sridhar
-
నల్ల చీరలో మతిపోగొడుతోన్న బాంధవి శ్రీధర్ అందాలు.. అదరహో అంటున్న కుర్రాళ్లు
-
ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్కు ఎదురుదెబ్బ
అమరావతి, సాక్షి: కూటమి సర్కార్కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అవుతు శ్రీధర్ రెడ్డి రిమాండ్ పోలీసులు వేసిన పిటిషన్ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. -
NRI డాక్టర్ రోజా మృతి కేసులో బిగ్ ట్విస్ట్
-
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక ఎన్ఆర్ఐ మహిళ, ఒక వైద్యుడు మధ్య ఏం జరిగిందన్న అంశం హాట్ టాపిక్గా మారింది. విశాఖకు చెందిన ఒక వైద్యుడు రెండు వారాలకు పైగా హోటల్లోనే ఎందుకు బస చేశాడు? అమెరికా పౌరసత్వం కలిగిన మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది? ఆమె ఆ వైద్యుడు ఉన్న రూమ్ నెంబర్ 229లో ఎందుకు ఉంది? వారి మధ్య గొడవ జరగడానికి గల కారణమేంటి? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్రూమ్లో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది?పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? కిటికీ గానీ, హుక్గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా? రెండు రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎఫ్ఐఆర్లో వైద్యుడి పేరును చేర్చారా? లేదా? అతడి సెల్ఫోన్లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి? హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామగ్రి గుర్తించారు? ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటి? ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాకు మించి సస్పెన్స్ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే విశాఖ పోలీసులు మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి.. సింపుల్గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకోసం రూ.కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తోంది. వైద్యుడు ఫ్యామిలీ ఫ్రెండ్? విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ రెండు వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకొని యూఎస్లో స్థిరపడ్డారు. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్గా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటోంది. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లోనే ఆమె బూత్రూమ్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్గా మారింది. అయితే మహిళ బాత్రూమ్లో ఉరి వేసుకొని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రూమ్లో శ్రీధర్ మాత్రమే ఉంటే.. హోటల్ మేనేజర్కు ఆమె చనిపోయిందన్న విషయం ఎలా తెలిసింది? ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా ఉంది. ఫ్యాన్ హుక్, కిటీకీ గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్లోనే ఉన్నారా? పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా? లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఎందుకంత గోప్యం.. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం 5.30కి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా త్రీటౌన్ సీఐ రమణయ్యను సంప్రదించారు. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారమని చెప్పి తప్పించుకున్నారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం.చదవండి: భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..కేసు మాఫీకి ప్రయత్నాలు? ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్ఆర్ఐ మహిళది హత్యా? ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్తలకు పోలీసుల వ్యవహార శైలే బలాన్ని చేకూరిస్తున్నాయి. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం మహిళ మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చెబుతున్నారు. -
ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ వాంగ్మూలం రీరికార్డింగ్!
సాక్షి, అమరావతి : చంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చడమే ఏకైక కర్తవ్యంగా భావిస్తున్న సీఐడీ అందుకు చర్యలు వేగవంతం చేసింది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ అక్ర మాలను ఆధారాలతో సహా వెల్లడించిన అప్పటి సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్పై ఒత్తిడి తెచ్చి, గతంలో ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని మా ర్పించి, కొత్తగా వాంగ్మూలం ఇప్పించడంలో విజ యవంతమైంది. చంద్రబాబు ప్రభుత్వ అక్ర మాలను వెల్లడిస్తూ ఆయన గుంటూరులోని న్యాయస్థానంలో ఇంతకుముందు 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా ఉన్న ఆయనతో గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వాలని సీఐడీ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఇందుకు ఆయన అంగీకరించలేదు. రెండుసా ర్లు ఆయనతో 164 సీఆర్సీపీ వాంగ్మూలాన్ని రీరి కార్డింగ్ చేసేందుకు సీఐడీ యత్నించి విఫలమైంది. ఓ సారి న్యాయాధికారి సెలవులో ఉండటంతో వాయిదా పడింది. మరోసారి న్యాయస్థానం ప్రాంగణం వరకూ వచ్చిన శ్రీధర్ బయటే చాలాసేపు తన వాహనంలో ఉండిపోయారు. న్యాయస్థానం లోపలికి వెళ్లలేదు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇవ్వడం నేరంగా పరిగణిస్తారని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పలువురు న్యాయవాదులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాంగ్మూలం ఇవ్వకుండానే వెనుదిరిగారు. మూడో ప్రయత్నంలో బుధవారం సీఐడీ అధికారులు ఆయన్ని గుంటూరులోని న్యాయస్థానానికి తీసుకువచ్చారు. సీఐడీ అధికారులు, మఫ్టీలో ఉన్న పోలీసు అధికారుల పహారా మధ్య దాదాపు రెండు గంటలపాటు ఆయన న్యాయస్థానంలోనే ఉన్నారు. ఆ సమయంలో ఇతరులు ఎవరూ ఆయన్ని కలిసేందుకు కూడా సీఐడీ అధికారులు అనుమతించలేదు.సీఆర్పీసీ 164 కింద శ్రీధర్ తన వాంగ్మూలాన్ని రీరికార్డింగ్ చేసినట్టు సమాచారం. అనంతరం ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా తన వాహనంలో వెళ్లిపోయారు. వాంగ్మూలం రీరికార్డింగ్పై అధికారికంగా సీఐడీ, ఇతర అధికారులుగానీ స్పందించలేదు. -
పోర్టులో స్టెల్లా నౌక డెమరేజ్ ‘పంచాయితీ’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కాకినాడ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా ఎల్ పనామా నౌక ‘డెమరేజ్’ చార్జీలు ఎగుమతిదారులకు గుదిబండగా మారాయి. ముందస్తు ఒప్పందం ప్రకారం నిర్దేశించిన తేదీలోపు ఓడలో సరుకు లోడింగ్ పూర్తి చేసి ఎగుమతికి క్లియరెన్స్ ఇవ్వాలి. అలాకాకుంటే నౌక పోర్టులో ఎన్ని రోజులు నిలిచిపోతే అన్ని రోజులకు షిప్ యాజమాన్యం డెమరేజ్ చార్జీలు వసూలు చేస్తుంది. నవంబర్ 28న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీకి వచ్చి సినిమాటిక్గా ‘సీజ్ ద షిప్’ అంటూ అధికారులను ఆదేశించారు. అయితే, ఇంటర్నేషనల్ మెరైన్ చట్టం ప్రకారం షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు. షిప్ను సీజ్ చేయడానికి అవకాశం లేదని, బియ్యం ఉన్న కంటైనర్ను మాత్రమే సీజ్ చేయగలమని విశాఖ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఇటీవల స్పష్టంగా చెప్పారు.సాగని అన్లోడ్ ప్రక్రియస్టెల్లా నౌకలో అధికారులు గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అన్లోడ్ (కిందకు దింపే) ప్రక్రియ సాగడంలేదు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రతిబంధకమైందని చెబుతున్నారు. దీంతో నౌక పోర్టులోనే నిలిచిపోయింది. ఇలా నిలిచిపోయిన ప్రతి రోజుకు డెమరేజ్ చార్జీలను షిప్ యాజమాన్యానికి చెల్లించాలి. ఈ నౌక సామర్థ్యం 52 వేల మెట్రిక్ టన్నులు. నౌకలో 28 ఎగుమతి కంపెనీలకు చెందిన 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంది. ఇదంతా నవంబర్ 28కి ముందే లోడింగ్ జరిగింది. మరో 14 వేల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయాల్సిన తరుణంలో నిలిపివేశారు. పవన్ హంగామా చేసిన రోజు నుంచి ఇప్పటి వరకు నౌక పోర్టులో నిలిచిపోయి 38 రోజులు దాటింది. ముందుగా నిర్దేశించిన నౌక క్లియరెన్స్ తేదీ దాటిన ప్రతి రోజుకు యాజమాన్యం డెమరేజ్ వసూలు చేస్తుంది. దీనిని డెమరేజ్ ఎవరు చెల్లించాలనే దానిపైనా పోర్టులో ఎగుమతిదారుల మధ్య పంచాయితీ నడుస్తోంది. డెమరేజ్ రోజుకు ఎంత చెల్లించాలనే దానిపైనా స్పష్టత లేదు. ముందస్తు ఒప్పందం ప్రకారం నవంబర్ 29 నుంచి డెమరేజ్ లెక్కవేయాలి. కానీ అప్పటికే తుపాను కారణంగా పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ కావడం, డిసెంబర్ 4 వరకు వాతావరణం అనుకూలంగా లేకపోవడం కారణాలు చూపుతూ అప్పటివరకు డెమరేజ్ వేయడానికి వీల్లేదని ఎగుమతిదారులు గట్టిగా పట్టుబడుతున్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి డెమరేజ్ వేయడానికి స్టెల్లా యాజమాన్యం నిర్ణయించిందని సమాచారం. నౌకకు రోజుకు అయ్యే అన్ని ఖర్చులు కలిపి 22,000 యూఎస్ డాలర్లు.. అంటే రూ.18.73 లక్షలు చెల్లించాలని లెక్కకట్టారు. ఒక్కసారి డెమరేజ్ తేదీని నిర్థారిస్తే తుపానులు, వాయుగుండాలు వచ్చినా చెల్లించాల్సిందే. ఈ లెక్కన డిసెంబర్ 5 నుంచి ఇంతవరకు డెమరేజ్ రూపంలో రూ.7.11 కోట్లు చెల్లించాలి. నౌక నిలిచిపోవడానికి కారణమైన పీడీఎస్ బియ్యం మొత్తం బాలాజీ ఎక్స్పోర్టర్స్ కంపెనీదే కావడం వల్ల ఆ సంస్తే డెమరేజ్ మొత్తం చెల్లించాలని మిగతా వారి వాదన. కాకినాడ పోర్టులో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని ఎగుమతిదారులు కోరినా షిప్పర్ అంగీకరించలేదు. పవన్ చేసిన హడావుడి వల్ల తాము నష్టపోతున్నామని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం ఉన్నా షిప్ను సీజ్ చెయ్యలేం
సాక్షి, విశాఖపట్నం: సరకు రవాణా చేసే కార్గో షిప్లో అక్రమంగా తరలించిన పీడీఎస్ బియ్యం ఉంటే.. షిప్ మొత్తం సీజ్ చెయ్యలేమనీ, బియ్యం ఉన్న కంటైనర్ని మాత్రమే సీజ్ చెయ్యగలమని విశాఖపట్నం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. అదేవిధంగా.. పీడీఎస్ బియ్యం రవాణా చేసిన వారిపైనే చర్యలు తీసుకోగలం తప్ప.. షిప్పై చర్యలు తీసుకోలేమని చెప్పారు. విశాఖలోని కస్టమ్స్ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో ఇటీవల పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోందని, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. సివిల్ సప్లైస్ ఎన్వోసీ తప్పనిసరిపోర్టులోకి వచ్చిన ఏ సరుకైనా నేరుగా షిప్లోకి లోడ్ చేసే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రతి సరుకుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే షిప్లోకి ఎక్కించేందుకు కస్టమ్స్ అనుమతిస్తుందని స్పష్టం చేశారు. బియ్యం విషయంలోనూ పక్కాగా పరిశీలన ఉంటుందన్నారు. కస్టమ్స్ విభాగం ఎలాంటి అనధికార బియ్యం ఎగుమతి, దిగుమతుల్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఎన్ని చెక్పోస్టులు దాటి వచ్చినా, అన్ని డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాతే కస్టమ్స్ నుంచి లోడింగ్కు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏ బియ్యమైనా సరే.. పీడీఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) చెకింగ్ డాక్యుమెంట్స్లో తప్పనిసరిగా ఉండాలని, అప్పుడే లోడింగ్కు అనుమతిస్తామని తెలిపారు. బియ్యం డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే వాటిని నిలిపేస్తామని చెప్పారు. ఒకవేళ అనుమానం వచ్చి అవి పీడీఎస్ బియ్యమా కాదా అనేది తెలుసుకోవాలంటే పరీక్షకు పంపాలని, దాని ఫలితాలు 15 రోజులకు వస్తాయని తెలిపారు. అప్పుడే దానిపై చర్యలు తీసుకోగలమని అన్నారు. స్టేక్ హోల్డర్లతో అవగాహన సదస్సుఇటీవల కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం ఎగుమతి జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో విశాఖపట్నం జోన్ కస్టమ్స్, సెంట్రల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ సంజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ ఆధ్వర్యంలో కస్టమ్స్ కార్యాలయంలో శుక్రవారం ఏపీలోని వివిధ పోర్టుల స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కస్టమ్స్ బ్రోకర్స్ అసోసియేషన్, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఎంకరేజ్ పోర్ట్, స్టివడోర్స్ అసోసియేషన్, పౌర సరఫరాల శాఖ అధికారులు హాజరయ్యారు. పోర్టుల ద్వారా ఎలాంటి అక్రమ ఎగుమతి, దిగుమతులకు తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని, ఇకపై మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని సంజయ్రెడ్డి తెలిపారు. ఈ విషయంలో స్టేక్హోల్డర్స్ సహకారాన్ని అందించాలని కోరారు. అక్రమ ఎగుమతులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కస్టమ్స్ శాఖ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. బియ్యం ఎగుమతి విధి విధానాలు, నిబంధనలను ఎన్.శ్రీధర్ వివరించారు. బియ్యం ఎగుమతుల పత్రాలను పరిశీలనలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నౌక మొత్తం సీజ్ చెయ్యడం కుదరదుషిప్లో పొరపాటున పీడీఎస్ బియ్యం ఉన్నా.. నౌకని మొత్తం సీజ్ చెయ్యలేమని తెలిపారు. ఒక రవాణా నౌకలో ఎన్నో కంటైనర్లు ఉంటాయని, వాటిలో ఇతర కంపెనీలు, వ్యాపారులకు సంబంధించిన విభిన్న రకాల ఉత్పత్తులు కూడా ఉంటాయని తెలిపారు.అందువల్ల ఏవైనా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే.. సంబంధిత కంటైనర్ని మాత్రమే సీజ్ చెయ్యగలమని, షిప్ మొత్తాన్ని కాదని స్పష్టంచేశారు. చర్యలు కూడా అక్రమ రవాణాదారులపైనే ఉంటాయని, షిప్పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. -
KSR Live Show: షాడో సీఎం.. చక్రం తిప్పుతున్న లోకేష్
-
ఫుట్బాల్కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్తో పాటు రాష్ట్రంలో ఫుట్బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్బాల్కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సోలార్పవర్తో ‘హైడ్రోజన్’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/గోదావరిఖని: ఇప్పటికే సోలార్ విద్యుత్ రంగంలోకి అడుగిడిన ‘సింగరేణి’ మరో భారీ పర్యావరణహిత కార్యక్ర మానికి శ్రీకారం చుడు తోంది. సంస్థ నిర్వహణలో ఉన్న హైడ్రోజన్ ప్లాంట్ను గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా మార్చేందుకు సిద్ధమైంది. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని సింగరేణి సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) ఎన్.శ్రీధర్ సంస్థకు చెందిన విద్యుత్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తాజాగా జరిగిన ఈ సమావేశంలో దీనిపై చర్చించారు. హైడ్రోజన్ అవసరం థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వాడే జనరేటర్లలోని వేడిని తగ్గించేందుకు శీతలీకరణ ధాతువుగా హైడ్రోజన్ను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్లాంట్ ఆవరణలోనే ఒక హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తారు. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్లో ఉన్న హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ఏటా దాదాపు 10 వేల క్యూబిక్ మీటర్ల హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ సాధారణంగా థర్మల్ విద్యుత్ వినియోగించి ఎలక్ట్రాలసిస్ రసాయనిక పద్ధతిలో హైడ్రోజన్ వాయువు ఉత్పత్తి చేస్తారు. అయితే థర్మల్ విద్యుత్కు బదులు సోలార్ విద్యుత్ వినియోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఇలా ఉత్పత్తి చేసే హైడ్రోజన్ను ‘గ్రీన్ హైడ్రోజన్’గా పేర్కొంటారు. సింగరేణి పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 100 కిలోవాట్ థర్మల్ విద్యుత్ను వినియోగిస్తుండగా, రాబోయే రోజుల్లో థర్మల్ బదులుగా సోలార్ విద్యుత్ ఉపయోగిస్తారు. జైపూర్లోనే... జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోనే ప్రస్తుతం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, ఐదు మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ నేరుగా హైడ్రోజన్ ప్లాంట్కు అనుసంధానం చేస్తారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం రీజియన్లోనే మరో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యాసా«ధ్యాలను పరిశీలించాలని చైర్మన్ సూచించారు. సోలార్ పవర్ ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి మొదలైతే దేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ వినియోగిస్తున్న తొలి థర్మల్ విద్యుత్ కేంద్రంగా సింగరేణి నిలుస్తుంది. జియోపై దృష్టి వేడినీటి ఊట ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి ప్రయోగాత్మకంగా జియో థర్మల్ ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద మూడేళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో పాటు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లోనే మిథనాల్ ప్రాజెక్ట్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేయాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగరేణిలోని సోలార్ ప్లాంట్ల ద్వారా 170 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశామని, తద్వారా ట్రాన్సోకు చెల్లించే విద్యుత్ బిల్లులో రూ.108 కోట్లు ఆదా చేసుకోగలి గామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారా యణరావు, సీటీసీ సంజయ్కుమార్ సూర్, చీఫ్ ఓఅండ్ఎం జే.ఎన్.సింగ్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ చినబసివి రెడ్డి, జనరల్ మేనేజర్(సోలార్) జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్వీకేవీ.రాజు, జీఎం సూర్య నారాయణ, ఏజీఎంలు కేఎస్ఎన్.ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు -
బాధతో పార్టీని వీడుతున్నా..
సాక్షి, మేడ్చల్ జిల్లా:/అల్వాల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు. అల్వాల్లోని ఆయన నివాసం వద్ద సోమవారం మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, మల్కాజిగిరిలో పార్టీ కోసం పని చేస్తూ ప్రత్యర్థిగా ఉన్న మైనంపల్లి హన్మంతరావుతో విభేదించిన సందర్భంగా పలు కేసులు నమోదు అయ్యాయన్నారు. బీఆర్ఎస్లో తన కొడుకుకు టికెట్ రాకపోవడంతో మైనంపల్లి కాంగ్రెస్లో చేరారని ఈ క్రమంలో తనకు మల్కాజిగిరిలో పార్టీ టికెట్ ఇవ్వలేమన్న సంకేతాలు రావడం బాధించాయన్నారు. బీసీలకు అన్ని పార్టీలకన్నా అధిక సీట్లు ఇస్తామని ప్రకటించిన నాయకులు తన మాదిరిగా వెనుకబడిన తరగతి నుండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం చూస్తుంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్రెడ్డికి దెబ్బే.. శ్రీధర్ రాజీనామాతో టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లయింది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉండటం గమనార్హం. సొంత నియోజకవర్గానికి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని కాపాడుకోలేని రేవంత్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా అధికారంలోకి తీసుకు రాగలరన్న ప్రశ్నలు స్థానికంగా పార్టీ శ్రేణుల నుంచి తలెత్తుతున్నాయి. కాగా శ్రీధర్ బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. -
సింగరేణిలో బదిలీ వర్కర్ల క్రమబద్ధీకరణ
గోదావరిఖని/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న 2,266 మంది కార్మికులను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఏడాదిలో భూగర్భగనుల్లో 190 మస్టర్లు, ఉపరితలంలో 240 మస్టర్లు పనిచేసిన బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఎన్.బలరాం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 2023 సెపె్టంబర్ 1వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. తొలిసారి 2017 అక్టోబర్లో ఒకేసారి 2,718 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించినట్లు ఆయన తెలిపారు. 2022 డిసెంబర్ 31వ తేదీకి ముందు సంస్థలో బదిలీ వర్కర్లుగా చేరినవారిలో కనీసం 190/240 మస్టర్ల అర్హత కలిగిన వారిని ఇప్పుడు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేసినట్లు వెల్లడించారు. 2017 నుంచి ఇప్పటివరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేసినట్లు వివరించారు. ఏరియాల వారీగా ఇలా.. జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధికరణ అయినవారిలో ఏరియాల వారీగా పరిశీలిస్తే.. శ్రీరాంపూర్లో 677 మంది, ఆర్జీ–1లో 522, ఆర్జీ–2లో 51, ఆర్జీ–3, అడ్రియాలలో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, బెల్లంపల్లిలో 32, ఇల్లెందు, కార్పొరేట్లో 38, కొత్త్తగూడెంలో 9 మందిని రెగ్యులరైజ్ చేశారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు గతంలో బదిలీ వర్కర్లుగా ఉద్యోగంలో చేరిన కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా గుర్తింపు రావడానికి కనీస మస్టర్లు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు 2017 నుంచి ఎప్పటికప్పుడు బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరిస్తున్నారు. పనిచేసే వారికి గుర్తింపు సింగరేణిలో బాగా పనిచేసే వారికి ఎప్పుడూ మంచి గుర్తింపు ఉంటుంది. గతంలో జనరల్ మజ్దూర్లుగా ఎంపికైన అనేక మంది మరింత శ్రద్ధగా పనిచేస్తూ కంపెనీ నిర్వహించిన ఇంటర్నల్ పరీక్షల్లో పాల్గొని పదోన్నతులు సాధించారు. ప్రతి ఒక్కరూ విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సంస్థ ఉన్నతితో పాటు మంచి లాభాలు, ఇన్సెంటివ్లు అందుకోవాలి. – ఎన్ బలరామ్, డైరెక్టర్ -
కొత్త ప్రపంచంలోకి వెళ్తారు
అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. ఈ సినిమా నేడు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో అశ్విన్బాబు మాట్లాడుతూ– ‘‘హిడింబ’ మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫిల్మ్. ఈ సినిమా కాన్సెప్ట్ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందులో నా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్ట్స్ మెడికల్ మాఫియా నేపథ్యంలో ఓ సినిమా, ఓ స్పోర్ట్స్ ఫిల్మ్ చేయబోతున్నాను’’ అని అన్నారు. -
సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు
గోదావరిఖని: సింగరేణి ఆల్టైం రికార్డ్ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్టైం రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. -
తెలంగాణ విద్యుత్ సంస్థలకు కొత్త బాస్లు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల మార్పు, కొత్తవారి నియామకంపై ఊహా గానాలు ఊపందుకున్నాయి. కొత్త సీఎండీలు, డైరెక్టర్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించిందని చెబుతున్నారు. సింగరేణి సంస్థ సీఎండీగా ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న ఎన్.శ్రీధర్.. ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయన ఇప్పటికే ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ సీఎండీగా ఎంపికైనా, ఇంకా నియామక ఉత్తర్వులు జారీ కాలేదు. శ్రీధర్ కాకుంటే, సీఎంకు అత్యంత విశ్వసనీయంగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిని ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. తనకు విముక్తి కల్పించాలంటున్న ప్రభాకర్రావు.. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) సీఎండీగా, విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్కో)ల ఇన్చార్జి సీఎండీగా డి.ప్రభాకర్రావు గత నెలతో 9 ఏళ్లు, 2019 జనవరి 10 నాటికి విద్యుత్ సంస్థల్లో 50 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించారు. ఆయన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా 1969 జనవరి 10న ఎలక్ట్రిసిటీ బోర్డులో చేరారు. విద్యుత్ రంగానికి సంబంధించిన విధానాల రూపకల్పన, నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ (టీఎస్పీసీసీ) చైర్మన్ హోదాలో ఆయన డిస్కంల నిర్వహణను సైతం పర్యవేక్షించారు. ఆయనకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) హోదాను కట్టబెట్టి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం 76 ఏళ్ల వయస్సులో ప్రభాకర్రావు వయోభారం, అనా రోగ్య సమస్యలతో ఇబ్బందులు పడు తున్నారు. తనను బాధ్యతల నుంచి తప్పిస్తే విశ్రాంతి తీసు కుంటానని గతంలో ఆయన విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఆయన బహిరంగ సభల్లో తనకు బాధ్యతల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో తాను బాధ్యతల నుంచి తప్పు కున్నా మరో విధంగా భావించవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఆయన తాజా గా విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి సాను కూల సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఆయనీ ప్రకటనలు చేశారని విద్యుత్ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 80 ఏళ్లకు చేరువలో ఉత్తర డిస్కం సీఎండీ.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీ డీసీఎల్) సీఎండీగా ఎ.గోపాల్ రావు ఆరున్నరేళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 2003లో చీఫ్ ఇంజనీర్గా రిటైరయ్యారు. ప్రస్తు తం ఆయన వయస్సు 78 ఏళ్లకు పైనే. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన వృద్ధాప్య సమ స్యల వల్ల తరుచుగా హైదరాబాద్కు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతు న్నాయి. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అంటున్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీగా జి.రఘుమా రెడ్డి సైతం ఈ నెలలో 9 ఏళ్లను పూర్తి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు కూడా 71 ఏళ్లకు పైనే. ఒక వేళ ట్రాన్స్కో, జెన్కో సీఎండీగా నాన్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తే ఈయన పేరును సైతం పరిశీలించే అవకాశం ఉంది. డైరెక్టర్లు కూడా దీర్ఘకాలంగా.. టీఎస్ఎస్పీడీసీఎల్లో 8 మంది, టీఎస్ఎన్పీ డీసీఎల్లో ఆరుగురు, ట్రాన్స్కోలో జేఎండీ, మరో నలుగురు డైరెక్టర్లు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో చాలామంది 9 ఏళ్లకు పైగా ఆయా పదవుల్లో కొనసాగు తున్నారు. వీరిలో చాలామంది 70 ఏళ్లకు పైబడిన వారే. కొన్ని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల సంఖ్య మంజూరైన పోస్టు ల సంఖ్య కంటే పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొందరు డైరెక్టర్లను సాగనంపి వారి స్థానంలో కొత్తవారిని నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. -
ఏపీలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్టార్టప్లకు భారీ ప్రోత్సాహానికి కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్లన్నింటికీ ఒకే చోట అన్ని పరిష్కారాలు లభించేలా ఏపీ స్టార్టప్ డాట్ ఇన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధులను సమకూర్చేవిధంగా ఇన్నొవేషన్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే టాప్ ఫండింగ్ కంపెనీల్లో ఒకటైన సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ రాష్ట్రంలోని స్టార్టప్లకు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో ఏడు స్టార్టప్లతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, మరో రెండు దశల తర్వాత ఎంపికైన సంస్థలకు ఫండింగ్ మొదలవుతుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) చైర్మన్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ స్టార్టప్స్, డీప్టెక్ ఇండియాలు సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో సుమారు రూ.1,000 కోట్లతో ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేసిన విధంగానే రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయనున్నామని, దీనికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ స్ఫూర్తినిచ్చినట్లు తెలిపారు. గుజరాత్ తరహాలోనే ప్రారంభంలో రూ.100 కోట్లతో స్టార్టప్ ఫండ్ స్టార్ట్ చేస్తే దానికి కేంద్రం నుంచి కూడా అంతేమొత్తం అందించేలా తోడ్పాటును అందిస్తానని చెప్పారన్నారు. దీంతో ఏపీ స్టార్టప్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ ఫండింగ్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సక్సీడ్ ఇండోవేషన్ ఫండ్ ముందుకు వచ్చిందన్నారు. ఆ సంస్థ భాగస్వాములు రమేష్ లోగనాథం, విక్రాంత్ వర్షిణి విశాఖలోని 40 మందికిపైగా హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు, స్టార్టప్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. ఎంపికైన స్టార్టప్కు రూ.50 లక్షల నుంచి రూ. 8 కోట్ల వరకు సక్సీడ్ సమకూరుస్తుందన్నారు. ప్రారంభంలో రూ.200 కోట్లతో నిధి ఏర్పాటు చేసి, అనంతరం రూ.1,000 కోట్లకు చేర్చి స్టార్టప్ హబ్గా ఏపీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
వాకపల్లి అత్యాచార కేసు కొట్టివేత
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా)/ విశాఖ లీగల్: వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం కేసులో గురువారం తీర్పు వెలువడింది. విచారణ అధికారుల వైఫల్యం కారణంగా ఈ కేసును కొట్టివేస్తున్నట్లు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎల్.శ్రీధర్ ప్రకటించారు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు విశాఖ జిల్లా న్యా య సేవా ప్రాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విచారణాధికారి శివానందరెడ్డి సరిగ్గా విచారణ చేయనందున శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సిఫార్సు చేశారు. వివరాలు.. 2007 ఆగస్టు 20వ తేదీన అప్పటి విశాఖ జిల్లాలోని వాకపల్లిలో 11 మంది గిరిజన మహిళలు తమపై ప్రత్యేక పోలీస్ దళం(గ్రేహౌండ్స్) సిబ్బంది సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉద్యమించాయి. అప్పటి ప్రభుత్వం 21 మంది పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. బి.ఆనందరావును విచారణాధికారిగా నియమించగా కొంతకాలానికి ఆయన మరణించారు. ఆ తర్వాత శివానందరెడ్డి విచారణాధికారిగా వ్యవహరించారు. మొ త్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. ప్రాసిక్యూషన్ 38 మంది సాక్షులను విచారించింది. సుదీర్ఘ విచారణ తర్వాత కేసును కొట్టివేస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, 11 మంది మహిళల్లో ఇద్దరు అనారో గ్య సమస్యలతో మరణించారు. అప్పటి ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేయగా.. బాధితులు నిరాకరించారు. -
Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాధ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్ వన్ ఇండస్ట్రియల్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగాల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం. పీపీపీ కింద ఇండస్ట్రియల్ పార్కులతో పాటు ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్ టు వర్క్ కాన్సెప్ట్ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్ పేరుతో ఐకానిక్ టవర్ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి. దుబాయ్ తరహాలో ఇండస్ట్రియల్ పార్క్ : స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి, ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా వైజాగ్లో ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్లకు చేయూతనందిస్తాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆర్ అండ్ డీ సెంటర్స్ని ప్రోత్సహిస్తాం. పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్ వైస్ చైర్మన్ డా.మురళీకృష్ణ ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు. లాజిస్టిక్స్ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్ షిప్పింగ్ ఎండీ సాంబశివరావు 2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణప్రసాద్ నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్జీఎస్టీ 100 శాతం రీయింబర్స్మెంట్ మంచి సంకేతం. పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ ఎం.లక్ష్మీ ప్రసాద్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్ ఏపీ వన్ యాప్ను తేవడం హర్షణీయం. పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్ల కోసం ఐ–స్పేస్ పేరుతో టవర్ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి. నూతన విధానంలో ప్రధానాంశాలు.. ♦ ప్లగ్ అండ్ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ ♦ వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన ♦ వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం ♦ పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ♦ తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు ♦ ఎర్లీబర్డ్ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ♦ ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం ♦ లో కాస్ట్, లో రిస్క్ బిజినెస్ ♦ పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి ♦ ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ♦ అంతర్జాతీయ కనెక్టివిటీ, తయారీ రంగంలో ఎకో సిస్టమ్ ♦ దుబాయ్ తరహాలో బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి ♦ పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ ♦ తొలిసారిగా ఆపరేషనల్ గైడ్లైన్స్లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి -
పోలవరం ముంపు జాబితాలోకి మరో 36 గ్రామాలు
వేలేరుపాడు (ఏలూరు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్ ముంపు కాంటూర్ లెవల్స్తో సంబంధం లేకుండా గత ఏడాది వచ్చిన గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మరో 36 గ్రామాలను మొదటి దశ ముంపు జాబితాలోకి చేరుస్తోంది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 20,946 మంది నిర్వాసితులు ఉండగా.. కొత్త జాబితా ప్రకారం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని చింతూరు, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు సంబంధించిన మరో 13,937 మంది నిర్వాసితులను చేర్చనున్నారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 34,883కు పెరుగుతోంది. త్వరలో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు. కొత్తగా చేరిన గ్రామాలివీ కొత్త జాబితాలో వేలేరుపాడు మండలంలోని పేరంటపల్లి, తూర్పుమెట్ట, టేకూరు, కాకినూరు, కాచారం, ఎర్రమెట్ట, ఎడవల్లి, టేకుపల్లి గ్రామాల్లో 901 మంది నిర్వాసితులను జాబితాలో చేరనున్నాయి. కుక్కునూరు మండలంలోని కౌడిన్యముక్తి, చీరవల్లి మాధవరం, బెస్తగూడెం, ఆంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, రావిగూడెం, ఎల్లప్పగూడెం, ఎర్రబోరు, గుడంబోరు, ముత్యాలంపాడు గ్రామాల్లో 2,123 మంది కొత్త నిర్వాసితులు చేరతారు. చింతూరు మండలంలోని చింతూరు, రామవరంపాడు, ప్రతిపాక, గుండుగూడెం, వడ్డిగూడెం, వీఆర్పురం మండలంలోని వీఆర్పురం, ధర్మతాళ్లగూడెం, రాజ్పేటకాలనీ, ఎ.వెంకన్నగూడెం, చింతరేగుపల్లి, కూనవరం మండలంలోని టేకుబాక, కూనవరం, టేకులబోరు, కొడ్రాజుపేట, పెద్దార్కూరు, పండురాజుపల్లి, శబరికొత్తగూడెం తదితర గ్రామాలను కొత్త జాబితాలో చేరుస్తున్నారు. కాంటూర్ లెవల్స్తో సంబంధం లేదు కొత్త జాబితాలో చేర్చే గ్రామాలకు, పోలవరం ప్రాజెక్ట్ కాంటూర్ లెవల్స్కు సంబంధం లేదు. ఏటా వచ్చే వరదలకు వల్ల నిర్వాసితులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ఆధారంగా రెండు జిల్లాల్లో 36 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రారంభించాం. మొదటి ప్రాధాన్యతగా ఆర్ అండ్ ఆర్ పరిహారం అందిస్తాం. – చెరుకూరి శ్రీధర్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ -
రాజస్తాన్లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్లోని కాల్ సెంటర్ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
ఈడీ విచారణకు హాజరైన PSR గ్రానైట్స్ అధినేత పాలకుర్తి శ్రీధర్
-
Book Review: అనువాదం ఒక సవాలు
‘భిన్న నేపథ్యాలు, కులాలు, మతాలు, ఇతివృత్తాలు, కథ నాలు, మాండలీకాలు ఉన్న 26 కథలను ఆంగ్లంలోకి అనువాదం చేయడమెట్లా? వాటిలోని విభిన్నతను, ప్రత్యేకతను అనువాదంలోకి తీసుకురావడమెట్లా?... ఇవీ అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్లకు ఈ పుస్తకం అనువాదం సమయంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు. ఇంగ్లిష్ అనువాదంలో వెలువడ్డ తెలుగు కథల సంక లనం ‘తెలుగు: ద బెస్ట్ షార్ట్ స్టోరీస్ అఫ్ అవర్ టైమ్స్’కు ఓల్గా సంపాదకులు. హార్పర్ పెరెన్నియల్ వాళ్ళు ప్రచురించారు. ‘గత ముప్పై ఏళ్ళల్లో వచ్చిన ముఖ్యమయిన కథల్లోంచి ఎంపిక చేసుకున్న ఈ 26 కథలు భారతీయ పాఠకులకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగిస్తే నా యత్నం, ప్రచురణకర్తల ఉద్దేశం, అనువాదకుల ప్రయత్నం నెరవేరినట్లే’ అంటారు ఓల్గా. ఈ పుస్తకంలోని రచనలనూ, రచయితలనూ తెలుగు పాఠకులకు పరిచయం చేయా ల్సిన అవసరం లేదు. ఈ కథలన్నీ మనల్ని కదిలించినవే, ఆలోచింప జేసినవే. తెలుగు కథకు సరిగ్గా నూటా ఇరవై ఏళ్ళు. వేలాది కథలు, వందలాది కథల సంపుటాలు ఈ శతాబ్ద కాలంలో వెలువడ్డాయి. ముఖ్యంగా 1990 నుండి వైవిధ్యమైన భావజాలాలు, అస్తిత్వాలు తెలుగు పాఠకులను కదిలించాయి. ఆ భిన్నత్వం అనుభవం నుండి, ప్రతిఘటన నుండి, ఉద్యమాల నుండి వచ్చింది. ఏ గొంతులు, మనుషులు, జీవితాలు, భాషలు సాహిత్యానికి వెలుపల ఉంచబడ్డాయో సరిగ్గా అవే, సాహిత్యం అంటే ఇదీ– కథ అంటే ఇదీ అంటూ ముందు కొచ్చాయి. అలాంటప్పుడు అన్ని కథల్లోంచి ఇరవై ఆరు కథలు ఎంపిక చేయాలంటే ఓల్గా తన ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, కష్టమయిన పనే. ఈ సంకలనంలో సతీష్ చందర్ ‘డాగ్ ఫాదర్’, ఎండ్లూరి మానస ‘బొట్టు భోజనాలు’, పెద్దింటి అశోక్ కుమార్ ‘జుమ్మే కి రాత్’, కరుణ ‘నీళ్లు చేపలు’, పి. సత్యవతి ‘ఇట్లు స్వర్ణ’, కోట్ల వనజాత ‘ఇత్తు’, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి ‘సముద్రపు పిల్లోడు’, వి. ప్రతిమ ‘మనిషి విత్తనం’, వి. చంద్రశేఖరరావు ‘ద్రోహ వృక్షం’, వాడ్రేవు వీరలక్ష్మీదేవి ‘బినామీ’, సన్నపురెడ్డి వెంక ట్రామిరెడ్డి ‘సేద్దెగాడు’, ఎం.ఎం.వినోదిని ‘ఒక విలన్ ఆత్మ హత్య’, కె.ఎన్. మల్లీశ్వరి ‘రెండంచుల కత్తి’, మల్లిపురం జగదీశ్ ‘ఇప్ప మొగ్గలు’, కేతు విశ్వనాథరెడ్డి ‘అమ్మవారి నవ్వు’, కొలకలూరి ఇనాక్ ‘కొలిమి’, మహమ్మద్ ఖదీర్ బాబు ‘గెట్ పబ్లిష్డ్’, జూపాక సుభద్ర ‘ఎంపీటీసీ రేణుకెల్లు’, అక్కినేని కుటుంబరావు ‘పనివాడితనం’, కె.వరలక్ష్మి ‘మంత్రసాని’, అట్టాడ అప్పల్నాయుడు ‘బతికి చెడ్డ దేశం’, షాజహానా ‘సిల్సిలా’, జి.ఆర్.మహర్షి ‘పురాగానం’, బి.ఎస్.రాములు ‘మెరుగు’, ఓల్గా ‘సారీ జాఫర్’, కుప్పిలి పద్మ ‘వే టు మెట్రో’ కథలు ఉన్నాయి. పలు భాషలు, పలు రాతలు, పలు రచయి తలు, పలు సందర్భాలు, పలు కాలాలు, కానీ ఒక అనువాదం! అందుకే అనువాదాన్ని పలు అంచుల కత్తి అనడం అతిశయోక్తి కాదేమో. తాము లేవనెత్తిన చర్చకు సమాధానమే అన్నట్లుగా, రచనల, రచయితల విభిన్నతను అనువాదాల్లోకి తీసుకు రావడానికి అల్లాడి ఉమ, ఎం. శ్రీధర్ తెలుగు పదాలను, ఉర్దూ మాటలను యథాతథంగా ఆంగ్లంలోకి తీసుకొచ్చారు. ‘నా తమిళ జీవితాన్ని, అనుభవాన్ని ప్రతిఫలించే ఆంగ్లం కావాలి’ అని మీనా కందసామి అన్న మాటలు గుర్తొస్తాయిక్కడ. అనువాదం అనువాదంలాగా ఉండాలా, అసలులాగే ఉండాలా, పదకోశం ఇవ్వాలా లేదా పాఠకులే కొంత ప్రయత్నించి అర్థం చేసుకోవాలా అన్న చర్చలు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అయితే మూల కథలోని పదాలను అనువాదంలో అలాగే ఉంచేయడం ఎప్పుడూ ఒకలాగే పని చేయకపోవచ్చు. రచనల్లోని విభిన్నతే వాటిలోని నిగూఢ అర్థాలకు కూడా వర్తిస్తుంది కదా. (చదవండి: కాలానికి ముందు పయనించిన కవి) – కె. సునీతారాణి -
కథ: ‘నేను’... సుందర్ని చంపేశానన్నమాట! ఇంతకీ ఏం జరిగింది?
