమస్య చెప్పుకున్న వ్యక్తిని పిలిచి ఆయన పని ఎంతవరకు పూర్తయిందో చెప్పేవారు. వెంట ఎప్పుడూ రెండు సూట్ కేసులు ఉండేవి. అందుకే ఆయన ఏడు సార్లు గెలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనే పేరులోనే అతను/ఆమె ప్రజలకు ప్రతినిధిగా ఉండాలని స్పష్టం. మంత్రితో సమావేశ సమయం దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య. దానికి తెలిసిన వాడు ఉండాలి. లేకపోతే బ్రోకర్లు తయారవుతారు. బోలెడంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇదంతా భ్రష్టాచారం. ఇందులో మంత్రికి పాలు ఉండవచ్చు లేకపోవచ్చు. కాని ఆయన్ను కలుసుకోవడానికి పౌరుడు లంచాలు ఇవ్వకుండా సులువైన విధానాలను కల్పించడం, ముందే సమయాలను ప్రకటించడం మంత్రుల బాధ్యత. సహ చట్టం వచ్చిందే ఇటువంటి అవినీతిని నిరోధించడానికి. సామాన్యునితో సమావేశమయ్యే వేళలను మంత్రి కార్యాలయమే ప్రకటించాలి. మంత్రిత్వ శాఖ ఆ పని చేయలేదు. నెలలో ఏ రోజు ఎక్కడ జనాన్ని కలుస్తారో చెప్పాలి. లేదా ఫలానా నెలలో కలవడం లేదు అని ప్రకటించాలి. సహ చట్టం సెక్షన్ 4(1)(బి కింద ఇది ముందే తమంత తామే తెలియజేయవలసిన సౌకర్య సంబంధిత సమాచారం. కనుక కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మంత్రి ఈ బాధ్యతను నెరవేర్చి ప్రజల సమాచార హక్కును కాపాడడానికి రెండు నెలల్లో పిఐఓను నియమించాలని కమిషన్... కేబినెట్ సెక్రటరీని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ( హేమంత్ ధాగే వర్సెస్ న్యాయవ్యవహారాల శాఖ కేసులో మార్చి 12న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార శాఖ కమిషనర్) -
సింగరేణిలో విద్యుదుత్పత్తి ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ఉన్న సింగరేణి యూనిట్ -1 బాయిలర్ లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. -
సహజీవనంపై స.హ.అస్త్రమా?
విశ్లేషణ ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇలాంటి అంశాలపై అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు. గోప్యతను రక్షించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపైన ఉంది. ఆర్టీఐ చట్టం ఇచ్చిన సమాచార హక్కు అస్త్రంతో వ్యక్తిగత జీవితాల గోప్యతపైన దాడులు పెరుగుతున్నాయి. బంధువులు, భార్యాభర్తలు, సోదరులు, భార్యాభర్తలు, సోదరులు, ఒకరిపైన ఒకరు కత్తులు దూస్తూ ఆర్టీఐని అందుకు వాడుకుంటున్నారు. అది కచ్చితంగా దుర్వినియోగం, దుర్మార్గం. సుపరిపాలన కోసం ప్రజా శ్రేయస్సు కోసం, హక్కుల రక్షణ కోసం అన్యాయాలను వెలికి తీయడం కోసం అవినీతిని ప్రశ్నించడం కోసం ఆర్టీఐని వినియోగించాలి. పగలు ప్రతీకారాలతో, వ్యక్తిగత ద్వేషాలతో, బంధుత్వపు ఈర్ష్యలతో, పై అధికారుల మీద కోపంతో, పక్కవాడిని వేధించాలన్న దురు ద్దేశంతో ఆర్టీఐనీ వినియోగించడం ఏమాత్రం న్యాయం కాదు. పదే పదే ఒక సమాచారం గురించి, ఒకరి గురించే అనేక ప్రశ్నలు వేయటం చాలా తప్పు. ఇటువంటి దుర్వినియోగాల వల్ల అసలు అవసరాల కోసం, లక్ష్యాల కోసం ఆర్టీఐని వాడే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల సుపరిపాలనా సాధన ప్రయత్నాలకు హాని కలుగుతుంది. ఒక ప్రొఫెసర్ వివాహితుడై ఉండి, ఇద్దరు పుత్రులను కలిగి ఉండి కూడా మరొక మహిళా ప్రొఫెసర్తో సహజీవనం చేస్తున్నాడని ఆయన భార్య సవతి సోదరుడు విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు. దానిపైన ఏ చర్య తీసుకున్నారో తెలియచేయాలని ఆర్టీఐ కింద యూనివర్సిటీ పీఐఓకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ ఫిర్యాదుపై ఒక ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు. వారు విచారణ జరిపి ఇది ఆ ఇద్దరు ప్రొఫెసర్ల వ్యక్తిగత వ్యవహారమని, దరఖాస్తుదారుడు కావాలంటే కోర్టులో కేసు వేసుకోవచ్చని నివేదిక ఇచ్చారు. సంబంధిత ప్రొఫెసర్ల అభిప్రాయాన్ని అడిగితే.. దీనిపైన తాము వ్యాఖ్యానించేదేమీ లేదని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరాదని విడివిడిగా రాసిన లేఖల్లో ఇద్దరు అధ్యాపకులు కోరారు. విశ్వవిద్యాలయం విచారణా నివేదికను ఆర్టీఐ అభ్యర్థన చేసిన సోద రుడికి ఇచ్చింది. అధ్యాపకులు రాసిన లేఖల ప్రతులు కూడా ఇవ్వాలని కోరుతూ సమాచార కమిషన్లో అప్పీలు చేశారు. తనకు, ప్రొఫెసర్కు మధ్య ప్రస్తుతం వివాహ బంధం ఏదీ లేదని, తాను చాలా సంవత్సరాల కిందటే విదేశాలకు వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డానని, తన సోదరుడికి ఈ విషయంతో ఏ సంబంధమూ లేదని తన సవతి సోదరుడు అడిగిన సమాచారాన్ని ఏదీ ఇవ్వరాదని సోదరి విశ్వవిద్యాల యానికి వినతి చేశారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ అధి కారులు విచారణ నివేదిక ఇచ్చారు. అది ఇవ్వాల్సిన అవ సరం లేదు. తన సోదరి తరపున ఆమె శ్రేయస్సు కోసం సమాచారం అడుగుతున్నారేమోనని అనుకో వడానికి వీల్లేదు. ఎందుకంటే వారి సోదరి చాలా స్పష్టంగా వీరికి సమాచారం ఇవ్వకూడదని రాశారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నడవడికపై ఇది ఫిర్యాదు అనుకోవచ్చా అనేది మరో ప్రశ్న. సోదరుడు ఆరోపించినట్లు బహుభార్యాత్వ (బైగమీ) నేరానికి లేదా అక్రమ సహజీవనం (లివ్ ఇన్) తప్పిదానికి లేదా అక్రమ సంబంధానికి (అడల్టరీ) పాల్పడి ఉంటే చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థపైన ఉంటుంది. ఇరువురి మధ్య వివాహ సంబంధం తెగిపోయిన తర్వాత వారు మరొక వివాహం చేసుకున్నా, బహు భార్యాత్వం కాదు. మరొకరితో సహజీవనం చేసినా నేరం లేదు. వారిపైన తీసుకోవలసిన చర్య ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా బహు భార్యాత్వ నేరానికి పాల్పడితే ఇద్దరు భార్యల్లో ఒకరు ఫిర్యాదు చేయాలి. వారి సోదరుడికి ఫిర్యాదు చేసే అర్హత లేదు. అక్రమ సంబంధం నేరారోపణలో తన భార్యను మరొకరు లోబరుచు కున్నారని భర్త ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మరెవరో కాదు. ఇక అక్రమ సహజీవనాన్ని నేరంగా ఏ చట్టమూ ప్రకటించకపోగా, ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. కనుక ఏ కోణం నుంచి చూసినా విశ్వవిద్యాలయం దర్యాప్తు చేయతగిన నేరంగానీ, దుష్ర్పవర్తన గానీ అందులో లేదు. కనుక సోదరుడికి ఏ చర్యా అవసరం లేదని చెబితే పూర్తి సమాచారం ఇచ్చినట్లే. నిజానికి ఇదంతా కచ్చితంగా వ్యక్తిగత సమాచారమే కనుక సోదరుడికి సెక్షన్ 8(1)(జె) కింద సమాచారం నిరాకరించే అవకాశం ఉంది. కాని సమాచారం ఇచ్చేశారు. అతను అడుగుతున్నది ఏమిటంటే ఆ ఇద్దరూ రాసిన లేఖల ప్రతులు మాత్రమే. వారు చేసిన వ్యాఖ్యలే మిటి అని. కనుక ఈ ఉత్తరాల ప్రతి ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదు. ఇవ్వకపోతే ఏదో దాస్తున్నారనుకుంటారు. అందులో ఏదో ఉందని పుకార్లు చెలరేగుతాయి. పుకార్లకు విరుగుడు నిజాలను బయటపెట్టడమే. తన సోదరి రాసిన లేఖను ఈ సోదరుడు అడగటం లేదు. నిజానికి అడగకపోయినా ఇవ్వవలసినది సోదరి రాసిన లేఖ. అందులో వివాహ బంధం లేదనే నిజంతో పాటు ఈ సోదరుడికి అడిగే అర్హత లేదని. అతనికి ఏ సమాచారం ఇవ్వరాదనే ఆంక్షలున్నాయి. ఇవి ఆ సోదరుడికి తెలియవలసిన అవసరం ఉంది. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలు రక్షించడానికి, ఆ ఇద్దరు అధ్యాపకులూ పుకార్లకు గురికాకుండా ఉండటానికి, సోదరి ప్రతిష్ట హక్కును కాపాడటానికి ఈ ముగ్గురు రాసిన లేఖల ప్రతులు ఇవ్వాలని సమాచార కమిషన్ ఆదేశించింది. అధ్యాపకుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న సూచన మేరకు, వారి పేర్లు ఇవ్వడం లేదు. వ్యక్తుల పేర్లతో ప్రమేయం లేదు. అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు. (CIC/D/A/2013/002353-SA కేసులో మార్చి 2న కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార శాఖ కమిషనర్, మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఉత్సాహంగా మాగ్నోవా 2016
-
ప్రభుత్వ ఈ-మెయిల్స్నూ కోరవచ్చు
విశ్లేషణ ప్రభుత్వ అధికారులకు విన్నపాలు ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి? జనం తమ కష్టాలు చెప్పుకోవడానికి సులువైన పద్ధతులు అందు బాటులో ఉండాలి. కష్టాలు చెప్పుకోవడానికి వీలు కల్పించకుండా చేయగలి గిందేమీలేదు. ఈ- పాలన, డిజిటల్ ఇండియా, ఈ-కామర్స్ అని మాట్లాడుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రతివారికి ఈ-మెయిల్స్ పంపే అవకాశం వచ్చింది. కాగితాలు, పోస్టల్ కవర్లు, స్టాంపులు అవసరం ఉండ కూడదు. ఈ-మెయిల్ చేసి జవాబులు పొందడానికి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా డిజిటల్ ప్రపంచం అంటే అర్థం లేదు. ప్రభుత్వాధి కారికి జనం చెప్పుకునేందుకు ఒక ఈ-మెయిల్ అడ్రసు ఉండడం, అది పనిచేస్తూ ఉండడం ప్రాథమిక అవసరం. ఆ ఈ-గోడు తమకు ముట్టిందని తెలియ జెప్పాలి. ఆ తరువాత ఆ గోడును పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. లేకపోతే పరిష్కరించలేక పోవడానికి కారణాలు తెలియ జేయాలి. ఇది పరి పాలనలో ముఖ్యమైన అంశం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులకు ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఆ మొత్తం ఈ-మెయిల్ ఐడీలను ఇవ్వాలని, అవి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఒక సీడీ రూపంలో ఇవ్వాలని న్యాయవాది మణిరాం శర్మ ఆర్టీఐ కింద కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) కింద ఆయా ప్రభుత్వ కార్యాలయాలు తాము జనానికి అందించే సేవలేమిటో, ఎంతకాలంలో చేస్తారో వివరిస్తూ కష్టాలు, ఫిర్యాదులు ఎవరికి, ఏ విధంగా చెప్పుకోవాలో కూడా తమంత తామే వివరించాలి. కనుక ఆ ఈ-మెయిల్ ఐడీలు ఇవ్వాల్సిందేనని వాదించారు. వివిధ విభాగాలు వారు కోరిన విధంగా వెబ్సైట్లూ, ఈ-మెయిల్ ఐడీలూ తయారుచేసి ఆ ప్రభుత్వశాఖల వారికివ్వడం వరకే తమ బాధ్యత అని, తరువాత తమ దగ్గర అవి ఉండబోవని, కనుక తాము ఇవ్వజాలమని ఎన్ఐసి ప్రజా సమాచార అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. అన్ని ఈ-మెయిల్ ఐడీలను ఒకచోట సీడీలో ఇస్తే హాకర్లకూ, సైబర్ నేరగాళ్లకూ అదొక సులువైన నేర సాధనం అవుతుందని, ప్రభుత్వ వెబ్సైట్ల సమా చారం అపహరించడానికి, వాటిని స్తంభింప చేయ డానికి, వారు దాడులు చేస్తారని సైబర్ నిపుణులు సమాచార కమిషన్కు వివరించారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం తయారు చేసిన ఈ-మెయిల్ చిరునామాల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుంది కనుక వారి అనుమతి తీసుకోకుండా తాము వాటిని ఇవ్వజాలమని, వారి అనుమతి తీసుకోవడం చాలా పెద్ద పని అవుతుందని కూడా ఎన్ఐసి వారు వాదించారు. ఈ వాదన సమంజసం కాదు. ఈ కేసు అనేక దశలు దాటి, ముగ్గురు