ఉన్నట్టుండి మెలకువ వచ్చింది నాకు. టైమ్ చూద్దును కదా అర్ధరాత్రి ఒకటిన్నర. ఇది కాస్త అసహజమైన విషయమే. ఒకసారి పడుకున్నానూ అంటే మళ్లీ తెల్లారేవరకూ వొకపట్టాన లేచే రకం కాదు నేను. నా నిద్రని డిస్టర్బ్ చేయగలిగే శబ్దాలు కూడా ఏమీ బయట్నించీ లోపలికి రాలేదని బల్లగుద్ది చెప్పగలను. ఇలా మధ్యరాత్రిలో నిద్ర లేవడమన్నది ఊహ తెలిశాక ఎప్పుడూ జరగలేదు. ఒంటరిగా పడుకోవడం అలవాటు లేక మెలకువొచ్చిందని అనుకోడానికి కూడా లేదు. నాకంటూ అసలెవరున్నారని. ఆ ఫ్లాట్లో వుండేది నేనొక్కణ్నేగా. మరి నన్ను నిద్ర లేపింది ఏమైవుండొచ్చు? ఉన్నట్టుండి సడెన్గా వెలిగింది నాకు, ఆ గదిలో నేను వొంటరిగా లేను. ఇంకెవరో కూడా వున్నారు. నా పడకగదిలో కనీసం బెడ్లైట్ కూడా వేసి లేదు. కిటికీల్లోంచీ బయటి వెలుతురేమీ లోపలికి రావట్లేదు. ఎంత చీకటిగా వుందంటే, అసలు కళ్లు తెరవడానికీ మూయడానికీ తేడా ఏం తెలీడం లేదు. అయినా సరే అర్థమైపోయింది నాకు, ఆ రూములో ఎవరో వున్నారని. నేను భయపళ్లేదు. నాకు ఎలాంటి హానీ తలపెట్టే వుద్దేశం ఆ వ్యక్తికి లేదని నాకు తెలిసిపోతోంది. ఎలా తెలుస్తోందీ అని అడగొద్దు. చిమ్మచీకటిలో కూడా యింకొక మనిషి అక్కడున్నట్టు నాకెలా తెలిసిందో, యిదీ అలాగే. ఆఫీసుల్లో పెట్టినట్టు నా బెడ్రూమ్ బయట కూడా ఒక లాగ్ రిజిస్టర్ పెట్టాలి. ఇంట్లో నేనొక్కణ్నే వుండి, నిద్రలో మునిగిపోయి వున్నప్పుడు నా గదిలోకి రావాలనుకున్నవాళ్లు ‘పర్పస్ ఆఫ్ విజిట్’ ఏంటో అందులో రాసిన తర్వాత మాత్రమే లోపలికి రావాలి. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది. ఆ వొచ్చిన మనిషికి నాకేదో చెప్పాలన్న వుద్దేశం లేదు. నన్నేదైనా అడిగే ఆలోచనా లేదు. కాస్త యెడంగా నిలబడి నేనేం చేస్తున్నానో పరిశీలించడమే అతను (ఆమె?) చేయదల్చుకున్న పని అని అనిపించింది నాకు. అసలైనా అంత చీకట్లో, అందునా నిద్రపోతున్న నన్ను గమనించడం ద్వారా నా గురించి ఏం తెలిసే అవకాశం వుంది? ఆ వచ్చిన మనిషి చనిపోయిన మా నాన్న గానీ, అమ్మ గానీ అయ్యుండే చాన్సుందా? వాళ్లు వదిలెళ్లిన పాత పెంకుటిల్లు బాగోగులు నేను చూస్కోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడానికి వచ్చారా? అయ్యుండకపోవచ్చు. మరి? నాలుగేళ్ల క్రితం చనిపోయిన నా బెస్టు ఫ్రెండు ఆత్మ అయ్యుండొచ్చా? ‘నాగ్గానీ ఏమైనా అయితే, మా ఫ్యామిలీ మేటర్స్ అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాల్రా’ అని చేతిలో చెయ్యేయించుకొని, మాట తీసుకొని మరీ కన్ను మూశాడు. నేను వాళ్లింటి ఛాయలకి పోయి ఎన్నాళ్లయ్యింది? తనకి నేనిచ్చిన ప్రామిస్ని గుర్తు చేయాలనుకుంటున్నాడా? ఆత్మలకి అన్నీ తెలిసిపోయే ప్రొవిజన్ వుంటే వాడికి (వాడి ఆత్మకి) నా మీద భ్రమలు తొలగిపోయి వుండాలి. మొత్తమ్మీద యీ కొత్తమనిషి ప్రెజెన్సు, దాని వెనక వుండగల కారణాలు యివన్నీ ఆలోచిస్తుంటే నాకు మిగతా విషయాలేవీ గుర్తుకు రావట్లేదు. లెక్క ప్రకారం, యిలా అనుకోకుండా మెలకువ వచ్చిన ఎవరైనా ఏం చేయాలీ? ఆ ముందురోజు జరిగిన లేదా తర్వాతిరోజు జరగాల్సిన ముఖ్యమైన పనేదో చప్పున మైండులోకి వచ్చి, దాని గురించే కదా ఆలోచించాలి! నాకు సంబంధించినంత వరకూ ముఖ్యమైన విషయం అంటే లావణ్య తప్ప మరింకేదీ కాదు. పిచ్చెక్కించే అందం, అసాధారణమైన తెలివితేటలు, అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్. అలాంటి అమ్మాయి పార్టనర్గా దొరకడాన్ని మించిన అదృష్టం ఏ మగాడికైనా వేరే వుంటుందా? లక్కీగా పెళ్లి అనే సిస్టమ్లో యిరుక్కుపోవడానికి లావణ్య కూడా సిద్ధంగా లేదు. ‘లైఫ్ అంతా వొక్కడితోనే అనే ఆలోచనే సఫొకేటింగా వుంటుంది’ అని పైకే అనేస్తుంది. ఎవరైనా వింటే ఏం అనుకుంటారో అనే భయం కూడా లేదు ఆ పిల్లకి. ‘సీరియస్ కమిట్మెంట్లు అవసరం లేని క్యాజువల్ రిలేషన్ షిప్ ఎవరితో అయినా ఓకే’ అన్నట్లుగా ఉంటుంది. లావణ్య అలా ఉండడంత మొదట్లో నాకు పెద్దగా నచ్చలేదు. ఆమె నమ్మే ఫిలాసఫీలో నాకు లాభించగల కోణం ఏంటీ అన్నది నాకు తర్వాత్తర్వాత తెలిసొచ్చింది. ఒకవేళ ఆమె కూడా అందరిలాగానే పెళ్లి ద్వారా వచ్చే సెక్యూరిటీ కావాలనుకుంటే ఏమైవుండేది? అసలు నన్ను దగ్గరకి రానిచ్చేదేనా? మిగతావాళ్ల సంగతేమో గానీ, నాతో ఫిజికల్గా ఎఫైర్ పెట్టుకోడానికి లావణ్యకి ఎలాంటి అభ్యంతరమూ లేదు. అలాగని దానికి లివిన్ రిలేషన్ అని పేరు పెట్టడం కూడా ఆమెకి యిష్టం వుండదు. ఏదీ ఒక అరేంజ్మెంట్ లాగా, కాంట్రాక్ట్ లాగా వుండకూడదనేది తన ఫిలాసఫీ. సమాజం ఎప్పుడైనా మార్పుని వ్యతిరేకిస్తుంది. కొన్నాళ్లకి చచ్చినట్టు రాజీపడుతుంది. ఏ మార్పుతో అయితే అయిష్టంగా రాజీపడిందో దాని తాలూకూ ఫలితాన్ని యిన్ఫ్లూయెన్స్ చేయాలని కొన్నాళ్లకి దానిలో ఆరాటం మొదలవుతుంది. అప్పుడు ఆ మార్పుకి విలువ లేకుండా పోతుంది. మళ్లీ కొత్త మార్పు కోసం కొత్తగా ప్రయత్నం మొదలవుతుంది. ఇవన్నీ లావణ్య చెప్పిన మాటలే. తన ఐడియాలజీతో నాకొచ్చిన పేచీ ఏమీ లేదనే అనిపించింది నాకు. ∙∙ ‘దబ్’ అన్న సౌండుకి మళ్లీ మెలకువొచ్చింది నాకు. కిటికీలో నుండీ విసరబడిన న్యూస్ పేపర్ చప్పుడన్నమాట. పేపర్ బాయ్ మీద భలే కోపం వచ్చింది. అయితే, ఆ కోపం ఎంతోసేపు ఆగలేదు. మూడో అంతస్తులో వున్న కిటికీలోంచీ కచ్చితంగా నా రూములో కొచ్చి పడేలాగా గురిచూసి విసిరే వాడి టాలెంట్ గుర్తొచ్చి ముచ్చటేసింది. అవునూ, మూడు రోజుల్నుండీ నేను పేపర్ చదవనే లేదా? రబ్బర్బ్యాండ్ కూడా తీయకుండా పేపర్లు కిటికీ పక్కనే పడున్నాయేంటి? సరే నా సంగతి వదిలేద్దాం. మరి నా రూముకి కొత్తగా వచ్చిన గెస్టు సంగతేంటి? అతను (ఆమె?) కి పేపర్ చదవాలనీ, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనీ లేదా? ఎవరో నా పక్కన వున్నారని తెలిసి కూడా నాకు మళ్లీ నిద్ర ఎలా పట్టింది? తెల్లారింది కాబట్టీ, వెలుతుర్లో ఆ మనిషి ఎవరన్నదీ స్పష్టంగానే కనబడొచ్చు. కానీ, నాకెందుకో అలా తెలుసుకోబుద్ధి కాలేదు. అవతలి మనిషి వల్ల నాకెలాంటి యిబ్బందీ లేనప్పుడు ఆరాలు తీయడం పద్ధతి కాదని అనిపించింది నాకు. అలా చేయడం ఎదుటివాళ్ల ప్రైవసీకి భంగం కలిగించడం కాదూ?! తాళం వేసున్న గదిలో, ఊహించని విధంగా వొక అగంతకుడు ప్రత్యక్షం అవ్వడం, అప్పుడే నిద్రలేచి మత్తుగా ఆవులిస్తున్న హీరోపై హత్యా ప్రయత్నం చేయడం, ఆ ప్లాన్ ముందే పసిగట్టిన హీరో లాఘవంగా అవతలికి గెంతడం, కత్తితో పొడవబోయిన క్రిమినల్ తూలి ముందుకి పడిపోవడం, వాడి చేతిలో వున్న ఆయుధం జారిపోవడం.. సినిమాల్లో చూసిన యిలాంటి సీన్లన్నీ గుర్తుకొచ్చాయి నాకు కాసేపు. నిజానికి నా బుర్ర చేస్తున్న తప్పు క్షమార్హం కాదు. ఎందుకంటే అసలు నా చుట్టూ వున్న వాతావరణం ప్రాస్పెక్టివ్ క్రైౖ మ్ సీన్లా లేనే లేదు. ముందుగా జరిగిన వొప్పందం ప్రకారం యిద్దరు మనుషులు స్నేహపూర్వకంగా ఒక వెన్యూని షేర్ చేసుకుంటున్నట్టుంది. అయినా, వర్రీ కావాల్సిన సీరియస్ యిష్యూస్ వదిలేసి, యింత అల్పమైన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను నేను? పట్టించుకోవాలే గానీ ఎన్ని సమస్యలు లేవు నాకు! లావణ్య విషయంలో నాకు పోటీ వస్తున్న కొలీగ్ సుందర్ విషయంలో ఏం చేయాలో ఆలోచించాలి ముందు. సుందర్..! ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదు. లేదా, వయసు పెరక్కుండా అడాలసెన్స్లోనే ఆగిపోయినట్టున్నాడు. లావణ్య మనసు మార్చగలననీ, ఆమెకి పెళ్లి మీద నమ్మకం కుదిరేలా చేస్తాననీ వాదిస్తాడు. ‘జీవితాంతం యితని చేయి వదలకూడదు అనిపిచేంత నమ్మకం కలిగించే మగాడు తారసపడకపోవడం వల్లే లావణ్య అలా మాట్లాడుతోందీ’ అంటాడు. ‘ఎన్ని రోజులు ఎదురుచూసైనా సరే, ఎంత కష్టపడాల్సివచ్చినా సరే.. లావణ్యని పెళ్లి చేసుకోవడమే నా జీవితాశయం’ అంటాడు. ఒకప్పుడు తను కూడా సుందర్ లాగానే వుండేవాడు. అచ్చం అలానే ఆలోచించేవాడు, ‘విధి యిద్దరు మనుషుల్ని దగ్గరగా తీసుకురావడం, వాళ్లిద్దరూ కలిసి జీవితం పంచుకోలేకపోవడం, ఆ వెలితి వాళ్లని జీవితాంతం వేధించడం’. కాలేజీ రోజుల్లో యిలాంటి కథలు ఎంత కిక్కెక్కించాయో.. తనకి కూడా! చాలామంది గ్రాడ్యువల్గా ఆ ట్రాన్స్ నుండి బయటకి వచ్చేస్తారు. సుందర్ మాత్రం బయట ప్రపంచం ఎలావుందో చూడడానికి రెడీగా లేడు. అతని ప్రవర్తన చైల్డిష్గా వుందని చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోవడం లేదు సరి కదా, కోపం తెచ్చుకొని అసహనంతో రగిలిపోతున్నాడు. ∙∙ ‘కావాలంటే నువ్వూ లావణ్యని ప్రేమించు. తనని పెళ్లి చేసుకోవాలని నాకు మాదిరిగానే కలలు కను. నాకేం అభ్యంతరం లేదు. మనిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటే లావణ్య వాళ్లనే ప్రేమిస్తుంది. అసలు లావణ్య వరకూ ఎందుకు?! నాకన్నా నువ్వే తనని ఎక్కువ సంతోషంగా ఉంచగలవు అని నమ్మకం కుదిరితే నేనే హ్యాపీగా మీ యిద్దరి లైఫ్లో నుండీ వెళ్లిపోతాను. కానీ, అసలు ప్రేమా పెళ్లీ అనే ప్రస్తావన లేకుండా, వొక అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటే చాలు అనుకోవడం తప్పు’ అన్నాడు సుందర్. ‘చెప్పేది వినవే. ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకోవొద్దు, తనతో సంబంధం పెట్టుకుంటే చాలు’ అని జనరలైజ్ చేయడం లేదు నేను. ఇక్కడ డిస్కషన్ కేవలం లావణ్య గురించే. ఆ అమ్మాయికి కావాల్సిందేదో తనకి యివ్వడమే కదా ఆమెని ప్రేమించేవాడు చేయాల్సిన పని?’ లాజిక్ తీశాన్నేను. ‘అసలిలా ఎలా మాట్లాడగలుగుతున్నావ్? ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్గా తెలీదు. ఏదో సరదాకి అలా మాట్లాడుతుందంతే. తన అమాయకత్వాన్నీ, వల్నరబిలిటీనీ క్యాష్ చేసుకోవడంలో తప్పు లేదని అంటున్నావ్ నువ్వు, అంతేగా?’, నన్ను విలన్ లాగా చూస్తూ అడిగాడు సుందర్. ‘లైఫ్ అంటే ఏంటో యింకా క్లియర్గా తెలియని అమ్మాయిని ప్రేమించి, ఆమెని పెళ్లి చేసుకోవడం కూడా తప్పేగా మరి? కొన్నాళ్లయ్యాక ఆమె తన యిష్టాయిష్టాలేంటో తెలుసుకొని, అసలు పెళ్లెందుకు చేసుకున్నాన్రా దేవుడా అని వుసూరుమంటుందేమో?’ అన్నాను నేను. చెప్పొద్దూ, నన్ను చూసుకుంటే నాకే చాలా గర్వంగా అనిపించింది. ఈ దెబ్బకి సుందర్గాడి మాట పడిపోతుంది. ‘భవిష్యత్తులో లావణ్య పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు అని అనుకుంటే, అది లైఫ్ గురించి మొత్తం తెలుసుకున్నట్టు అవుతుందా? పెళ్లి చేసుకోవడం కంటే, దొరికినోడితో దొరికినట్టు ఉండడం బెటర్ అనే ఆలోచన తప్పు అని తెలుసుకోవడం కదా అల్టిమేట్ రియలైజేషన్ అంటే?!’ వీడంత తేలిగ్గా రాజీ పడే రకం కాదు. ‘సుందర్, నువ్వేం అనుకోనంటే నిన్నొక ప్రశ్న అడుగుతాను’ టెంపో మార్చి, సాఫ్ట్గా అన్నాను. ‘ఏంటి? అడుగు’ అనుమానంగా బదులిచ్చాడు. ‘పెళ్లి గురించి లావణ్య ఫిలాసఫీ మీద నీకు రెస్పెక్ట్ లేదు. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి తాను డెసిషన్ తీసుకునేంత మెచూరిటీ వుందనే నమ్మకం లేదు. మరి, ఏం చూసి తనని ప్రేమించావు? ఎందుకు తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు?’ నా నుండి ఈ ప్రశ్నని సుందర్ ఏమాత్రం వూహించలేదని తన ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. సుందర్లో కాస్త నిజాయితీ లేకపోలేదు. అతని స్థానంలో ఎవరైనా వుంటే, నా ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఏదో వొక సమాధానం చెప్పివుండేవాళ్లు. కానీ సుందర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించాడు. నిజానికి సుందర్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లావణ్యతో నేను సంబంధం పెట్టుకోడానికి అతని పర్మిషన్ తో పనేముంది? కానీ, ఎందుకోగానీ నేను చేసే పని రేషనల్గానే వుందని సుందర్ని నమ్మించాలని అనిపిస్తోంది. బహుశా, నేనూ వొకప్పుడు అతనిలాగానే ఆలోచించేవాడిని అని నాకు పదేపదే గుర్తుకు రావడం వల్ల అనుకుంటాను. వాదించడం ఆపేసి సుందర్ డిఫెన్సులో పడిపోవడం నాకు కాస్త వుత్సాహానిచ్చింది. సుందర్.. విషయం యిక్కడిదాకా వచ్చింది కాబట్టీ, నాకు ఏమనిపిస్తుందో చెపుతా విను. నీకూ నాకూ లావణ్య నుండీ కావాల్సింది వొక్కటే. మనిద్దరి అప్రోచ్ మాత్రమే వేరు. పెళ్లి అన్నమాట ఎత్తకుండా లావణ్యతో నేను ఎక్కడ తేలతానో, పెళ్లీ పెళ్లీ అని కలవరిస్తూ నువ్వు కూడా అక్కడే తేలతావ్. పచ్చిగా చెప్పాలంటే, లావణ్యతో ‘రిలేషన్షిప్’ కోసం నువ్వు పెళ్లి అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటున్నావ్, అంతే!’ మరీ యింత హార్ష్గా చెప్పకుండా వుండాల్సిందేమో. కానీ, యిక ముసుగులో గుద్దులాట అనవసరం. ఈసారి కూడా సుందర్ ఏమీ మాట్లాడలేదు. లేచి నిలబడి గదిలో అటూయిటూ పచార్లు చేయడం మొదలెట్టాడు. ఆల్రెడీ లైన్ క్రాస్ చేసేశాను. ఇక కొత్తగా జరగ్గలిగే డ్యామేజ్ అంటూ ఏం లేదు. సిగరెట్ పెట్టె, లైటర్ చేతిలోకి తీసుకొని, అప్పటిదాకా జరిగిన చర్చని కంక్లూడ్ చేస్తూ చెప్పాన్నేను.. ‘నా మాట విని నువ్వూ నా స్కూల్లోకొచ్చెయ్. ఇలా తర్జనభర్జన పడుతూ పోతే, చివరికి నువ్వూ నేనూ తప్ప అందరూ వాడతారు దాన్ని’ లావణ్య గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము. కానీ ఆమెని వుద్దేశించి ‘దానిని’, ‘అది’ లాంటి పదాలు నేను వాడడం అదే మొదటిసారి. కుండబద్దలు కొట్టేసి, నా పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, మాటలకి మరీ ఎక్కువ డెకరేషన్ అవసరం లేదు అని నా యిన్స్టింక్ట్ చెపుతోందన్నమాట. హాల్లోంచీ బాల్కనీలోకి వెళ్లే తలుపు బోల్ట్ తీస్తూ నేను పై మాటలు అంటున్న సమయానికి సుందర్ వేరేౖ వెపు తిరిగి వున్నాడు. అతని ఫేస్ నాకు కనబడుతూ వుండివుంటే కనీసం చివరి రెండు వాక్యాలైనా మాట్లాడకుండా నిగ్రహించుకొని వుండేవాణ్నేమో. సుందర్ ఆవేశంగా నా మీదకి రావడం అర్థమయ్యి చప్పున వెనక్కి తిరగబోయాను నేను. అప్పటికే అతను నా కాలర్ పట్టుకుని విసురుగా వెనక్కిలాగి, నా తలని పక్కనే వున్న గోడకేసి కొట్టాడు. అతని పట్టు నుండి విడిపించుకోడానికి నా శక్తికొద్దీ ప్రయత్నించాను. చూడ్డానికి అర్భకుడిలా వున్నాడనే కానీ గట్టిపిండమే. ∙∙ నా గదిలో ఎవరో వున్నారని నేను గ్రహించడం దగ్గర కదా ఈ కథ మొదలైంది. నేను పడుకోడానికి ముందు ఏం జరిగిందీ అన్నది గుర్తు చేసుకున్నాక నాకు యిప్పుడు కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తుంది. సుందర్ని నేను చంపేశానన్నమాట. నాకు నిద్రాభంగం అవడానికి కారణమైంది సుందర్ శవం కానీ లేదా అతని ఆత్మ కానీ అయ్యుండాలి. సెకండ్ ప్రాబబిలిటీ ప్రకారం, సుందర్ నన్ను చంపేసి వుంటే, ఆ గదిలో వున్న యిద్దరూ నేనే అవ్వడానికి కూడా అవకాశం వుంది. సుందర్కీ నాకూ మధ్య జరిగిన పెనుగులాటలో ఎవరు గెలిచారు అన్నదానిమీద ఆధారపడి వుంటుంది నిజం ఏంటన్నది. అన్నట్టు మీకు యింకో ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సుందర్ నన్ను చంపడానికి ప్రయత్నించడం, అంత కంగారులోనూ, నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు. నన్ను ఆశ్చర్యపోయేలా చేసిందేంటంటే, సుందర్ మొహంలో కోపం కాకుండా భయం కనిపించడం. తన గురించి తాను తెలుసుకోవడంలో మనిషికి వుండే భయం. ప్రాణాలు వదలడానికి ముందు ఏబర్డీన్ లోయల్లో మాక్బెత్ని వేధించిన భయం. నిజం బారి నుండి పారిపోలేని నిస్సహాయత దెయ్యంగా మారి వెంటాడుతున్నప్పుడు కలిగే భయం. ఫైనల్గా సుందర్ని నేను కన్విన్స్ చేశానా? ఒకవేళ నా ప్రవర్తనని సమర్థించుకోడానికి నేను సుందర్ మొహంలో భయాన్ని కాకుండా ఆశ్చర్యాన్నే చూసినట్టు నటిస్తున్నానా? ఈ చివరి ఆలోచన రాగానే నా వొళ్లు వొక్కసారిగా జలదరించింది. తల పక్కకి తిప్పి, నా గదిలో వున్నదెవరో చూడాలంటే నాకిప్పుడు భయంగా వుంది. -
ఎకరం కూడా ఎండకూడదు.. ఇంధన శాఖకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట పొలం కూడా ఎండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ అప్రమత్తమైంది. వేసవి, విద్యార్థులకు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గృహ విద్యుత్కూ డిస్కమ్లు ప్రాధాన్యమిస్తున్నాయి. రోజూ 50 ఎంయూల కొరత రాష్ట్రంలో 2018–19లో మొత్తం విద్యుత్ డిమాండ్ 63,605 మిలియన్ యూనిట్లు ఉండగా 2021–22 నాటికి 68,905 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే 8.3 శాతం పెరిగింది. గృహ వినియోగం 32 శాతం, పారిశ్రామిక వినియోగం 6 శాతం, వ్యవసాయ వినియోగం 16 శాతం చొప్పున పెరిగింది. గృహ విద్యుత్ డిమాండ్ 2018–19లో 14,681 ఎంయూలు ఉండగా 2021–22లో 19,355 మిలియన్ యూనిట్లకు చేరింది. పారిశ్రామిక రంగంలో డిమాండ్ 17,781 మిలియన్ యూనిట్ల నుంచి 18,844 మిలియన్ యూనిట్లకు చేరింది. వ్యవసాయ రంగంలో వాడకం 10,832 మిలియన్ యూనిట్ల నుంచి 12,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వివిధ రంగాల్లో పెరిగిన విద్యుత్ డిమాండ్ కారణంగా రోజూ 50 మిలియన్ యూనిట్ల మేర కొరత ఎదుర్కొంటున్నట్లు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు. దీన్ని అధిగమించేందుకు బహిరంగ మార్కెట్లో నిత్యం 30 మిలియన్ యూనిట్ల మేర కొనుగోలు చేస్తుండగా మరో 20 ఎంయూల కొరత నెలకొంది. ఈ నెలలో విద్యుత్ డిమాండ్ 6,720 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొరతకు రెండు ప్రధాన కారణాలు.. కోవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో వివిధ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఇది ఒక కారణం. రష్యా – యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో దేశంలో బొగ్గు కొరత కారణంగా కొద్ది నెలలుగా అసాధారణంగా పెరిగాయి. ఇది మరో ప్రధాన కారణం. గతంలో టన్ను బొగ్గు రూ.6 వేల నుంచి రూ.8 వేలు ఉండగా ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేలకు చేరింది. దీంతో గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ బొగ్గు కొరత నెలకొంది. విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు వివిధ రాష్ట్రాలు పవర్ ఎక్సే్ఛంజీల నుంచి విద్యుత్ కొనుగోలుపై ఆధారపడుతున్నాయి. ఫలితంగా డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరిగి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం యూనిట్ ధర పీక్ అవర్స్లో రూ.12 వరకూ ఉంది. నెలాఖరుకు సాధారణ పరిస్థితి.. ‘‘రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ డిమాండ్ను అందుకునేలా దీర్ఘకాలిక ప్రాతిపదికన బొగ్గు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. విద్యుత్ కొరత కారణంగా పారిశ్రామిక వినియోగంపై కొంతమేర ఆంక్షలు విధించక తప్పని పరిస్థితి ఎదురైంది. అలా ఆదా చేసిన విద్యుత్ను వ్యవసాయ, గృహ అవసరాల కోసం సరఫరా చేస్తున్నాం. ఈ నెలాఖరు నాటికి విద్యుత్ కొరత సమస్య చాలా వరకు తీరుతుందని భావిస్తున్నాం. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించడంలో రాజీ లేదు’’ – బి.శ్రీధర్, ఇంధన శాఖ కార్యదర్శి -
విద్యుత్పై ఉత్త కబుర్లే.. ఆ ‘బాబు’ గొప్పేమీ లేదు
సాక్షి,అమరావతి: గతంలో టీడీపీ అధికారంలోకి వచ్చేసరికే రాష్ట్రంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయని, గత సర్కారు హయాంలోనే మొదలయ్యాయనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ స్పష్టం చేశారు. ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్తో కలసి ఆదివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుదిబండల్లా పీపీఏలు.. బకాయిలు ఆర్టీపీపీలో 600 మెగావాట్లు, కృష్ణపట్నంలో 1600 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు 2009లోనే మొదలయ్యాయని ఇంధనశాఖ కార్యదర్శి వెల్లడించారు. 2014 నాటికి దేశ వ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ అధిక ధరలకు 8,000 మెగావాట్ల పీపీఏలు కుదుర్చుకోవడంతో పాతికేళ్ల పాటు ఏటా రూ.3 వేల కోట్లు భారం డిస్కంలపై పడుతోందన్నారు. గత సర్కారు హయాంలో రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకుని 2018–19 నాటికి రూ.62 వేల కోట్లకు చేర్చారని, ఏటా రూ.8 వేల కోట్లు చొప్పున ఇవ్వాల్సిన సబ్సిడీలను ఇవ్వకుండా రూ.2 వేల కోట్లే ఇవ్వడం వల్ల బకాయిలు పెరిగిపోయాయని చెప్పారు. గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలను (విద్యుత్ కొనుగోలు ఖర్చులు) ఏపీఈఆర్సీకి సమర్పించకుండా, తప్పుడు నివేదికలు సమర్పించడంతో ఆర్థిక భారం పడిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు, బకాయిలకే రెండున్నరేళ్లలో రూ.36 వేల కోట్లు ఇచ్చిందన్నారు. నెలలోపే కృష్ణపట్నం యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో 960 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును సిద్ధం చేస్తోందని, 2024 నుంచి దశలవారీగా ఆ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి వివరించారు. సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు చేపట్టామని, మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని వెల్లడించారు. కృష్ణపట్నం యూనిట్ నెలలోపే ప్రారంభిస్తామన్నారు. నెడ్ కాప్ ద్వారా 6600 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, డీపీఆర్ సిద్ధమవుతోందని తెలిపారు. సాగుకు సౌర విద్యుత్తుతో భరోసా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఇటీవల ఎన్టీపీసీ చైర్మన్తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తెలియచేశారని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వ్యవసాయానికి సెకీ ద్వారా తక్కువ ధరకే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.49కే సేకరిస్తోందని, తద్వారా 2024లో వ్యవసాయ మిగులు విద్యుత్ను గృహ, పారిశ్రామిక అవసరాలకు అందిస్తామన్నారు. ప్రస్తుతం సగటున విద్యుత్తు కొనుగోలు వ్యయం యూనిట్ రూ.5.10 చొప్పున ఉందన్నారు. ఈ లెక్కన సంవత్సరానికి దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి గత సర్కారు హయాంలో విడుదల చేసిన మొత్తం రాయితీలు రూ.13,255 కోట్లు కాగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్లలో విడుదల చేసిన సబ్సిడీలు రూ.21,497 కోట్లు అని శ్రీధర్ వెల్లడించారు. బొగ్గు సంక్షోభంతో.. దేశంలో విపత్కర పరిస్థితులు, వ్యవసాయ రంగం డిమాండ్, బొగ్గు సంక్షోభం విద్యుత్ కోతలకు ప్రధాన కారణాలని శ్రీధర్ తెలిపారు. 2014–15 మధ్య కాలంలో 6 శాతంగా ఉన్న విద్యుత్ గ్రోత్ (సంవత్సరానికి సంవత్సరానికి మధ్య గ్రోత్) 2020–21లో 14 శాతానికి పెరిగిందని తెలిపారు. 2014–19లో కెపాసిటీ ఎడిషన్ జరగడం వల్ల డిస్కంలపై, వినియోగదారులపై భారం పడిందని, విద్యుత్ కొరతకు ఇది కూడా ఓ కారణమన్నారు. మే నెలలో మొదలై జూన్, జూలై వరకు మాత్రమే విండ్ పవర్ తక్కువ సమయం అందుబాటులో ఉంటుందన్నారు. తాత్కాలిక సమస్యలే.. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు తక్షణమే తీసుకున్న చర్యల వల్ల గృహావసరాలు, వ్యవసాయానికి ఆదివారం రోజు విద్యుత్ కోతలను తగ్గించగలిగామని చెప్పారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. గత నెల నుంచి విద్యుత్ వినియోగం గరిష్ట స్థాయికి చేరిందని, వ్యవసాయ విద్యుత్ వినియోగం ఈ నెలాఖరుకు తగ్గే అవకాశం ఉందన్నారు. సాగు విద్యుత్ వినియోగం తగ్గాక పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికే వినతులు అందుతున్నాయని, త్వరలో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎలాంటి బకాయిలు లేవు.. గత అక్టోబర్ నుంచి బొగ్గు సంక్షోభం నెలకొన్నా కోల్ కంపెనీలకు ఎటువంటి బకాయిలు లేవని, సింగరేణి నుంచి నిరంతరాయంగా సరఫరా జరుగుతోందని ఇంధనశాఖ కార్యదర్శి చెప్పారు. శనివారం రోజు కోల్ కంపెనీలకు రూ.150 కోట్లు చెల్లించామన్నారు. కోల్ ఇండియా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తోందని, రైల్వేలు కూడా క్రమం తప్పకుండా ర్యాక్లు సమకూరుస్తున్నాయని చెప్పారు. విశాఖలోని హిందూజా పవర్కు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని, అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరిగితే పీపీఏ ప్రకారం మనకు 1000 మెగావాట్లు అందుతుందని తెలిపారు. విద్యుత్ సమస్యలపై కేంద్రం ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. బాబు దూరదృష్టితోనే దేశమంతా మెరుగైందా? రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విద్యుత్ కొరత నెలకొనగా టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే సమస్య తగ్గిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని, అయితే, ఇంధన కొరత తగ్గడం అనేది దేశవ్యాప్తంగా ఏర్పడ్డ పరిస్థితుల వల్లే కానీ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కాదన్నారు. 2014 జూన్ 3న 16 రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉండగా 2016 జూన్ 3 నాటికి నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ కొరత ఉందన్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందన్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు తన దూరదృష్టితో కూడిన నాయకత్వం వల్లే దేశం మొత్తం విద్యుత్ పరిస్థితి మెరుగుపడిందని చెప్పగలరా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పటికి 90 శాతం కంటే ఎక్కువ అభివృద్ధి దశలో ఉన్న కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్.. ప్రభుత్వం ఏర్పడిన తేదీ నుంచి ఏడాది లోపు కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వాల ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది కానీ టీడీపీ సర్కారు గొప్పతనమేమీ కాదన్నారు. డిస్కమ్లపై తీవ్ర ఒత్తిడి టీడీపీ పాలనలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి ఉండేదని, చంద్రబాబు తనను తాను దార్శనికుడిగా అభివర్ణించుకునే అవకాశం లేదన్నారు. వాస్తవానికి విభజన తర్వాత మొదటి సంవత్సరానికి 54,225 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ను ఏపీఈఆర్సీ ఆమోదించిందని, 54,867 మిలియన్ యూనిట్ల లభ్యతను అంచనా వేయడం విద్యుత్ కొరత లేదని సూచిస్తుందన్నారు.ఆ సమయంలో దేశంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,43,028 మెగావాట్లు ఉంటే, గరిష్ట డిమాండ్ 1,35,918 మెగావాట్లేనన్నారు. అలాంటప్పుడు దీర్ఘకాలిక ప్రాతిపదికన భారీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అధిక ఖర్చులతో తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం హడావుడిగా 8 వేల మెగావాట్ల పీపీఏలను అధిక ధర (యూనిట్ రూ. 4.84 చొప్పున)లకు కుదుర్చుకుందని గుర్తుచేశారు. రెట్టింపు అప్పులు.. భారీ బకాయిలు టీడీపీ హయాంలో విద్యుత్ రంగం అప్పులు రూ.29,703 కోట్ల నుంచి రూ.58,596 కోట్లకు చేరాయన్నారు. విద్యుదుత్పత్తిదారులకు డిస్కంల బకాయిలు రూ.2,893.23 కోట్ల నుంచి రూ.21,540.96 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్ర పంపిణీ, వినియోగాల నికర విలువ రూ.4,315.72 కోట్ల ప్రతికూల విలువ నుంచి రూ.19,926.27 కోట్ల ప్రతికూల విలువకు క్షీణించిందన్నారు. కనీసం నెట్వర్త్ సానుకూలంగా ఉంటే చంద్రబాబు దూరదృష్టి గల వ్యక్తి అనే వాదనను కొంతవరకు సమర్థించవచ్చని, కానీ ఆయన హయాంలో నెట్వర్త్ గణనీయంగా క్షీణించిందన్నారు. -
అక్టోబర్ నుంచే దేశంలో బొగ్గు కొరత: ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్
సాక్షి, విజయవాడ: గత ఏడాది అక్టోబర్ నుంచి దేశంలో బొగ్గు కొరత ఉందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఎక్కడా బొగ్గు సరఫరాకు డబ్బు కొరత లేదు. సమయానికి చెల్లింపులు చేస్తున్నాం. కోల్ ఇండియా వాళ్లకు రూ.150 కోట్లు నిన్న చెల్లించాం. హిందూజకు బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ రాశాం. విద్యుత్ వినియోగం 14 శాతానికి పెరిగింది. దీనికి తోడు బొగ్గు కొరత ఏర్పడింది. సెకితో 2024 వరకు ప్రభుత్వం 7 వేల మెగావాట్ల కోసం ఒప్పందం ఉంది. ఇది రాష్ట్రంలోని 19 లక్షల బోర్లకు ఉపయోగిస్తున్నాము. 2014-15 వరకు డిస్కంలు తెచ్చిన రుణాలు రూ.30 వేల కోట్లు ఉన్నాయి. 2018-19కి ఇవి రూ.62 వేల కోట్లకు పెరిగాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు పెరిగాయి. 2019 నుంచి ఈ ప్రభుత్వం వచ్చాక డిస్కమ్లకు 36 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. బొగ్గు, వినియోగం పెరగడం వల్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. నెలాఖరుకి సమస్య పరిష్కారం అవుతుంది' అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. చదవండి: (మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై బొత్స కీలక వ్యాఖ్యలు) -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. విద్యుత్ కొరతకు ఇవే కారణాలు.. దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్ కోవిడ్ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం 2020 మార్చి–ఏప్రిల్లో కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేవలం 160 మిలియన్ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్లో 200 నుంచి 210 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్లో కోవిడ్ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతోంది. 20–25 ఎంయూల విద్యుత్ లోటు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్ వినియోగం 130 మిలియన్ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు కలిపి మొత్తం 500 మిలియన్ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా, పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్ 10 ఎంయూ, సోలార్ 25 ఎంయూ, విండ్ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్ యూనిట్లను యూనిట్కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. దక్షిణాదిలో కొరత ఎక్కువ పవర్ ఎక్సే్ఛంజ్లో విద్యుత్ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్ రిలీఫ్ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్లో పవర్ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే వల్ల 10 మిలియన్ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్ సరఫరా ఉంటుంది. -
AP: విద్యుత్ కోతలు తాత్కాలికమే.. ఇతర రాష్ట్రాలది ఇదే పరిస్థితి
సాక్షి, విజయవాడ: మార్చి నెల నుంచి ఎండలు పెరగడంతోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '2020 మార్చ్ నెలలో 160 మిలియన్ యూనిట్ల కాగా గత ఏడాది 210 మిలియన్ యూనిట్లు ఉంది. ఈ ఏడాది ఇపుడు 240 మిలియన్ యూనిట్లకి చేరుకుంది. ఇంత డిమాండ్ ఉమ్మడి రాష్డ్రంలో ఉండేది. జెన్ కో ద్వారా పూర్తి ఉత్పత్తి జరుగుతోంది. జెన్ కో ద్వారా సగం ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డిమాండ్కి ఉత్పత్తికి దాదాపు 55 మిలియన్ యూనిట్లు తేడా ఉంది. ఏపీలోనే కాదు తెలంగాణా, గుజరాత్ తదితర రాష్ట్రాలు ఇదే సమస్యని ఎదుర్కొంటున్నాయి. మార్చ్ నెలలో రాష్ట్ర అవసరాల కోసం 1551 మిలియన్ యూనిట్లని కొనుగోలు చేశాం. ఇందుకోసం దాదాపు రూ.1250 కోట్లని ఖర్చు చేశాం. బొగ్గు కొరత కారణంగా ఈ సమస్య ఏర్పడింది. విద్యుత్ కొనడానికి సిద్దంగా ఉన్నా దొరకటం లేదు. తప్పని పరిస్ధితులలో పరిశ్రమలకి 15 రోజులపాటు ఆంక్షలు విధించాము. వారంలో ఒకరోజు పరిశ్రమలకి పవర్ హాలిడే ప్రకటించాయి. నెలాఖరునాటికి సాదారణ పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నాం. వ్యవసాయ విద్యుత్ వినియోగం నెలాఖరు నుంచి పూర్తిగా తగ్గుతుంది. తెలంగాణా, తమిళనాడు రాష్డ్రాల అధికారులతో మాట్లాడాం అక్కడా ఇదే పరిస్ధితి. చదవండి: (కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సజ్జల కీలక వ్యాఖ్యలు) 2014-15లో సరాసరిన 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ప్రస్తుతం సరాసరిన రోజుకి 190 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంది. రోజుకి 30 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నాం. తప్పని పరిస్ధితుల్లోనే రోజుకి గ్రామీణ ప్రాంతాలలో గంట.. పట్టణ ప్రాంతాలలో అరగంట మాత్రమే కోతలు ప్రకటించాం. ఆసుపత్రులకి పూర్తిస్ధాయి సరఫరా కొనసాగించాలని ఆదేశించాం. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ ఇవ్వాలని ఆదేశించాం. పూర్తి సామర్ద్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ విద్యుత్ కోతలు తాత్కాలికం మాత్రమే. ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం. నెలాఖరు నుంచి మళ్లీ విద్యుత్ డిమాండ్ తగ్గి సాధారణ పరిస్ధితులకి వస్తుంది అని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. -
చార్జీల పెంపు స్వల్పమే