సభ్యుల సమాచార కమిషన్ పీఠం ముందుకు వచ్చింది. సీనియర్ కమిషనర్లు బసంత్ సేథ్, యశోవర్ధన్ ఆజాద్తో నేను కూడా విచారణలో ఉన్నాను. ప్రజల ఫిర్యాదుల విచారణకు, నివారణకు ఈ-మెయిల్ కాంటాక్ట్లు ప్రజారంగంలో ఉండడం చాలా అవసరం అన్న వాదం సరైనదే. అది ప్రజాప్రయోజనకరమైన అంశమే. ఈ-మెయిల్స్ను తయారు చేసి, పనిచేయించే పరిజ్ఞానం, బాధ్యత ఉన్న ఎన్ఐసీ మాత్రమే ఇవ్వగలదు కనుక వారిని వివరాలు అడగడంలో కూడా తప్పులేదు. ఎన్నో ఈ-మెయిల్ ఐడీలు అసలు పనికిరావని, అవి పని చేస్తున్నాయోలేదో తెలియక జనం తమ మహజర్లు పంపుతూ ఉంటారని, కనీసం పనిచేసే ఈ-మెయిల్ ఐడీలు ఏవో చెప్పవలసిన బాధ్యత ఉందని లాయర్ ఆర్కె జైన్ గుర్తు చేశారు. ఈ-మెయిల్స్ అన్నీ టోకున ఇస్తే గుండుగుత్తగా అన్ని వెబ్సైట్ల మీద దాడిచేసే ప్రమాదాలను ఆపడం ముఖ్యమైన అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ-మెయిల్ విషయమై విధాన ప్రకటన చేసింది. ఆ విధానాన్ని అమలు చేసే బాధ్యత ఎన్ఐసీకి అప్పగించింది. ఎన్ఐసీ తయారు చేసిన ఈ-మెయిల్ ఐడీలనే వాడాలని; గూగుల్, యాహూ వంటి ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ప్రభుత్వ అధికారులు, తమ అధికార కార్యక్రమాలకు వినియోగించకూడదని కూడా కేంద్రం నిర్దేశించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు, మొత్తం దేశానికి ఒక ఈ-మెయిల్డెరైక్టరీని తయారు చేయాలని ప్రభుత్వం ఎన్ఐసీని ఆదేశించింది. ఒకే వేదిక మీద సమాచార సంచార సమ్మేళనం కోసం కేంద్రం కృషి చేస్తున్నది. ఒక సమగ్రమైన ఈ-మెయిల్ అనుసంధానం, అన్ని ప్రభుత్వ రంగాలు, శాఖలను కలిపే ఒక వేదికను, వెబ్ డెరైక్టరీ తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజల అభిప్రాయాలు కూడా కోరారు. కనుక పారదర్శకత్వం కోసం, పాలనను మెరుగుపరచడం కోసం, అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం సమగ్రమైన ఈ-మెయిల్ డెరైక్టరీని ఎన్ఐసీ తయారు చేయాలని, అందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సహకరించాలని, సైబర్ దాడులను నివారించే కృషి చేయాలని ఎన్ఐసీ ముగ్గురు కమిషనర్లు ఆదేశించారు. (మణిరాం శర్మ వర్సెస్ ఎన్ఐసీ NIC, CIC/BS/A/2012/001725, లో ముగ్గురు సభ్యులధర్మాసనం 16 డిసెంబర్ 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్కు అంతర్జాతీయ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా వెబ్సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్మ్యాన్. శ్రీధర్కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం. కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి. అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్డేకు... అమెరికా నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు. ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?.. ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు * అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి * కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్... * గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు * ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్. అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం.... ఆన్లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే... * ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే. * ప్యాకేజ్కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే. * గిఫ్ట్గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది. * పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి. * ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు. * అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ. * దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి. కస్టమ్స్ గుర్తిస్తే...? ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్మ్యాన్తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది. కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా? సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు. నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్లో సంప్రదించవచ్చు. వస్తువు ట్రాక్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి కొరియర్కూ సొంత వెబ్సైట్ ఉంది. కన్సైన్మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్షిప్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్కు చెందిన ఐపీఎస్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే... ఏ కొరియర్నైనా ట్రాక్ చేయటానికి... https://www.17track.net/en https://www.aftership.com/ అంతర్జాతీయ పోస్టల్ను ట్రాక్ చేయటానికి... http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm -
చిలకలగూడలో ఓ ఇంట్లో చోరీ
చిలకలగూడ గొల్లపుల్లయ్యబావి కాలనీలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సుమారు 40 తులాల బంగారం, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి క్లూస్టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యజమాని ఇచ్చే బీమాతో సరా..!
శ్రీధర్ది ప్రైవేటు ఉద్యోగం. మంచి జీతం. కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఎప్పుడూ సొంత ఆరోగ్య బీమా గురించి ఆలోచించలేదు. అయితే ఉన్నట్టుండి కంపెనీ అతన్ని తొలగించింది. ఈ వార్త పిడుగుపాటులా తాకటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... ఈ కుంగుబాటుతో ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తలెత్తింది అసలు సమస్య. ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంచటం... పరీక్షలన్నీ చేయటం, ట్రీట్మెంట్... వీటన్నిటికీ రూ.2 లక్షల దాకా అయింది. అంతకు ముందైతే కంపెనీ హెల్త్ పాలసీ ఉండేది కనక ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు. కానీ ఉద్యోగం పోవటం... ఆదాయం లేకపోవటం... అదే సమయంలో ఆసుపత్రి పాలవటం అన్నీ కలిసి శ్రీధర్ను నానా ఇబ్బందులూ పెట్టాయి. బంధుమిత్రుల సాయంతో బయటపడ్డా... కంపెనీ ఇస్తున్నది కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎంత అవసరమో అప్పుడు తెలిసొచ్చింది శ్రీధర్కు. నిజానికిపుడు చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ ఇస్తున్న ఆరోగ్య బీమా పాలసీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ బీమా సరిపోతుంది కదా! ఇంకెందుకు మరొకటి? అనేది వారి ఆలోచన. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. గడిచిన మూడేళ్లుగా చాలా సంస్థలు ఉద్యోగుల తల్లిదండ్రుల బీమా కవరేజీకి వచ్చేసరికి వారి నుంచి కూడా కొంత పేమెంట్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా ఇవి కవరేజీ పెంచటం లేదు. ఇటీవల ఓ బీమా కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైందేంటంటే... 2008 నుంచి భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న మెడిక్లెయిమ్ ప్రీమియం పెరగటమే లేదు. అయితే తగ్గటం, లేకపోతే అదే స్థాయిలో ఉండటం జరుగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలు పెడుతున్న ఖర్చులో 10 శాతమే ఇక్కడి కంపెనీలు వెచ్చిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెపైచ్చు 2008లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న తరవాత నుంచి ఇవి ఆ ఖర్చులను కూడా కుదించటం మొదలుపెట్టాయి. బీమా ప్రీమియంలలో కోత పెట్టాయి. దీంతో 20 నుంచి 25 శాతం ఉద్యోగులు తమ మెడిక్లెయిమ్ పాలసీలకు అదనంగా టాప్ అప్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి * కంపెనీ పాలసీలో కవరేజీ మొత్తం అంతంతే * వ్యక్తిగత, గ్రూప్ టాప్-అప్లూ చేయించుకోవచ్చు * సొంత హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్, ప్రమాద బీమాతో ధీమా పెరుగుతున్న నియంత్రణలు... చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ బీమా కవరేజీలపై ఆంక్షలు పెడుతున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ తాజా నివేదిక ప్రకారం 76 శాతం కంపెనీలు కో-పేమెంట్ నిబంధనను పాటించటమే కాక ఆసుపత్రుల్లో గది అద్దెపై పరిమితి విధిస్తున్నాయి. సగటున చూస్తే ఇవి ఉద్యోగులకు అందిస్తున్న బీమా కవరేజీ మొత్తం లక్ష నుంచి లక్షన్నర దాటడం లేదు. ‘‘దురదృష్టవశాత్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు ఉన్నారనుకోండి. మీ ఆసుపత్రి బిల్లు భారీగా పెరిగిపోయే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కంపెనీ ఇస్తున్న కవరేజీ సరిపోదు. అందుకని మీ వార్షిక ఆదాయానికి సమానమైన సొంత ఆరోగ్య బీమా కవరేజీ తప్పక ఉండి తీరాలి. దానికి క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద బీమా జత చేయాలి’’ అనేది పాలసీ బజార్ సీఈఓ యాశిష్ దహియా మాట. నిజానికి కంపెనీ ఇస్తున్న కవరేజీ చాలకపోవటం అనేది ఒక్కటే కాదు. కంపెనీ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటిపోయినా, లేక మీరు తరచు ఉద్యోగాలు మారుతున్నా కూడా... మీకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఏడాదికి రూ.9 వేలలోనే అన్నీ... ఒకవేళ విడిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామనుకుంటే... ముఖ్యంగా చూడాల్సింది అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి వారు పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత? మెటర్నిటీ ప్రయోజనాలున్నాయా? క్యాష్లెస్ ఫెసిలిటీ కల్పించే ఆసుపత్రులెన్ని? వంటివి. నిజానికి 30 ఏళ్ల వ్యక్తి గనక రూ.5 లక్షల బీమా కవరేజీ, రూ.10 లక్షల క్రిటికల్ ఇల్నెస్, రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా... వీటన్నిటికీ కలిసి ఏడాదికి రూ.9 