సాక్షి, అమరావతి: ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు కరెంట్ చార్జీలు ఆంధ్రప్రదేశ్లోనే అతి తక్కువని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ వెల్లడించారు. కామన్ టెలిస్కోపిక్ విధానం ప్రకారం సామాన్యులపై భారం లేకుండా విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కొత్త టారిఫ్ ప్రకటించిందని చెప్పారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. కొత్త టారిఫ్ ప్రకారం చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. గురువారం విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ట్రాన్స్కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.35 వేల కోట్లు ఇచ్చి ఆదుకుంది. ఇకపైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వంద యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు చార్జీలు ఏపీలోనే తక్కువ. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వారు మొత్తం గృహ వినియోగదారుల్లో 50 శాతం వరకు ఉంటారు. ► టెలిస్కోపిక్ విధానంలో 0–30 యూనిట్లకు విద్యుత్ చార్జీల పెంపు చాలా స్వల్పం. ప్రజల వినతి మేరకే ఏపీఈఆర్సీ ఈ శ్లాబ్లను తెచ్చింది. ► తెలంగాణలో తాజాగా రూ.5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచగా ఆంధ్రప్రదేశ్లో పెంపుదల రూ.1,400 కోట్లు మాత్రమే ఉంది. ► ట్రూ అప్ చార్జీలను మూడో త్రైమాసికంలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ.3,368 కోట్లు, ఏపీఈపీడీసీఎల్లో రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. రూ.3,977 కోట్ల సర్దుబాటు మొత్తంలో వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల రాయితీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,066.54 కోట్ల భారాన్ని భరిస్తుండగా మిగతాది మాత్రమే ఇతర వినియోగదారుల నుంచి పంపిణీ సంస్థలు వసూలు చేయాలని మండలి ఆదేశించింది. అది కూడా వినియోగదారుల వాస్తవ వినియోగం ఆధారంగా యూనిట్కు ఏపీఎస్పీడీసీఎల్ రూ.0.23, ఏపీసీపీడీసీఎల్ రూ.0.22, ఏపీఈపీడీసీఎల్ రూ.0.07 చొప్పున మాత్రమే విధించాలని నిర్దేశించింది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లో ఆగస్టు 1వ తేదీ నుంచి 36 నెలలు, ఏపీఈపీడీసీఎల్ 18 నెలల వాయిదాలలో వసూలు చేయాలని ఆదేశించింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ట్రూఅప్ వసూలు రూ.700 కోట్లు మాత్రమే. గత సర్కారు ట్రూ అప్ ఫైల్ చేయకపోవడం పెనుభారంగా పరిణమించింది. ► 2022–23లో మొత్తం ఆదాయ అవసరం రూ.45,398.66 కోట్లుగా డిస్కమ్లు అంచనా వేశాయి. ఇందులో రూ.11,123.21 కోట్లను ఉచిత విద్యుత్, సబ్సిడీల కింద రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో 20.76 లక్షల మంది వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఏమాత్రం ఉండదు. మూడు పంపిణీ సంస్థల సగటు విద్యుత్ కొనుగోలు ఖర్చు యూనిట్కు రూ.6.82 నుంచి రూ.6.98కు పెరిగింది. ► రాష్ట్రంలో 74 శాతం విద్యుత్ థర్మల్ ద్వారా ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 230 మిలియన్ యూనిట్ల వినియోగం జరుగుతోంది. మనకు బొగ్గు గనులు లేకపోవడంతో మహానది (ఒడిశా), సింగరేణి కాలరీస్(తెలంగాణ)పై ఆధారపడి కొనుగోలు చేస్తున్నాం. బొగ్గు రేట్లు, రవాణా చార్జీల పెరుగుదల కారణంగా ఏటా 14 శాతం ఉత్పత్తి వ్యయం అధికం అవుతోంది. నిజానికి దీని కారణంగానే విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చింది. గుదిబండల్లా పీపీఏలు గత సర్కారు హయాంలో కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల విద్యుత్ సంస్థలపై అదనపు భారం పడుతోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ పేర్కొన్నారు. గత ప్రభుత్వం సగటు విద్యుత్ కొనుగోలు రేటు కంటే అధిక ధరలకు 25 ఏళ్లకు పీపీఏలు కుదుర్చుకుందని పీపీఏల రద్దు వల్ల చార్జీలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదన్నారు. ఆ పీపీఏలను రద్దు చేయలేదని, ధరలను సమీక్షించాలని ప్రభుత్వం ఆయా కంపెనీలకు సూచించిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి విద్యుత్ రంగంలో రూ.68 వేల కోట్లకుపైగా అప్పులు, రూ.21 వేల కోట్లకుపైగా బిల్లుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. 2014 నాటికి విద్యుత్తు సంస్థలు రూ.29,703 కోట్ల మేర అప్పుల్లో ఉండగా టీడీపీ హయాంలో 2019 నాటికి రూ.68,596 కోట్లకు పెరగడంతో నష్టాలతో దివాలా తీసే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విద్యుత్ రంగ సంస్కరణలతోపాటు పొదుపు చర్యలను సమర్థంగా అమలు చేయడం, ఆర్థికంగా చేయూత ద్వారా డిస్కమ్లను ఆదుకున్నట్లు చెప్పారు. గత సర్కారు ట్రూ అప్ చార్జీలను ఫైల్ చేయకుండా వ్యవస్థలను అడ్డదిడ్డంగా మేనేజ్ చేయడం వల్లే అప్పులు ఆ స్థాయికి పెరిగాయని ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకాల కారణంగా విద్యుత్తు రంగం కుప్పకూలే పరిస్థితి నెలకొనడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు అందించే వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం సెకీ నుంచి తక్కువ ధరకే కరెంట్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. -
Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు
ఆకలితో జరిగిన యుద్ధంలో ఓడిన ప్రతిసారి తనను తాను రక్షించుకున్నాడు. ఈ క్రమంలో మనసుకు గాయమైనా లక్ష్యం కోసం భరించాడు. తనను వేధిస్తున్న సమాజానికి సరైన సమాధానం చెప్పాలన్న కాంక్షతో అడుగు ముందుకేశాడు. తరుముకొచ్చే అవసరం నుంచి.. సృజనాత్మక ఆలోచన పుట్టుకొచ్చింది. అప్పటి వరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరిసింది. అదే అతన్ని విజయతీరాలకు చేర్చింది. తన ప్రతిభతో ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు. ప్రతి ఓటమి నుంచి పాఠం నేర్చుకుంటూ.. వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. ఒకప్పుడు కోడిని చంపి.. చికెన్ డెలివరీ చేసిన అతనే.. ఈ రోజు ప్రపంచ వాణిజ్య విభాగంలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నాడు. ఆకలి, ఆవేదనలో నుంచి పుట్టికొచ్చిన అక్షరాలను ఆకళింపు చేసుకుని ప్రపంచస్థాయి రచయితగా ఎదిగాడు. పేదరికంతో మొదలైన అతని జీవన ప్రస్థానం.. నేడు పదుగురికి సాయం చేసే స్థాయికి చేరింది. మేధో శ్రమకే అంకితమైన ఒక అసమాన యాత్రికుని ప్రయాణమిది. ఆ యువకుడి పేరే శ్రీధర్ బెవర. సాక్షి, విశాఖపట్నం: శ్రీధర్ బెవర పుట్టింది శ్రీకాకుళం జిల్లా రాజాం. కుటుంబాన్ని పేదరికం వెక్కిరించడంతో తల్లి శ్రీధర్తో పాటు తన నలుగురు పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కో బంధువు ఇంట్లో పెట్టింది. అక్కడైనా తన పిల్లలకు కష్టాలు లేకుండా మూడు పూటలా తిండి దొరుకుతుందనీ.. చక్కగా చదువుకుంటారనీ.! అలా ఒకే గూటి పక్షులను వేర్వేరు ప్రాంతాలకు పంపించేసింది. శ్రీధర్ను గుంటూరులో, శ్రీధర్ అక్క శైలజను వాళ్ల పెదనాన్న ఇంట్లో, అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ను విశాఖలోని బంధువుల ఇంటికి అప్పగించింది. శ్రీధర్ గుంటూరులోని పెద్దమ్మ వాళ్ల అబ్బాయి ఇంట్లో ఆశ్రయం పొందారు. పదో తరగతి వరకు అక్కడే కాలం వెళ్లదీశారు. చివరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన రోజున.. ఇక నుంచి ఇక్కడ ఉండొద్దని బంధువులు ఆయనకు తెగేసి చెప్పేశారు. అక్కడే.. కొత్త ఆలోచనలకు బీజం ఏదైనా పనిలో చేరి సమస్యల నుంచి బయటపడాలని భావించాడు శ్రీధర్. విశాఖ డెయిరీలో పాల ప్యాకెట్లు తీసుకుని టీ దుకాణాలకు డెలివరీ బాయ్గా ప్రస్థానం ప్రారంభించారు. కష్టపడుతున్నా.. ఆదాయం రాకపోవడంతో చికెన్ దుకాణంలో మాంసం కొట్టేందుకు పనికి కుదిరాడు. కోడిని చంపడం వంటి దృశ్యాలతో చూసిన శ్రీధర్ బెదిరిపోయి జ్వరం బారిన పడ్డారు. కూటి కోసం ఆ పనిలోనే కొనసాగాడు. ఆ సమయంలోనే కొత్త ఆలోచనలకు బీజం పడింది. అపార్ట్మెంట్లు, ఇంటింటికీ వెళ్లి ముందు రోజే చికెన్ ఆర్డర్ తీసుకునేవాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్డర్లు సరఫరా చేసేవాడు. అక్క శైలజ పేరుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించాడు. మంచి లాభాలొచ్చినా.. రేయింబవళ్లు పని చేయడంతో శ్రీధర్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా ఆ వ్యాపారానికి కూడా మధ్యలోనే స్వస్తి చెప్పాడు. కుంగదీసిన అన్నయ్య మరణం ఇంతలో అన్నయ్య మురళీధర్ క్యాన్సర్ బారిన పడి 2017లో కన్నుమూశాడు. దీంతో అందరూ ఉన్నా ఒంటరిగా మారిపోయిన శ్రీధర్.. ఆ బాధ నుంచి కోలుకుని అన్నయ్య పేరుతో బీఎంఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు విద్యాదానం, ప్రజలకు నిత్యావసరాల పంపిణీ, ఇతర సేవాకార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆకలి ముందు చదువు ఓడిపోయింది పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాసయ్యారు శ్రీధర్. గుంటూరు నుంచి బయటకు వచ్చిన తర్వాత విశాఖలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరారు. ఆకలి కారణంగా చదువులో వెనకబడిపోయాడు. అన్నయ్య మురళి, తమ్ముడు గిరిధర్ కూడా బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ముగ్గురూ కలిసి ఒకే రూమ్లో జీవనం ప్రారంభించారు. అన్నయ్య మురళి తండ్రిగా బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అప్పటికే అన్నయ్య మురళి పెద్దింటి అమ్మాయి లక్ష్మీ భారతిని ప్రేమించి.. పెళ్లి చేసుకుని రూమ్కు తీసుకొచ్చేశారు. ఆ ముగ్గురితో పాటు లక్ష్మీభారతి కూడా అదే చిన్న రూమ్లో తలదాచుకుంది. తల్లిలా వారిని లాలించింది. ఆర్థిక సమస్యలు.. ఆకలి బాధలతో చదువుపై దృష్టి సారించలేకపోయారు శ్రీధర్. ఇంటర్లో తప్పారు. దీంతో తను కన్న కలలన్నీ కల్లలయ్యాయ్. తాజ్లో వెయిటర్.. డిగ్రీలో ఫెయిల్ విశాఖలోని తాజ్ హోటల్లో వెయిటర్ ఉద్యోగాలు పడటంతో శ్రీధర్ అక్కడ పనికి చేరాడు. బ్యాంకెట్ వెయిటర్గా 14 గంటల పాటు నిలబడి పనిచేసేవాడు. ఉదయం 10 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పని పూర్తి చేసి.. ఆ సమయంలో వాహనాలు లేక 5 కిలోమీటర్లు నడుచుకుంటూ రూమ్కు వెళ్లేవాడు. ఆ సమయంలో పోలీసులు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. క్రమంగా వెయిటర్గా మంచి గుర్తింపు వచ్చింది. వైజాగ్కు ప్రముఖులు ఎవరొచ్చినా సర్వ్ చేసేందుకు శ్రీధర్నే ఎంపిక చేసే వారు. వెయిటర్గా చేస్తూనే బీకామ్లో చేరాడు. పని ఒత్తిడితో మూడేళ్ల డిగ్రీ పూర్తయ్యే సరికి 15 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. కొత్త జీవితం వైపు అడుగులు ఎదుగు బొదుగూ లేని జీవితంతో పోరాటం చేస్తున్న శ్రీధర్కు అన్నయ్య మురళీ మాటలు కొత్త జీవితం వైపు అడుగులు వేసేలా చేశాయి. అప్పటికే దుబాయ్లో స్థిరపడ్డ మురళీ.. శ్రీధర్ను డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చేయాలని సూచించాడు. ఆయన మాట ప్రకారం వాటిని పూర్తి చేసిన శ్రీధర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అంతే.. అక్కడి నుంచి శ్రీధర్ జీవితం పూర్తిగా మారిపోయింది. చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం మొదలు పెట్టిన ఆయన.. ఎల్జీ, పానాసోనిక్ కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. మళ్లీ ఇండియా వచ్చి ఐఐఎం–అహ్మదాబాద్లో అడ్వాన్స్డ్ బిజినెస్ కోర్సు చదివి.. 37 ఏళ్లకే జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. పానాసోనిక్ మిడిల్ ఈస్ట్–ఆఫ్రికా విభాగం ఇన్చార్జిగా నియమితులయ్యారు. రచయితగా.. రికార్డు.. ఆకలి, ఆవేదన నుంచే అక్షరాలు ధ్వనిస్తాయన్నది అక్షర సత్యమని శ్రీధర్ కవిత్వం వింటే అర్థమవుతుంది. చిన్నతనం నుంచి కవితలు, కథలు రాయడం అలవాటు చేసుకున్న శ్రీధర్.. క్రమంగా మంచి రచయితగా మారారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా కొన్నేళ్ల కిందట మూమెంట్ ఆఫ్ సిగ్నల్ అనే పుస్తకాన్ని ఇంగ్లిష్లో రచించారు. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ప్రసిద్ధ రచయితలతో పాటు సాహితీ విమర్శకులు.. ఈ పుస్తకానికి ప్రశంసల జల్లు కురిపించారు. నాయకత్వ లక్షణాలపై శ్రీధర్ రాసిన ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ వ్యక్తిత్వ వికాస నవల చరిత్ర సృష్టించింది. ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ నిర్వహించిన పాపులర్ బుక్స్ ఆఫ్–2021లో శ్రీధర్ ‘ది రోరింగ్ ల్యాంబ్స్’ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తొమ్మిది విభాగాల్లో ఐదేసి పుస్తకాల చొప్పున పోటీ నిర్వహించింది. ఇందులో ది రోరింగ్ ల్యాంబ్స్ పుస్తకం బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో అన్ని విభాగాల్లోనూ చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ రచయిత శ్రీధర్ కావడం విశేషం. కొన్నేళ్లుగా బిజినెస్ అండ్ ఎకనమిక్స్ విభాగంలో అమెరికాకు చెందిన రచయితల పుస్తకాలే మొదటిస్థానంలో నిలిచేవి. తొలిసారిగా ఓ భారతీయ రచయిత ఆ రికార్డుని తుడిచిపెట్టేసి నంబర్ వన్గా అవతరించారని అమెజాన్ సంస్థ ప్రశంసించింది. అంతే కాదు.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ శ్రీధర్ తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. చిన్నప్పటి నుంచి సమస్యలు చుట్టిముట్టినా.. పడిలేచిన కెరటం లా పైకెగిరిన అతని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. పారిశ్రామికవేత్తగా పయనం తాను పనిచేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి పారిశ్రామికవేత్తగా ప్రయాణం ప్రారంభించాడు శ్రీధర్. అన్నయ్య పేరుతో బీఎంఆర్ ఇన్నోవేషన్స్ అనే ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీ కార్పొరేట్ సంస్థను ప్రారంభించాడు. రుణం పొందేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు పడే ఇబ్బందుల నుంచి గట్టెక్కించి.. రుణ మంజూరుకు సహాయం చేసేదే ఈ సంస్థ. పలు దేశాలకు ఈ సంస్థ రుణాలు మంజూరు చేసింది. మన కేంద్ర ప్రభుత్వానికి కూడా సహాయం అందించడం విశేషం. ఇటీవలే గోవా ప్రభుత్వం కన్వెన్షన్ సెంటర్ స్థాపించేందుకు రుణ మంజూరు ప్రక్రియ శ్రీధర్ కంపెనీతోనే జరిగింది. దీంతో శ్రీధర్ను గోవా ప్రభుత్వం స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్కు మెంటర్గా నియమించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ఇండియా సంస్థతో కలిసి దేశానికి వివిధ పనులకు సంబంధించి రుణాల మంజూరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీధర్తో భేటీ అయ్యింది. ఒకప్పుడు ఆకలి తీర్చుకునేందుకు పని దొరుకుతుందని ఎదురు చూడగా... ఇప్పుడు అనేక దేశాలు శ్రీధర్ బెవర కోసం ఎదురు చూస్తున్నాయి. ఇదీ కదా.. అసలైన విజయమంటే.! -
సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం. -
7 నెలల్లో రూ.868 కోట్ల లాభం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి మళ్లీ సిరుల రాణిగా మారింది. బొగ్గు గనుల్లో లాభాల పంట పండింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా గతేడాది ఏర్పడిన నష్టాల ఊబి నుంచి గట్టెక్కింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2021–22లో గత ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలను ఆర్జించింది. 2020–21 తొలి ఏడు నెలల్లో రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ.14,067 కోట్ల విక్రయాలు జరిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలవ్యవధిలో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గి రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాతోపాటు విద్యుత్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలను సింగరేణి సమకూర్చుకుంది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.6,678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా, ఈ ఏడాది 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల అమ్మకాలు నిర్వహించింది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.1,860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 18 శాతం వృద్ధితో రూ.2,182 కోట్ల మేర విద్యుత్ విక్రయించింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి గతేడాదితో పోల్చితే గడిచిన ఏడునెలల్లో 65 శాతం అభివృద్ధిని కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో టర్నోవర్, లాభాలు ఆర్జిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ పురోగతిపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించి గత ఏడు నెలల్లో సాధించిన ఫలితాలను వెల్లడించారు. పెరిగిన బొగ్గు, విద్యుదుత్పత్తి... గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి 7నెలల్లో బొగ్గు ఉత్పత్తి 220 లక్షల టన్నుల నుంచి 60% వృద్ధితో 352 లక్షల టన్నులకు పెరిగింది. బొగ్గు రవాణా 218 లక్షలటన్నుల నుంచి 68% వృద్ధితో 367 లక్షల టన్నులకు పెరిగింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గతేడాది అక్టోబర్ వరకు 3,819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5,291 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా టర్నోవర్, లాభాలు గణనీయంగా పెరిగాయి. -
నెల రోజుల్లో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
దేవీపట్నం: అర్హులైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నెలరోజుల వ్యవధిలోనే గ్రామాల వారీగా ప్యాకేజీ సొమ్మును అందజేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ సి. శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఒ.ఆనంద్తో కలసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు పునరావాస కాలనీలను సందర్శించారు. ఇందుకూరు పంచాయతీలో నిర్మించిన పెదభీంపల్లి3, ఇందుకూరు2, ముసుళ్లకుంట కాలనీలను సందర్శించారు. ఇళ్లు, మరుగుదొడ్లు, రహదారులు, డ్రెయిన్లు, పాఠశాల, అంగన్వాడీ, గ్రామసచివాలయం, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దాదాపు రూ.90 కోట్ల మేర బిల్లులు నిర్వాసితులకు అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అనర్హుల జాబితాలో ఉన్నవారి వాస్తవాలను పరిశీలించి.. 10 రోజుల్లో ప్యాకేజీ పొందేందుకు అర్హులా కాదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. అనంతరం కొండమొదలు పంచాయతీలోని కొంతమందికి గంగవరం మండలం నేలదోనెలపాడు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని: శ్రీధర్
సాక్షి, తిరుపతి: టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నుంచి తనకు ప్రాణ ముప్పు ఉందని ఎన్ఆర్ఐ విద్యాసంస్థల తాజా మాజీ సీఈవో శ్రీధర్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల సీఈవోగా రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. వచ్చిన లాభాల్లో 5 శాతం వాటా ఇస్తామని తానను మోసం చేశారన్నారు. కోవిడ్ సమయంలో ఫీజులు తగ్గించమని చెప్పినా పూర్తిగా వసూలు చేశారని.. తనపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. తనకేదైనా జరిగితే టీడీపీ నేత ఆలపాటిదే బాధ్యత అని శ్రీధర్ స్పష్టం చేశారు. చదవండి: రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..! -
‘సువర్ణభూమి’ కొత్త లోగోను ఆవిష్కరించిన రాంచరణ్
రాయదుర్గం: ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నూతన లోగోను ఆవిష్కరించింది. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో కొత్త లోగో, యాడ్ ఫిల్మ్ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్తో కలిసి శుక్రవారం సాయంత్రం సినీ హీరో రాంచరణ్ ఆవిష్కరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను, వినియోగదారుల మన్ననలను పొందుతున్న సంస్థగా సువర్ణభూమి నిలుస్తోందని రాంచరణ్ ప్రశంసించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే సువర్ణభూమి సంస్థతో పనిచేయడం, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం సంతోషం కలిగిస్తోందన్నారు. అందుబాటు ధరలలో అపార్ట్మెంట్లు, విల్లాలను వినియోగదారులకు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్న సువర్ణభూమి సంస్థను అభినందించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ ఆధునిక సకల సౌకర్యాలతోపాటు సరసమైన ధరలకు ఫ్లాట్స్, విల్లాలతో పాటు స్థలాలను కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. -
కరోనా బారిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
లండన్: లండన్లో ఉన్న భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్లు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్తో మాంచెస్టర్లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
69 పట్టణాల్లో 54,056 ఇళ్లు
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్ ద్వారా కాంట్రాక్టులు ఖరారు చేసిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) వేగవంతం చేసింది. 69 పట్టణాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో చేపట్టిన 54,056 ఇళ్ల నిర్మాణం ఏడాదిన్నరలో పూర్తిచేయాలని నిర్ణయించింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో అత్యధిక రేట్లకు ఖరారు చేసిన యూనిట్లకు ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తిచేసింది. ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం 12 దశల్లో నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.392.23 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. వీటి నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం రూ.3,239.39 కోట్లకు టెండర్లు కట్టబెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించి రూ.2,847.16 కోట్లకు టెండర్లు ఖరారు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీకి) రూ.1,815 వ్యయంగా నిర్ణయించగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1,593కే ఖాయం చేసింది. టిడ్కో ఇళ్ల ప్రాజెక్టుల్లో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులు కూడా సమకూర్చనున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ 54,056 ఇళ్ల నిర్మాణ పనుల్ని నాలుగు కాంట్రాక్టు సంస్థలు దక్కించుకున్నాయి. ఈ ఇళ్లను మూడుదశల్లో ఏడాదిన్నరలో పూర్తిచేయాలని ఇటీవల కాంట్రాక్టు సంస్థల వారితో సమావేశమైన టిడ్కో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. టిడ్కో క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు ఇళ్ల నిర్మాణ నాణ్యతను తరచు పరీక్షిస్తున్నారు. (చదవండి: స్థలం మాది.. ఇల్లు మాది.. జగనన్న వరం ఇది..) టిడ్కో నిర్మించే ఇళ్లలో మూడు రకాలు టిడ్కో నిర్మిస్తున్న 54,056 ఇళ్లల్లో మూడు రకాలున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల వంతున ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. 300 ఎస్ఎఫ్టీ ఇళ్లు 47,832 ఉన్నాయి. వీటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్టుగా ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అందిస్తారు. 365 ఎస్ఎఫ్టీ ఇళ్లు 288 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుడు వాటా రూ.50 వేలు భరిస్తే మిగిలినది బ్యాంకు లోన్గా నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.50 వేలలో సగం అంటే రూ.25 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.25 వేలు చెల్లిస్తే చాలు. ప్రభుత్వం రూ.25 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. 430 ఎస్ఎఫ్టీ ఇళ్లు 5,936 ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వంలో లబ్ధిదారు వాటా రూ.లక్ష చెల్లించాలని, మిగిలినది బ్యాంకు లోన్ అని నిర్ణయించారు. కాగా లబ్ధిదారు చెల్లించాల్సిన రూ.లక్షలో సగం అంటే రూ.50 వేలు ప్రభుత్వం చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కాబట్టి లబ్ధిదారు రూ.50 వేలు భరిస్తే చాలు. ప్రభుత్వం రూ.50 వేలు చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి టిడ్కోనే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తుంది. నాణ్యతకు ప్రాధాన్యం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ఇప్పటికే సత్ఫలితాలను ఇచ్చింది. ఆ విధంగా ఖరారు చేసిన 54,056 ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నాం. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థలకు ఆదేశించాం. - శ్రీధర్, టిడ్కో ఎండీ -
మనవైపు శ్రీశైలం ప్లాంట్లు సురక్షితం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో భద్రతను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) క్షుణ్నంగా పరిశీలించింది. ఏపీ జల విద్యుత్ కేంద్రాలు నూటికి నూరుపాళ్లు సురక్షితమని నివేదిక రూపొందించింది. ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని జనరేటర్లు పోలికే లేదు... ► ఏపీ జెన్కో పరిధిలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలు 1960లో ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిధిలో ఉన్నవి 1990లో డిజైన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వీటికి పోలిక లేదు. ► తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా భూగర్భంలో (భూ ఉపరితలం నుంచి కిలో మీటరున్నర) ఉన్నాయి. ఏపీ జల విద్యుత్ కేంద్రం భూ ఉపరితలంపైనే ఉన్నందున విపత్కర సమయంలో పొగ, విషవాయువులు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ► తెలంగాణ విద్యుత్తు కేంద్రం జనరేషన్, నీళ్ల పంపింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భూగర్భంలో నిర్మాణం చేశారు. ఏపీ వైపు ఉన్న ప్లాంట్లు కేవలం జనరేషన్ మాత్రమే చేస్తాయి. నీటిని రివర్స్ పంప్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రమాదానికి అంతగా ఆస్కారం లేదు. ► కుడివైపు జల విద్యుత్ కేంద్రాలు ఒక్కొక్కటి 110 మెగావాట్ల (మొత్తం 7) సామర్థ్యంతో కూడుకున్నవి. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి అయిన విద్యుత్ను బయటకు పంపి ట్రాన్స్మిషన్ వ్యవస్థకు లింక్ చేశారు. తెలంగాణలో భూగర్భంలోనే (ఇండోర్) ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంది. ఇండోర్ ట్రాన్స్మిషన్ వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కాపర్ వైర్ అతి వేడిని పుట్టించే వీలుంది. దురదృష్టవశాత్తూ ప్రమాదం.. ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తెలంగాణ విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. అక్కడి టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. భూగర్భ బొగ్గు గని తరహాలో తెలంగాణ ప్లాంట్లు ఉంటే ఏపీ వైపు ఉన్నవి ఓపెన్కాస్ట్ మాదిరిగా ఉంటాయి. ఏపీ జల విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా సురక్షితం’ – శ్రీధర్, జెన్కో ఎండీ -
నా చావుకి భార్య 'జల'నే కారణం
పెద్దపల్లి, వెల్గటూరు(ధర్మపురి): భార్య కాపురానికి రావడం లేదని మానసిక వేదనకు గురై మండల కేంద్రం వెల్గటూరుకు చెందిన గంట్యాల శ్రీధర్(35) అనే యువకుడు ఇంట్లో బుధవారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా..గ్రామానికి చెందిన శ్రీధర్కు రామడుగు మండలకేంద్రానికి చెందిన జలతో 2011లో వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రాగా పలుమార్లు పంచాయితీలు జరిగాయి. ఫలితంగా యువకుడు తాగుడుకు బానిసయ్యాడు. పదిరోజులక్రితం భార్య అతడిని వదిలేసి తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి మరింత తాగుడుకు బానిసై తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యేవాడు. (నువ్వులేని లోకం నాకెందుకని..!) ఈక్రమంలో రెండురోజులక్రితం అతడి భార్య మరో మహిళను వెంట తీసుకొచ్చి పిల్లలు పుట్టడం లేదని వైద్యపరీక్షలు చేయించుకోవాలని బెదిరింపులకు గురిచేశారు. రెండు రోజుల్లో కరీంనగర్ వచ్చి వైద్యపరీక్షలు చేసుకోవాలని లేదంటే నీ సంగతి చూస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారని మృతుడి తల్లి పేర్కొంది. అప్పటినుంచి తీవ్రంగా భయపడుతున్నాడు. భార్య తరపు బంధువులు బెదిరింపులకు గురి చేశారని ఫిర్యాదు చేయడానికి పోలీ స్స్టేషన్కు వెళ్లగా ఎస్సై సాయంత్రం రావాలని చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. భార్యతరపు బంధువులతో ప్రాణహాని ఉందనే భయంతోపాటు భార్య కాపురానికి రావడంలేదనే మానసిక వేదనతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తల్లి రాజేశ్వరి తెలిపారు. బెదిరింపులకు గురి చేసిన వారు వచ్చేదాకా మృతదేహాన్ని తీసేది లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయగా ఎస్సై శ్రీనివాస్ సముదాయించి శవాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ రాంచందర్రావు సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే ‘తనకు చెందిన ఆస్తుల్లో భార్యకు ఎలాంటి వాటా ఇవొద్దని..అన్నీ తల్లికే చెందాలని.. నా మృతికి నా భార్య జలనే కారణమని ఆమెపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అలా అయితేనే నా ఆత్మ శాంతిస్తుందని’ శ్రీధర్ రాసిన సూసైడ్నోట్ అతడి జేబులో లభించింది. -
నేను ప్రేమించా.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు
బచ్చన్నపేట: ఇద్దరూ క్లాస్మేట్స్.. కలసి చదువుకున్నారు.. ఆ రకంగా ఏర్పడిన చనువు ప్రేమగా మారింది. ఈ ప్రేమ యువతి పెళ్లి చెడిపోవడానికి కారణమైంది.. దీంతో కక్ష పెంచుకున్న ఆమె సోదరుడు.. చెల్లెలిని ప్రేమించిన యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూర్ కమాన్ వద్ద శుక్రవారం జరిగింది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. మండలంలోని కొన్నె గ్రామానికి చెందిన పేర్ని కొమురమ్మ, తిరుపతి దంపతులకు ముగ్గురు కుమారులు. (పోలీసుల అదుపులో యాకూబ్.. సెల్ఫోన్లు ఎక్కడ?) కాగా, కొమురమ్మ దంపతులు ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం ముంబై వెళ్లగా.. రెండో కుమారుడు శ్రీధర్ను అమ్మమ్మ వద్ద మండలంలోని కొడవటూర్లో చదివించారు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి, శ్రీధర్ కలసి ఒకే కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివారు. ప్రస్తుతం యువతి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నర్సు శిక్షణ చేస్తుండగా, శ్రీధర్ (22) హైదరాబాద్లోనే ఓ హోటల్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు. లాక్డౌన్ కావడంతో ఇద్దరూ కొడవటూర్ గ్రామంలోనే ఉంటున్నారు. (బెంగాలీ కుటుంబం.. విషాదాంతం) నేను ప్రేమించాను.. నువ్వు పెళ్లి చేసుకోవద్దు ఈ ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో వారు శ్రీధర్తో పాటు అతడి తాతను మందలించారు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీధర్ ..ఆ యువతిని పెళ్లి చేసుకోబోయే యువకుడికి ఫోన్ చేసి తమ ప్రేమ విషయాన్ని చెప్పాడు. దీంతో పెళ్లి చేసుకోవడానికి ఆ అబ్బాయి నిరాకరించగా యువతి కుటుంబ సభ్యులు శ్రీధర్పై కక్ష పెంచుకున్నారు. శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనంపై కొడవటూర్ వెళుతున్న అతడిని యువతి సోదరుడు శివకుమార్ బచ్చన్నపేట – చేర్యాల మెయిన్ రోడ్డుపై కమాన్ వద్ద ఆటోతో ఢీకొట్టగా అతను కింద పడ్డాడు. అనంతరం శ్రీధర్ను కత్తితో పొడిచి హత్య చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
కళాకారుడు వస్తున్నాడు
శ్రీధర్, దుర్గ జంటగా కిరణ్ దుస్సా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళాకారుడు’. శ్రీధర్ శ్రీమంతుల నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ దుస్సా మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. దర్శకునిగా అవకాశం ఇచ్చిన శ్రీధర్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ప్రతి సాంకేతిక నిపుణుడు సొంత సినిమాలా భావించి ఈ సినిమా కోసం పనిచేశారు. సినిమా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం’’ అన్నారు శ్రీధర్. ‘‘కథ వినగానే నచ్చింది’’ అన్నారు దుర్గ. ‘‘5 పాటలు చక్కగా కుదిరాయి. శ్రీధర్గారికి సినిమా పిచ్చి’’ అన్నారు సంగీత దర్శకుడు రఘురామ్. -
సింగరేణిలో 10,446 కొలువుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ 10,446 కొలువులను భర్తీ చేసింది. 2014 నుంచి 2019 మే వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో 3,025 మంది, డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ పథకం కింద మరో 7,421 మందిని నియమించింది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, పర్సనల్, అకౌంట్స్, తదితర విభాగాల్లో కొత్త నియామకాలు జరిగాయి. గడిచిన మూడు దశాబ్దాల్లో ఇంత పెద్ద మొత్తంలో నియామకాలు జరపడం ఇదే తొలిసారని సంస్థ యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ ఖాళీల భర్తీలో ప్రత్యేక చొరవ చూపారని తెలిపింది. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రాత పరీక్ష ద్వారానే నియామక ప్రక్రియ జరిపామని పేర్కొంది. కొత్తగా ఉద్యోగాలు పొందిన నాన్ కేడర్ వర్కర్ కేటగిరీలో క్లర్కులు, ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, వెల్డర్లు, సర్వేయర్లు తదితర టెక్నీషియన్ల నియామకం జరపగా, అధికారుల విభాగంలో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీర్లు, సివిల్, ఫైనాన్స్, అకౌంట్స్, పర్సనల్, ఫారెస్ట్, సెక్యూరిటీ అధికారులు, స్పెషలిస్టు డాక్టర్లు తదితరులను నియమించినట్లు వెల్లడించింది. చనిపోయిన, అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలిచ్చే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపింది. గతంలో నెలకు 20 లేదా 30 మందికి మాత్రమే డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తుండేవారని, ప్రస్తుతం నెల కు 150 నుంచి 200 మందికి ఉద్యోగాలిస్తున్నామని పేర్కొంది. 2014లో 674 మందికి ఉద్యోగాలివ్వగా 2015లో 1,989 మందికి, 2018లో 1,663 మందికి, 2019లో మే వరకు 1,378 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు వెల్లడించింది. 4,728 మందికి కారుణ్య నియామకాలు కారుణ్య నియామక ప్రక్రియ 2018 ఏప్రిల్ నుంచి ముమ్మరంగా సాగుతోందని సింగరేణి యాజమాన్యం తెలిపింది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు నిమ్స్, గాంధీ ఆసుపత్రి తదితర ప్రభుత్వ వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని పరీక్షించి అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో వారు సూచించిన వారసులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 38 మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించగా 4,728 మంది కార్మికులు కారుణ్య నియామక ప్రక్రియలో తమ వారసులకు ఉద్యోగం లభించే అవకాశం పొందారని వెల్లడించింది. ఇంతమంది సింగరేణిలో ఉద్యోగాలు పొందడంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆనందం వ్యక్తం చేశారు. -
నాన్న కల నెరవేర్చేందుకు క్రికెట్లోకి వచ్చా..