వేలు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే... రూ.5 లక్షల రెలిగేర్ కేర్ హెల్త్ కవర్కు ఏడాదికి రూ.5,162 అవుతుండగా, బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.3వేలు, ఐసీఐసీఐ లాంబార్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.1,221 ఖర్చవుతోంది. కాకపోతే వ్యక్తిగత బీమాకు కొన్ని పరిమితులుంటాయి. కంపెనీ ఇస్తున్న గ్రూప్ బీమా కవరేజీ అయితే అప్పటికే ఉన్న వ్యాధుల్ని, మెటర్నిటీ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలైతే అప్పటికే ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది కంపెనీని బట్టి మారుతుంది. కవరేజీని పెంచుకోవాలనుకుంటే టాప్ అప్ ప్లాన్నూ పరిశీలించొచ్చు. కొన్ని కంపెనీలు గ్రూప్ టాప్-అప్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిని మీరు పనిచేస్తున్న కంపెనీ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థ దగ్గరే కొనుగోలు చే యొచ్చు. ఇలాంటప్పుడు గ్రూప్ టాప్-అప్ అనేది కంపెనీ ఇస్తున్న పథకానికి జతగా ఉంటుందో లేదో చూడాలి. ఇక వ్యక్తిగత టాప్-అప్లనేవి కొంత ఖరీదే. వీటిని ఎంచుకునే ముందు వాటి షరతులనూ చూడాలి. మరికొన్ని కంపెనీలు నిర్దిష్ట మొత్తానికి సొంత ఆరోగ్య బీమా ఉంటే తప్ప టాప్ అప్ చేయలేమని, కవరేజీ మొత్తాన్ని ఏకకాలంలో ఉపయోగించుకున్న తరవాతే టాప్ అప్ వర్తిస్తుందని షరతులు పెడుతున్నాయి. కనుక చిన్న వయసులో ఉన్నపుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకుంటే తక్కువ ధరకే రావటం తో పాటు మరిన్ని వ్యాధులు కవరయ్యే అవకాశం ఉంటుంది. -
వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం?
ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు... బైక్, కారు వంటి ఆటోమొబైల్స్ కావచ్చు... వీటిని కొనేటపుడు ప్రతిసారీ శ్రీధర్కు షోరూమ్ వాళ్లు ఒక ఆఫర్ ఇస్తుంటారు. ‘‘సర్! దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. తీసుకోండి’’ అని. అంటే... సదరు వస్తువుకు కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా డీలర్ ఇచ్చే అదనపు వారంటీ అన్నమాట. దానిక్కాస్త ఎక్స్ట్రా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ ప్రతి సందర్భంలోనూ వద్దని చెప్పేస్తూ ఉంటాడు. తరవాత బయటికొచ్చి... అరె! తీసుకుని ఉంటే బాగుండేదేమో!! అనుకుంటుంటాడు. మరి ఈ ఎక్స్టెండెడ్ (పొడిగించిన) వారంటీని తీసుకోవటం మంచిదా..? లేక వద్దని వదిలేయటమే మంచిదా? ఒకసారి చూద్దాం. పొడిగించిన వారంటీ అంటే నిజానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే. ఎందుకంటే ప్రతి వస్తువుకూ సాధారణంగా ఇచ్చే వారంటీ ఒకటుంటుంది. అది నెల కావచ్చు... ఏడాది కావచ్చు. ఈ గడువులో గనక వస్తువుకేదైనా అయితే కంపెనీ దాన్ని రిపేరు చేయటమో, లేక మార్చి కొత్తది ఇవ్వటమో చేస్తుంది. ఆ గడువు అయిపోయాక గనక ఆ వస్తువు దెబ్బతింటే అప్పుడు ఈ పొడిగించిన వారంటీ పనికొస్తుంది. బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలియంది కాదు. అవి క్లెయిమ్ రూపంలో చెల్లించే మొత్తం కంటే ప్రీమియం రూపంలో వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అవి క్లెయిమ్లు చెల్లించ గలుగుతాయి. లేదంటే దివాలా తీస్తాయి. ఈ పొడిగించిన వారంటీ కూడా ఇలానే పనిచేస్తుంది. అంటే దీనర్థం పొడిగించిన వారంటీలో క్లెయిమ్లు ఎక్కువగా ఉండవనేగా!? అంకెల్లో ఓ సారి చూద్దాం.. శ్రీధర్ ఎలా ఆలోచించాడో ఓ సారి చూద్దాం. తను ఓ ల్యాప్టాప్ కొందామనుకున్నాడు. పేరున్న రిటెయిలర్ దగ్గరకు వెళ్లాడు. రూ.36,000 ధర చెప్పిన రిటెయిలర్... కంపెనీ ఇస్తున్న ఏడాది వారంటీతో పాటు తాము రెండేళ్లు పొడిగింపు వారంటీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ రెండేళ్ల పొడిగింపు వారంటీ లేకుండా ల్యాప్టాప్ ఎంతని అడిగితే... ఆ వారంటీ (బీమా) ధర మైనస్ చేసి రూ.26,000కు ఇస్తానన్నాడు. గమనించాల్సిందేంటంటే ఏడాదిలోపు ల్యాప్టాప్కు ఏదైనా అయితే తిరిగి కొత్తదిస్తారు. రూ.36,000 పెట్టి కొంటే ఈ గడువు మూడేళ్లకు పెరుగుతుంది. అదే 26వేలు పెట్టి కొంటే ఏడాది మాత్రమే వారంటీ. ఆ తరవాత ఒక్కరోజు గడిచినా రీప్లేస్మెంట్ ఉండదు. శ్రీధర్ ఆలోచన మరోలా ఉంది. ఎలాగూ ఏడాది వరకు వారంటీ ఉంటుంది. పెపైచ్చు ల్యాప్టాప్ 26వేలకే వస్తుంది. ఒకవేళ ఏడాది తరవాత ఏదైనా జరిగితే... రోజురోజుకూ టెక్నాలజీ మారుతోంది కనక అప్పటికి మార్కెట్లో ఉండే కొత్త టెక్నాలజీ ల్యాప్టాప్ను దాదాపు 26వేలకే కొనుక్కోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం కొన్న మోడల్నే అప్పుడు కూడా కొనాలంటే పాతదై పోతుంది కనక ధర కూడా దాదాపు 15-20 వేల మధ్యనే ఉంటుంది. ఒకవేళ ల్యాప్టాప్కు ఏమీ కాకపోతే మొత్తం మిగిలినట్టే. ఇలా ఆలోచించాకే... రిటెయిలర్ ఎంత ఆశ చూపించినా, ఎంతగా భయపెట్టినా శ్రీధ ర్ లొంగలేదు. తన నిర్ణయానికే కట్టుబడి ఈ పొడిగింపు వారంటీ వద్దనుకున్నాడు. మానసికంగా లాభమే! శ్రీధర్లానే అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఈ పొడిగింపు వారంటీ తీసుకోవటం వల్ల ఇతర లాభాల మాటెలా ఉన్నా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన నోబెల్ విజేత డానియెల్ కానెమన్ వంటి మానసిక విశ్లేషకులు ఏమంటారంటే... ఏదైనా లాభం వల్ల కలిగే ఆనందం కన్నా నష్టం వల్ల కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఈ లెక్కన చూస్తే నష్టం వల్ల కలిగే బాధను, నష్టం వస్తుందనే ఒత్తిడిని దూరం చేసే పొడిగింపు వారంటీ మంచిదే. గతంలో శ్రీధర్ ఇలాంటి వారంటీలు అవసరం లేదని, వద్దని తన తోటి కస్టమర్లకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ మానసిక ప్రశాంతత కోణంలో ఆలోచించాక తను ఆ సిఫారసు మానుకున్నాడులెండి!!. అవసరమైనచోటే బీమా ఎప్పుడైనా బీమా తీసుకునేది అవసరమైన చోటే. అంటే... తద్వారా జరిగే నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉంటేనే! మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ ఇలాంటివే. ఎందుకంటే నష్టం జరిగినపుడు మనం కోల్పోయేదాన్ని ఈ పాలసీలు లేకుంటే భర్తీ చేసుకోవటం కష్టం. నిపుణులు చెప్పేదేంటంటే... ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అలా కాదు. వాటికేదైనా జరిగితే ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోగలం. మరి అలాంటపుడు బీమా ఎందుకనేది వారి ప్రశ్న. ఇటీవల ‘బ్లూమ్బర్గ్’ చేసిన సర్వే ప్రకారం... ఈ పొడిగించిన వారంటీలు అమ్మకం దార్లకు ఊహించని లాభాల్ని అందిస్తున్నాయట. ఈ రకం వారంటీల కోసం కంపెనీలకయ్యే ఖర్చు చాలా తక్కువని, అవి వీటిద్వారా వినియోగదారులకు అందిస్తున్న ప్రయోజనాలు కూడా తక్కువ కావటంతో వాటికి లాభాలొస్తున్నాయని బ్లూమ్బర్గ్ వివరించింది. -
ముత్యాలముగ్గు సీతాయణం
రామాయణం ఎంత మధురంగా ఉంటుందో... అంతే కఠినంగా కూడా ఉంటుందనిపిస్తుంది! రాక్షసుడు భార్యాభర్తల్ని విడగొడతాడు. భక్తుడు భుజం మీద తల్లిని వెనక్కి తెస్తానంటే... రాముడే రావాలని సీతమ్మ అంటుంది. రామాయణం రాముడి గురించి అనుకుంటాం కానీ నాకు రామాయణంలో సీతమ్మవారి గొప్పతనమే ఎక్కువగా గోచరిస్తుంది. పట్టాభిషేకం అయింది... కథ సుఖాంతం అయింది... హమ్మయ్య... అనుకునేలోపు పామరుడు అన్న మాటకు సీతమ్మ మళ్లీ అడవిపాలు అవుతుంది. మొదటిసారి రాముడి కోసం... రాముడి వెంట... రాముడికి తోడుగా ఈసారి కూడా రాముడి కోసమే... రాముడు లేకుండా... రాముడి పిల్లల సాక్షిగా. అమ్మానాన్నల్ని కలపడానికి లవకుశులు చేసే ప్రయత్నం రామాయణంలో విఫలమైనా... ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో కవలలు... శ్రీధర్ని, సంగీతను కలుపుతారు. రాక్షసమూకను తరిమికొడతారు. బాపూ రమణల సినిమా మరి! రామాయణం కనపడక మానదు. సీతమ్మవారిని కీర్తింపక మానరు. తనపై అనుమానాన్ని, తనకు జరిగిన అవమానాన్ని... జయించిన సీత కథ ఇది. సీతాయణం ఇది. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్ ఫస్ట్ నైట్. శ్రీధర్ పట్టెమంచం మీద ఉన్నాడు. సంగీత అతడి గుండెలపై తలవాల్చి ఉంది. పెళ్లి పీటలపై ‘అదృష్టవశాత్తూ’ పెళ్లి ఆగిపోతే.. అక్కడికక్కడ దొరికిన వరుడు శ్రీధర్. కోటీశ్వరుడైన రాజా రామ్దాసు కొడుకు అతడు. సంగీత అన్నయ్యకు స్నేహితుడు. మంచి మనసున్నవాడు. స్నేహితుడి చెల్లెలి పెళ్లికని శ్రీధరే తండ్రి చేత కట్నం డబ్బులు ఇప్పించాడు. తనూ ఆ పెళ్లికి వచ్చాడు. కానీ పెళ్లి చెడిపోయింది. సంగీతను అదృష్టం వరించింది. అప్పటికే ఎనభై పెళ్లిళ్లు చేసుకుని ఉన్న నిత్య వరుడు నూతన్ ప్రసాద్ను లాస్ట్ మినిట్లో పోలీసులు వచ్చి పెళ్లి పందిట్లోంచి పట్టుకెళ్లకపోతే సంగీతకు శ్రీధర్ అనే అదృష్టం పట్టేది కాదు. శ్రీమంతుల దగ్గర చెయ్యి చాచి తెచ్చిన పాపపు సొమ్ముతో పెళ్లి చేయబోతే ఇలాగే జరుగుతుందని పెళ్లి పెద్ద సాక్షి రంగారావు నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే శ్రీధర్కు సంగీత అనే అపురూపం లభించేది కాదు. తన తండ్రిది పాపపు సొమ్ము కాదని చెప్పడానికి మాత్రమే సంగీత మెడలో తాళి కట్టలేదు శ్రీధర్. చిన్నపాటి పరిచయంలో అంతకుముందే ఆమె అంటే అతడికి ఇష్టం కూడా ఉంది. ‘కట్టుకథల కన్నా... జరిగే కథలే చిత్రంగా ఉంటాయి కదూ. నీకిది వరకు పెళ్లి చూపులు జరిగాయా?’ ‘ఆరుసార్లు’. ‘ఆరుసార్లా? అందులో నీకెందరు నచ్చారు?’ ‘నేను ఆడపిల్లని. పైగా పేద పిల్లని. మాకు నచ్చడం, ప్రేమించడం అంటూ ఉండవు. పెద్దవాళ్లు ఏదో కుదురుస్తారు. సరేనంటాం. పెళ్లయ్యాకే ప్రేమ’. ‘అంటే ఆ పెళ్లి కొడుకులకు నువ్వు నచ్చలేదా?’ ‘తెలీదు. ఒకళ్లిద్దరు కట్నం తక్కువని, ఒకళ్లిద్దరు తెల్లగా లేనని వద్దన్నారు. ఒకడు రెండో పెళ్లివాడు. మా అన్నయ్య పొమ్మన్నాడు’. ‘ఇంతకీ ఈ పెళ్లి కొడుకు నచ్చాడా?’ (తన గురించి శ్రీధర్). నవ్వులు. ‘మా అమ్మ చెప్పేది. తమలపాకు, వక్కపలుకు, తాంబూలంలా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలేడని. ఇది ఆకు, ఇది వక్క అన్నమాటే ఉండదు’. ‘ఎంత చక్కని ఊహ! మన దాంపత్యం నిత్య తాంబూలమై పండాలి’. ఇద్దరూ అనుకున్నారు. కానీ ఆ దాంపత్యాన్ని పండనివ్వకూడదని ముక్కామల అనుకున్నాడు. అందుకు అల్లురామలింగయ్య హెల్ప్ తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి రావుగోపాల్రావు హెల్ప్ కోసం వెళ్లారు. రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్కి పని పురమాయించాడు! ముక్కామల... రాజా రామ్దాసు (కాంతారావు) బావమరిది. శ్రీధర్ని తన కూతురికిచ్చి చేద్దామనుకుంటే ఇది దెయ్యంలా తగలడిందని సంగీత మీద కోపం. ఈ తాళిని తెంపించి, ఆ తాళిని కట్టించాలని అతడి ప్లాన్. అల్లురామలింగయ్య దివాణం మేనేజర్. రావుగోపాల్రావు కాపురాలు కూల్చే కాంట్రాక్టర్. ఇంకా చాలా చేస్తుంటాడు. ఖూనీలు, సెటిల్మెంట్లు వగైరాలు. నూతన్ ప్రసాద్ అతడికి రైట్ హ్యాండ్. నూతన్ ప్రసాద్కి రెగ్యులర్గా పెళ్లిళ్లు చేయిస్తుండేది రావుగోపాల్రావే. సంగీత తాళి తెంచే పథకం మొదలైంది. సంగీతపై శ్రీధర్కి అనుమానం తెప్పించి, ఆమెను తప్పించే పథకం అది. పథకం సక్సెస్ కూడా అయింది. అప్పటికే సంగీత గర్భిణి. ‘ఆ మనిషెవడో నీకు తెలీదు. గడియ వేసున్నా పడగ్గదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలీదు. అవునా?’ ‘అవునండి. నిజం. మీ పాదాల సాక్షి’. ‘నోర్ముయ్’. ‘నన్ను నమ్మండి. కలలో కూడా...’ ‘ఛ... కళ్లతో చూసిన దానికి దిక్కులేదు.. కలలో పతిభక్తి గురించి మాట్లాడుకోవాలిక...’ ‘నా మాట వినండి. తెల్లనివన్నీ పాలూ కావు. నల్లనివన్నీ నీళ్లూ కావు’. ‘అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరం అని మోసపోయాను. ఆనాడు నువ్వీ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకున్నా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడీ సంగతి తెలిస్తే... ఆయన గుండె బద్దలైపోదూ.. మేం గౌరవానికి ప్రాణాలిచ్చే మనుషులం’. ‘ఏవండీ’ ‘ఇంకే చెప్పొద్దు. నేను నిన్నేం సాధించను. తిట్టి కొట్టి బాధించను. చంపి ఈ ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒక్కటే. రచ్చ చెయ్యకుండా ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చెయ్యాలి. రేపే నిన్ను మీ పుట్టింటికి పంపే ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి, నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దలయెడల గౌరవం, నాయందు విరహం నటించి వెళ్లిపో. వెళ్లి, నీకు మనసనేదే ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్న గారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడుపు ఏడుస్తారు. వాళ్ల మీద దయ ఉంచి అక్కడితో సరిపెట్టు. నీక్కావలసింది డబ్బే కదా, కావలసినంత పట్టుకుపో. ఈ ఇంటి గౌరవం, మా నాన్న గారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ దోచుకుపో. ఫో. శ్రీధర్, సంగీత విడిపోయారు. రావుగోపాల్రావు, అల్లురామలింగయ్య దివాణాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. శ్రీధర్, అతడి తండ్రి కాంతారావు వైరాగ్యంలో పడిపోయారు. తన కూతుర్ని చేసుకొమ్మని అడగడానికి వచ్చిన ముక్కామలను తిట్టి పంపించాడు శ్రీధర్. ఏళ్లు గడుస్తున్నాయి. కాలం.. మొదట సంగీతను, కాంతారావును కలిపింది. కాంతారావుకు నిజం తెలిసింది. తన మనవణ్ణి, మనవరాలిని చూసి మురిసిపోయాడు. (సంగీతకు కవలలు). ‘అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఇంటికిరా తల్లి. మనం ఆ బందిపోటు ముఠాను వెళ్లగొడదాం. అబ్బాయికి నేనంతా చెబుతాను. నువ్వు నట్టింట కాలుపెట్టి...’ ‘క్షమించండి మామగారు. నేను రాను. రాలేను’. ‘అమ్మా... నీకేం భయం లేదు. ఇప్పటికీ అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు. నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే...’ ‘వద్దు మామగారు... సిఫారసులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు. నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి. ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి. అంతవరకు నేను రాలేను’. ఇదంతా ఇద్దరు పిల్లలు విన్నారు. ఎలాగైనా అమ్మనీ, నాన్ననీ కలపాలనుకున్నారు. ఆలోచించారు. ఆచరణలోకి దిగారు. అక్క శాంతకు ఆంజేయస్వామి ఫ్రెండ్. తమ్ముడు రాముకు కోతి ఫ్రెండ్. ఈ ఇద్దరి ఫ్రెండ్స్ సహాయంతో అక్కాతమ్ముడు రంగంలోకి దిగారు. చివరికి సంగీత కోరుకున్నట్లే జరిగింది. శ్రీధర్ తన పొరపాటు తెలుసుకున్నాడు. సంగీతను చెంతకు చేర్చుకున్నాడు. క్షమించమని అడిగాడు. దివాణంలోని దుష్టులకు తగిన శాస్తి అయింది. అల్లురామలింగయ్య పిచ్చివాడయ్యాడు. ముక్కామల, రావుగోపాల్రావు తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. ముక్కామల కూతుర్ని నూతన్ ప్రసాద్ చేసుకుని మోసం చేస్తే, రావుగోపాల్రావు కూతుర్ని సంగీత అన్నయ్య చేసుకుని, చిన్న నాటకం ఆడి రావుగోపాల్రావుకు బుద్ధి వచ్చేలా చేశాడు. ‘దేవుడా... నేనెప్పుడూ నిన్నేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చుననుకున్నాను. ప్రాణాలు తియ్యడం, కొంపలు కూల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పొయ్యడం, కాపరం నిలబెట్టడం చేతకాదు. ఇదొక్కటే చేసిపెట్టి, నా బిడ్డ కాపరం దారికి పెట్టు. నీకు తీరికలేకపోతే సాయం చేసేవాళ్లను చూపెట్టు’ అని దేవుణ్ణి వేడుకుంటున్న రావుగోపాల్రావుని చూస్తుంటే.. అయ్యోపాపం అని కూడా అనిపిస్తుంది. విలన్లా, అసహాయుడైన ఆడపిల్ల తండ్రిలాను ఆయన ప్రేక్షకులను ఆయన కదిలించారు. రావుగోపాల్రావు ఎంట్రీ (రావు గోపాల్రావు అటు తిరిగి ఉంటాడు. సూర్యోదయాన్ని చూస్తూ. అప్పుడు అతడి సెక్రెటరీ వస్తాడు) ‘నారాయుడు వచ్చాడండి’. ‘వచ్చాడా? తీసుకొచ్చావా?’ (వచ్చాడు అంటే మనిషే వచ్చాడని. తీసుకురావడం అంటే డెడ్బాడీ వచ్చిందని) ‘ఎస్ సార్. తీసుకొచ్చాను చూస్తారా?’ ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిజినెస్సేనా? ఆ.. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ’. ‘ఎస్ సార్’. ‘ఎస్ సార్. కాదు. కళ్లెట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ... ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ. అద్భుతం సార్’. ‘ఆ... మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటదీ?’ ‘ఎస్ సార్. మీరోసారి చూసి సరే అనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ‘సరే లెద్దూ... ఎదవ నూసెన్సూ. (సెవంటీస్లో ఎవరి నోట విన్నా... ‘ఆకాశంలో మర్డరైనట్టు లేదూ’ అనే డైలాగే. ‘దీని శిగదరగ’ అనేది ఇంకో డైలాగు. సినిమాలో రావుగోపాల్రావు ఊత పదం ఇది). పాటలు (రచన / గానం) 1. శ్రీ రామ జయరామ సీతారామ (ఆరుద్ర / బాలమురళీకృష్ణ) 2. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు (ఆరుద్ర / రామకృష్ణ) 3. ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ (ఆరుద్ర / సుశీల) 4. ఎంతటి రసికుడవో తెలిసెరా (సినారె / సుశీల) 5. గోగులు పూచె గోగులు పూచే ఓ లచ్చగుమ్మడి (సినారె / సుశీల, ఎస్పీబీ) 6. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది (గుంటూరు శేషేంద్ర శర్మ / సుశీల) -
'దేవుడు వదిలేస్తాడేయో కానీ రహానే వదలడు'
చెన్నై : ఫీల్డింగ్ అనేది ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యమని భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. 'దేవుడైనా కూడా పొరపాటున క్యాచ్ వదిలేస్తాడేమో కానీ రహానే అలా కాదు' అంటూ జట్టు ఆటగాడిని ప్రశంసించాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వెంటనే వాటి నుంచి పాఠం నేర్చుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు. లంకతో రెండో టెస్టులో కుమార సంగక్కర క్యాచ్ వదిలేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత అదే ఆటగాడు ఇచ్చిన క్యాచ్నే ఒంటి చేత్తో ఒడిసిపట్టడం చూస్తే అతని ఫీల్డింగ్ ప్రతిభ అర్థమవుతోందంటూ కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగు చేయడంపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏ జట్టుకైనా ఫీల్డింగ్ కీలక అంశమని అన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ఫీల్డింగ్ కొంత మెరుగైందని, దీంతో లంక ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టగలిగాం. టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీన్నే నమ్ముతారని చెప్పాడు. ఈ సిరీస్ లో బాగా రాణించిన ఆటగాళ్లలో మిశ్రా ఒకడని అతడు అభిప్రాయపడ్డాడు.