క్రికెట్.. ప్రపంచమంతా క్రేజీ ఉన్న క్రీడ. మైదానంలో ఆటగాళ్లు ఆడుతుంటే క్రీడాభిమానులు, ప్రేక్షకులకు ఒకటే ఉత్కంఠ. మన జట్టు గెలవాలని ఆరాటం. అటువంటి ఆటలో నెగ్గాలంటే ఫీల్డింగ్లో రాణించాలి. బ్యాటింగ్లో ఎంతటి నైపుణ్యం కనబరిచినా ఫీల్డింగ్లో విఫలమైతే పరాజయం తప్పదు. మరి అలాంటి ఫీల్డింగ్ కోచ్గా భారత జట్టుకు సేవలందిస్తున్నాడు మన హైదరాబాదీ. ఓ సాధారణ క్రికెటరైన అతను ప్రస్తుతం ప్రపంచ క్రికెట్నే శాసిస్తున్న భారత జట్టుకు ఫీల్డింగ్లో మెలకువలు నేర్పించే స్థాయికి ఎదిగాడు. తండ్రి ఆశయం కోసం అహరహం తపించి ఉన్నత స్థానానికి చేరాడు. అతడే రామకృష్ణన్ శ్రీధర్. శనివారం ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం. – చైతన్య వంపుగాని సికింద్రాబాద్లోని సిఖ్విలేజిలోని ఎస్సీహెచ్బీ కాలనీలో నివాసం ఉండే రామకృష్ణ, పార్వతి దంపతుల కుమారుడు రామకృష్ణన్ శ్రీధర్. తండ్రి రామకృష్ణకు క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. శ్రీధర్ను క్రికెట్లో మంచి ఆటగాడిగా చూడాలనేది ఆయన స్వప్నం. 1985లో బేగంపేటలోని ‘రాజాజితేంద్ర’ స్కూల్లో శ్రీధర్ 10వ తరగతి పూర్తి చేశాడు. వెస్లీ కాలేజీలో ఇంటర్లో జాయిన్ అయ్యాడు. 1986లో క్రికెట్ కోచ్ సంపత్కుమార్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్పై మక్కువ పెరిగింది. ‘హైదరాబాద్ బ్లూస్’ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1989లో ఎస్బీహెచ్లో క్యాషియర్ ఉద్యోగంలో చేరాడు. ఆ బ్యాంకు తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడి ప్రతిభను కనబరిచాడు. రంజీ ప్లేయర్గా గుర్తింపు 1989లో కేరళలో జరిగిన రంజీ ట్రోఫీ లీగ్లో శ్రీధర్ ఎస్బీహెచ్ తరఫున బరిలోకి దిగాడు. తన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో ఎంతో పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గాయాలపాలై కొన్ని రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. రంజీ ప్లేయర్గా ఆడుతున్న సమయంలో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా ఫీల్డింగ్ కోచ్గా.. సాదాసీదాగా వెళ్తున్న శ్రీధర్ జీవితంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2014లో ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్)లో ‘కింగ్ లెవన్ పంజాబ్’ జట్టుకు కోచ్గా చేసే అవకాశం వచ్చింది. ఇదే ఏడాది భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ అరుణ్ అర్ధరాత్రి ఫోన్ చేసి.. ‘శ్రీధర్ ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా చేస్తావా? అని అడిగాడు. నేను వెంటనే సరేనన్నాను. ఆ మరుసటి రోజు ఉదయం బీసీసీఐ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఇండియన్ టీంకి ఫీల్డింగ్ కోచ్గా చేయాలని అడిగారు. వెంటనే ఒప్పుకొన్నా’ అన్నాడు శ్రీధర్. భుజం తట్టిన ధోని.. క్రికెట్ ప్రపంచంలో ధోని, విరాట్ కోహ్లీ ఎంతో అరుదైన ఆటగాళ్లు. వీరికి ఫీల్డింగ్ నేర్పించడమంటే కత్తిమీద సామే. ‘మొదటి రోజు ధోని వద్దకు వెళ్లి నేను కొత్త కోచ్ని కదా. మీకు నేను ఎలా ఉపయోగపడగలనో చెప్పండి, ఆ విధంగా ఉంటా అని చెప్పాను. ఆయన నా భుజం తట్టాడు. ఇప్పుడెలా ఉన్నావో ఇకముందు కూడా అలాగే నీ ప్రయాణం సాగించు అని ధైర్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన ఆత్మస్థైర్యాన్ని నేనెప్పుడూ మరిచిపోను’ శిష్యుడు.. విహారీ ‘2003లో 20 మంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకువచ్చి నా చేతిలో పెట్టారు. ఆ పిల్లల్లో ప్రస్తుత ఇండియన్ ప్లేయర్ హనుమ విహారీ కూడా ఉన్నాడు. 20మందిని మంచి క్రీడాకారులుగా చేశా. ఇప్పుడు విహారీ భారత్ జట్టు తరఫున ఆడటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను బ్యాట్ పట్టించిన వ్యక్తి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడం.. విహారీ నా శిష్యుడు అని చెప్పుకోవడం గర్వంగా అనిపిస్తుంది’ అన్నాడు శ్రీధర్. ఫీల్డింగ్ స్టాటిటిక్స్ వచ్చుండాలి.. ‘క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉంటాయి కానీ.. ఫీల్డింగ్కు సంబంధించిన స్టాటిటిక్స్ ఉండవు. నేను కోచ్గా ఉన్నప్పటి నుంచి ఫీల్డింగ్లో అనేక మార్పులు వచ్చాయి. ఫీల్డింగ్లో మనోళ్లు ది బెస్ట్గా ఉంటున్నారు. ఫీల్డింగ్లో స్టాటిటిక్స్ అనేవి ప్రేక్షకులు చూపిస్తే ఆటగాళ్లకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ.. నేను చెప్పగలను, ఏ ఆటగాడు ఎన్ని బాల్స్ ఆపాడు, ఎన్ని క్యాచ్లు పట్టాడు, ఎన్ని రన్ అవుట్స్ చేశాడని. వచ్చే వరల్డ్కప్ సమయానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లలో రాణించి విజయం సాధిస్తాం’ అంటూ ముగించాడు శ్రీధర్. ‘కొన్ని మ్యాచుల్లో ఆటగాళ్లను చాలా దగ్గరగా గమనించాను. వారిలో ఉన్న లోపాలను గుర్తించాను. వాటిని పాయింట్ అవుట్ చేశా. ఇవి విజయానికి దారి తీస్తున్నాయి’. -
కూర్చోనివ్వని సినిమా
మనుషులతో వాస్తవం నిత్యం దోబూచులాడుతూ ఉంటుంది. కళ్లకు కట్టిన గంతలు తెరిస్తే ఏం చూడాల్సి వస్తుందోనని భయం. చేదు నిజంలో కంటె, తియ్యని అబద్ధంలో జీవించడమే మనిషికి ఆనందం. అయితే ఒక చేదు నిజాన్ని విని గుండె ఆగినంత పనైంది ఆ తల్లికి! అయినప్పటికీ కుమారుడిని అర్థం చేసుకుంది. భర్తతో పోరాడింది. కొడుకుకు, భర్తకు మధ్య నలిగిపోయింది. ఈ థీమ్తో ఒక సంచలనాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు క్వీర్ సినిమాలు (హోమో సెక్సువల్) తీయడంతో సిద్ధహస్తుడైన శ్రీధర్ రంగాయన్. ఆ చిత్రం పేరు ‘ఈవెనింగ్ షాడోస్’. జనవరి 10న మెట్రో నగరాల్లోని పరిమిత థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అబ్బాయి ఊరి నుంచి రాగానే వివాహం చేయాలని సంకల్పించారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. అబ్బాయికి విషయం చెప్పారు. అయితే ఆ అబ్బాయి.. ‘‘అమ్మా! ఎందుకో నాకు అమ్మాయిల మీద మనసు పోవట్లేదు’ అన్నాడు. తల్లి షాకయ్యింది. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ‘ఈవెనింగ్ షాడోస్’ చిత్రంలోని సీన్ ఇది. ముంబైకి చెందిన ఒక యువకుడు కర్ణాటకలోని తన స్వగ్రామానికి చేరుకుంటాడు. ఇంట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. అమ్మాయిని చూడటానికి తనకు మనస్కరించడం లేదని, తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తాను ‘గే’ అని తల్లికి చెప్పుకుంటాడు. ఆవిడకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ యువకుడి పేరు కార్తిక్ (దేవాంశ్ దోషి). మోనా అంబేగాన్కర్ కార్తిక్ తల్లిగా నటించారు. అనంత్ మహదేవన్, అర్పిత్ చౌదరీ, యామినీ సింగ్, అభయ్ కులకర్ణి, వీణా నాయర్, దిశా ఠాకూర్ ఇందులో నటించారు. 2018, జనవరి 11న ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలో ప్రదర్శించి, అవార్డులు అందుకున్నారు. చాలామంది గేలను కలిసి, వారి జీవితాల గురించి స్వయంగా తెలుసుకున్న అనుభవంతో ఈ చిత్రం తీశారు రంగయాన్. బెంగళూరు ఫిలిమ్ ఫెస్టివల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు, చాలామంది ప్రేక్షకులు ఎంతో ఇబ్బందిపడడం గమనించారు రంగాయన్. ముఖ్యంగా మగవారు ఇబ్బంది పడటం ఆయనకు కనిపించింది. కొందరు హాలులో నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రేక్షకుల స్పందనను నేరుగా చూడటం వలన చిత్రం గురించి ప్రేక్షకుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు రంగాయన్. ఈ కథను రంగాయన్ 2009లో రాయడం ప్రారంభించారు. సినిమా తీయడానికి తగినంత డబ్బు దొరకడంలో ఆలస్యం జరగడంతో, ఏడు సంవత్సరాల తరవాత ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం ప్రారంభించారు. బాలారిష్టాలు దాటుకుని 2016లో చిత్ర నిర్మాణం ఊపందుకుంది. తియ్యడం వరకు బాగానే ఉంది కానీ, విడుదల చేయడం ఇబ్బందికరంగా మారింది. ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రాలేదు. అందువల్ల ఈ చిత్రాన్ని ఇప్పుడు చాలా ప్రత్యేకంగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నారు. 200 థియేటర్లలో శుక్రవారం నాడు విడుదల చేసే పద్ధతి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు. అన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎవ్వరూ వెళ్లి చూడరు. తక్కువ స్క్రీన్లు ఉన్నచోట విడుదల చేసి, ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ వస్తుందో చూడాలనుకుంటున్నారు రంగాయన్. – జయంతి -
విశాఖ ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఏడీ కొత్తరోడ్డులో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణాన్ని చలార్చడానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు మళ్ల విజయప్రసాద్తో పార్టీకి చెందిన ఇతర నాయకులు.. శ్రీధర్కు సంఘీభావంగా ఎయిర్పోర్ట్ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ నాయకుడిని విడిచిపెట్టాలని స్థానికులు, కార్యకర్తలు ఉదయం నుంచి పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఎయిర్పోర్ట్ పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ.. పోలీసులు తప్పుగా అర్థం చేసుకున్నందువల్లే శ్రీధర్ను అరెస్ట్ చేసి ఉంటారని అన్నారు. గతరాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డు జంక్షన్లోని గణేశ్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, లక్ష్మీ దంపతులు చేతబడి ప్రమోగించి పలువురి మరణానికి కారణం అవుతున్నారంటూ ఆరోపిస్తూ స్థానికులు వారిపై దాడికి దిగారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో ఆరోగ్యంగా ఉన్న ఆరుగురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కొల్పోయారని.. దీనికి ఆ దంపతులే కారణమని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు. స్థానికులు ఆ దంపతులను చితకబాదడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలలకొంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న జియ్యాని శ్రీధర్తోపాటు పలువురు నాయకులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అనుకోకుండా అల్లరి చెలరేగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మహిళలను అని కూడా చూడకుండా చితకబాదారు. నాయకులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. -
మహాకూటమిలో కాంగ్రెస్ టిక్కెట్ల గోల
-
2 గంటల్లో ముంగిట్లోకి ‘ఖట్టా మీఠా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నచ్చిన స్వీట్స్ కోసం కొన్ని షాపులకే వెళతాం. అక్కడికెళ్లే అవకాశం లేకపోతే ఫుడ్ అగ్రిగేటర్ల ద్వారా ఆన్లైన్లో ఆర్డరివ్వొచ్చు. కానీ అవి నిర్దేశిత పరిధి వరకే డెలివరీ చేస్తాయి. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ ‘ఖట్టా మీఠా’ ఒక అడుగు ముందుకేసింది. వినియోగదారులు సిటీలో ఏ మూలనున్నా టాప్ దుకాణాల నుంచి రెండు గంటల్లో డెలివరీ చేస్తోంది. స్వీట్స్, నమ్కీన్స్, డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు ఆర్డర్లు తీసుకుంటోంది. హైదరాబాద్కే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా 10–15 శాతం తక్కువ ధరకే సరఫరా చేస్తామంటున్నారు ‘ఖట్టా మీఠా’ను ప్రమోట్ చేస్తున్న ఫ్రెస్కో సర్వీసెస్ సీఈవో సందీప్ మారెళ్ల, సీవోవో శ్రీధర్ మహంకాళి. దీని గురించి స్టార్టప్ డైరీకి వారు చెప్పిన వివరాలివీ.. టాప్ స్వీట్ షాప్స్ నుంచే.. హైదరాబాద్లో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని స్వీట్స్, నమ్కీన్స్ మాత్రమే డెలివరీ చేసే కంపె నీ మాదే. దాదూస్, ఆల్మండ్ హౌస్, మిఠాయివాలా, ఆలివ్, ఆగ్రా స్వీట్స్ బంజారా, కేసరియాస్, ఆగ్రావాలా, గంగారామ్స్ వంటి 40 ప్రముఖ బ్రాండ్ల స్వీట్లు, నమ్కీన్స్, పచ్చళ్లు, టీ పొడులు మా పోర్టల్లో ఉన్నాయి. ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా మాదిరి ముంబై, బెంగాల్, అగ్రా, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో పేరున్న దుకాణాల్లో లభించే పాపులర్ వెరైటీలను త్వరలో ప్రవేశపెడతాం. సంక్రాంతి నుంచి హోమ్ మేడ్ స్వీట్స్ సరఫరా చేస్తాం. విదేశాలకు అయిదు రోజుల్లో.. ప్రస్తుతం ఖట్టామీఠా.ఇన్ పోర్టల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నాం. దీపావళికల్లా యాప్ సిద్ధమవుతుంది. 10–15 శాతం తక్కువ ధరకే ఉత్పత్తుల్ని సరఫరా చేస్తున్నాం. ఇక భాగ్యనగరిలో రెండు గంటల్లో డెలివరీ ఇస్తాం. డెలివరీకి రూ.40 చార్జీ తీసుకుంటున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 48 గంటల్లో కస్టమర్కు చేరతాయి. విదేశాలకు 5–7 రోజుల సమయం పడుతుంది. ఇతర సంస్థలతో పోలిస్తే విదేశాలకు సరఫరాకు డెలివరీ చార్జీలు 50 శాతం కంటే తక్కువే వసూలు చేస్తున్నాం. స్వీట్ కంపెనీలు మాకిచ్చే డిస్కౌంట్ ప్రయోజనాలను కస్టమర్లకే అందజేస్తున్నాం. స్నేహితులు రవీందర్ పల్లెర్ల, నరేశ్ కుమార్ బుద్ధాతో కలిసి ఈ ఏడాది మొదట్లో దీన్ని ఆరంభించాం. 10 మంది మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారు. డెలివరీకి క్వికర్ సేవల్ని వినియోగించుకుంటున్నాం. కార్పొరేట్ ఆర్డర్లూ స్వీకరిస్తున్నాం. యూఏఈ, మలేషియా, సింగపూర్, యూఎస్ నుంచి ఇప్పటికే ఎంక్వైరీలు వస్తున్నాయి. -
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
నాగర్కర్నూల్ క్రైం: ఎన్నికల్లో ఏ చిన్న సంఘటన జరిగినా.. ఫిర్యాదులు వచ్చిన వాటికి సంబం ధిం చిన వీడియోలు, సీసీ కెమెరా పుటేజీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి అధికారి ఎన్నికల సంఘం ఆధీనంలో పని చేస్తున్నారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు సమావేశ మందిరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, వీవీ ప్యాట్లపై పోలీసు అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ట్రబుల్ మంగర్స్(ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారు) ను బైండోవర్ చేయాలని, రిటర్నింగ్ అధికారుల తో కలిసి రూట్ మ్యాప్ను తయారు చేయాలని సూచించారు. ప్రచారంలో లౌడ్ స్పీకర్లను ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు అనుమతులు మంజూరు చేసేటప్పుడు డీఎస్పీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, వారి నిర్వర్తించే బాధ్యతలను వీడియోలలో చిత్రీకరించాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఏవైనా ఫిర్యాదులు వస్తే అధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికీ తమ ఇష్టం వచ్చిన వారికే ఓటు వేసుకునేలా ప్రశాంతమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వేసుకోవడానికి రెవెన్యూ అ«ధికారులతో కలిసి వర్ణలేబుల్టీ మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన శాంతిభద్రతల నివేదికను ప్రతిరోజూ ఎన్నికల అధికారికి , కలెక్టరేట్కు పంపాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ప్రతి నియోజకవర్గంలోమూడు చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని, చెక్ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేటప్పుడు వీడియోలు తీయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. హైపర్ క్రిటికల్, క్రిటికల్ , నార్మల్ పోలింగ్ బూత్లను వెంటనే గుర్తించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ఓటర్లలో విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పని తీరు గురించి గ్రామగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించాలని పోలీసు శాఖ అధికారులకు సూచించారు. ఓటింగ్ మిషన్ ,వీవీ ప్యాట్ల పనితీరు గురించి తెలియజేస్తూ సందేహ నివృత్తి చేయాలన్నారు. వాహనాల ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం వీవీ ప్యాట్ల పనితీరు గురించి కలెక్టర్ శ్రీధర్ మాక్ పోలింగ్ ద్వారా పోలీసులకు అవగాహన కల్పించారు. ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన ఉండాలి ఈవీఎం, వీవీ ప్యాట్ల గురించి ప్రతి పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండి.. క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఎస్పీ సాయిశేఖర్ ఉంటుందన్నారు. తమ వద్దకు వచ్చి సమాచారం అడిగిన ఓటరుకు వివరాలు సవివరంగా తెలిపేలా పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల మ్యాన్యువల్ చదివి ఉండాలని సూచించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాల నుంచి ఇప్పటికే పలువురు పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అవగాహన సదస్సులో ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీనారాయణ, నర్సింహులు, పుష్పారెడ్డి, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
గోప్యత పేరుతో అడ్డుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: గోప్యత పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వకుండా తిరస్కరించేందుకు వీల్లేదని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలోని సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ.. ‘సమాచార హక్కును గోప్యత పేరుతో అడ్డుకోరాదు. గోప్యత హక్కును దుర్వినియోగం చేసి సమాచారాన్ని నిరాకరించరాదు. ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించా. గోప్యత పేరుతో ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారాన్ని నిరాకరించే ఆఫీస్ మెమోరాండంను ప్రభుత్వాలు వెనక్కు తీసుకోవాలి. అడిగిన వివరాలు వెల్లడించాల్సిందే అనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ డీవోపీటీగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ మరో ఆఫీస్ మెమోరాండంను విడుదల చేయాలి. అప్పుడే గోప్యత హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. -
స.హ.చట్టం బాగా పనిచేస్తోంది: మాడభూషి
హైదరాబాద్: దేశంలో సమాచార హక్కు(స.హ)చట్టం సక్రమంగా పనిచేస్తోందని ప్రతీ ఏడాది 60– 70 లక్షల మంది చట్టాన్ని విని యోగించుకుంటున్నారని కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, యుగాంతర్ సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. అంతకుముందు యూఆర్టీఐ.ఇన్ వెబ్ సైట్ను ఆవిష్కరించారు. వ్యవస్థల పనితీరు, అందులోని లోటుపాట్లు ప్రశ్నించేందుకు ఆర్టీఐను ఉపయోగించుకోవాలన్నారు. ఒక పత్రికలో వార్తను చూసి వంద ఆర్టీఐలు వేయవచ్చన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి ఉం దని, కాని కమిషనర్కు జీతం అంశా న్ని మాత్రం కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే దీన్ని ఏ రాష్ట్రం ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంస్థలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలుండాలని, జాతీయ మహిళా కమిషన్లో ఆ కమిటీ ఉందా? అని ప్రశ్నించారు. ఐజేయూ ప్రధాన కార్యదర్శి, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. జర్నలిస్టులకు శిక్షణ, పరిశోధనకు ఒక సంస్థ ఉండాలనే దీన్ని ఏర్పాటు చేశా మని త్వరలోనే మరికొన్ని కోర్సుల్ని ప్రారం భించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెబ్సైట్ నిర్వాహకుడు సుశీల్, యుగాంతర్ డైరెక్టర్ శశికుమార్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనికేషన్ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యం, కార్మికులకు మధ్య సరైన కమ్యూనికేషన్ కోసం ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రణాళికలు, గనుల్లో ఉత్పత్తి లక్ష్యాలు, సాధించలేక పోవడానికి గల కారణాలు, ఓపెన్కాస్ట్(ఓసీ) గనుల యంత్రాల పనితీరు వంటివాటిపై కార్మికులకు వివరించాలని నిర్ణయించారు. సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా భారీ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నారు. సదస్సులు, సమావేశాలకు ఐఈడీ విభాగం ఏరియా జనరల్ మేనేజర్లు సారథ్యం వహించనున్నారు. సింగరేణిలో మొత్తం 19 ఓసీ గనులు, 29 భూగర్భ గనులు, వర్క్షాపులు, తదితర విభాగాల నుంచి 54 వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి ఆర్థిక స్థితి, ప్రణాళికలు, ఉత్పత్తి వంటి విషయాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. అనంతరం ఆయా అంశాలపై కార్మికుల అభిప్రాయాలు సేకరించనున్నారు. కార్మికుల ఇబ్బందులను తొలగించేలా వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. గతంలో ఇలాంటి సమావేశాల్లో కార్మికుల సలహాలు, సూచనలపై శ్రీధర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు గనుల్లో క్యాంటీన్ల పరిశీలన, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చడం వంటి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో దీన్ని భారీ పరస్పర ప్రయోజనకర కమ్యూనికేషన్స్ ప్రక్రియగా సీఎండీ శ్రీధర్ భావించి ఏటా సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. యంత్రాల వినియోగం, గనుల్లో నష్ట నివారణ చర్యలు వంటి అంశాలను పొందుపరిచిన సీఎండీ లేఖను ఆదివారం నుంచి అన్ని ఏరియాల్లో పంపిణీ చేయనున్నారు. టీంలు సంసిద్ధం ప్రతి ఏరియాలో ఈ సమావేశాల కోసం ఏరియా జీఎం అధ్యక్షతన పర్సనల్, ఫైనాన్స్, ఐఈడీ, సేఫ్టీ అధికారులతో కూడిన మల్టీ డిపార్ట్మెంట్ టీంలను సిద్ధం చేశారు. సమావేశాలు, సదస్సుల్లో కార్మికులకు అర్థమయ్యే విధంగా వివరాలను వివరిస్తారు. మొత్తం 250కిపైగా సమావేశాలు నిర్వహించి సింగరేణిలోని ప్రతి కార్మికుడికి సందేశం చేరేలా ఏర్పాటు చేశారు. -
షకలక శంకర్పై శ్రీరెడ్డి ఫైర్..
సాక్షి, సినిమా: ఇటీవల టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి, అంతకు మించి తన మాటలు, ట్వీట్స్, పోస్ట్లతో పలువురిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కమెడియన్ షకలక శంకర్ను ఉద్దేశించి తన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశారు. అయితే హాస్య నటుడు షకలక శంకర్ హీరోగా, కారుణ్య కథానాయికగా, శ్రీధర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ వై.రమణారెడ్డి, సురేష్ కొండేటి నిర్మించిన ‘శంభో శంకర’. సినిమా ఈ నెల 29న విడుదలైన విషయం తెలిసిందే.. ఈ సినిమా ప్రమోషన్ కోసం శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘నేను ఎవరిని పొగుడుతూ.. వారిని ఓరేంజ్కి ఎత్తేసి వాళ్ల పేరు అడ్డు పెట్టుకొని ఇక్కడికి రాలేదు. అయితే ఇటీవల కొంత మంది భక్తులు.. ఓ హీరో భక్తులు.. ఆ హీరోకి తెలియంది ఏంటంటే అతని పేరు చెప్పుకొని అతన్ని దేవుడు.. మా కోసం ఎంతో చేస్తున్నాడు అంటూ.. మొత్తం మీద బతికేస్తున్నారు.. బతకండీ.. ఆ హీరో ఫ్యాన్స్ని వాడుకోండి. మీ సినిమా ఓపెనింగ్స్కి కావాలి కదా.. వాడుకోండి.. ఓపెనింగ్స్ కోసం ఆ హీరోని పొగడటం.. మీ ఊరు వచ్చినపుడు ఆయన్ని నెత్తిన పెట్టుకొవడం.. మీరు కూడా రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించడం తప్పులేదు.. కానీ నా పేరు అనవసరంగా మద్యలో తీశారంటే మాత్రం పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా... ఓ కమెడియన్వి హీరోగా ఇంట్రడ్యూజ్ అయ్యావు.. నీ పని ఏదో నువ్వు చూసుకో.. అందరిలాగా అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. అందరికీ ఒకటే చెబుతున్నాను.. మీ ప్రొడ్యూసర్ ఏం గొప్పోడు కాదు..నువ్వేం పెద్ద గొప్పోడివి కాదు.. కథలు తీస్తే అందరి కథలు ఉన్నాయి మా దగ్గర.. సమయం వచ్చినపుడు అందరి కథలు బయటికొస్తాయి. నీ సినిమా ఓపెనింగ్స్ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొని వ్యాపారం చేసుకోవడం మంచింది కాదు.. దాని కోసం నన్ను మద్యలో లాగటం కరెక్ట్ కాదు. నీ లాంటి పిచ్చ సినిమాలు నేను చూడను అని’ శ్రీరెడ్డి పేర్కొన్నారు. -
32 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యం
సాక్షి, కొత్తగూడెం: వచ్చే ఏడాది రూ.32 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నట్లు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. సింగరేణి ఆవిర్భా వ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది రూ.18 వేల కోట్లు, ఈ ఏడాది రూ.23 వేల కోట్ల టర్నోవర్ సాధించి నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం 52 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసిన సంస్థ.. ఈ ఏడాది 66 మిలియన్ టన్నుల రవాణాకు ప్రణాళికలు రూపొందించుకుందని, ఈ విషయంలో గత మూడేళ్లలో వరుసగా 11.5శాతం, 4శాతం, 10శాతం వృద్ధి సాధించిందని వివరించారు. 2015లో రూ.1,050 కోట్లు, 2016లో రూ.800 కోట్ల లాభాలు గడించామని చెప్పారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో 12 కొత్త గనులు ప్రారంభిస్తున్నామని, ఇందులో 6 ఓసీలు, 6 భూగర్భగనులు ఉన్నాయని తెలిపారు. సింగ రేణి ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తోందన్నారు. ఒడిశాలోని నైనీ బ్లాక్ను తీసుకున్నామని, రెండు, మూడేళ్లలో నైనీ బ్లాక్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే విద్యుత్ రంగంలోకి అడుగుపెట్టామని, 11 ఏరియాల్లో ఒక్కొక్కటి 500 మెగావాట్ల చొప్పున సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామని చెప్పారు. జైపూర్లో ఏర్పాటుచేసిన థర్మల్ ప్లాంట్తో పాటు సోలార్ ప్లాంట్ల ద్వారా 2,500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి పండగలకు వేతనంతో కూడి న సెలవులు ఇస్తూ సర్క్యులర్ జారీ చేశామన్నారు. -
సౌతిండియా మాఫియా డాన్ ఆత్మహత్య..
సాక్షి, చెన్నై: నిన్నటి వరకూ దక్షిణ భారతాన్ని గడగడలాడించిన డాన్ ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు పోలీసులతో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన డాన్ శ్రీధర్ ధనపాలన్(44) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన శ్రీధరన్ గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే దక్షిణ భారత దావూద్ ఇబ్రహీంగా పేరుపొందాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 43కేసులు నమోదయ్యాయి. ఇందులో 7హత్యారోపణలు కూడా ఉన్నాయి. అనంతరం పోలీసుల తనిఖీలు పెరిగిపోవడం, పెద్ద మాఫియా డాన్గా ఎదగాలనే కోరికతో పోలీసుల కన్ను కప్పి కంబోడియాకు పారిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మద్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో విసుగు చెంది తన నివాసంలో సైనేడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం 6.30 ప్రాంతంలో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 2013లో భారత్ నుంచి తప్పించుకొని కంబోడియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. శ్రీధర్కు భార్య, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే శ్రీధర్ మరణ వార్త విని అతని స్వస్థలం కాంచీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాల్లేవు
జీఎస్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ హైదరాబాద్: ఉద్దానం నీటిలో ఎలాంటి ప్రమాదకర మూలకాల్లేవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ తెలిపారు. ఇటీవల తాము జరిపిన పరిశోధనల్లో ఈ అంశం స్పష్టమైనట్లు పేర్కొన్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల బారిన పడి వేలాది మంది మృతి చెందడానికి కారణం అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షల్లో తేలిందనడం అవాస్తవమని చెప్పారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆగస్టులో ఉద్దానం నుంచి సేకరించిన 12 నీటి నమూనాలను పరీక్ష కోసం అందజేసినట్లు తెలిపారు. వాటితో పాటు మరో 8 నమూనాలను తమ సిబ్బంది సేకరించారని, వాటితో కలిపి మొత్తం 20 నమూనాలను పరీక్షించగా ఎలాంటి హానికరమైన మూలకాలు అందులో లేవని తేలిందని వివరించారు. ఉద్దానం నీటిలో ప్రమాదకర మూలకాలు ఉన్నాయని జీఎస్ఐ నిర్ధారించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ డా.రాజారెడ్డి చెప్పారని పేర్కొనడం సరైంది కాదన్నారు. ఆయనను ఫోన్లో సంప్రదించగా ఉద్దానం నీటిలో ప్రమాదకరమైన మూలకాలు ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదని చెప్పినట్లు వివరించారు. కాడ్మియం, క్రోమియం, సిలికా, లెడ్ మూలకాలు అధికంగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తుతాయని మాత్రమే రాజారెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు. ఉద్దానం పరిసర ప్రాంతాలపై అధ్యయనానికి జీఎస్ఐ 2018–19 సంవత్సరంలో ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సమావేశంలో ఆర్ఎంహెచ్–3 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రేమ్చంద్, డైరెక్టర్ కె.రవి, కెమికల్ ల్యాబ్ డైరెక్టర్ శోభారాణి, అజయ్కుమార్, కామేశ్వర్ పాల్గొన్నారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో విశేషంగా కృషి చేసిన డాక్టర్ రాజారెడ్డి చెప్పిన అంశాల మేరకే సమావేశంలో చెప్పామని, జీఎస్ఐ అధికారుల ప్రకటనపై ఆయనే స్పందించాల్సి ఉందని, శాస్త్రీయ అంశాల్లో తమకు ప్రవేశం లేదని కె.రామచంద్రమూర్తి తెలిపారు. -
ఆ ఇద్దరు సబలలకు సలాం
విశ్లేషణ ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్ల కోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశ పాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉంటే సుదీర్ఘ పోరాటాన్ని తలచుకుంటూ రాంరహీం బాబా అత్యాచార బాధితులు అన్నమాట ఇది: ‘‘డబ్బున్న అత్యంత శక్తిమంతులపైన యుద్ధం ఎంతో కష్టం, న్యాయం దాదాపు అసాధ్యం, అయినా ‘‘ఉమీద్ కీ కిరణ్ హై’’ (ఆశాకిరణం ఉంది). నేరగాడికి శిక్ష తప్పదని నమ్మాం’’. దారుణమైనదంటూ పాత ప్రభుత్వాన్ని ఓడిస్తే, కొత్త ముఖ్యమంత్రి సహా మంత్రిమండలి రేప్ కేసులలో ప్రథమ నిందితుడికి మోకరిల్లింది. సార్వభౌమత్వాన్ని అతని పాదాక్రాంతం చేసిన దశలో, అధికార, ప్రతిపక్ష తేడా లేకుండా ఈ ముఠా నాయకుడికి దాసోహం అంటున్న దుర్దశలో ఏటికి ఎదురీదుతూ, పోలీసులకు, న్యాయస్థానానికి నిజాన్ని నివేదిస్తూ, సాక్ష్యాలు చూపుతూ, చాలా సులువుగా వచ్చి పడుతున్న అపారమైన మురికి డబ్బు లక్షలకు లక్షలు తీసుకుని నేరగాడిని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదుల అవమానకరమైన క్రాస్ ఎగ్జామినేషన్తో పాటు అనేక దుర్మార్గాలను సహిస్తూ బోనులో కూలిపోకుండా నిలబడి న్యాయ పోరాటం చేసిన ఆ ఇద్దరు సాధ్వీల సాహసాన్ని ఏ విధంగా ప్రశంసించాలి? సరిహద్దులో నిలబడి, భయానకమైన చలిలో చలించకుండా, ఆకాశం నుంచి పిడుగులు కురిపిస్తున్నా, ఎదురుగా శత్రువు ఫిరంగులు పేలుతున్నా పోరాడుతున్న సైనికుని ధైర్యం కన్న గొప్ప ధైర్యం వారిది. అధికార పార్టీ ఏజెంట్ అన్న నిందను భరించే సీబీఐ ఈ కేసు పరిశోధనలో చూపిన నిజాయితీ వల్లనే న్యాయం బతికింది. పేరు దాచి రాసిన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోరు. కాని సాధ్వి నాటి ప్రధానికి, పంజాబ్ హరియాణా చీఫ్జస్టిస్కు రాసిన ఉత్తరం పనిచేసింది. సిర్సా జిల్లా సెషన్స్ న్యాయమూర్తి నుంచి నివేదిక తెప్పించుకుని హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం కీలకమైన మలుపు. 150 మంది బాధితులున్నారని తేల్చి, వారిలో 130 మందిని కనిపెట్టినా ఇద్దరు సాధ్వీలు మాత్రమే నిజం చెప్పే సాహసం చేశారు. 2008లో సీబీఐ కోర్టు రేప్ ఆరోపణలు నిర్ధారించింది. ఉత్తరం అజ్ఞాతంగా రాయడమే సాహసం. కాని బహిరంగంగా సాక్ష్యం చెప్పడం మరింత సాహసం. తరువాత వారి జీవితం దుర్భరమైంది. బతకడమే సాహసమైంది. డేరా బాబా అనుమతి లేకుండా ఏదీ జరగని రాష్ట్రం, ఏదీ చేయని రాజ్యం. మరోవైపు నేర డేరాను ఒక్క మాటన్నా చంపి పారేసే లక్షల నేరభక్తులు. ఒక నేరగాణ్ణి దేవుడనీ, వాడు చెప్పేది దైవ సందేశమనీ నమ్మే పిచ్చి జనం. కూతుళ్లు చెప్పే నిజాలు నమ్మక డేరాబాబాను మాత్రమే నమ్మి, బాబా దుర్మార్గాలను వివరిస్తే తప్పు చేస్తున్నావని మందలించే తల్లిదండ్రులు. పారిపోవాలనుకున్నా వెళ్లనీయని టెర్రర్. డేరా నడిపే పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలు. 1999లో అమాయక బాలికలపై బాబా అత్యాచారాలు ఆమెకు అర్థమయ్యాయి. బాబాకు ఒక గుఫా (గుహ) ఉంటుంది. గుఫా ప్రవేశ ద్వారానికి కాపలాగా ఈ ఆడవారిని నియమిస్తారు. ఈ టీచర్ బాధితురాలు కూడా ఒక కాపలాదారు. లోపలికి వెళ్లి కొంతసేపటికి ఏడుస్తూ వచ్చిన అమ్మాయిలను ఈ టీచర్ గమనించారు. ఆమెపై కూడా అత్యాచారాలు జరిపారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆమెను సొంత గ్రామానికి పంపించారు. చివరకు మొత్తం కుటుంబం 2001లో వెళ్లి పోయింది. అప్పటి నుంచి బెదిరింపుల మధ్య భయం భయంగా బతుకుతున్నారు. 2002లో డేరా గూండాలు ఆమె తమ్ముడిని కాల్చి చంపారు. దుర్మార్గాన్ని వెల్లడించిన జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతిని డేరా మనుషులే చంపేశారు. ఇది నేరగాళ్లు–రాజ్యం కలిసి పన్నిన పద్మవ్యూ హం, అభిమన్యుడివలె అందులోనే చావకుండా పోరాడి బతికి బయటపడి, ఎలుగెత్తి అన్యాయాన్ని చాటిన ఆ ఇద్దరిలో ఒకరు ధైర్యలక్ష్మి, మరొకరు సాహసలక్ష్మి (అసలు పేర్లతో పనిలేదు). ఈ కీచకబాబా వందలాది మహిళలపై అత్యాచారం చేశాడు. కుటుంబంలో కుల సమాజంలో పరువుపోతుందని భయపడి నోరువిప్పని వారే అందరూ. ‘‘2002 నుంచి రాజకీయ ప్రభుత్వాలన్నీ నేరవిచారణను, ప్రాసిక్యూషన్ను నీరు గార్చడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కనుక ఈ డేరాబాబా దేన్నయినా మాయచేయగలడనుకున్నాం, అయినా న్యాయం గెలిచింది’’ అని సాధ్వి అన్నారు. 28 మంది సాక్షులు, 14 పత్రాల వల్ల నేరం రుజువైంది. అవతార్ సింగ్, ఇందర్ సింగ్, కిషన్ లాల్ అనే బాబా ఆంతరంగికులైన సహ నిందితులు లై డిటెక్టర్ పరీక్షలో అసంబద్ధంగా మాట్లాడడం, పాలిగ్రాఫీ పరీక్షలో బాబా ప్రేలాపన నేరగాడిని పట్టించింది. ఇతడిని జైలుకు పంపిన న్యాయాధికారి జగ్దీప్సింగ్ ఒక బ్రహ్మోస్ అయితే ఓట్లకోసం నేరాన్ని సహించొద్దని చెప్పి, మీరు పార్టీకి చెందిన పాలకులా దేశపాలకులా అని నిలదీసిన హైకోర్టు న్యాయమూర్తులు ఫిరంగులు. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
కామెడీ థ్రిల్లర్
తెలుగు, హిందీ, మలయాళంలో పలు చిత్రాలకు స్వరాలందించిన సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ కీలక పాత్రలో నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘రావోయి.. మా ఇంటికి’. ఆయనే స్వరకర్త. శ్రీధర్, కావ్యా సింగ్, అవంతిక ముఖ్యతారలు. బ్లాక్ పెప్పర్ స్క్రీన్స్ పతాకంపై డాలీ భట్ నిర్మించారు. ఈ చిత్రం పాటల సీడీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేసి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావుకు అందించారు. ‘‘కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కథే మా చిత్రంలో హీరో. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉంటుంది. పాటలు, సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సాకేత్ సాయిరామ్. ‘‘కామెడీ చిత్రమైనా నా పాత్రలో రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి’’ అన్నారు హీరో శ్రీధర్. అవంతిక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కె. దిలీప్ కుమార్ రెడ్డి, డి.కె. గోయల్ పాల్గొన్నారు. -
నిజ జీవితంలోనూ మున్నాభాయ్లేనా?
ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, అక్రమార్కులను శిక్షించలేదంటే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుంది. మున్నాభాయ్ సినిమాలో ఎవడో ప్రవేశ పరీక్ష రాస్తాడు, హీరోకు మెడికల్ కాలేజిలో సీటు వస్తుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని వేలమంది మేధావులు డబ్బు తీసుకుని వేరే వ్యక్తులకోసం పరీక్షలు రాసారు. ఉద్యోగాలకు ఎంపికై అనేక విభాగాల్లో చేరిపో యారు. వ్యాపం కుంభకోణం అని ప్రసిధ్ధి చెందిన ఈ అక్రమాల పుట్ట ఎంత లోతుగా ఉందో ఇంకా తెలియడం లేదు. అటువంటి అక్రమం ఒకటి కార్మిక భీమా సంస్థలో ఆర్టీఐ జవాబుల్లో తేలింది. కాని విచిత్రమేమంటే పట్టిం చుకునే వారెవరూ లేరు. కార్మిక జీవిత భీమా సంస్థలో గుమాస్తా ఉద్యో గానికి నిత్యానంద్ అనే వ్యక్తి పోటీ పరీక్ష రాసినప్పుడు ఇచ్చిన హాజరు పత్రం, ప్రవేశపత్రం (అడ్మిట్ కార్డ్) ప్రతులు ఇవ్వాలని హరీందర్ దింఘ్రా ఆర్టీఐ దర ఖాస్తులో కోరారు. అతనికి ఆ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పమన్నాడు. ఈఎస్ఐసీ వారు అతను క్లర్క్ ఉద్యోగానికి ఎంపిక కాలేదని జవాబిచ్చి ఫైలు మూసేశారు. సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీలు చేరింది. 2009 సెప్టెంబర్ 20 వ తేదీన జరిగిన గుమాస్తా ఉద్యోగ కంప్యూటర్ నైపుణ్యపోటీ పరీక్షలో పాల్గొన్న 17 మంది అభ్యర్థులు అడ్మిట్ కార్డుపైన చేసిన సంతకాలకు ఆ తరువాత పరీక్ష హాజరు పత్రం మీద చేసిన సంత కాలకు చాలా తేడా ఉంది. తాను చేతిరాత నిపుణుడు కాకపోయినా తేడా చాలాస్పష్టంగా తెలుస్తున్నదనీ. ఈ తేడాలున్నప్పటికీ 17 మందిని ఎంపిక చేశారనీ, వారు గుమాస్తాలుగా పనిచేస్తున్నారనీ హరీందర్ వివరిం చారు. పరీక్ష రాసే తెలివి లేని వారికి ఉద్యోగాలు ఇప్పిం చడానికి వేరెవరో తమ తెలివిని అమ్ముకున్నారన్నమాట. ఎనిమిది మంది ఎల్డీసీలుగా చేరి యూడీసీలుగా ప్రమోషన్ కూడా పొందారు. ఇది కేవలం ఎనిమిది మంది సమస్య కాదని, కొన్ని వందల మందిని అక్రమంగా నియమించిన పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్పారు. ఈ విషయంలో హరీందర్ అడిగిన పత్రా లన్నీ ఇచ్చారు. కాని అభ్యర్థుల బొటన వేలి ముద్రలున్న కాగితాల నకళ్లు ఇవ్వలేదన్నారు. తాము అభ్యర్థుల వేలి ముద్రలు సేకరించలేదని అధికారి వివరించారు. అడిగిన సమాచారం చాలావరకు ఇచ్చినా తీవ్రమైన స్థాయిలో జరిగిన అక్రమాన్ని ప్రభుత్వ సంస్థ గుర్తించకపోవడం ఆశ్చర్యం. సమాచారం కేవలం తెలుసుకోవడంకోసమే అడగరు. దాని వెనుక ఒక బాధ, ఫిర్యాదు, లంచగొండి తనం, అక్రమం, అన్యాయం, ప్రభుత్వాల నిష్క్రియ ఉంటాయి. ఆర్టీఐ వీటిని ప్రశ్నిస్తుంది. విభిన్న హోదాలకు రకరకాల పరీక్షలు నిర్వహించి నియమించిన కనీసం 800 మంది వ్యవహారంలో వారి బదులు వేరే అభ్యర్థులు పరీక్ష రాసారని, 11 ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా ఈ గందరగోళం వెల్లడయిందని హరీందర్ కమిషన్కు వివరించారు. ఈ ఆర్టీఐ జవా బులు వచ్చిన తరువాత తాను అనేక పర్యాయాలు అధి కారుల దృష్టికి ఈ అక్రమాలు తెచ్చానని కాని ఎవరూ పట్టించుకోలేదని హరీందర్ వివరించారు. ఈ విధంగా అనర్హులైన వారు ఉద్యోగాలు చేస్తుంటే, కార్మికుల హక్కులు రోజూ భారీ ఎత్తున భంగపడుతూనే ఉంటా యని అన్నారు. ఈ అక్రమాలపైన దర్యాప్తు జరిపితే తాను సేకరించిన ఈ పత్రాల ద్వారా రుజువు చేయ గలనన్నారు. అన్ని ప్రతులను జతచేసి సమగ్రమైన ఫిర్యాదు పత్రాన్ని విజిలెన్స్ శాఖకు సమర్పించిన తరువాత కూడా ఏ కదలికా లేదన్నారు. ఆర్టీఐ ప్రశ్నలు వచ్చిన వెంటనే లేదా వివరమైన ఫిర్యాదు అందగానే దర్యాప్తు జరిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇటువంటి అన్యాయాలను వెలికి తీయడానికే సమాచార చట్టాన్ని తెచ్చారు. ప్రజాప్రయోజనం అధికంగా ఉన్న ఆర్టీఐ అప్పీలు ఇది. ఒకరికి బదులు మరొకరు పరీక్షరాసిన ఈ సంఘటనలు ఎన్నో ఉన్నాయని హరీందర్ దాఖలు చేసిన రెండో అప్పీలు వెల్లడిస్తున్నా, ఏదో ఒక జవాబిస్తు న్నారే గాని అక్రమార్కులను శిక్షించే పని చేయక పోవడం చూస్తుంటే ప్రభుత్వ కార్యాలయాలు అవి నీతిలో ఎంతగా కూరుకుపోయాయో ఊహించవచ్చు. ఎల్డీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థు లకు కంప్యూటర్లో నైపుణ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన పరీక్షలలో కనీసం 40 మార్కులు రావా లని నిర్ణయించారు. దరఖాస్తు దారులకు బదులుగా రాసిన నకిలీ వ్యక్తుల తెలివి తేటలు కూడా అంతంత మాత్రమే. ఎందుకంటే వీరికి 42, 43కు మించి మార్కులు రాలేదు. వీరి నైపుణ్యం ఆధారంగా ఈ మాత్రం కంప్యూటర్ తెలివి లేని మహానుభావులు ఉద్యో గాలు చేస్తున్నారు. కార్మిక జీవిత బీమా సంస్థలలో వీరు ఏం చేస్తున్నారో? హరీందర్ఇచ్చిన ఫిర్యాదును వెంటనే పరిశీలించా లని, లేదా ఈ రెండో అప్పీలునే ఫిర్యాదుగా పరిగణించి దర్యాప్తు చేసి రెండు నెలలోగా ఏ చర్యతీసుకున్నారో వెల్ల డించాలని సమాచార కమిషన్ ఈఎస్ఐసీ సంస్థ ఉన్న తాధికారులను ఆదేశించింది. సంస్థ డైరెక్టర్ జనరల్, కార్మిక ఉపాధికల్పనా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా ప్రతులు పంపాలని, కేంద్ర కార్మిక ఉపాధికల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు కూడా ఒక ప్రతి పంపాలని కమిషన్ ఆదేశించింది. ఈ ఉద్యోగాల నియామక అక్రమాల విషయంలో తగిన చర్య తీసు కోవాలని సూచించింది. (హరీందర్ దింఘ్రా వర్సెస్ పీఐఓ, ఈఎస్ఐసీ ఫరీదాబాద్ కేసులో సమాచార కమిషన్ 24 మార్చి 2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా. http://www.cic.gov.in సీఐసీ వెబ్సైట్ లో CIC/BS /A/2016/001489 తీర్పు పూర్తి వివరాలు చూడవచ్చు) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com విశ్లేషణ మాడభూషి శ్రీధర్ -
భారత క్రికెట్ కోచ్ను కలిసిన అఖిల్
బెంగుళూరు: భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ను నటుడు అక్కినేని అఖిల్ కలిశాడు. బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల్.. అనుకోకుండా భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ను కలిసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. అఖిల్ తనను కలిసిన విషయాన్ని శ్రీధర్ కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో అఖిల్, శ్రీధర్లు కలిసిదిగిన ఫోటో ఇన్స్టాగ్రాంలో షేర్ అవుతోంది. ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు మ్యాచ్లు ఆడుతున్న నేపధ్యంలో భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్లలో విజయాలు సాధించాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించాడు అఖిల్. It was pleasant surprise to catch up with @akkineniakhil & @rcratul indeed a surprise to meet such well behaved up boys in today's world!! A post shared by R Sridhar (@coach_rsridhar) on Mar 5, 2017 at 7:01am PST -
ఉన్నత విలువలతోనే ఉత్తమ పౌరులు
ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు ఎదుర్కొన్నాను సదస్సులో ఉత్తరాఖండ్ కలెక్టర్ శ్రీధర్బాబు కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : పిల్లల్లో నిజాయితీ, మానవీయ విలువలు కోల్పోకుండా పెంచితే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని, తాను ఆ బాటలో నడిచినందునే తన ఎనిమిదేళ్ల కాలంలో 17 బదిలీలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగానని ఉత్తరాఖండ్ కలెక్టర్ అద్దంకి శ్రీధర్బాబు అన్నారు. మోరంపూడి సమీపంలోని నామవరం రోడ్డులోనున్న బార్లపూడి కళ్యాణ మండపంలో శ్రీ షిర్డీసాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ‘తల్లుల సదస్సు’ (ఎయిమ్స్) మంగళవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ స్వీయ గౌరవం, సమగ్రత అనే రెండు మానవీయ విలువలు పిల్లల్లో పెంపొందించి రాజీపడకుండా జీవించేటట్లుగా పెంచాలన్నారు. అప్పుడే వారు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారన్నారు. తన బదిలీల్లో అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయన్నారు. గ్లోబల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ కేఎస్.రత్నాకర్ మాట్లాడుతూ బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే పిల్లలపై తల్లులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరో అతిథి, ప్రముఖ సైకాలజిస్ట్ పి.స్వాతి మాట్లాడుతూ పిల్లలతో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాస్త్రీయ కారణాలను వివరించారు. విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత విలువలు గల పౌరులుగా తీర్చిదిద్దాలంటే మాతృమూర్తుల సహకారం అవసరమన్నారు. ఈ సదస్సును ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నామన్నారు. విద్యాసంస్థల డైరక్టర్ టి.శ్రీవిద్య, టి.పాలేశ్వరరావు, టి.నాగమణి పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
► 13 మందికి కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స ► వైరస్ వల్లేనన్న చొప్పదండి ఎస్పీహెచ్వో రవీందర్ చొప్పదండి/కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్లో పదమూడు మంది విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యాలయంలో ప్రార్థన అనంతరం ఒకరి వెంట ఒకరికి విపరీతమైన దగ్గు రావడంతో వారిని ఆటోలలో చొప్పదండి పీహెచ్సీకి తరలించారు. వైద్యులు చంద్రశేఖర్, శ్రీకర్ ప్రాథమిక చికిత్స జరిపారు. విద్యార్థులకు చికిత్స చేసే సమయంలో అక్కడ ఉన్నవారికి కూడా దగ్గు మొదలైంది. ఏదో వైరస్ వ్యాపిస్తోందని గ్రహించి ఆస్పత్రిలో ఉన్న అందరికి మాస్కులు ధరింపజేశారు. విద్యార్థులు దగ్గుతూ ఆయాసపడటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యాధికారులు రెండు అంబులెన్సలలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని తెలిపారు. వారందరిని ప్రత్యేక వార్డులో ఉంచి వైద్యచికిత్స అందిస్తున్నట్లు ఇన్చార్జి ఆర్ఎంవో శ్రీధర్ తెలిపారు. పలువురు విద్యార్థులు సాయంత్రం వరకు కోలుకోగా వారి తల్లిదండ్రులు వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. మరో ఇద్దరు ముగ్గరు విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు వారాల క్రితం శిరీష, అంజలి అనే ఇద్దరు విద్యార్థినులకు ఆస్తమా సోకిందని, వారిని వైద్యం కోసం ఇంటికి పంపించామని, పూర్తిగా నయం కాకుండానే తిరిగి కళాశాలకు రావడంతో మిగిలిన వారికి సోకిందని ప్రిన్సిపాల్ వరప్రసాద్చారి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీహిత, శిరీష, పూజ, సమత, శైలజ, సమత, శిరీష, సమత, అక్షిత, అఖిల, అంజలి, తొమ్మిదవ తరగతి విద్యార్థి కావేరి, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి సుష్మిత ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీహెచ్వో రవీందర్ మాడల్ స్కూల్ను సందర్శించి వైరస్ ప్రభావంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. శిరీష, అంజలి ఎక్కువ అస్వస్థకు గురయ్యారని, వారి ద్వారా వైరస్ ఇతరులకు సోకిందని చెప్పారు. శీతాకాలం కావడం, డార్మెటరీలో అపరిశుభ్రత ఉండటం, విద్యార్థులకు సరైన పోషకాలు అందక బలహీనంగా ఉండటం కూడా కారణమని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో అన్వర్, ఎంఈవో రాజాస్వామి, సీఐ లక్ష్మిబాబు విద్యార్థులకు అందుతున్న చికిత్సను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. -
ప్రభుత్వానికి పతనం తప్పదు
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ కన్వీనర్ శ్రీధర్ హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరి ష్కరించకపోతే ప్రభుత్వానికి పత నం తప్పదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ బుధవారం హన్మకొండలో విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర స్థారుు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులంతా నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ సమస్యలు విన్నవించుకుందామనుకుంటే సీఎం కేసీఆర్ అపారుుంట్మెంట్ ఇవ్వరన్నారు. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చైనాకు పారిపోతున్నారని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో నిరాహారదీక్ష చేపట్టనున్నామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతామన్నారు. ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ పద్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మనది, సీఎం కేసీఆర్ మనోడు, మన సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామని, కానీ, అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. -
ఆర్టీఓగా శ్రీధర్ నియామకం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం డివిజన్ రోడ్డు రవాణా అధికారి(ఆర్టీఓ)గా శ్రీధర్ నియమితులైనట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పరిపాలన అధికారి(ఏఓ)గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై అనంతపురం ఆర్టీఓగా వస్తున్నారు. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న ప్రతాప్ రిటైర్డ్ అయ్యారు. -
రాజీనామా
ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ సి.ఆర్.డి.ఎ. (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారి సంస్థ) కమిషనర్ రాజీనామా..? క్వశ్చిన్ మార్క్తో వెలువడ్డ ఈ వార్త సంచలనం కల్గించింది. సి.ఎం. విశ్వేశ్వరనాయుడు కమిషనర్ శ్రీధర్ రాజినామాను తిరస్కరిస్తూ తొక్కిపెట్టాడు. ఉదయాన్నే కమిషనర్ కలవడానికి వస్తే, రాజధాని నిర్మాణ ప్రాంతంలోని విషయాలను అప్డేట్ చేయడానికి అనుకున్నాడు సి.ఎం. విశ్వేశ్వరనాయుడు. ‘‘మీరు మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే ఈ బాధ్యత అప్పగించాను శ్రీధర్గారూ’’ అన్నాడు నాయుడు. శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు. ఇబ్బందిగా కదిలాడు. ‘‘మనది మహా సంకల్పం ఆఫీసర్. భావితరాల కోసమే ఈ మహా నిర్మాణం’’ చెప్పాడు. ‘‘కాదనలేదు సర్. నేను మీరు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించలేని అశక్తుడ్ని’’ చెప్పాడు. నాయుడు ఒక నిమిషం సుదీర్ఘంగా శ్వాస పీల్చి ‘‘ఓ...కే. నౌ యు కెన్ గో’’ చెప్పాడు. బంగ్లాకొచ్చిన భర్త శ్రీధర్ని, ఆయన భార్య సుచిత్ర ‘‘ఏమైంది మీ రిజిగ్నేషన్’’ అడిగింది. ‘‘సి.ఎం.గారికి లెటర్ ఇచ్చాను. నాది కేంద్ర సర్వీస్ కాబట్టి ఆల్ రెడీ ఢిల్లీకి ఫ్యాక్స్ చేశా’’ చెప్పాడు. ‘‘ఏకంగా ఉద్యోగానికే రాజినామా చేశారు. ఇప్పుడు మనకు బతుకు తెరువు ఎలా?’’అడిగింది. ‘‘నువ్వు బీఈడీ చేశావుగా. టీచర్ ఉద్యోగానికి ట్రై చేద్దాం. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా పనిచేస్తా’’ చెప్పాడు. ‘‘పిల్లలిద్దరూ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మన సంపాదన ఎలా సరిపోతుంది?’’ నిలదీసింది సుచిత్ర. ‘‘నువ్వు వర్క్ చేయబోయే స్కూల్లో మన పిల్లల్ని వేద్దాం. బహుశా స్కూల్ ఫీజులో కన్సెషన్ రావచ్చు. కొంత సేవింగ్స్ వున్నాయ్గా. పిల్లలు ఎదిగే కొద్దీ అవి ఉపయోగపడతాయి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘అయినా సమస్యలకు భయపడి జాబ్ వదులుకోవడం ఏంటండీ’’ అంది నిర్వేదంగా. ఆర్గ్యుమెంట్ చేసే ఓపిక లేక నవ్వాడు. నెల వ్యవధిలో ఆరు వేల ఇంట్లో చేరారు శ్రీధర్ దంపతులు. ‘‘పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో. నిన్నటి వరకూ నౌకర్లూ, కార్లూ. ఇప్పుడు మోటార్ బైక్ స్థాయికి వచ్చారు’’ అంది సుచిత్ర నవ్వుతూ. ‘‘అవి ప్రభుత్వం నా పొజిషన్కి ఇచ్చిన ప్రివిలేజస్. ఇది మన కష్టార్జితం’’ చెప్పాడు. స్కూల్లో జాయిన్ అయింది సుచిత్ర. ముందు కాస్త గౌరవించేవాళ్లూ... తర్వాత కలిసిపొయ్యారు. ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ వంటా వగైరా పూర్తి చేసేశాడు. ‘‘మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు. నే వచ్చి చేసుకుంటా కదా’’ అంది బాధగా. ‘‘ఇప్పుడా మాట అంటున్నావ్ గానీ కొద్దికాలం అయ్యాక ఇంట్లో ఖాళీగా వున్నావు కదా. వంటా వార్పూ చెయ్యొచ్చు కదా అంటావ్. నీకెందుకు ఆ అవకాశం ఇవ్వాలని నేనే ‘నలభీముడ్ని’ అయ్యా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘చాల్లే జోకులు ఆపండి. నా భర్త, నా పిల్లలు నాకు భారమవుతారా’’ అంది కోపంగా. ‘‘సాయం చెయ్యడంలో తప్పేం వుంది డియర్’’ భార్య బుగ్గపై చిటికేశాడు. వారం క్రితం సుచిత్ర ‘స్కూటీ’ కొన్నది. దాంట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని పక్కవీధిలో వున్న తన కొలీగ్ వీరశంకర్ దగ్గరకు ట్యూషన్కి తీసుకెళ్లింది. ‘‘ఖాళీగా వున్నాను కదా సుచీ. పిల్లలకు ట్యూషన్ చెబుతాగా’’ అన్నాడు శ్రీధర్. భర్త ముఖంలో చూసి, ‘‘అసలే పిల్లలంటే మీకు ప్రేమ. గారంతో ఏం చెబుతారు. గట్టిగా కూడా కోప్పడరు’’ అంది నవ్వుతూ. ‘‘భర్తని అర్థం చేసుకొనే భార్య దొరకడం కంటే మరో అదృష్టం లేదు’’ అన్నాడు నవ్వుతూ. ‘‘ఎక్కడర్థమయ్యారు మీరు? రాజీనామా ఎందుకు చేశారో ఇప్పటికీ అర్థం కావట్లేదు గదా. బంగారం లాంటి జాబ్’’ అంది. ‘‘నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం నా లోపమే’’ అన్నాడు. ‘‘ఆర్టికల్స్ అన్నా రాయండి. చదువుకుంటా’’ అంది. ‘‘ఆ పనిమీదే వున్నా. కలం మొరాయిస్తుంది’’ చెప్పాడు. నమస్కారం పెట్టి, ‘‘మీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పండి’’ అంది నవ్వుతూ సుచిత్ర. శ్రీధర్ నవ్వి కంప్యూటర్లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ‘‘నేనూ సామాన్యుడనే లక్ష్మయ్యా. ఇంతకంటే ఏం చేయగలను’’ గొణుక్కున్నాడు శ్రీధర్. ‘‘ఎవరతను?’’ అడిగారు శ్రీధర్ అటెండర్ సత్తెయ్యను. రోజూ కారు ఎక్కేప్పుడూ దిగేప్పుడూ కన్పిస్తున్న అతడ్ని చూస్తూనే వున్నాడు. ‘‘మన ల్యాండ్ ఆక్విజేషన్లో భూమి కోల్పోయిన రైతు సర్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘మనం ఇప్పుడు చేసేది ఏం ఉంది? నష్టపరిహారం ఇచ్చాంగా’’ చెప్పాడు శ్రీధర్. ‘‘తన భూమి తనకి కావాలంట సార్’’ చెప్పాడు సత్తెయ్య. ‘‘అది మన చేతుల్లో ఏముంది? ప్రభుత్వ ఆదేశాలని అమలు చేయడం మన డ్యూటీ కదా’’ అని... క్యాంప్ క్లర్క్ని లైన్లోకి పిలిచి ‘‘ఆ రైతుని కన్విన్స్ చేసి పంపండి’’ చెప్పాడు. సి.సి.శర్మ... ‘‘అలాగే సర్’’ చెప్పాడు. రోజూ డ్యూటీకి వచ్చి కార్లోంచి దిగి అటువైపు చూడ్డం అలవాటైంది శ్రీధర్కి. అతడు కన్పించలేదు. ‘‘ఏం చెప్పి పంపారు’’ అడిగాడు. ‘‘ఏమో సార్. మన సి.సి.గారు చెప్పారు’’ చెప్పాడు సత్తెయ్య. మరో వారం గడిచింది. లక్ష్మయ్య కన్పించలేదు. సి.సి.ని పిలిచి ‘‘నన్ను కలవాలని ట్రై చేశాడే రైతు. అతడెక్కడున్నాడు?’’అడిగాడు శ్రీధర్. ‘‘అతడిది ఏ గ్రామమో తెలీదు సర్. కానీ కమిషనర్గారి చేతిలో ఏమీ లేదు. ఎన్నిసార్లు వచ్చినా ఫలితం లేదని చెప్పా. అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇక రావడం లేదు’’ చెప్పాడు. శ్రీధర్కి అసంతృప్తిగా ఉంది. ఒక్కసారైనా తను మాట్లాడి వుండాల్సింది. తప్పు చేశానా? అతడి అంతరాత్మ నిలదీసింది. రెండ్రోజుల తర్వాత సి.సి. ఒక రిజిష్టర్ కవర్ ఓపెన్ చేసి తెచ్చి, శ్రీధర్ ముందు పెట్టాడు. ‘‘ఏంటి?’’ అన్నట్టు నొసలు ముడివేసి చూశాడు శ్రీధర్. ‘‘లక్ష్మయ్య రాసుకున్న చివరి లేఖ సర్’’ అన్నాడు సి.సి.. టపాల్ ఓపెన్ చేసి కమిషనర్ ముందు పెట్టడం సి.సి.కి అలవాటు. వణికే చేతుల్తో లెటర్ అందుకున్నాడు శ్రీధర్. వచ్చీరాని తెలుగులో అక్షరాలు కూడబలుక్కొని రాసినట్టుంది ఆ ఉత్తరం. చదవడం పూర్తయ్యేలోపు శ్రీధర్ వళ్లంతా చమట్లు పట్టినట్లైంది. సి.సి.ని పిలిచి ‘‘లక్ష్మయ్య బతికి ఎక్కడైనా వుంటే తీసుకురండి. పోతే కనీసం అతడి డెడ్ బాడీనైనా ట్రేస్ చేయండి’’ చెప్పాడు. ‘‘ఎస్ సర్’’ చెప్పాడు క్యాంప్ క్లర్క్ శర్మ. పోలీసుల సహాయంతో జల్లెడ పట్టారు. ప్రకాశం జిల్లా గుడ్లకమ్మవాగులో లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ శవాలు బయటపడ్డాయి. ఎందుకు చనిపోయారన్న కారణాలు తెలీక వ్యక్తిగత కారణాలతో చనిపోయినట్టు రాసుకొని కేసు క్లోజ్ చేశారు పోలీసులు. ఆ రోజు నుండి వరుసగా పది రోజులు శ్రీధర్కి నిద్రపట్టలేదు. అన్యమనస్కంగానే విధులకు హాజరవుతున్నాడు. ఆ రోజ తెల్లవారుజామున వచ్చిన కలతో దిగ్గున లేచాడు. లక్ష్మయ్య వీధిగుమ్మాన నిలిచి వున్నాడు. ‘‘నాకు చనిపోయేంత ధైర్యం వుంది సామీ. అందుకే నా భార్యని కలుపుకొని పోయాను. చావుకూ బతుక్కీ మధ్య తేడా తెలీక అక్కడ చాలామంది ఊగిసలాడుతున్నారు. వెళ్లండి వాళ్లనైనా కాపాడండి’’ లక్ష్మయ్య అదృశ్యమయ్యాడు. చెమట్లు పడుతూ లేచాడు. అతడి భార్య దిగ్గున లేచి కూర్చొని, ‘‘ఏమైందండీ’’ అని అడిగింది. ‘‘ఏం లేదు... ఏం లేదు’’ అని ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొని నీళ్లు తాగాడు. ఆఫీస్కి వెళ్లాడు. క్యాంప్ క్లర్క్ శర్మ ముఖంలో కూడా దిగులు కన్పిస్తూ వుంది. ‘‘మనం... ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు సర్. అంతా అయోమయంగా వుంది. మూడు పంటలు పండే పొలాల్ని తీసుకున్నాం. కౌలు రైతుల్ని అనాథల్ని చేశాం. ఒక్కొక్కర్లో ఒక్కో లక్ష్మయ్య కన్పిస్తున్నాడు సర్’’ అన్నాడు. ‘‘మనం... ప్రభుత్వ ఉద్యోగులం శర్మా. ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేయడం మన విధి’’ చెప్పాడు. ‘‘మనది తలారి పోస్ట్లా వుంది సర్’’ అన్నాడు శర్మ. ‘‘మరణశిక్ష పడ్డ ఖైదీకి ఉరి తలారి ఉరి తీస్తున్నట్టు... వుంది సర్ మన నిర్వాకం’’ అన్నాననుకున్నాడు శర్మ. గొంతు పెగల్లేదు. కానీ శ్రీధర్కి అర్థమైంది. రైతుకి పడింది మరణశిక్షేనా? ఏ నేరం చేయకుండా? ఇంటికి వచ్చాడు. తన సేవింగ్స్ చూసుకున్నాడు. ఆ తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రాజధాని నిర్మాణ ప్రాంతంలోని భూమి కోల్పోయిన వారి పక్షాన వెళ్లాడు శ్రీధర్. గత నెల నుండి ఉద్యమం ముమ్మరంగా సాగుతుంది. జన జీవనం స్తంభించిపోయింది. ఆర్.డి.ఎ. మాజీ కమిషనర్ ఉద్యమానికి నాయకత్వం వహించడం ‘మీడియా’లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించడమే కాక ఉద్యమంలో సింహ భాగం నిలిచాయి... ‘‘శ్రీధర్ నువ్వు బాధ్యతగల ఉద్యోగిగా చేశావ్. ప్రజల్ని పక్కదారి పట్టిస్తే ఎలా?’’ ప్రశ్నించాడు సి.ఎం. ‘‘వాళ్లు సరైన రీతిలోనే ఆలోచిస్తున్నారు సర్. వాళ్ల భ్రమలన్నీ తొలగిపోయాయి’’ చెప్పాడు శ్రీధర్. ‘‘నువ్వు ప్రతిపక్షం నేతలతో కుమ్మక్కై ఉద్యమం నడిపిస్తున్నావ్’’ సి.ఎం. పక్కనే వున్న మున్సిపల్ మంత్రి రాజధాని ప్రాధికార నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్న మంత్రి ఉమామహేశ్వరరావు అన్నాడు. ‘‘బహుశా ప్రతిపక్ష నేత తన ప్రభుత్వం వస్తే ఏ ఎం.ఎల్.సి.నో, రాజ్యసభ సభ్యత్వమో ఇస్తానని హామీ ఇచ్చాడా?’’ మరో మంత్రి చక్రపాణి అన్నాడు వ్యంగ్యంగా. ‘‘మీరు చర్చలకు పిల్చారా? నన్ను అవమానించడానికి పిల్చారా?’’ అడిగాడు శ్రీధర్. మిగతా మంత్రుల్ని సంభాళించి... ‘‘సారీ శ్రీధర్. నీమీద మాకెలాంటి కోపం లేదు. ప్రజాస్వామ్యంలో పోరాటం ప్రజల హక్కు. దాన్ని కాదనే హక్కు కూడా మాకు లేదు. కానీ అన్ని తెలిసిన వ్యక్తిగా నువ్విలా రైతుల్ని రెచ్చగొట్టడం బాధాకరం’’ చెప్పాడు విశ్వేశ్వరనాయుడు. ‘‘సర్. రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో వేలాదిగా నిరుపయోగకరంగా వుండే భూములున్నాయ్ సర్. అభివృద్ధి అంటే అన్నీ ఒక దగ్గరే వుండడం కాదు సర్. వికేంద్రీకరించడం. మీరు గీసింది చందమామ... బాలమిత్ర లాంటి కథల్లోని ‘కథ’ లాంటి ఊహాచిత్రం సార్. మీరు అందులో తేలిపోయే ప్రజల్ని కూడా అదే భ్రమలో బతకమంటున్నారు. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు. ఎందుకు సార్... వీరి బతుకుల్తో ఆడుకుంటారు. మీరొక పిచ్చివాళ్ల స్వర్గంలో విహరిస్తున్నారు. సి.ఎం.గారూ రోడ్డు విస్తరణకు భూమి అవసరమైతే అక్వెర్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్మాణానికి భూమి అవసరమైతే తీసుకోవచ్చు. కానీ ఇలా రాజధాని నిర్మాణానికి వేల ఎకరాలు తీసుకోవడమేంటి? ఒకే దగ్గర ఆకాశ హార్మ్యాలు నిర్మించాల్సిన అవసరం ఏంటి? అభివృద్ధి అనేది కేంద్రీకరణ కాకూడదు. అది అన్నివైపులా ‘అక్టోపస్’లా విస్తరించాలి. మన రాష్ట్రం చాలా సుందరమైంది. ప్రతి జిల్లాకి ఒక అస్థిత్వం ఉంది. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయండి. ప్రతి ప్రాంతాన్ని సుసంపన్నం చేయండి. భగవంతుడు మీకిచ్చిన అధికార హోదాని దుర్వినియోగం చేయకండి. ప్రపంచంలో ప్రజలను ఖాళీ చేయించి రాజధాని నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున చేసిన చరిత్ర ఎవరికీ లేదు. ఇలా చేసిన ఘన చరిత్ర... హీన చరిత్ర కూడా మీకే దక్కుతుంది’’ అన్నాడు శ్రీధర్. సి.ఎం. ముఖంలో కోపం ప్రజ్వరిల్లుతుంది. ‘‘షటప్... మేన్... నీలాగా ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా అభివృద్ధి ఉండదు. వారికి అభివృద్ధి చేసిన భూములిస్తున్నాం’’ అన్నాడు. ‘‘మీ లెక్కలే కరెక్టు అనుకుందాం. మీరిచ్చే కమర్షియల్ ప్లేస్ ఎప్పటికి ఉపయోగపడుతుంది. కనీసం చెప్పగలరా?’’ అడిగాడు శ్రీధర్. సి.ఎం.తో సహా ఎవరి ముఖాల్లోనూ వెలుగు లేదు. ‘‘భూములు కోల్పోయిన సన్న చిన్నకారు రైతులు అప్పటివరకూ ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎలా బతగ్గలుగుతారు? మీకు ముఖ్యమంత్రి పదవీ రాజకీయం తప్ప మరో పని చేయడం ఎలా తెలీదో... రైతుకు వ్యవసాయం తప్ప మరో పని చేయడం రాదు. రాజధాని ప్రాంతం సింగపూరో మలేషియాగానో మారితే అప్పటివరకూ వీరిలో బతికేది ఎవరూ పోయేది ఎవరూ?’’ అన్నాడు. ‘‘రాజకీయ ఉపన్యాసం అవసరం లేదు. మీ డిమాండ్స్ ఏమిటి?’’ అడిగాడు మంత్రి ఉమామహేశ్వరరావు. శ్రీధర్లో ధర్మావేశం పెల్లుబికింది. ‘‘మీ భూదాహానికి బలైన లక్ష్మయ్య, అతడి భార్య రాములమ్మ ప్రాణాలు తిరిగి తీసుకురండి’’ అని తన జేబులోంచి ఒక లేఖ తీసి ముఖ్యమంత్రి, మంత్రులకిచ్చి వెనుదిరిగాడు శ్రీధర్. అతడ్ని అనుసరించారు మిగతా నాయకులు. వస్తూ వుంటే లక్ష్మయ్య రాసుకున్న ఆఖరి లేఖ శ్రీధర్ కళ్లముందు కదలాడింది. ‘‘సామీ... ప్రాణం విలువైందో కాదో నాకు తెలియదు. పాతికేళ్లు నాతో బతికిన నా ఇంటి ఆడదానికి పెద్ద జబ్బు వచ్చిందట. దాని పేరు కేన్సరని డాక్టర్లు చెబితే తెలిసింది. జబ్బు ఖరీదైందే కానీ మేము ఖరీదైనవాళ్లం కాదు. వున్న ఐదు ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది. కూసింత నష్ట పరిహారం ఇచ్చారు. అదేదో ‘కీమో థెరపీ’కే ఆ డబ్బు సరిపోదన్నారు. అయ్యా, భవిష్యత్లో నేను షాపులు పెట్టుకోవడానికి కూసింత స్థలమిస్తారు. అది కోట్ల విలువ చేస్తుందిట. అదేమీ నాకు వద్దు సామీ. మా ఇంటి ఆడదాన్ని బతికించుకుంటా. నా భూమి నాకిప్పించండి’’ ఇంతవరకే ఈ ఉత్తరం రాద్దామనుకున్నాను. మా ఆడది ఒక మాటంది. ‘‘శుభమా... అని రాజధాని కడుతుంటే... నీ ఏడుపుగొట్టు యవ్వారం ఏంటయ్యా’’ అని గదమాయించింది. బతికినంతకాలం బతకాం. బతికి సాధించేదేముంది? మన బిడ్డల భవిష్యత్ కోసం భూమి దానం చేశావనుకో’’ అంది. ‘‘నిజమే. రాజధాని విలువేంటో ఐదో క్లాసు వరకూ చదివిన నాకు తెలియకపోవచ్చు. బిడ్డల్లేని మాకు రాష్ట్రంలోని ప్రజలే... మా బిడ్డలు అనుకుంటాం. అందుకే ఊరుదాటి వెళ్లిపోతున్నాం. బతుకు మీద ఇక ఆశల్లేవు కాబట్టి, చావుకి కూడా సిద్ధమే. ఎలాగూ... నా ఇంటి ఆడది పోయాక ఇక నేను బతికి వుండి చేసేది ఏం... ఉంది సామీ. భూమి పోయాక నేను చేయడానికి ఏముంది? ఇక కనిపించను కమిషనర్ సామీ. మిమ్మల్ని విసిగించను. చిన్నప్పుడు తప్పిపోయిన నా కొడుకులా వున్నావ్. అచ్చు పోలికలు కూడా. అలాగే వున్నాయ్. వీలైతే... దగ్గర నుండి నిన్ను చూసుకుందాం అనుకున్నా ఒక పాలి. ఆ సెక్యూరిటీవాళ్లు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు సామీ. సర్లే. వుంటా. ఇక కనిపించను. లక్ష్మయ్య రాజధాని రైతు శ్రీధర్ కళ్లు మరోసారి చెమర్చాయి. శ్రీధర్ నవ్వి కంప్యూటర్లోకి తలదూర్చాడు. అతడి కళ్లముందు లక్ష్మయ్య ముఖమే కన్పిస్తూ వుంది. ‘‘మీరు రాజినామా చేస్తే మాకేంటి సార్ ఉపయోగం’’ అతడి ఆత్మ. శ్రీధర్ ఆత్మని నిలదీస్తున్నట్టే వుంది. ఒకవేళ మీ ‘ఊహ’ నిజమయ్యే నాటికి అక్కడ మనుషులెవరూ వుండరు సర్. కంకాళాలే వుంటాయ్. నవ్వాలో ఏడ్వాలో తెలియని విచిత్ర మానసిక స్థితిలో రాజధాని నిర్మాణ ప్రాంతంలోని ప్రజలున్నారు. -
గ్యాంగ్స్టర్ నయూమ్ గురించి.....
నయీమ్ అనుచరుడి ఇంటరాగేషన్! రియూజ్ను ప్రశ్నించిన డీఎస్పీ? మునుగోడు: గ్యాంగ్స్టర్ నయూమ్ ముఖ్య అనుచరుడు, బెస్ట్ షూటర్గా పేరున్న రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళవారం రాత్రి మునుగోడు పోలీస్ స్టేషన్లో ఇంటరాగేషన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో రియాజ్ను అదుపులోకి తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నల్లగొండ డీఎస్పీకి అప్పగించినట్లు తెలిసింది. మూడు వాహనాల్లో పోలీసులను వెంటబెట్టుకుని డీఎస్పీ రాత్రి 1 గంట సమయంలో రియాజ్ను మునుగోడు పీఎస్కు తరలించి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఆ సమయంలో స్థానిక పోలీసులను కూడా దగ్గరికి రానివ్వలేదని సమాచారం. 3 గంటల 30 నిమిషాలకు డీఎస్పీ నల్లగొండకు వెళ్లగా ఉదయం 7 గంటల సమయంలో రియాజ్ను మరో చోటుకు తరలించినట్లు తెలియవచ్చింది. నయీమ్ ఇంటి నుంచి వాహనాలు స్వాధీనం షాద్నగర్: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లోని మిలీనియం కాలనీలో నయీమ్ నివసించిన ఇంటి నుంచి పోలీసులు బుధవారం రెండు కార్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్న ఈ వాహనాలు ఎవరివి, ఎవరి పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నయీమ్కు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, ఇతరత్రా అంశాలను పోలీసులు బయటకు పొక్కనివ్వడం లేదు. శ్రీధర్ ఆచూకీ సంగతేమిటి? పూర్తి వివరాలు సమర్పించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందిన గ్యాంగ్స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడుగా భావిస్తున్న నీలా శ్రీధర్గౌడ్ ఆచూకీ కోసం అతని భార్య దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. శ్రీధర్గౌడ్ అదృశ్యంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్కుమార్, జస్టిస్ సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత పోలీసులు తన భర్తను పట్టుకెళ్లారని, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియడం లేదని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీధర్ భార్య శ్రీలత హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం జస్టిస్ సంజయ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా శ్రీలత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్, ఆమె భర్త ఈ నెల 8న హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో శ్రీధర్గౌడ్కు ప్రాణహాని ఉందన్నారు. నయీమ్ అనుచరులు వేధించారు ఆదిబట్ల గ్రామవాసి ఇబ్రహీంపట్నం రూరల్: ‘‘గ్యాంగ్స్టర్ నయీమ్ అనుచరులు మా భూమి కబ్జా చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ వారు దాడులు, దౌర్జన్యాలు చేసినా జంకలేదు’’ అని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల గ్రామానికి చెందిన బురుగుల వెంకట్రెడ్డి పేర్కొన్నాడు. వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2013లో ఆదిబట్ల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 289లో 8 ఎకరాల భూమిని హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేశారు. కాగితాలు ఉన్నా దానికి సరిపోయేంత భూమి అక్కడ లేకపోవడంతో పక్కనే 490, 410 సర్వే నంబర్లోని మా భూమిని కబ్జా చేశారని వెంకట్రెడ్డి చెప్పాడు. సర్వే నంబర్ 289లోని భూమిని యజమానులు నయీమ్ అనుచరుడు శ్రీహరికి అమ్మారని, అతను చాలాసార్లు తమ కుటుంబ సభ్యులను బెదిరించాడని వెంకట్రెడ్డి తెలిపాడు. ప్రత్యక్ష దాడులకు కూడా దిగాడని, తమ భూమిలో ఉన్న దొండ తోటను కూడా ధ్వంసం చేశాడని చెప్పారు. శ్రీహరి భార్య మాధవి కూడా తమ ఇంటికి వచ్చి మహిళలపై దాడికి దిగిందన్నాడు. ఈ వ్యవహారంపై గతంలో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు వారి వైపే మొగ్గు చూపారని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ స్థల వివాదం భూపరిపాలన శాఖలో పెండింగ్లో ఉందన్నాడు. నయీమ్తో సంబంధాలపై విచారణ జరపండి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హైదరాబాద్: పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు నయీమ్ ముఠాతో ఉన్న సంబంధాలపై సమగ్ర విచారణ జరిపి నేరస్తులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వాలు, పోలీసుల అండదండలతో అరాచకాలు, హత్యలు చేస్తూ వేల ఎకరాల భూములు, కేజీల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదును నయీమ్ కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. నయీమ్ను అడ్డం పెట్టుకుని చాలా మంది రాజకీయ నాయకులు, అధికారులు కోట్లు సంపాదించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మావోయిస్ట్ పార్టీ నుంచి బహిష్కృతుడైన నయీమ్ను పోలీసులు చేరదీసి ఆ ముఠా ద్వారా ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలను హత్య చేయించారని ఆరోపించారు. చివరకు వారికే సవాల్గా మారడంతో నయీమ్ను మట్టుపెట్టారని వెల్లడించారు. నేరస్తులను మొగ్గలోనే తుంచివేసే పద్ధతిలో కఠినంగా వ్యవహరించడం ద్వారా ప్రజలకు భరోసానివ్వాలని ఆయన సూచించారు. -
వచ్చే నెలాఖరుకు రైతుల చేతికి ప్లాట్లు
సాక్షి, అమరావతి : రాజధాని గ్రామాల్లోని రైతులందరికీ సెప్టెంబర్ నెలాఖరుకల్లా వారి వాటా ప్లాట్లు పంపిణీ చేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. ఆ సమయానికి ప్లాట్ల కేటాయింపుతోపాటు వారికి భూసమీకరణ యాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. దీనివల్ల ప్లాట్లను అమ్ముకునే హక్కు రైతులకు ఉంటుందని వివరించారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటికే తుళ్లూరు మండలం నేలపాడు రైతులకు ప్లాట్లు కేటాయించామని, త్వరలో వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ గ్రామంతోపాటు మరో ఏడు గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు ముసాయిదా నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నాలుగు గ్రామాలు, 20వ తేదీన మరో నాలుగు గ్రామాలు, 26వ తేదీన ఎనిమిది గ్రామాలకు ముసాయిదా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయా గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెలరోజుల సమయం ఇస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను బట్టి తుది ప్లాట్ల కేటాయింపు చేపడతామన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా విడతల వారీగా 29 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపుతోపాటు భూయాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యాజమాన్య హక్కు పత్రాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ఎనిమిది భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్లను ఇకపై ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి బ్యాంకు అకౌంట్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. జూన్, జూలై పెన్షన్ మొత్తాలు ఒకేసారి వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. -
పోస్టర్ రహిత నగరంగా తీర్చిదిద్దుదాం
భవానీపురం : విజయవాడను వాల్పోస్టర్స్ రహిత నగరంగా తీర్చిదిద్దుదామని నగర మేయర్ కోనేరు శ్రీధర్ పిలుపునిచ్చారు. నలంద కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆయన గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లోబ్రిడ్జి వరకు ఇరువైపులా గోడలకు ఉన్న పోస్టర్లను తొలగించి పెయింటింగ్స్ వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా నగరానికి వచ్చే యాత్రీకులకు కనువిందుగా, అహ్లాదభరితంగా ఉండే చిత్రాలను గీయాలని సూచించారు. పెయింటింగ్ వేస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. -
మడ్తపల్లిలో విషాదం
ఇంకా తెలియని గల్లంతైన శ్రీధర్ ఆచూకీ మూడు రోజులుగా గాలింపు రేగొండ : మేడారం సమీపంలోని జంపన్నవాగులో మూడు రోజుల క్రితం గల్లంతైన శ్రీధర్ ఆచూకీ తెలియకపోవడంతో అతడి స్వగ్రామం రేగొండ మండలం అడ్తిపల్లిలో విషాదం అలుముకుంది. వరంగల్లో వడ్రంగి పనిచేస్తున్న శ్రీధర్ అలియాస్ శ్రీనివాస్ (36) శనివారం తోటి కార్మికులతో కలిసి మేడారం వెళ్లి, వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం మూడు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు మేడారం వెళ్లి వెదుకుతున్నారు. ఇంతవరకూ కనిపించకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా శ్రీధర్
శంషాబాద్ రూరల్: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడుగా మండలంలోని తొండుపల్లికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బైతి శ్రీధర్యాదవ్ నియమితులయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఈమేరకు ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా, శంషాబాద్ బాగ్ కన్వీనర్గా, జిల్లా కో-కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా పని చేసిన శ్రీధర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడుగా నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో శ్రీధర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పారు. జిల్లాలో 2019 సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. -
కార్ల చోరీ ఇతివృత్తంగా బొంగు
కార్ల దొంగల ఇతివృత్తంగా రూపొందిస్తున్న చిత్రం బొంగు అని ఆ చిత్ర దర్శకుడు తాజ్ తెలిపారు. ఈయన ప్రముఖ కళాదర్శకుడు సాబు శిరిల్ వద్ద పలు చిత్రాలకు సహయ కళాదర్శకుడిగా పనిచేసి ఈ చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టారు. ఆర్టీ.ఇన్ఫినిటీ డీల్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై రఘుకుమార్ అనబడే తిరు, రాజరత్నం, శ్రీధర్ ముగ్గురు కలిసి నిర్మిస్తున్న చిత్రం బొంగు. చతురంగం తదితర విజయవంతమైన చిత్రాల ఫేమ్ నటరాజ్(నట్టి) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. 2014లో మిస్ ఇండియా పట్టం గెలుచుకున్న రూహీసింగ్ నాయకిగా ఈ చిత్రం ద్వారా కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు.ఈ బ్యూటీ ఇప్పటికే హిందీతో పాటు ఇతర భాషల్లో నటిస్తున్నారన్నది గమనార్హం. మాధూర్ బండార్కర్ దర్శకత్వం వహించిన క్యాలెండర్ గర్ల్స్ చిత్రంలో నటించి ప్రాచుర్యం పొందిందీ భామ. బొంగు చిత్రంలో ఇతర పాత్రల్లో అతుల్కులకర్ణి, ముండాసుపట్టి రాందాస్,అర్జున్, పావలా లక్ష్మణన్, మయిల్సామి,శ్యామ్ నటిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక రాయపేటలోని ఓల్డ్ ఉడ్ల్యాండ్ హోటల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ నలుగురు కార్ల దొంగల ఇతివృత్తం తెరకెక్కిస్తున్న చిత్రం బొంగు అని అన్నారు. అయితే వారు ఎందుకు దొంగలుగా మారారు. ఆ తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారన్న సంఘటనలో కథ, కథనం జెట్ స్పీడ్లో నడుస్తుందన్నారు. ఇందులో ఒక రేస్ కారు ముఖ్య పాత్రగా ఉంటుందన్నారు. అందుకు ఖరీదైన రేస్ కారును ఉపయోగించామని చెప్పారు. ఆ కారు షోరూమ్ కోసం దేశం అంతా శోధించామనీ చివరికి అహ్మదాబాద్లో కనిపించిందని, అక్కడ అనుమతి తీసుకుని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్ర షూటింగ్ను చెన్నై,అహ్మదాబాద్, మధురై ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి శ్రీకాంత్దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు!
సహాయక పదవులకు బంగర్, అరుణ్, శ్రీధర్ కూడా... న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ పదవికి మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది పదవులకు సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్లు మళ్లీ దరఖాస్తు చేసుకోనున్నారు. మరో రెండు రోజుల్లో బోర్డు కోచ్ పదవులకు ప్రకటన జారీ చేయనున్న నేపథ్యంలో ఆ నలుగురు దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘శాస్త్రి, అరుణ్, బంగర్, శ్రీధర్లు తమ గత పోస్ట్లకు మళ్లీ దరఖాస్తులు పంపుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడి నుంచి వీళ్లకు సానుకూల సంకేతాలు అందాయి. అయితే ప్రతి అభ్యర్థి ప్రత్యేకమైన ఫార్మాట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ నలుగురు బోర్డు జారీ చేసే ప్రకటన కోసం వేచి చూస్తున్నారు’ అని సదరు అధికారి పేర్కొన్నారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన అనురాగ్ ఠాకూర్ను ఇటీవలే ఢిల్లీలో సహాయక సిబ్బంది కలిసి ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా కోచ్ ఎంపికకు లెవల్-3 డిగ్రీతో పాటు సీనియర్ జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే ఎంపికయ్యే అభ్యర్థి తమ దేశం తరఫున కనీసం 50 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి ఉండాలి. అనవసరమైన దరఖాస్తులు రాకుండా ఈ రెండు నిబంధనలను విధించారని బోర్డు వర్గాలు వెల్లడించాయి. -
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్నగర్ కాలనీలో నివాసముంటున్న శ్రీధర్(29) అనే యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మంత్రిగారిని ఎక్కడ కలవాలి?
విశ్లేషణ కేంద్ర మంత్రిగారిని కలవాలని ఉంది. ఎక్కడ ఏవిధంగా కలవవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ లేకుండానే కలవవచ్చా? సామాన్యులను కలిసే వేళలను ఏవైనా నిర్ధారించారా? అపాయింట్మెంట్ తీసుకోవడానికి మార్గ మేమిటి? ఎవరిని సంప్రదించాలి? అని హేమంత్ ధాగే మన న్యాయశాఖ మంత్రిని సమాచార హక్కు దరఖాస్తు ద్వారా అడిగాడు. అటువంటి సమా చారమేమీ లేదు. ఎప్పటికప్పుడు ఎవరయినా కలవాలని అనుకుంటే మంత్రి గారి లభ్యతను బట్టి అపాయింట్మెంట్ ఇస్తారు అని కేంద్ర న్యాయ వ్యవహారాల విభాగం ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది అరకొర సమాచారం. నిజానికి చెప్పిందేమీ లేదు. అసలు మంత్రిని కలిసే హక్కు పౌరుడికి లేదా? ఉంటే ఏ విధంగా కలిసే అవకాశాలు ఉంటాయో తెలియజెప్పే బాధ్యత మంత్రిగారికి లేదా వారి కార్యాలయానికి లేదా? మంత్రిగారి ప్రయివేటు కార్యదర్శిని అడిగిన సమా చారాన్ని మంత్రిత్వ శాఖ ఏవిధంగా ఇస్తుంది? ఇరుపక్షాల వారు రెండో అప్పీలు విచారణ రోజు రాలేదు. అయినా దరఖాస్తు లోతుగా పరిశీలించి చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలో కూడదో తేల్చవలసిన బాధ్యత కమిషన్ పైన ఉంది. చట్టం కింద పబ్లిక్ అథారిటీ మంత్రిని గుర్తించవచ్చా? ఒకవేళ అథారిటీ అయితే మంత్రి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత ఉందా? మంత్రి అనే అధికార పీఠం రాజ్యాంగం సృష్టించింది. ఆర్టికల్ 74 ప్రకారం రాష్ర్టపతికి సలహా ఇవ్వడానికి ఒక మంత్రి వర్గం ఉండాలి. ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిని రాష్ర్టపతి నియమిస్తారు. రాష్ర్టపతి ఇష్టపడినంతకాలమే మంత్రి పదవిలో కొనసాగుతాడు. పార్లమెంటు ఆమోదించిన చట్టం 1954 ప్రకారం ఎంపీకి జీతాలు ఇస్తారు. మంత్రికి కూడా. రాష్ట్రాలకు సంబంధించి 163, 164 ఆర్టికల్స్ రాష్ర్ట మంత్రులకు ఈ విధమైన నియమావళినే రూపొందించాయి. ఈ నియమాలన్నీ సెక్షన్ 2(హెచ్) పబ్లిక్ అథారిటీ నిర్వచనానికి అనుగుణంగా ఉన్నాయి. ఆర్టికల్ 75(3) ప్రకారం మంత్రివర్గానికి సమిష్టి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్ణయాలకు పరిమితమవుతుంది. కాని ఒక్కో మంత్రి తనకు ఇచ్చిన శాఖలకు అధిపతిగా ఉంటారు. ఆ శాఖలో నిర్ణయాలకు మంత్రే బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ విధులను అధికారాలను ప్రభుత్వ నిధులను నిర్ణయించేది మంత్రి. కనుక కేంద్ర రాష్ర్ట మంత్రివర్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క పబ్లిక్ అథారిటీ అవుతారు. మంత్రిగారికి సరైన సిబ్బంది సౌకర్యాలు లేవు కనుక పబ్లిక్ అథారిటీగా సహ చట్టం కింద సమాధానాలు ఇవ్వాలనడం సమంజసం కాదనే వాదన చెల్లదు. మంత్రులకు సహాయక సిబ్బంది, వ్యక్తిగత సహాయకులుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వమే ఇస్తుంది. ప్రభుత్వమే కార్యాలయాన్ని అధికారిక నివాసాన్ని కల్పిస్తుంది. ఒకే వ్యక్తిగా ఉన్నప్పటికీ అటార్నీ జనరల్ ప్రభుత్వ అథారిటీ అయినప్పుడు, మంత్రి కూడా అథారిటీ అయి తీర వలసి ఉంటుంది. మంత్రులంతా పబ్లిక్ అథారిటీలేనని 2015 సెప్టెంబర్ 25న మహారాష్ర్ట సమాచార కమిషన్ నిర్దేశించింది. వేలకోట్ల రూపాయల ప్రజానిధిని ఖర్చుచేసే నిర్ణయాలు తీసుకునే అధికారమున్న మంత్రి పబ్లిక్ అథారిటీ అవుతారు. రెండో ప్రశ్న.. మంత్రిని కలుసుకునే హక్కు పౌరులకు ఉందా? రామరాజ్యంలో తన ఇంటిముందు గంట మోగించిన వారెవరయినా రాముడు బయటకు వచ్చి వారి బాధలను విని న్యాయం చేసే వారని, మొఘల్ చక్రవర్తులు, రాజపుత్ర రాజులు దర్బారులో జనాన్ని కలుసుకునే వారని కథలు విన్నాం. కొందరు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు కూడా జనాన్ని రోజూ ఉదయం కలిసే వారు. ఇప్పటికీ కొందరు కలుస్తూనే ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు ఎన్నికైన ఎన్ యతిరాజారావు మంత్రి పదవిలో ఉన్నా, మామూలు ఎమ్మెల్యేగా ఉన్నా జనం ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు ఉత్తరాలు ఒక సూట్ కేసునిండా వెంట పెట్టుకుని అధికారులను కలుస్తూ, ఆ తరువాత సమస్య చెప్పుకున్న వ్యక్తిని పిలిచి ఆయన పని ఎంతవరకు పూర్తయిందో చెప్పేవారు. వెంట ఎప్పుడూ రెండు సూట్ కేసులు ఉండేవి. అందుకే ఆయన ఏడు సార్లు గెలిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనే పేరులోనే అతను/ఆమె ప్రజలకు ప్రతినిధిగా ఉండాలని స్పష్టం. మంత్రితో సమావేశ సమయం దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య. దానికి తెలిసిన వాడు ఉండాలి. లేకపోతే బ్రోకర్లు తయారవుతారు. బోలెడంత డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఇదంతా భ్రష్టాచారం. ఇందులో మంత్రికి పాలు ఉండవచ్చు లేకపోవచ్చు. కాని ఆయన్ను కలుసుకోవడానికి పౌరుడు లంచాలు ఇవ్వకుండా సులువైన విధానాలను కల్పించడం, ముందే సమయాలను ప్రకటించడం మంత్రుల బాధ్యత. సహ చట్టం వచ్చిందే ఇటువంటి అవినీతిని నిరోధించడానికి. సామాన్యునితో సమావేశమయ్యే వేళలను మంత్రి కార్యాలయమే ప్రకటించాలి. మంత్రిత్వ శాఖ ఆ పని చేయలేదు. నెలలో ఏ రోజు ఎక్కడ జనాన్ని కలుస్తారో చెప్పాలి. లేదా ఫలానా నెలలో కలవడం లేదు అని ప్రకటించాలి. సహ చట్టం సెక్షన్ 4(1)(బి కింద ఇది ముందే తమంత తామే తెలియజేయవలసిన సౌకర్య సంబంధిత సమాచారం. కనుక కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మంత్రి ఈ బాధ్యతను నెరవేర్చి ప్రజల సమాచార హక్కును కాపాడడానికి రెండు నెలల్లో పిఐఓను నియమించాలని కమిషన్... కేబినెట్ సెక్రటరీని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ( హేమంత్ ధాగే వర్సెస్ న్యాయవ్యవహారాల శాఖ కేసులో మార్చి 12న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార శాఖ కమిషనర్) -
సింగరేణిలో విద్యుదుత్పత్తి ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ఉన్న సింగరేణి యూనిట్ -1 బాయిలర్ లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. -
సహజీవనంపై స.హ.అస్త్రమా?
విశ్లేషణ ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇలాంటి అంశాలపై అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు. గోప్యతను రక్షించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపైన ఉంది. ఆర్టీఐ చట్టం ఇచ్చిన సమాచార హక్కు అస్త్రంతో వ్యక్తిగత జీవితాల గోప్యతపైన దాడులు పెరుగుతున్నాయి. బంధువులు, భార్యాభర్తలు, సోదరులు, భార్యాభర్తలు, సోదరులు, ఒకరిపైన ఒకరు కత్తులు దూస్తూ ఆర్టీఐని అందుకు వాడుకుంటున్నారు. అది కచ్చితంగా దుర్వినియోగం, దుర్మార్గం. సుపరిపాలన కోసం ప్రజా శ్రేయస్సు కోసం, హక్కుల రక్షణ కోసం అన్యాయాలను వెలికి తీయడం కోసం అవినీతిని ప్రశ్నించడం కోసం ఆర్టీఐని వినియోగించాలి. పగలు ప్రతీకారాలతో, వ్యక్తిగత ద్వేషాలతో, బంధుత్వపు ఈర్ష్యలతో, పై అధికారుల మీద కోపంతో, పక్కవాడిని వేధించాలన్న దురు ద్దేశంతో ఆర్టీఐనీ వినియోగించడం ఏమాత్రం న్యాయం కాదు. పదే పదే ఒక సమాచారం గురించి, ఒకరి గురించే అనేక ప్రశ్నలు వేయటం చాలా తప్పు. ఇటువంటి దుర్వినియోగాల వల్ల అసలు అవసరాల కోసం, లక్ష్యాల కోసం ఆర్టీఐని వాడే అవకాశాలు తగ్గుతాయి. అందువల్ల సుపరిపాలనా సాధన ప్రయత్నాలకు హాని కలుగుతుంది. ఒక ప్రొఫెసర్ వివాహితుడై ఉండి, ఇద్దరు పుత్రులను కలిగి ఉండి కూడా మరొక మహిళా ప్రొఫెసర్తో సహజీవనం చేస్తున్నాడని ఆయన భార్య సవతి సోదరుడు విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశారు. దానిపైన ఏ చర్య తీసుకున్నారో తెలియచేయాలని ఆర్టీఐ కింద యూనివర్సిటీ పీఐఓకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ ఫిర్యాదుపై ఒక ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు. వారు విచారణ జరిపి ఇది ఆ ఇద్దరు ప్రొఫెసర్ల వ్యక్తిగత వ్యవహారమని, దరఖాస్తుదారుడు కావాలంటే కోర్టులో కేసు వేసుకోవచ్చని నివేదిక ఇచ్చారు. సంబంధిత ప్రొఫెసర్ల అభిప్రాయాన్ని అడిగితే.. దీనిపైన తాము వ్యాఖ్యానించేదేమీ లేదని, తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వరాదని విడివిడిగా రాసిన లేఖల్లో ఇద్దరు అధ్యాపకులు కోరారు. విశ్వవిద్యాలయం విచారణా నివేదికను ఆర్టీఐ అభ్యర్థన చేసిన సోద రుడికి ఇచ్చింది. అధ్యాపకులు రాసిన లేఖల ప్రతులు కూడా ఇవ్వాలని కోరుతూ సమాచార కమిషన్లో అప్పీలు చేశారు. తనకు, ప్రొఫెసర్కు మధ్య ప్రస్తుతం వివాహ బంధం ఏదీ లేదని, తాను చాలా సంవత్సరాల కిందటే విదేశాలకు వెళ్లిపోయి అక్కడ స్థిరపడ్డానని, తన సోదరుడికి ఈ విషయంతో ఏ సంబంధమూ లేదని తన సవతి సోదరుడు అడిగిన సమాచారాన్ని ఏదీ ఇవ్వరాదని సోదరి విశ్వవిద్యాల యానికి వినతి చేశారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ అధి కారులు విచారణ నివేదిక ఇచ్చారు. అది ఇవ్వాల్సిన అవ సరం లేదు. తన సోదరి తరపున ఆమె శ్రేయస్సు కోసం సమాచారం అడుగుతున్నారేమోనని అనుకో వడానికి వీల్లేదు. ఎందుకంటే వారి సోదరి చాలా స్పష్టంగా వీరికి సమాచారం ఇవ్వకూడదని రాశారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నడవడికపై ఇది ఫిర్యాదు అనుకోవచ్చా అనేది మరో ప్రశ్న. సోదరుడు ఆరోపించినట్లు బహుభార్యాత్వ (బైగమీ) నేరానికి లేదా అక్రమ సహజీవనం (లివ్ ఇన్) తప్పిదానికి లేదా అక్రమ సంబంధానికి (అడల్టరీ) పాల్పడి ఉంటే చర్య తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ సంస్థపైన ఉంటుంది. ఇరువురి మధ్య వివాహ సంబంధం తెగిపోయిన తర్వాత వారు మరొక వివాహం చేసుకున్నా, బహు భార్యాత్వం కాదు. మరొకరితో సహజీవనం చేసినా నేరం లేదు. వారిపైన తీసుకోవలసిన చర్య ఏమీ ఉండదు. ఒకవేళ ఎవరైనా బహు భార్యాత్వ నేరానికి పాల్పడితే ఇద్దరు భార్యల్లో ఒకరు ఫిర్యాదు చేయాలి. వారి సోదరుడికి ఫిర్యాదు చేసే అర్హత లేదు. అక్రమ సంబంధం నేరారోపణలో తన భార్యను మరొకరు లోబరుచు కున్నారని భర్త ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మరెవరో కాదు. ఇక అక్రమ సహజీవనాన్ని నేరంగా ఏ చట్టమూ ప్రకటించకపోగా, ఇరువురు అర్హుల మధ్య సహజీవనాన్ని వివాహంగా భావించాలని ఎన్నో కోర్టులు తీర్పులు చెప్పాయి. కనుక ఏ కోణం నుంచి చూసినా విశ్వవిద్యాలయం దర్యాప్తు చేయతగిన నేరంగానీ, దుష్ర్పవర్తన గానీ అందులో లేదు. కనుక సోదరుడికి ఏ చర్యా అవసరం లేదని చెబితే పూర్తి సమాచారం ఇచ్చినట్లే. నిజానికి ఇదంతా కచ్చితంగా వ్యక్తిగత సమాచారమే కనుక సోదరుడికి సెక్షన్ 8(1)(జె) కింద సమాచారం నిరాకరించే అవకాశం ఉంది. కాని సమాచారం ఇచ్చేశారు. అతను అడుగుతున్నది ఏమిటంటే ఆ ఇద్దరూ రాసిన లేఖల ప్రతులు మాత్రమే. వారు చేసిన వ్యాఖ్యలే మిటి అని. కనుక ఈ ఉత్తరాల ప్రతి ఇవ్వడం వల్ల నష్టమేమీ లేదు. ఇవ్వకపోతే ఏదో దాస్తున్నారనుకుంటారు. అందులో ఏదో ఉందని పుకార్లు చెలరేగుతాయి. పుకార్లకు విరుగుడు నిజాలను బయటపెట్టడమే. తన సోదరి రాసిన లేఖను ఈ సోదరుడు అడగటం లేదు. నిజానికి అడగకపోయినా ఇవ్వవలసినది సోదరి రాసిన లేఖ. అందులో వివాహ బంధం లేదనే నిజంతో పాటు ఈ సోదరుడికి అడిగే అర్హత లేదని. అతనికి ఏ సమాచారం ఇవ్వరాదనే ఆంక్షలున్నాయి. ఇవి ఆ సోదరుడికి తెలియవలసిన అవసరం ఉంది. ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయం పేరు ప్రతిష్టలు రక్షించడానికి, ఆ ఇద్దరు అధ్యాపకులూ పుకార్లకు గురికాకుండా ఉండటానికి, సోదరి ప్రతిష్ట హక్కును కాపాడటానికి ఈ ముగ్గురు రాసిన లేఖల ప్రతులు ఇవ్వాలని సమాచార కమిషన్ ఆదేశించింది. అధ్యాపకుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న సూచన మేరకు, వారి పేర్లు ఇవ్వడం లేదు. వ్యక్తుల పేర్లతో ప్రమేయం లేదు. అనవసర వ్యాజ్యాలతో సమాచార హక్కును భ్రష్టు పట్టించకూడదు. (CIC/D/A/2013/002353-SA కేసులో మార్చి 2న కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార శాఖ కమిషనర్, మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఉత్సాహంగా మాగ్నోవా 2016
-
ప్రభుత్వ ఈ-మెయిల్స్నూ కోరవచ్చు
విశ్లేషణ ప్రభుత్వ అధికారులకు విన్నపాలు ఎక్కడ ఏ విధంగా చేసుకోవాలి? జనం తమ కష్టాలు చెప్పుకోవడానికి సులువైన పద్ధతులు అందు బాటులో ఉండాలి. కష్టాలు చెప్పుకోవడానికి వీలు కల్పించకుండా చేయగలి గిందేమీలేదు. ఈ- పాలన, డిజిటల్ ఇండియా, ఈ-కామర్స్ అని మాట్లాడుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని ప్రతివారికి ఈ-మెయిల్స్ పంపే అవకాశం వచ్చింది. కాగితాలు, పోస్టల్ కవర్లు, స్టాంపులు అవసరం ఉండ కూడదు. ఈ-మెయిల్ చేసి జవాబులు పొందడానికి ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వాలు డిజిటల్ ఇండియా డిజిటల్ ప్రపంచం అంటే అర్థం లేదు. ప్రభుత్వాధి కారికి జనం చెప్పుకునేందుకు ఒక ఈ-మెయిల్ అడ్రసు ఉండడం, అది పనిచేస్తూ ఉండడం ప్రాథమిక అవసరం. ఆ ఈ-గోడు తమకు ముట్టిందని తెలియ జెప్పాలి. ఆ తరువాత ఆ గోడును పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలి. లేకపోతే పరిష్కరించలేక పోవడానికి కారణాలు తెలియ జేయాలి. ఇది పరి పాలనలో ముఖ్యమైన అంశం. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అధికారులకు ఈ-మెయిల్ ఐడీలను తయారు చేసిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు ఆ మొత్తం ఈ-మెయిల్ ఐడీలను ఇవ్వాలని, అవి చాలా ఎక్కువగా ఉన్నట్టయితే ఒక సీడీ రూపంలో ఇవ్వాలని న్యాయవాది మణిరాం శర్మ ఆర్టీఐ కింద కోరారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) కింద ఆయా ప్రభుత్వ కార్యాలయాలు తాము జనానికి అందించే సేవలేమిటో, ఎంతకాలంలో చేస్తారో వివరిస్తూ కష్టాలు, ఫిర్యాదులు ఎవరికి, ఏ విధంగా చెప్పుకోవాలో కూడా తమంత తామే వివరించాలి. కనుక ఆ ఈ-మెయిల్ ఐడీలు ఇవ్వాల్సిందేనని వాదించారు. వివిధ విభాగాలు వారు కోరిన విధంగా వెబ్సైట్లూ, ఈ-మెయిల్ ఐడీలూ తయారుచేసి ఆ ప్రభుత్వశాఖల వారికివ్వడం వరకే తమ బాధ్యత అని, తరువాత తమ దగ్గర అవి ఉండబోవని, కనుక తాము ఇవ్వజాలమని ఎన్ఐసి ప్రజా సమాచార అధికారి నిస్సహాయత వ్యక్తం చేశారు. అన్ని ఈ-మెయిల్ ఐడీలను ఒకచోట సీడీలో ఇస్తే హాకర్లకూ, సైబర్ నేరగాళ్లకూ అదొక సులువైన నేర సాధనం అవుతుందని, ప్రభుత్వ వెబ్సైట్ల సమా చారం అపహరించడానికి, వాటిని స్తంభింప చేయ డానికి, వారు దాడులు చేస్తారని సైబర్ నిపుణులు సమాచార కమిషన్కు వివరించారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల కోసం తయారు చేసిన ఈ-మెయిల్ చిరునామాల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుంది కనుక వారి అనుమతి తీసుకోకుండా తాము వాటిని ఇవ్వజాలమని, వారి అనుమతి తీసుకోవడం చాలా పెద్ద పని అవుతుందని కూడా ఎన్ఐసి వారు వాదించారు. ఈ వాదన సమంజసం కాదు. ఈ కేసు అనేక దశలు దాటి, ముగ్గురు సభ్యుల సమాచార కమిషన్ పీఠం ముందుకు వచ్చింది. సీనియర్ కమిషనర్లు బసంత్ సేథ్, యశోవర్ధన్ ఆజాద్తో నేను కూడా విచారణలో ఉన్నాను. ప్రజల ఫిర్యాదుల విచారణకు, నివారణకు ఈ-మెయిల్ కాంటాక్ట్లు ప్రజారంగంలో ఉండడం చాలా అవసరం అన్న వాదం సరైనదే. అది ప్రజాప్రయోజనకరమైన అంశమే. ఈ-మెయిల్స్ను తయారు చేసి, పనిచేయించే పరిజ్ఞానం, బాధ్యత ఉన్న ఎన్ఐసీ మాత్రమే ఇవ్వగలదు కనుక వారిని వివరాలు అడగడంలో కూడా తప్పులేదు. ఎన్నో ఈ-మెయిల్ ఐడీలు అసలు పనికిరావని, అవి పని చేస్తున్నాయోలేదో తెలియక జనం తమ మహజర్లు పంపుతూ ఉంటారని, కనీసం పనిచేసే ఈ-మెయిల్ ఐడీలు ఏవో చెప్పవలసిన బాధ్యత ఉందని లాయర్ ఆర్కె జైన్ గుర్తు చేశారు. ఈ-మెయిల్స్ అన్నీ టోకున ఇస్తే గుండుగుత్తగా అన్ని వెబ్సైట్ల మీద దాడిచేసే ప్రమాదాలను ఆపడం ముఖ్యమైన అవసరం. కేంద్ర ప్రభుత్వం ఈ-మెయిల్ విషయమై విధాన ప్రకటన చేసింది. ఆ విధానాన్ని అమలు చేసే బాధ్యత ఎన్ఐసీకి అప్పగించింది. ఎన్ఐసీ తయారు చేసిన ఈ-మెయిల్ ఐడీలనే వాడాలని; గూగుల్, యాహూ వంటి ప్రైవేటు సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ప్రభుత్వ అధికారులు, తమ అధికార కార్యక్రమాలకు వినియోగించకూడదని కూడా కేంద్రం నిర్దేశించింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేయడం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఈ సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు, మొత్తం దేశానికి ఒక ఈ-మెయిల్డెరైక్టరీని తయారు చేయాలని ప్రభుత్వం ఎన్ఐసీని ఆదేశించింది. ఒకే వేదిక మీద సమాచార సంచార సమ్మేళనం కోసం కేంద్రం కృషి చేస్తున్నది. ఒక సమగ్రమైన ఈ-మెయిల్ అనుసంధానం, అన్ని ప్రభుత్వ రంగాలు, శాఖలను కలిపే ఒక వేదికను, వెబ్ డెరైక్టరీ తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రజల అభిప్రాయాలు కూడా కోరారు. కనుక పారదర్శకత్వం కోసం, పాలనను మెరుగుపరచడం కోసం, అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం సమగ్రమైన ఈ-మెయిల్ డెరైక్టరీని ఎన్ఐసీ తయారు చేయాలని, అందుకు ప్రభుత్వ విభాగాలన్నీ సహకరించాలని, సైబర్ దాడులను నివారించే కృషి చేయాలని ఎన్ఐసీ ముగ్గురు కమిషనర్లు ఆదేశించారు. (మణిరాం శర్మ వర్సెస్ ఎన్ఐసీ NIC, CIC/BS/A/2012/001725, లో ముగ్గురు సభ్యులధర్మాసనం 16 డిసెంబర్ 2015న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్కు అంతర్జాతీయ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్లైన్ దిగ్గజం అలీబాబా వెబ్సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్మ్యాన్. శ్రీధర్కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం. కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి. అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్డేకు... అమెరికా నుంచి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు. ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?.. ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం... ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు * అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి * కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్... * గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు * ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్. అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం.... ఆన్లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే... * ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే. * ప్యాకేజ్కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే. * గిఫ్ట్గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది. * పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి. * ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు. * అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ. * దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి. కస్టమ్స్ గుర్తిస్తే...? ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు. కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్మ్యాన్తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది. కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా? సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు. నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్లో సంప్రదించవచ్చు. వస్తువు ట్రాక్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి కొరియర్కూ సొంత వెబ్సైట్ ఉంది. కన్సైన్మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్షిప్ వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్కు చెందిన ఐపీఎస్ వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే... ఏ కొరియర్నైనా ట్రాక్ చేయటానికి... https://www.17track.net/en https://www.aftership.com/ అంతర్జాతీయ పోస్టల్ను ట్రాక్ చేయటానికి... http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm -
చిలకలగూడలో ఓ ఇంట్లో చోరీ
చిలకలగూడ గొల్లపుల్లయ్యబావి కాలనీలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సుమారు 40 తులాల బంగారం, రూ.80 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనాస్థలానికి క్లూస్టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యజమాని ఇచ్చే బీమాతో సరా..!
శ్రీధర్ది ప్రైవేటు ఉద్యోగం. మంచి జీతం. కంపెనీ ఆరోగ్య బీమా ఇస్తోంది కదా అని ఎప్పుడూ సొంత ఆరోగ్య బీమా గురించి ఆలోచించలేదు. అయితే ఉన్నట్టుండి కంపెనీ అతన్ని తొలగించింది. ఈ వార్త పిడుగుపాటులా తాకటంతో మానసికంగా బాగా కుంగిపోయాడు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా... ఈ కుంగుబాటుతో ఆరోగ్యం దెబ్బతింది. ఆసుపత్రిలో చేరాడు. అక్కడ తలెత్తింది అసలు సమస్య. ఆసుపత్రిలో నాలుగైదు రోజులు ఉంచటం... పరీక్షలన్నీ చేయటం, ట్రీట్మెంట్... వీటన్నిటికీ రూ.2 లక్షల దాకా అయింది. అంతకు ముందైతే కంపెనీ హెల్త్ పాలసీ ఉండేది కనక ఎన్నడూ ఇబ్బంది అనిపించలేదు. కానీ ఉద్యోగం పోవటం... ఆదాయం లేకపోవటం... అదే సమయంలో ఆసుపత్రి పాలవటం అన్నీ కలిసి శ్రీధర్ను నానా ఇబ్బందులూ పెట్టాయి. బంధుమిత్రుల సాయంతో బయటపడ్డా... కంపెనీ ఇస్తున్నది కాకుండా సొంత ఆరోగ్య బీమా పాలసీ ఉండటం ఎంత అవసరమో అప్పుడు తెలిసొచ్చింది శ్రీధర్కు. నిజానికిపుడు చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీ ఇస్తున్న ఆరోగ్య బీమా పాలసీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ బీమా సరిపోతుంది కదా! ఇంకెందుకు మరొకటి? అనేది వారి ఆలోచన. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటుంది. గడిచిన మూడేళ్లుగా చాలా సంస్థలు ఉద్యోగుల తల్లిదండ్రుల బీమా కవరేజీకి వచ్చేసరికి వారి నుంచి కూడా కొంత పేమెంట్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా ఇవి కవరేజీ పెంచటం లేదు. ఇటీవల ఓ బీమా కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైందేంటంటే... 2008 నుంచి భారతీయ కంపెనీలు చెల్లిస్తున్న మెడిక్లెయిమ్ ప్రీమియం పెరగటమే లేదు. అయితే తగ్గటం, లేకపోతే అదే స్థాయిలో ఉండటం జరుగుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాలు, ఆరోగ్య పరిరక్షణపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అక్కడి కంపెనీలు పెడుతున్న ఖర్చులో 10 శాతమే ఇక్కడి కంపెనీలు వెచ్చిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెపైచ్చు 2008లో మాంద్యం పరిస్థితులు నెలకొన్న తరవాత నుంచి ఇవి ఆ ఖర్చులను కూడా కుదించటం మొదలుపెట్టాయి. బీమా ప్రీమియంలలో కోత పెట్టాయి. దీంతో 20 నుంచి 25 శాతం ఉద్యోగులు తమ మెడిక్లెయిమ్ పాలసీలకు అదనంగా టాప్ అప్ చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా ఉండటం తప్పనిసరి * కంపెనీ పాలసీలో కవరేజీ మొత్తం అంతంతే * వ్యక్తిగత, గ్రూప్ టాప్-అప్లూ చేయించుకోవచ్చు * సొంత హెల్త్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్, ప్రమాద బీమాతో ధీమా పెరుగుతున్న నియంత్రణలు... చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటూ బీమా కవరేజీలపై ఆంక్షలు పెడుతున్నాయి. ఐసీఐసీఐ లాంబార్డ్ తాజా నివేదిక ప్రకారం 76 శాతం కంపెనీలు కో-పేమెంట్ నిబంధనను పాటించటమే కాక ఆసుపత్రుల్లో గది అద్దెపై పరిమితి విధిస్తున్నాయి. సగటున చూస్తే ఇవి ఉద్యోగులకు అందిస్తున్న బీమా కవరేజీ మొత్తం లక్ష నుంచి లక్షన్నర దాటడం లేదు. ‘‘దురదృష్టవశాత్తూ తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు ఉన్నారనుకోండి. మీ ఆసుపత్రి బిల్లు భారీగా పెరిగిపోయే అవకాశముంది. అలాంటి సందర్భాల్లో కంపెనీ ఇస్తున్న కవరేజీ సరిపోదు. అందుకని మీ వార్షిక ఆదాయానికి సమానమైన సొంత ఆరోగ్య బీమా కవరేజీ తప్పక ఉండి తీరాలి. దానికి క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్, వ్యక్తిగత ప్రమాద బీమా జత చేయాలి’’ అనేది పాలసీ బజార్ సీఈఓ యాశిష్ దహియా మాట. నిజానికి కంపెనీ ఇస్తున్న కవరేజీ చాలకపోవటం అనేది ఒక్కటే కాదు. కంపెనీ ఆఫర్ చేస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ పరిమితిని దాటిపోయినా, లేక మీరు తరచు ఉద్యోగాలు మారుతున్నా కూడా... మీకు ప్రత్యేక ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. ఏడాదికి రూ.9 వేలలోనే అన్నీ... ఒకవేళ విడిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకుందామనుకుంటే... ముఖ్యంగా చూడాల్సింది అప్పటికే ఉన్న వ్యాధుల కవరేజీకి వారు పేర్కొన్న వెయిటింగ్ పీరియడ్ ఎంత? మెటర్నిటీ ప్రయోజనాలున్నాయా? క్యాష్లెస్ ఫెసిలిటీ కల్పించే ఆసుపత్రులెన్ని? వంటివి. నిజానికి 30 ఏళ్ల వ్యక్తి గనక రూ.5 లక్షల బీమా కవరేజీ, రూ.10 లక్షల క్రిటికల్ ఇల్నెస్, రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా... వీటన్నిటికీ కలిసి ఏడాదికి రూ.9 వేలు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎలాగంటే... రూ.5 లక్షల రెలిగేర్ కేర్ హెల్త్ కవర్కు ఏడాదికి రూ.5,162 అవుతుండగా, బజాజ్ అలయంజ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.3వేలు, ఐసీఐసీఐ లాంబార్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ రూ.10 లక్షలకు ఏడాదికి రూ.1,221 ఖర్చవుతోంది. కాకపోతే వ్యక్తిగత బీమాకు కొన్ని పరిమితులుంటాయి. కంపెనీ ఇస్తున్న గ్రూప్ బీమా కవరేజీ అయితే అప్పటికే ఉన్న వ్యాధుల్ని, మెటర్నిటీ ఖర్చుల్ని కవర్ చేస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలైతే అప్పటికే ఉన్న వ్యాధులకు రెండు నుంచి నాలుగేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అది కంపెనీని బట్టి మారుతుంది. కవరేజీని పెంచుకోవాలనుకుంటే టాప్ అప్ ప్లాన్నూ పరిశీలించొచ్చు. కొన్ని కంపెనీలు గ్రూప్ టాప్-అప్లను కూడా ఆఫర్ చేస్తున్నాయి. అయితే వీటిని మీరు పనిచేస్తున్న కంపెనీ ఆఫర్ చేస్తున్న బీమా సంస్థ దగ్గరే కొనుగోలు చే యొచ్చు. ఇలాంటప్పుడు గ్రూప్ టాప్-అప్ అనేది కంపెనీ ఇస్తున్న పథకానికి జతగా ఉంటుందో లేదో చూడాలి. ఇక వ్యక్తిగత టాప్-అప్లనేవి కొంత ఖరీదే. వీటిని ఎంచుకునే ముందు వాటి షరతులనూ చూడాలి. మరికొన్ని కంపెనీలు నిర్దిష్ట మొత్తానికి సొంత ఆరోగ్య బీమా ఉంటే తప్ప టాప్ అప్ చేయలేమని, కవరేజీ మొత్తాన్ని ఏకకాలంలో ఉపయోగించుకున్న తరవాతే టాప్ అప్ వర్తిస్తుందని షరతులు పెడుతున్నాయి. కనుక చిన్న వయసులో ఉన్నపుడే వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకుంటే తక్కువ ధరకే రావటం తో పాటు మరిన్ని వ్యాధులు కవరయ్యే అవకాశం ఉంటుంది. -
వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం?
ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు... బైక్, కారు వంటి ఆటోమొబైల్స్ కావచ్చు... వీటిని కొనేటపుడు ప్రతిసారీ శ్రీధర్కు షోరూమ్ వాళ్లు ఒక ఆఫర్ ఇస్తుంటారు. ‘‘సర్! దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. తీసుకోండి’’ అని. అంటే... సదరు వస్తువుకు కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా డీలర్ ఇచ్చే అదనపు వారంటీ అన్నమాట. దానిక్కాస్త ఎక్స్ట్రా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ ప్రతి సందర్భంలోనూ వద్దని చెప్పేస్తూ ఉంటాడు. తరవాత బయటికొచ్చి... అరె! తీసుకుని ఉంటే బాగుండేదేమో!! అనుకుంటుంటాడు. మరి ఈ ఎక్స్టెండెడ్ (పొడిగించిన) వారంటీని తీసుకోవటం మంచిదా..? లేక వద్దని వదిలేయటమే మంచిదా? ఒకసారి చూద్దాం. పొడిగించిన వారంటీ అంటే నిజానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే. ఎందుకంటే ప్రతి వస్తువుకూ సాధారణంగా ఇచ్చే వారంటీ ఒకటుంటుంది. అది నెల కావచ్చు... ఏడాది కావచ్చు. ఈ గడువులో గనక వస్తువుకేదైనా అయితే కంపెనీ దాన్ని రిపేరు చేయటమో, లేక మార్చి కొత్తది ఇవ్వటమో చేస్తుంది. ఆ గడువు అయిపోయాక గనక ఆ వస్తువు దెబ్బతింటే అప్పుడు ఈ పొడిగించిన వారంటీ పనికొస్తుంది. బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలియంది కాదు. అవి క్లెయిమ్ రూపంలో చెల్లించే మొత్తం కంటే ప్రీమియం రూపంలో వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అవి క్లెయిమ్లు చెల్లించ గలుగుతాయి. లేదంటే దివాలా తీస్తాయి. ఈ పొడిగించిన వారంటీ కూడా ఇలానే పనిచేస్తుంది. అంటే దీనర్థం పొడిగించిన వారంటీలో క్లెయిమ్లు ఎక్కువగా ఉండవనేగా!? అంకెల్లో ఓ సారి చూద్దాం.. శ్రీధర్ ఎలా ఆలోచించాడో ఓ సారి చూద్దాం. తను ఓ ల్యాప్టాప్ కొందామనుకున్నాడు. పేరున్న రిటెయిలర్ దగ్గరకు వెళ్లాడు. రూ.36,000 ధర చెప్పిన రిటెయిలర్... కంపెనీ ఇస్తున్న ఏడాది వారంటీతో పాటు తాము రెండేళ్లు పొడిగింపు వారంటీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ రెండేళ్ల పొడిగింపు వారంటీ లేకుండా ల్యాప్టాప్ ఎంతని అడిగితే... ఆ వారంటీ (బీమా) ధర మైనస్ చేసి రూ.26,000కు ఇస్తానన్నాడు. గమనించాల్సిందేంటంటే ఏడాదిలోపు ల్యాప్టాప్కు ఏదైనా అయితే తిరిగి కొత్తదిస్తారు. రూ.36,000 పెట్టి కొంటే ఈ గడువు మూడేళ్లకు పెరుగుతుంది. అదే 26వేలు పెట్టి కొంటే ఏడాది మాత్రమే వారంటీ. ఆ తరవాత ఒక్కరోజు గడిచినా రీప్లేస్మెంట్ ఉండదు. శ్రీధర్ ఆలోచన మరోలా ఉంది. ఎలాగూ ఏడాది వరకు వారంటీ ఉంటుంది. పెపైచ్చు ల్యాప్టాప్ 26వేలకే వస్తుంది. ఒకవేళ ఏడాది తరవాత ఏదైనా జరిగితే... రోజురోజుకూ టెక్నాలజీ మారుతోంది కనక అప్పటికి మార్కెట్లో ఉండే కొత్త టెక్నాలజీ ల్యాప్టాప్ను దాదాపు 26వేలకే కొనుక్కోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం కొన్న మోడల్నే అప్పుడు కూడా కొనాలంటే పాతదై పోతుంది కనక ధర కూడా దాదాపు 15-20 వేల మధ్యనే ఉంటుంది. ఒకవేళ ల్యాప్టాప్కు ఏమీ కాకపోతే మొత్తం మిగిలినట్టే. ఇలా ఆలోచించాకే... రిటెయిలర్ ఎంత ఆశ చూపించినా, ఎంతగా భయపెట్టినా శ్రీధ ర్ లొంగలేదు. తన నిర్ణయానికే కట్టుబడి ఈ పొడిగింపు వారంటీ వద్దనుకున్నాడు. మానసికంగా లాభమే! శ్రీధర్లానే అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఈ పొడిగింపు వారంటీ తీసుకోవటం వల్ల ఇతర లాభాల మాటెలా ఉన్నా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన నోబెల్ విజేత డానియెల్ కానెమన్ వంటి మానసిక విశ్లేషకులు ఏమంటారంటే... ఏదైనా లాభం వల్ల కలిగే ఆనందం కన్నా నష్టం వల్ల కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఈ లెక్కన చూస్తే నష్టం వల్ల కలిగే బాధను, నష్టం వస్తుందనే ఒత్తిడిని దూరం చేసే పొడిగింపు వారంటీ మంచిదే. గతంలో శ్రీధర్ ఇలాంటి వారంటీలు అవసరం లేదని, వద్దని తన తోటి కస్టమర్లకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ మానసిక ప్రశాంతత కోణంలో ఆలోచించాక తను ఆ సిఫారసు మానుకున్నాడులెండి!!. అవసరమైనచోటే బీమా ఎప్పుడైనా బీమా తీసుకునేది అవసరమైన చోటే. అంటే... తద్వారా జరిగే నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉంటేనే! మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ ఇలాంటివే. ఎందుకంటే నష్టం జరిగినపుడు మనం కోల్పోయేదాన్ని ఈ పాలసీలు లేకుంటే భర్తీ చేసుకోవటం కష్టం. నిపుణులు చెప్పేదేంటంటే... ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అలా కాదు. వాటికేదైనా జరిగితే ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోగలం. మరి అలాంటపుడు బీమా ఎందుకనేది వారి ప్రశ్న. ఇటీవల ‘బ్లూమ్బర్గ్’ చేసిన సర్వే ప్రకారం... ఈ పొడిగించిన వారంటీలు అమ్మకం దార్లకు ఊహించని లాభాల్ని అందిస్తున్నాయట. ఈ రకం వారంటీల కోసం కంపెనీలకయ్యే ఖర్చు చాలా తక్కువని, అవి వీటిద్వారా వినియోగదారులకు అందిస్తున్న ప్రయోజనాలు కూడా తక్కువ కావటంతో వాటికి లాభాలొస్తున్నాయని బ్లూమ్బర్గ్ వివరించింది. -
ముత్యాలముగ్గు సీతాయణం
రామాయణం ఎంత మధురంగా ఉంటుందో... అంతే కఠినంగా కూడా ఉంటుందనిపిస్తుంది! రాక్షసుడు భార్యాభర్తల్ని విడగొడతాడు. భక్తుడు భుజం మీద తల్లిని వెనక్కి తెస్తానంటే... రాముడే రావాలని సీతమ్మ అంటుంది. రామాయణం రాముడి గురించి అనుకుంటాం కానీ నాకు రామాయణంలో సీతమ్మవారి గొప్పతనమే ఎక్కువగా గోచరిస్తుంది. పట్టాభిషేకం అయింది... కథ సుఖాంతం అయింది... హమ్మయ్య... అనుకునేలోపు పామరుడు అన్న మాటకు సీతమ్మ మళ్లీ అడవిపాలు అవుతుంది. మొదటిసారి రాముడి కోసం... రాముడి వెంట... రాముడికి తోడుగా ఈసారి కూడా రాముడి కోసమే... రాముడు లేకుండా... రాముడి పిల్లల సాక్షిగా. అమ్మానాన్నల్ని కలపడానికి లవకుశులు చేసే ప్రయత్నం రామాయణంలో విఫలమైనా... ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో కవలలు... శ్రీధర్ని, సంగీతను కలుపుతారు. రాక్షసమూకను తరిమికొడతారు. బాపూ రమణల సినిమా మరి! రామాయణం కనపడక మానదు. సీతమ్మవారిని కీర్తింపక మానరు. తనపై అనుమానాన్ని, తనకు జరిగిన అవమానాన్ని... జయించిన సీత కథ ఇది. సీతాయణం ఇది. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్ ఫస్ట్ నైట్. శ్రీధర్ పట్టెమంచం మీద ఉన్నాడు. సంగీత అతడి గుండెలపై తలవాల్చి ఉంది. పెళ్లి పీటలపై ‘అదృష్టవశాత్తూ’ పెళ్లి ఆగిపోతే.. అక్కడికక్కడ దొరికిన వరుడు శ్రీధర్. కోటీశ్వరుడైన రాజా రామ్దాసు కొడుకు అతడు. సంగీత అన్నయ్యకు స్నేహితుడు. మంచి మనసున్నవాడు. స్నేహితుడి చెల్లెలి పెళ్లికని శ్రీధరే తండ్రి చేత కట్నం డబ్బులు ఇప్పించాడు. తనూ ఆ పెళ్లికి వచ్చాడు. కానీ పెళ్లి చెడిపోయింది. సంగీతను అదృష్టం వరించింది. అప్పటికే ఎనభై పెళ్లిళ్లు చేసుకుని ఉన్న నిత్య వరుడు నూతన్ ప్రసాద్ను లాస్ట్ మినిట్లో పోలీసులు వచ్చి పెళ్లి పందిట్లోంచి పట్టుకెళ్లకపోతే సంగీతకు శ్రీధర్ అనే అదృష్టం పట్టేది కాదు. శ్రీమంతుల దగ్గర చెయ్యి చాచి తెచ్చిన పాపపు సొమ్ముతో పెళ్లి చేయబోతే ఇలాగే జరుగుతుందని పెళ్లి పెద్ద సాక్షి రంగారావు నోటికొచ్చినట్లు మాట్లాడకపోతే శ్రీధర్కు సంగీత అనే అపురూపం లభించేది కాదు. తన తండ్రిది పాపపు సొమ్ము కాదని చెప్పడానికి మాత్రమే సంగీత మెడలో తాళి కట్టలేదు శ్రీధర్. చిన్నపాటి పరిచయంలో అంతకుముందే ఆమె అంటే అతడికి ఇష్టం కూడా ఉంది. ‘కట్టుకథల కన్నా... జరిగే కథలే చిత్రంగా ఉంటాయి కదూ. నీకిది వరకు పెళ్లి చూపులు జరిగాయా?’ ‘ఆరుసార్లు’. ‘ఆరుసార్లా? అందులో నీకెందరు నచ్చారు?’ ‘నేను ఆడపిల్లని. పైగా పేద పిల్లని. మాకు నచ్చడం, ప్రేమించడం అంటూ ఉండవు. పెద్దవాళ్లు ఏదో కుదురుస్తారు. సరేనంటాం. పెళ్లయ్యాకే ప్రేమ’. ‘అంటే ఆ పెళ్లి కొడుకులకు నువ్వు నచ్చలేదా?’ ‘తెలీదు. ఒకళ్లిద్దరు కట్నం తక్కువని, ఒకళ్లిద్దరు తెల్లగా లేనని వద్దన్నారు. ఒకడు రెండో పెళ్లివాడు. మా అన్నయ్య పొమ్మన్నాడు’. ‘ఇంతకీ ఈ పెళ్లి కొడుకు నచ్చాడా?’ (తన గురించి శ్రీధర్). నవ్వులు. ‘మా అమ్మ చెప్పేది. తమలపాకు, వక్కపలుకు, తాంబూలంలా కలిసిపోయాక ఇక వాటిని దేవుడు కూడా విడదీయలేడని. ఇది ఆకు, ఇది వక్క అన్నమాటే ఉండదు’. ‘ఎంత చక్కని ఊహ! మన దాంపత్యం నిత్య తాంబూలమై పండాలి’. ఇద్దరూ అనుకున్నారు. కానీ ఆ దాంపత్యాన్ని పండనివ్వకూడదని ముక్కామల అనుకున్నాడు. అందుకు అల్లురామలింగయ్య హెల్ప్ తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి రావుగోపాల్రావు హెల్ప్ కోసం వెళ్లారు. రావుగోపాల్రావు నూతన్ ప్రసాద్కి పని పురమాయించాడు! ముక్కామల... రాజా రామ్దాసు (కాంతారావు) బావమరిది. శ్రీధర్ని తన కూతురికిచ్చి చేద్దామనుకుంటే ఇది దెయ్యంలా తగలడిందని సంగీత మీద కోపం. ఈ తాళిని తెంపించి, ఆ తాళిని కట్టించాలని అతడి ప్లాన్. అల్లురామలింగయ్య దివాణం మేనేజర్. రావుగోపాల్రావు కాపురాలు కూల్చే కాంట్రాక్టర్. ఇంకా చాలా చేస్తుంటాడు. ఖూనీలు, సెటిల్మెంట్లు వగైరాలు. నూతన్ ప్రసాద్ అతడికి రైట్ హ్యాండ్. నూతన్ ప్రసాద్కి రెగ్యులర్గా పెళ్లిళ్లు చేయిస్తుండేది రావుగోపాల్రావే. సంగీత తాళి తెంచే పథకం మొదలైంది. సంగీతపై శ్రీధర్కి అనుమానం తెప్పించి, ఆమెను తప్పించే పథకం అది. పథకం సక్సెస్ కూడా అయింది. అప్పటికే సంగీత గర్భిణి. ‘ఆ మనిషెవడో నీకు తెలీదు. గడియ వేసున్నా పడగ్గదిలోకి ఎలా దూరాడో కూడా నీకు తెలీదు. అవునా?’ ‘అవునండి. నిజం. మీ పాదాల సాక్షి’. ‘నోర్ముయ్’. ‘నన్ను నమ్మండి. కలలో కూడా...’ ‘ఛ... కళ్లతో చూసిన దానికి దిక్కులేదు.. కలలో పతిభక్తి గురించి మాట్లాడుకోవాలిక...’ ‘నా మాట వినండి. తెల్లనివన్నీ పాలూ కావు. నల్లనివన్నీ నీళ్లూ కావు’. ‘అదే నేను చేసిన పొరపాటు. ఉప్పును చూసి కర్పూరం అని మోసపోయాను. ఆనాడు నువ్వీ గడప తొక్కడం మా నాన్నగారికి ఇష్టం లేకున్నా కర్మ అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడీ సంగతి తెలిస్తే... ఆయన గుండె బద్దలైపోదూ.. మేం గౌరవానికి ప్రాణాలిచ్చే మనుషులం’. ‘ఏవండీ’ ‘ఇంకే చెప్పొద్దు. నేను నిన్నేం సాధించను. తిట్టి కొట్టి బాధించను. చంపి ఈ ఇంటిని మైలపరచను. నేను నిన్ను కోరేది ఒక్కటే. రచ్చ చెయ్యకుండా ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలి. ఈ దౌర్భాగ్యపు కథను ఈ గదిలోనే సమాధి చెయ్యాలి. రేపే నిన్ను మీ పుట్టింటికి పంపే ఏర్పాటు చేస్తాను. చేతనైనంత నటించి, నవ్వుతూనే సాగనంపుతాను. నువ్వు మహానటివి. పెద్దలయెడల గౌరవం, నాయందు విరహం నటించి వెళ్లిపో. వెళ్లి, నీకు మనసనేదే ఉంటే చచ్చిపో. నేను మాత్రం కొంతకాలం తర్వాత ఈ ఇంటి కోడలు చచ్చిపోయిందని ఇక్కడికి కబురు తెప్పిస్తాను. మా నాన్న గారు, అత్తయ్య, నీ మంచితనం మీద నమ్మకం ఉన్న మిగతా జనాభా ఓ ఏడుపు ఏడుస్తారు. వాళ్ల మీద దయ ఉంచి అక్కడితో సరిపెట్టు. నీక్కావలసింది డబ్బే కదా, కావలసినంత పట్టుకుపో. ఈ ఇంటి గౌరవం, మా నాన్న గారి మనశ్శాంతి తప్ప మిగతావన్నీ దోచుకుపో. ఫో. శ్రీధర్, సంగీత విడిపోయారు. రావుగోపాల్రావు, అల్లురామలింగయ్య దివాణాన్ని దోచుకోవడం మొదలుపెట్టారు. శ్రీధర్, అతడి తండ్రి కాంతారావు వైరాగ్యంలో పడిపోయారు. తన కూతుర్ని చేసుకొమ్మని అడగడానికి వచ్చిన ముక్కామలను తిట్టి పంపించాడు శ్రీధర్. ఏళ్లు గడుస్తున్నాయి. కాలం.. మొదట సంగీతను, కాంతారావును కలిపింది. కాంతారావుకు నిజం తెలిసింది. తన మనవణ్ణి, మనవరాలిని చూసి మురిసిపోయాడు. (సంగీతకు కవలలు). ‘అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఇంటికిరా తల్లి. మనం ఆ బందిపోటు ముఠాను వెళ్లగొడదాం. అబ్బాయికి నేనంతా చెబుతాను. నువ్వు నట్టింట కాలుపెట్టి...’ ‘క్షమించండి మామగారు. నేను రాను. రాలేను’. ‘అమ్మా... నీకేం భయం లేదు. ఇప్పటికీ అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు. నేను స్వయంగా ఇక్కడి సంగతి చెబితే...’ ‘వద్దు మామగారు... సిఫారసులతో కాపురాలు చక్కబడవు. బతుకులు బాగుపడవు. నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి. ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి. అంతవరకు నేను రాలేను’. ఇదంతా ఇద్దరు పిల్లలు విన్నారు. ఎలాగైనా అమ్మనీ, నాన్ననీ కలపాలనుకున్నారు. ఆలోచించారు. ఆచరణలోకి దిగారు. అక్క శాంతకు ఆంజేయస్వామి ఫ్రెండ్. తమ్ముడు రాముకు కోతి ఫ్రెండ్. ఈ ఇద్దరి ఫ్రెండ్స్ సహాయంతో అక్కాతమ్ముడు రంగంలోకి దిగారు. చివరికి సంగీత కోరుకున్నట్లే జరిగింది. శ్రీధర్ తన పొరపాటు తెలుసుకున్నాడు. సంగీతను చెంతకు చేర్చుకున్నాడు. క్షమించమని అడిగాడు. దివాణంలోని దుష్టులకు తగిన శాస్తి అయింది. అల్లురామలింగయ్య పిచ్చివాడయ్యాడు. ముక్కామల, రావుగోపాల్రావు తాము తవ్వుకున్న గోతిలో తామే పడ్డారు. ముక్కామల కూతుర్ని నూతన్ ప్రసాద్ చేసుకుని మోసం చేస్తే, రావుగోపాల్రావు కూతుర్ని సంగీత అన్నయ్య చేసుకుని, చిన్న నాటకం ఆడి రావుగోపాల్రావుకు బుద్ధి వచ్చేలా చేశాడు. ‘దేవుడా... నేనెప్పుడూ నిన్నేం కోరలేదు. నీ అవసరం వస్తుందని కూడా అనుకోలేదు. నాకు చాలా విద్యలు వచ్చుననుకున్నాను. ప్రాణాలు తియ్యడం, కొంపలు కూల్చడం, కాపరాలు చెడగొట్టడం చాలా చేశాను. కానీ ప్రాణం పొయ్యడం, కాపరం నిలబెట్టడం చేతకాదు. ఇదొక్కటే చేసిపెట్టి, నా బిడ్డ కాపరం దారికి పెట్టు. నీకు తీరికలేకపోతే సాయం చేసేవాళ్లను చూపెట్టు’ అని దేవుణ్ణి వేడుకుంటున్న రావుగోపాల్రావుని చూస్తుంటే.. అయ్యోపాపం అని కూడా అనిపిస్తుంది. విలన్లా, అసహాయుడైన ఆడపిల్ల తండ్రిలాను ఆయన ప్రేక్షకులను ఆయన కదిలించారు. రావుగోపాల్రావు ఎంట్రీ (రావు గోపాల్రావు అటు తిరిగి ఉంటాడు. సూర్యోదయాన్ని చూస్తూ. అప్పుడు అతడి సెక్రెటరీ వస్తాడు) ‘నారాయుడు వచ్చాడండి’. ‘వచ్చాడా? తీసుకొచ్చావా?’ (వచ్చాడు అంటే మనిషే వచ్చాడని. తీసుకురావడం అంటే డెడ్బాడీ వచ్చిందని) ‘ఎస్ సార్. తీసుకొచ్చాను చూస్తారా?’ ‘అబ్బా... సెగట్రీ... ఎప్పుడూ పనులు, బిజినెస్సేనా? ఆ.. పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెచ్చక్ష నారాయణుడి సేవ చేసుకోవద్దూ’. ‘ఎస్ సార్’. ‘ఎస్ సార్. కాదు. కళ్లెట్టుకు చూడు. పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ... ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడూ. అద్భుతం సార్’. ‘ఆ... మడిసన్నాక కాసింత కలాపోసన ఉండాలయ్యా. ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకి తేడా ఏటుంటదీ?’ ‘ఎస్ సార్. మీరోసారి చూసి సరే అనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. ‘సరే లెద్దూ... ఎదవ నూసెన్సూ. (సెవంటీస్లో ఎవరి నోట విన్నా... ‘ఆకాశంలో మర్డరైనట్టు లేదూ’ అనే డైలాగే. ‘దీని శిగదరగ’ అనేది ఇంకో డైలాగు. సినిమాలో రావుగోపాల్రావు ఊత పదం ఇది). పాటలు (రచన / గానం) 1. శ్రీ రామ జయరామ సీతారామ (ఆరుద్ర / బాలమురళీకృష్ణ) 2. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు (ఆరుద్ర / రామకృష్ణ) 3. ముత్యమంత పసుపు ముఖమెంతో చాయ (ఆరుద్ర / సుశీల) 4. ఎంతటి రసికుడవో తెలిసెరా (సినారె / సుశీల) 5. గోగులు పూచె గోగులు పూచే ఓ లచ్చగుమ్మడి (సినారె / సుశీల, ఎస్పీబీ) 6. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది (గుంటూరు శేషేంద్ర శర్మ / సుశీల) -
'దేవుడు వదిలేస్తాడేయో కానీ రహానే వదలడు'
చెన్నై : ఫీల్డింగ్ అనేది ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యమని భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. 'దేవుడైనా కూడా పొరపాటున క్యాచ్ వదిలేస్తాడేమో కానీ రహానే అలా కాదు' అంటూ జట్టు ఆటగాడిని ప్రశంసించాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వెంటనే వాటి నుంచి పాఠం నేర్చుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు. లంకతో రెండో టెస్టులో కుమార సంగక్కర క్యాచ్ వదిలేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత అదే ఆటగాడు ఇచ్చిన క్యాచ్నే ఒంటి చేత్తో ఒడిసిపట్టడం చూస్తే అతని ఫీల్డింగ్ ప్రతిభ అర్థమవుతోందంటూ కితాబిచ్చాడు. టీమిండియా ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగు చేయడంపై బీసీసీఐ దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. ఏ జట్టుకైనా ఫీల్డింగ్ కీలక అంశమని అన్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ ఫీల్డింగ్ కొంత మెరుగైందని, దీంతో లంక ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టగలిగాం. టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీన్నే నమ్ముతారని చెప్పాడు. ఈ సిరీస్ లో బాగా రాణించిన ఆటగాళ్లలో మిశ్రా ఒకడని అతడు అభిప్రాయపడ్డాడు. -
సింగరేణి విద్యుత్ తెలంగాణకు అంకితం: శ్రీధర్
జైపూర్(ఆదిలాబాద్ జిల్లా): సింగరేణి ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్. శ్రీధర్ తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో నూతనంగా నిర్మించనున్న 1200 మెగావాట్ల పవర్ఫ్లాంట్కు సంబంధించిన రెండో బాయిలర్ లైట్ఆప్ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పవర్ ఫ్లాంట్ను మార్చి-2016 కల్లా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఫ్లాంట్లో తయారైన విద్యుత్ను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఫ్లాంట్లోని పలు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. -
ప్రేక్షకుల కోసం కొత్తగా...
టి20 ప్రపంచకప్తో వినోదం లభిస్తుంది టోర్నీ డెరైక్టర్ ఎం.వి. శ్రీధర్ సాక్షి, హైదరాబాద్: భారత్ తొలిసారిగా టి20 ప్రపంచకప్కు వచ్చే ఏడాది మార్చిలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీ నిర్వహణ బాధ్యత తెలుగు వ్యక్తి మాటూరు వెంకట శ్రీధర్కు దక్కింది. ప్రస్తుతం బీసీసీఐలో జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్)గా పని చేస్తున్న ఎంవీ శ్రీధర్ను 2016 టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ డెరైక్టర్గా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీకి కర్త, కర్మ, క్రియలాంటి పదవి తనకు దక్కడ ం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత టోర్నీలకు భిన్నంగా ప్రేక్షకుల కోసం కొత్తగా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. శ్రీధర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా చెప్పిన ఇతర అంశాలు ఆయన మాటల్లోనే... ఊహించలేదు: బీసీసీఐ నాపై నమ్మకముంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించింది. కానీ ప్రపంచకప్ డెరైక్టర్గా ఎంపికవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పటికే ఆపరేషన్స్ మేనేజర్గా భారత జట్టు ఆడే మ్యాచ్లు, దేశవాళీ మ్యాచ్ల ఏర్పాట్లతో పాటు ఐసీసీకి సంబంధించిన బాధ్యతలు కూడా పర్యవేక్షిస్తున్నాను. ఒక రకంగా దానికి ఇది పొడిగింపులాంటిదే అని భావిస్తున్నాను. చిత్తశుద్దితో నిర్వహిస్తా: టోర్నీ డెరైక్టర్ అంటే ప్రతి చిన్నా, పెద్దా విషయాలు చూసుకోవాలి. మంచికీ, చెడుకూ నేరుగా బాధ్యత వహించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా, చిత్తుశుద్దితో బాధ్యత నిర్వహిస్తా. ఇదొక సవాల్ లాంటిదే. కొత్త అనుభూతి కోసం: టి20కి మన దేశంలో చాలా క్రేజ్ ఉంది. తొలి చాంపియన్స్ మనమే అయినా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. కాబట్టి విదేశాల నుంచి వచ్చే ప్రేక్షకులు, క్రికెటర్లు అందరూ సంతోషంగా వెళ్లేలా చూస్తాం. ఐపీఎల్ వల్ల మన ప్రేక్షకులకు టి20 వినోదం కొత్త కాదు. కాబట్టి ప్రపంచకప్ అనగానే అందరి వైపు నుంచి అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ప్రేక్షకుల కోసం కొత్తగా ఏదైనా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తాం. కృతజ్ఞతలు: అభిమాని ఆనందమే ఏ టోర్నీలో అయినా అసలు విజయం. కాబట్టి ప్రపంచకప్ను కచ్చితంగా గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బీసీసీఐతో పాటు హైదరాబాద్ క్రికెట్ సంఘం, నా సహచరులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. -
‘సింగరేణి’కి జర్మన్ కంపెనీల క్యూ
సంస్థ సీఎండీతో 15 కంపెనీల బృందం సమావేశం సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల సరఫరాకు ప్రతిపాదనలు హైదరాబాద్: సింగరేణికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు 15 జర్మనీ కంపెనీలు ముందుకు వచ్చాయి. సిమాగ్ టెక్బర్గ్, కామాట్, డీఎంటీ, ఎస్ఎంటీ, క్లీమన్, వీడీఎంఏ ఫ్రాన్ఫుర్ట్, జియో కాన్స్టెక్ తదితర సంస్థల ప్రతినిధుల బృందం సోమవారం సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్తో సమావేశమై ఈ మేరకు ప్రతిపాదనలు ముందుంచింది. ఈ సందర్భంగా శ్రీధర్ తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ‘సింగరేణి భవిష్యత్తులో 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో 15 కొత్త గనులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ గనుల కోసం లాంగ్వాల్, కంటిన్యుయస్ మైనర్, డ్రిల్లింగ్, షాఫ్ట్ సింకింగ్ కోసం అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేసేం దుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలి’ అని జర్మనీ కంపెనీలను కోరారు. ఆయా కం పెనీలు సరఫరా చేసే యంత్రాలు వాటి పూర్తి జీవితకాలం పనిచేసే వరకూ సరఫరాదారు సేవలు అందించేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. తొలుత సింగరేణి గనులను సందర్శించి అవగాహన ఏర్పరుచుకున్నాక ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్పత్తి పెంచవచ్చో ప్రతిపాదనలతో ముందుకు రావాలన్నారు. సింగరేణికి ఉన్న భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా యంత్రాలు అందించి ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడేలా ప్రతిపాదనలు ఉండాలన్నారు. దీనిపై జర్మనీ బృందం సానుకూలత వ్యక్తం చేసింది. -
అందుకే మంచి ఫలితం వచ్చింది!
‘‘తెల్లాపూర్ గ్రామంలో మా స్నేహితుడి అన్నయ్య కొడుకు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆ పాయింట్ని తీసుకుని, ఈ చిత్రం చేశాను. కథ వినగానే నిర్మాతలు సారికా శ్రీనివాస్, భాస్కర్ మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా నిర్మించడానికి అంగీకరించారు. నటీనటులు అందరూ కూడా ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే, మంచి అవుట్పుట్ వచ్చింది. అందుకే మంచి ఫలితం కూడా వచ్చింది’’ అని దర్శకుడు చల్లా మన్మోహన్ అన్నారు. మంచు లక్ష్మీ, శ్రీధర్, ఇంద్రజ, మాస్టర్ ప్రేమ్బాబు, డాలీ ముఖ్య తారలుగా సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ‘బుడుగు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో మన్మోహన్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘మొదటి మూడురోజుల్లోనే సినిమా ఎత్తేస్తున్న ఈ రోజుల్లో మా సినిమా ఐదో రోజుకి కూడా 37 థియేటర్లు పెంచాం. మొత్తం 130 థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా హిందీ హక్కులను సన్నీ ఎంట ర్టైన్మెంట్స్ పొందింది’’ అని చెప్పారు. -
ఎకరంలోపు రైతులకూ.. రూ.30 వేలు
తాడికొండ : రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాల్లో ఎకరంలోపు రైతులకూ రూ.30 వేలు కౌలు ఇవ్వనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం కొత్త జీవో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.దాని ప్రకారం రాజధాని ప్రాంతంలో ఎకరంలోపు ఉంటే కౌలు సొమ్ము పూర్తిగా అంటే రూ.30 వేలు అందుతుందన్నారు. అయితే వేర్వేరు చోట్ల ఉంటే మాత్రం రెండు చెక్కులు రావన్నారు. మంగళవారం రాత్రి తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామంలో రైతులకు కౌలు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి గ్రామ సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ ఏసురత్నం అధ్యక్షత వహించారు. జేసీ శ్రీధర్ మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి నేలపాడు, ఐనవోలు పోటీపడి ఉత్సాహంగా భూముల ఇచ్చాయని అభినందించారు. వచ్చే ఏడాది రైతుల బ్యాంక్ అకౌంట్లలోనే కౌలు సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రైతులు పవర్ఆఫ్ అటార్నీ ఇచ్చిన వెంటనే కౌలు అందిస్తామని చెప్పారు. జూన్లో అభివృద్ధి మొదలవుతుందని చెప్పారు. రైతులు తమ పొలాల్లో ఉన్న వస్తువులను తొలగించాలని సూచించారు. గ్రామాల్లో కూలీలకు నెలకు రూ. 2,500 వంతున పదేళ్ల పాటు పింఛను ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. చదువుకున్న యువతను గుర్తించి ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని జేసీ తెలిపారు. అనంతరం రైతుల నుంచి అగ్రిమెంట్లు తీసుకొని కౌలు చెక్కులు అందించారు. ఇదిలావుండగా, మెట్టరైతులకు ప్యాకేజీ పెంచాలని కోరుతూ అదనపు జేసీ చెన్నకేశవరావు రైతులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అదనపు జేసీ చెన్నకేశవరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, తహశీల్దారు సుధీర్బాబు, ఎంపీపీ వడ్లమూడి పద్మలత, జెడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పోతురాజు శ్రీనివాసరావు, నేలపాడు మాజీ సర్పంచ్ ధనేకుల రామారావు, రైతులు పాల్గొన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : గుంటూరు జేసీ శ్రీధర్
-
ఆ ద్రోహాన్ని క్షమించలేను!
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది. ఆ సమయంలో ఎవరొచ్చారో అర్థం కాలేదు. వంట పనికి బ్రేక్ ఇచ్చి, చేతిలో ఉన్న గిన్నెని గట్టుమీద పెట్టి పరుగుదీశాను. తలుపు తీసి.. ఎదురుగా ఉన్న మావారిని చూసి ఆశ్చర్యపోయాను. ‘శ్రీధర్... నువ్వా?’ అన్నాను విస్మయంగా చూస్తూ. శ్రీధర్ మాట్లాడలేదు. విసురుగా లోనికి వచ్చాడు. ల్యాప్టాప్ని సోఫాలోకి గిరాటేసి, విసవిసా బెడ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. తన ప్రవర్తన వింతగా అనిపించింది. టైమ్ గాని టైములో ఆఫీసు నుంచి వచ్చేశాడు. పైగా అదోలా ఉన్నాడు. ఏం జరిగివుంటుందో అనుకుంటూ లోనికి వెళ్లాను. పక్కన కూర్చుని, ‘అలా ఉన్నావేంటి శ్రీ? ఏదైనా సమస్యా?’’ అన్నాను అనునయంగా. అంతే... అంతెత్తున లేచాడు. ‘ఆపుతావా నీ ప్రశ్నలు? అసలే చిరాగ్గా ఉంది. ఇంకా నా బుర్ర తినకు’... నా మనసు చివుక్కుమంది. కళ్లలో నీళ్లూరాయి. ‘నిన్ను విసిగించాలని కాదు శ్రీ. నువ్వలా ఉంటే చూడలేక అడిగాను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే’ అంటూ లేచాను. దుఃఖపూరితమైన నా స్వరం విని శ్రీధర్ కాస్త తగ్గాడు. ‘ఏం జరిగిందో తెలియాలి అంతే కదా’ అంటూ గబగబా సెల్ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ‘ఇదిగో చూడు’ అంటూ ఫోన్ని నా చేతిలో పెట్టాడు. ఏముందోనని ఆతృతగా చూసిన నేను అదిరిపడ్డాను. ‘ఏంటిది శ్రీ?’ అన్నాను విస్తుపోతూ. ‘నా కొలీగ్ ఒకతను రాత్రి వాటిని చూశాడట. ఇవాళ నా దగ్గరకు వచ్చి మరీ చూపించాడు. నా తల కొట్టేసినట్టయ్యింది. అందరూ ఆఫీసులో దీని గురించే డిస్కషన్. సిగ్గేసి ఇంటికొచ్చేశాను. ఈపాటికి అందరూ వాటిని చూసేసి ఉంటారు. నేను బయటికెలా వెళ్లాలి, అందరినీ ఎలా ఫేస్ చేయాలి? ఛ...’ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సిగ్గుతో మనసు చితికిపోతోంది. అవమానంతో గుండె రగిలి పోతోంది. ఎవరు చేశారీ పని? ఎందుకు చేశారు? నేనేం చేశానని? ఆలోచనలు మెదడును రంపపు కోత కోస్తుంటే... అక్కడ నిలబడలేక వంటింట్లోకి వెళ్లి పోయాను. దుఃఖం పొంగుకొస్తోంది. ఫేస్బుక్లో నా గురించి రాసిన పిచ్చి రాతలు, మార్ఫింగ్ చేసిన నా ఫొటోలు కళ్లముందే కదులుతున్నాయి. నేను మంచిదాన్ని కాదని, పెళ్లికి ముందే గర్భం దాల్చి అబార్షన్ చేయించుకున్నానని, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కూడా నా భర్త కాదని... భగవంతుడా, ఏ ఆడపిల్లా భరించలేని నిందలవి! ఎవరో పన్నిన ఉచ్చులో నా కాపురం చిక్కు కుంది. ఉన్నట్టుండి నా జీవితం పూర్తిగా మారి పోయింది. నా ముఖం చూడ్డానికి కూడా శ్రీధర్ ఇష ్టపడట్లేదు. నాతో మాట్లాడట్లేదు. ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. తలుపులు మూసుకుని గదిలోనే ఉంటు న్నాడు. తనలో తనే కుమిలిపోతున్నాడు. చేయని తప్పుకు మా జీవితాలు బలైపోతున్నాయి. ఎవరో పెట్టిన చిచ్చుకి నా కలలు కాలి బూడిదవుతున్నాయి. దీనికి ఫుల్స్టాప్ పెట్టి తీరాలి. అనుకున్నదే తడవుగా కంప్యూ టర్ ముందు కూర్చున్నాను. జరిగినదంతా వివరిస్తూ హైదరాబాద్ క్రైమ్బ్రాంచ్ డీసీపీకి మెయిల్ పెట్టాను. వారం తర్వాత, డీసీపీ గారి నుంచి ఫోన్. ‘ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేస్తున్నవారెవరో తెలిసింది సుధా... మీరు ఓసారి ఇండియా వస్తే మంచిది.’... డీసీపీ అలా అనగానే శ్రీధర్ని తీసుకుని ఆఘమేఘాల మీద యూకే నుండి ఇండియా బయలుదేరాను. నా బతుకును నరకప్రాయం చేసిన వ్యక్తిని చూడాలని ఆతృతగా హైదరాబాద్ డీసీపీ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి షాకైపోయాను. ‘రజితా... నువ్వా?’ అన్నాను నమ్మలేనట్టుగా. రజిత మాట్లాడలేదు. డీసీపీ సమాధానమిచ్చారు. ‘ఇదంతా చేసింది తనే మిసెస్ సుధా. ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేస్తోన్న కంప్యూటర్ ఐపీ అడ్రస్ను ట్రేస్ చేశాం. పోస్టింగ్స్ మైసూర్లో జరుగుతున్నట్టు తేలింది. ఒకసారి నేను మీ ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు, మీ బెస్ట్ ఫ్రెండ్ రజిత బెంగళూరులో పని చేస్తోందని చెప్పారు కదా. తనకి మైసూర్ వెళ్లే చాన్సెస్ ఎక్కువ ఉండటంతో, తన ఫొటో తీసుకెళ్లి కేఫ్ యజమానికి చూపించాం. గుర్తు పట్టాడు. తను ఆ కేఫ్కి వెళ్లినట్లుగా సీసీ టీవీ ఫుటేజులు చెప్తున్నాయి. తను వెళ్లిన తేదీలు, వేళలు... ఫేస్బుక్లో పోస్టింగ్స జరిగిన తేదీలు, వేళలతో సరిపోయాయి. దాంతో తనని అరెస్ట్ చేశాం.’... ఆయనలా చెప్తుంటే నా బుర్ర తిరిగిపోయింది. రజిత దగ్గరకు వెళ్లాను. తన చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘పక్కపక్క ఇళ్లవాళ్లం. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగాం. కలిసే చదువుకున్నాం. స్నేహితులమే అయినా అక్కాచెల్లెళ్లంత అనురాగంతో మెలిగాం. నువ్వు ఇలా చేశావంటే నమ్మలేకపోతున్నాను. చెప్పు రజితా... నామీద నీకెందుకంత కసి? నేనేం చేశాను?’ నా చేతుల్ని విదిలించికొట్టి, చివ్వున లేచింది రజిత. ‘ప్రాణంగా ప్రేమించిన శ్రీధర్ని తన్నుకు పోయావ్. నా మనసును ముక్కలు చేశావ్. ఇంతకంటే ఏం చేయాలి?’... అదిరిపడ్డాను. ‘శ్రీధర్ని తన్నుకుపోయానా? తను నీ ప్రాణమా? ఏమంటున్నావే?’ అన్నాను అయోమయంగా. ‘శ్రీధర్ని నేను పిచ్చిగా ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పాలనుకునేలోపు నువ్వు తనని వలలో వేసుకున్నావ్. నీవాణ్ని చేసేసుకున్నావ్. అందుకే నిన్ను తన నుంచి దూరం చేయాలనుకున్నాను. ఫేస్బుక్లో నీ గురించి చేతికొచ్చినట్టు రాసి పారేశాను. మార్ఫ్ చేసిన ఫొటోలను అప్లోడ్ చేశాను. శ్రీధర్ నిన్ను వదిలేసి నన్ను పెళ్లి చేసుకోవాలి. అదే నాకు కావాలి’... పిచ్చిదానిలా అరుస్తోన్న రజిత వైపు కొయ్యబొమ్మలా చూస్తూండి పోయాను. నా కళ్లు అప్రయత్నంగానే వర్షించడం మొదలుపెట్టాయి. శ్రీధర్ మీద రజిత ఆశలు పెంచుకున్న విషయం నాకు తెలియదు. ముగ్గురం కాలేజీలో ఫ్రెండ్స్. శ్రీధర్ నాకు ప్రపోజ్ చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను. ఇవన్నీ రజిత స్వయంగా చూసింది. మా పెళ్లిలో దగ్గరుండి తనే అన్నీ చేసింది. అలాంటిది ఈ రోజు ఇలా... ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దాన్ని ఏం అనడానికీ నోరు రాలేదు. ‘అది స్నేహితురాలికి ద్రోహం చేయగలదేమో, తన బెస్ట్ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేయగలదేమో. కానీ నేనలా చేయలేను. కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. తెలియక చేసిన తప్పు అనుకుని మీరు కూడా తనని వదిలేయండి’ అని డీసీపీతో చెప్పి వచ్చేశాను. ఆ తర్వాత చాన్నాళ్లపాటు నా మనసు రజిత చుట్టూనే తిరిగింది. శిక్ష పడనీయకుండా కేసు విత్డ్రా చేసేకున్నాను కానీ... స్వార్థంతో, అసూయతో తను మా స్నేహానికి తల పెట్టిన ద్రోహాన్ని మాత్రం క్షమించలేకపోయాను. బహుశా నా స్థానంలో ఎవరున్నా క్షమించగలిగే వారు కాదేమో! - సుధ (గోప్యత కోసం పేర్లు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి ఫేస్బుక్ అనేది బంధాలను కలుపుకోవడానికి రూపొందింది. కానీ దానివల్ల బాంధవ్యాలు చెడిపోవడం చాలాసార్లు జరుగుతుంది. దానికి ఉదాహరణ ఈ ఉదంతమే. స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేయడానికి ఫేస్బుక్ను వాడుకుందా అమ్మాయి. పోస్టింగ్స చేసిన ఐపీ అడ్రస్ ద్వారా తనని పట్టుకున్నాం. అయితే బాధితురాలు కేసు విత్డ్రా చేసుకోవడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశాం. మనం ఎవరో అవతలి వారికి తెలియదు కదా అని ఫేస్బుక్ ద్వారా పలువురు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే నేను ఫేస్బుక్ని ఫేస్లెస్ బుక్ అంటుం టాను. ఫేస్బుక్ విషయంలో అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పాస్వర్డ్ ఎవరికీ చెప్పకూడదు. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు అందరికీ షేర్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా అసభ్యకరమైన రాతలు రాస్తున్నా, ఫొటోలు అప్లోడ్ చేస్తున్నా, ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు విషయం చెప్పడం మంచిది. జి.పాలరాజు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ హైదరాబాద్ -
పోలీసుల అదుపులో అలేఖ్య
* పోలీసుల కళ్లుగప్పి కెనడాకువెళ్లే ప్రయత్నం * చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు శాఖ * ఆమెతో పాటు తల్లిదండ్రుల అరెస్టు చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బీమా కంపెనీలో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన అకౌంటెంట్ అలేఖ్య(24)ను పోలీసులు పట్టుకున్నారు. పది మందికి పైగా బీమా సొమ్ము చెల్లించిన వారి నుంచి రూ.31 లక్షలు కాజేసిన విషయంపై బ్రాంచ్ మేనేజరు శ్రీధర్ మంగళవారం చిత్తూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడు స్పందించిన సీఐ సూర్యమోహనరావు బుధవారం ఉదయానికే నెల్లూరులోని అలేఖ్య స్వగ్రామానికి చేరుకున్నారు. అలేఖ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు(55), రాజ్యలక్ష్మి (50)లను సైతం అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించి, ఇక్కడ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాతాదారులు చెల్లించే నగదును అలేఖ్య తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి ఆన్లైన్ ద్వారా రూ.31 లక్షలు జమ చేసింది. ఏ రోజుకారోజు బ్యాంకు ఖాతాల్లో జమయ్యే నగదును ఆమె తల్లిదండ్రులు విత్డ్రా చేసుకునే వాళ్లు. జరిగిన మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన ఐసీఐసీఐ బీమా కంపెనీ ప్రతినిధులు అలేఖ్య తల్లిదండ్రుల ఖాతాల్లో ఉన్న నగదును ఫ్రీజింగ్ చేయాలని నెల్లూరులోని బ్యాంకు అధికారులను కోరడంతో ఖాతాలో ఉన్న రూ.2 లక్షలు మాత్రం ఇటీవల విత్డ్రా కాకుండా చేయగలిగారు. అలేఖ్య తండ్రి నెల్లూరు ఆర్టీసీలో పనిచేస్తున్నాడు. ఇతను కొంత కాలంగా మెడికల్ సెలవులో ఉన్నాడు. నిందితులకు పట్టుకోవడానికి వెళ్లిన చిత్తూరు పోలీసులు పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. గత నెల 23న ఈ కుంభకోణం వెలుగు చూడడం.. అదే నెల 19నే అలేఖ్య ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగింది. అంటే ముందుగానే ప్రణాళిక రూపొందిం చుకున్నారు. దీనికితోడు అలేఖ్య తన తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మితో కలిసి కెనడా వెళ్లడానికి పాస్పోర్టులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్టు రావడం కాస్త ఆలస్యం కావడంతో దానికోసం వేచి చూస్తూ పోలీసులకు దొరికిపోయారు. అలేఖ్య, వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మిపై ఛీటింగ్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐ సూర్యమోహనరావు వారిని అరెస్టు చేసి, చిత్తూరులోని నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. వీళ్లకు 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం నిందితులను చిత్తూరు నగరంలోని జిల్లా జైలుకు తరలించారు. పోలీసులను పలువురు అభినందించారు. -
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి
సింగరేణి సీఎండీ వాహనాన్ని అడ్డుకునేందుకు గ్రామస్తుల యత్నం వెళ్లిపోయిన సీఎండీ... గంట పాటు రోడ్డుపై బైఠాయింపు టేకులపల్లి : కోయగూడెం ఓపెన్కాస్టు నుంచి బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వలన వచ్చే దుమ్ము, ధూళితో తమ ప్రాణాలు పోతున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరుతూ సింగరేణి సీఎండీ శ్రీధర్ వాహనాన్ని సోమవారం పెట్రాంచెలక స్టేజీ వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. సీఎండీ కేఓసీని సందర్శించి తిరిగి వస్తుండగా గ్రామస్తులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వేగంగా వాహనం వారిని దాటి వెళ్లిపోవడంతో వెనుక వస్తున్న డెరైక్టర్లు,మిగిలిన అధికారుల వాహనాలను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. వీరికి జెడ్పీటీసీ లక్కినేని సురేందర్రావు, ఎంపీపీ భూక్య లక్ష్మి, సొసైటీ అధ్యక్షులు వాంకుడోత్ పూన్యా, కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్ మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సైలు బత్తుల సత్యనారాయణ, ముత్తా రవికుమార్ల ఆధ్వర్యంలో సిబ్బంది వారిని శాంతింపజేసేందుకు యత్నించారు. కానీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంట పాటు ఆందోళన కొనసాగించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆందోళన ఉధృతం అవుతుండటంతో పోలీసులు, కేఓసీ పీఓ అభ్యర్ధన మేరకు సింగరేణి డెరైక్టర్లు కారు దిగి వచ్చి వారితో మాట్లాడారు. వారం రోజుల్లో పెట్రాంచెలక స్టేజీ నుంచి టేకులపల్లి రోడ్డు పనులు ప్రారంభం అవుతాయని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డి ప్రసాద్, గణితి కోటేశ్వరరావు, ఎండీ రాసుద్దీన్, నోముల భానుచందర్, జమీల్, శ్రీనివాస్, ప్రకాశ్, శంకర్, మారుతీరావు,రెడ్యానాయక్ పాల్గొన్నారు. -
విమానానికి కొత్త రెక్కలు!
విమానాలను చూసి అబ్బురపడని పిల్లలుంటారా? చిన్నప్పుడు అతనూ అంతే. నింగిలోకి ఎగిరే లోహ విహంగాలతో పాటే ఊహాలోకాల్లో విహరించేవాడు... అందుకే.. వందేళ్లుగా పెద్దగా ఏ మార్పులకూ నోచుకోని విమాన రెక్కలకు సరికొత్త్త రూపునిచ్చాడు! ఆకారం మార్చే విద్యతో విమానయానానికి కొత్త రెక్కలు మొలిపించాడు! విమానాల చరిత్రనే మలుపుతిప్పనున్న ఆ రెక్కల సష్టికర్త మన తెలుగువాడు శ్రీధర్ కోట కావడం విశేషం. ఆధునిక విమానం తొలిసారి గాలిలోకి ఎగిరి వందేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సైజు మొదలుకొని ఆకారం వరకూ అనేక రకాలుగా మారిపోయింది. కానీ.. పెద్దగా మారనిది రెక్కలు మాత్రమే. విమానం రెక్కలు దాదాపు వందేళ్లుగా ఇలాగే ఉన్నాయి. కాస్త పెద్దగా లేదా చిన్నగా. అంతే తప్ప నిర్మాణమంతా ఒకే తీరు. ఇంతకూ విమానాలకు రెక్కలెందుకు? పక్షి మాదిరిగా గాలిలో బాగా ఎగిరేందుకు. గగనతలంలో వాతావరణం, గాలి ద్వారా ప్రయాణిస్తూ స్థిరంగా ముందుకు సాగడానికి, గాలి నిరోధాన్ని తట్టుకోవడానికీ అవసరం. అయితే సాంకేతికతలో మార్పు వస్తున్నకొద్దీ విమానాల్లోనూ మార్పులు వచ్చాయి. అలాగే, విమానాల రెక్కల విషయంలోనూ మార్పులు చేసేందుకు అనేక మంది ప్రయత్నించారు. ఫలితం లేకపోయింది. కానీ.. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత శ్రీధర్ కోట దీనిని సాధ్యం చేశారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధనల అనంతరం ఆకారం మార్చుకోగలిగే రెక్కల అంచులు(వింగ్ ఫ్లాప్స్)ను సృష్టించగలిగారు. మడతపెట్టేందుకు వీలయ్యే ఈ అంచులను ‘ఫ్లెక్స్ఫాయిల్స్’గా పిలుస్తున్నారు. ఈ అంచుల సృష్టితో విమానయానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఫ్లెక్స్ఫాయిల్స్ అవసరమేంటి? విమానాల రెక్కలకు కొత్త అంచుల అవసరమేంటో తెలుసుకోవాలంటే ముందుగా ఇప్పుడున్న అంచులతో సమస్యలేంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం విమానాల రెక్కలకు సుమారు 19 అడుగుల పొడవుండే అంచులు(ఫ్లాప్స్)ను వాడుతున్నారు. వివిధ విడిభాగాలతో తయారు చేస్తున్న వీటిని రెక్కకు బిగించే చోట, ఇతర చోట్ల ఖాళీలు మిగిలిపోతున్నాయి. గాలినిరోధాన్ని తగ్గించేందుకోసం వీటిని అవసరమైన విధంగా మార్చుకునే అవకాశమూ లేదు. దీనివల్ల విమానం పైకి ఎగిరేటప్పుడు, కిందికి దిగేటప్పుడు శబ్దం మోత మోగిపోతోంది. గాలి నిరోధం కారణంగా ఇంధన ఖర్చులూ పెరిగిపోతున్నాయి. అందువల్ల ఈ సమస్యలను నివారించేందుకే ఫ్లెక్స్ఫాయిల్స్ అవసరం ఏర్పడింది. ఎలా పనిచేస్తాయి? మడత పెట్టేందుకు వీలయ్యే రెక్క అంచులే ఫ్లెక్స్ఫాయిల్స్. అల్యూమినియానికి బదులుగా మదువైన, దృఢ పదార్థంతో తయారు చేసే ఈ అంచుల్లో ఎక్కడా అతుకులు, ఖాళీలు ఉండవు. వీటిని రెక్కలకు బిగించే చోట సైతం ఖాళీ ఉండదు. అదేసమయంలో ఇది అవసరమైనప్పుడు సాగుతుంది. చాలా తేలికగా కూడా ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలతో పాటు పనితీరు కూడా సమర్థంగా ఉంటుంది. అవసరమైనప్పుడు సులభంగా ఆకారం మార్చుకుంటాయి. అల్యూమినియం అంచుల వాడకం వల్ల రెక్కలో.. అంచులు, రెక్కకు మధ్య ఖాళీలు ఏర్పడతాయి. విమానం రెక్కల అంచులను అవసరమైన విధంగా మడిచేందుకు లేదా తిప్పేందుకూ వీలవుతుంది. గాలి నిరోధాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఖాళీలు లేకుండానే రెక్కలకు ఎలా కావలిస్తే అలా ఇవి అతుక్కుని ఉంటాయి. ప్రయోజనాలేంటి? ఫ్లెక్స్ఫాయిల్స్వల్ల విమాన ఇంధన ఖర్చు 12 శాతం వరకూ తగ్గుతుంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో శబ్దం సుమారుగా 40 శాతం వరకూ తగ్గిపోతుంది. వీటి బరువు కూడా తక్కువే కాబట్టి విమానానికి ఆ మేరకు బరువు కూడా తక్కువే. వీటివల్ల గాలినిరోధం తగ్గడం వల్ల విమానం తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు ఆదా అవుతుంది. అటు పర్యావరణానికీ కీడు తగ్గుతుంది. విమానయానంలోనే కాక ఇతర రంగాల్లోనూ వీటిని ఉపయోగించే అవకాశాలూ ఉన్నాయి. 20 ఏళ్ల సుదీర్ఘ కృషి సికింద్రాబాద్కు చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగి కేవీ సుబ్రమణ్యం కుమారుడైన శ్రీధర్ 1980లో ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత 1984లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ వర్సిటీల్లో ఎంఎస్ పూర్తిచేసిన శ్రీధర్ విమానయానంపై ప్రత్యేక ఆసక్తితో పరిశోధనలు చేపట్టారు. ఈ ఫ్లెక్స్ఫాయిల్స్ గురించి తొలిసారిగా ఇరవై ఏళ్ల క్రితం ప్రతిపాదించారు. తన ప్రతిపాదనను నాసా, అమెరికా వాయుసేనలకు వివరించి ప్రాజెక్టు చేపట్టేందుకు ఒప్పించారు. దీంతో వాయుసేన, నాసాలు శ్రీధర్కు పరిశోధనల నిమిత్తం రూ. 250 కోట్ల నిధులు అందజేశాయి. శ్రీధర్కు అప్పగించిన ప్రాజెక్టుకు ‘అడాప్టివ్ కంప్లెయింట్ ట్రెయిలింగ్ ఎడ్జ్(ఏసీటీఈ)’ పేరుతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశాయి. 2001లో ‘ఫ్లెక్స్సిస్.ఇంక్’ను స్థాపించిన శ్రీధర్ ఎట్టకేలకు ఫ్లెక్స్ఫాయిల్స్ను ఆవిష్కరించారు. 19 అడుగుల పొడవైన సంప్రదాయ అల్యూమినియం రెక్కల అంచులకు ప్రత్యామ్నాయంగా శ్రీధర్ రూపొందించిన ఈ కొత్త రెక్కల అంచులను గల్ఫ్స్ట్రీమ్-3 బిజినెస్ జెట్ విమానానికి అమర్చి ఇటీవల నాసా, వాయుసేనలు విజయవంతంగా పరీక్షించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక విమాన తయారీ కంపెనీలు సైతం శ్రీధర్ ఆవిష్కరణపై ఆసక్తి చూపుతున్నాయి. కాగా, ప్రస్తుతం మిచిగన్లో స్థిరపడిన 55 ఏళ్ల శ్రీధర్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా ఈయన మొత్తం 25 పేటెంట్లు పొందారు. -
ఏడేళ్లలో 17 కొత్త గనులు: శ్రీధర్
బొగ్గు ఉత్పత్తి పెంచడమే లక్ష్యం సింగరేణి సీఎండీగా బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: సింగరేణి విజన్ ప్రకారం రాబో యే ఏడేళ్లలో 17 కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తామని కంపెనీ నూతన చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. దీంతో 32 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు లోటును తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు తనను సీఎండీగా నియమించడం సంతోషంగా ఉందని, అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కొత్త పరిశ్రమలు, కొత్త పథకాలు శరవేగంతో అమలు చేయాలన్న సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో... విదేశాల్లోనూ బొగ్గు బ్లాకులు తీసుకొని ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు చేపడుతామన్నారు. 600 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంటు నిర్మాణానికి సంసిద్ధమవుతున్నట్లు చెప్పారు. సుతీర్థ భట్టాచార్యకు వీడ్కోలు: సింగరేణి సంస్థకు ఇప్పటివరకు సీఎండీగా పని చేసిన సుతీర్థ భట్టాచార్యకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. -
తిట్టాడని.. బాస్ భార్య ఫోటోల మార్ఫింగ్
హైదరాబాద్ : బాస్ తనను తిట్టినందుకు అతని భార్య ఫోటోలను మార్ఫింగ్ ద్వారా అశ్లీలంగా చిత్రీకరించి కంపెనీలోని ఉద్యోగులందరికీ పోస్ట్ చేసిన ఓ ప్రబుద్ధుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీసీ ఎస్.జయరాం తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం హిల్ కాలనీకి చెందిన సేనాపతి శ్రీధర్ (49) హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో ఉద్యోగి. విధులకు తరచుగా ఆలస్యంగా వస్తుండటంతో ఉన్నతాధికారి (బాస్) ఒకరు తీవ్రంగా మందలించాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న శ్రీధర్ ...బాస్ సతీమణి ఫోటోను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా చిత్రీకరించాడు. ఆ ఫోటోలను కంపెనీలని ఉద్యోగులందరికీ మెయిల్ చేశాడు. ఈ నేపథ్యంలో బాస్ పోలీసులను ఆశ్రయించటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
నిమ్స్ మాజీ అధికారి శ్రీధర్ అరెస్ట్
హైదరాబాద్: ఫైళ్లు మాయమైన కేసులో నిమ్స్ మాజీ ఫైనాన్సియల్ కంట్రోల్ శ్రీధర్తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేశారు. అవకతవలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో శ్రీధర్ను సస్పెండ్ చేశారు. శ్రీధర్ విచారణకు సంబంధించిన ఫైల్ మాయం చేశారంటూ నిమ్స్ డైరెక్టర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
నేడు ‘మిషన్ కాకతీయ’పై సమీక్ష
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిషన్ కాకతీయ అమలులో భాగంగా జిల్లాలో చెరువుల పునరుద్ధరణపై శనివారం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి టి.హరీష్రావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. జెడ్పీలో జరిగే ఈ సమావేశంలో జెడ్పీ పాలకవర్గం పాల్గొననుంది. తొలివిడత 545 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం జరిగే సమావేశంలో ప్రణాళికపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సమావేశంలో చర్చించే అంశాలపై శుక్రవారం కలెక్టర్ ఎన్.శ్రీధర్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల్లో పూడిక తీసిన అనంతరం ఆ మట్టిని రైతుల పొలాల్లో వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చెరువుల సర్వే త్వరితంగా పూర్తిచేసి అంచనాలకు వెంటనే మంజూరు తీసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ చక్రధర్, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు భీంప్రసాద్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
జీఎంసీ ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు
ఇన్చార్జి కమిషనర్ శ్రీధర్ అరండల్పేట: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక నర్సరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కమిషనర్ సీహెచ్.శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. తొలుత నగరానికి మంచినీటిని సరఫరా చేసే తక్కెళ్లపాడు వాటర్ప్లాంటును తనిఖీచేశారు. అక్కడ నీటిలో క్లోరిన్శాతాన్ని పరిశీలించారు. అనంతరం ప్లాంటులోని బెడ్లను పరిశీలించి మొత్తం ఆరు బెడ్లు శిధిలావస్థకు చేరడాన్ని గమనించి వాటిస్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. ప్లాంటు విస్తరించి ఉన్న 40 ఎకరాలకు రక్షణగోడను నిర్మించాలని, ప్లాంటుకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఇక్కడ ఎకరం స్థలంలో సొంతంగా నర్సరీని ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నగరంలోని సెంటర్ డివైడర్లు, ఐలాండ్లు, జంక్షన్ల వద్ద గోడలపై విపరీతంగా పోస్టర్లు అతికించి ఉండటం గమనించి వాటిని వెంటనే తొలగించాలన్నా రు. తిరిగి అతికించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నా రు. ఐలాండ్లు, సెంట్రల్ డివైడర్లలో మొక్కలు పెంచాలనని చెప్పారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లు, బ్యానర్లను తొలగించాలన్నారు. గుజ్జనగుండ్ల వాకింగ్ట్రాక్ను పరిశీలించి అక్కడ జిమ్, యోగా సెంటర్, లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, చెరువుకు నీరు పెట్టేందుకు వంకాయలపాడు కాలువ నుంచి నిర్మిస్తున్న పైపులైన్ పనులు పూర్తిచేయాలన్నారు. గుజ్జనగుండ్ల నుంచి పెదపలకలూరు వెళ్లే రహదారిని నిర్మించేందుకు అంచనాలు సిద్దంచేయాలన్నారు. ఈ పర్యటనలో ఎస్ఈ డి మరియన్న, ఈఈలు రాంనాయక్, వెంకటేశ్వర్లు, ఏసిపి రవీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్
దాపులనే కృష్ణమ్మ గలగలలు... దారి పొడవునా తలలూపుతూ స్వాగతం పలుకుతున్న పచ్చని పంట పొలాలు... వాటి మధ్య చిన్న పల్లెటూరు హరిశ్చంద్రపురం. తుళ్లూరు మండలంలోని ఈ గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతుంటుంది. రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలోని ఈ ఊరి రైతులను ఇప్పుడు ఎన్నో సందేహాలు.. భూ సంబంధిత సమస్యలు చుట్టుముడుతున్నాయి. శుక్రవారం సాక్షాత్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్గా మారి ఆ గ్రామానికి వెళ్లారు. పంట పొలాల్లో పనిచేస్తున్న కూలీలు, రైతులను ఆప్యాయంగా పలుకరించారు. వారి సమస్యలు విని, వాటి పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. - సాక్షి, గుంటూరు/గుంటూరు సిటీ జాయింట్ కలెక్టర్ : హరిశ్చంద్రపురం గ్రామ ప్రజలకు నమస్కారం. గ్రామస్థులు : నమస్కారమండి. జేసీ : సాక్షి సహకారంతో మీ గ్రామంలో ఉన్న సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు విలేకరిగా మీ ముందుకు వచ్చాను. మీ సమస్యలను నాకు చెప్పండి. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తాను. జేసీ : (గామస్తుడిని పలుకరించి) మీ పేరేమిటి? మీ సమస్యేమిటి? గ్రామస్తుడు : నా పేరు శ్రీనివాసరావండీ, నాకు గ్రామంలో ఆరు ఎకరాల పొలం ఉంది సార్. వాటికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అడంగల్ కాపీల్లో వివరాలు తప్పుల తడకగా ఉండడం వల్ల ఇబ్బందులొస్తున్నారుు. నా సమస్య తీర్చండి సార్ జేసీ : భూములకు సంబంధించిన అన్ని రికార్డులను ప్రస్తుతం కంప్యూటరీకరిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా రైతుల పాస్బుక్లను ఆధార్ కార్డులకు అనుసంధానించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టాం. మీరు మీ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా మీ సేవ ద్వారా సమస్యను సత్వరం పరిష్కరించుకోవచ్చు. పాస్ పుస్తకాలను కూడా ఆధార్ తో అనుసంధానించుకోండి. భవిష్యత్తులో ఇక ఇబ్బందులు తలెత్తవు. జేసీ : మీ సమస్యేమిటయ్యూ? కృష్ణావతారం : ఈ గ్రామంలోని పొలాన్ని మా నాన్నగారు పదేళ్ళ కిందట కొన్నారు. దాని దస్తావేజులు కూడా మా వద్ద ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అది అనువంశికంగా నమోదై ఉంది. దీనికి పరిష్కారమేంటి సార్? జేసీ : మీ దగ్గర భూమి తాలూకు దస్తావేజులు ఉన్నప్పుడు అదేమంత పెద్ద సమస్య కాదండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలతో రెవెన్యూ అధికారులను కలవండి. వారు అనువంశికం కాదని రాసిస్తారు. జేసీ : ఇక మీ సమస్యలేంటమ్మా? శ్రీలత : గ్రామంలోని భూమి మా నాయనమ్మ పేరు మీద ఉంది సార్. అడంగల్లో మాత్రం తాతయ్య పేరు నమోదై ఉంది. ఇప్పుడు తాతయ్య లేరు. అడంగల్లో మా తాతయ్య పేరు మార్చాలంటే ఏం చేయాలి సార్? జేసీ : మీ తాతయ్య డెత్ సర్టిఫికెట్ ఉందామ్మా? శ్రీలత : లేదు సార్. జేసీ : ప్రస్తుతం ఆదాం అనే పేరు అడంగల్లో ఉంది. ఆయన మీ నాయనమ్మకు భర్తే అని నిర్ధారించే ఆధారాలు ఏమి ఉన్నా వాటిని తీసుకుని రెవెన్యూ అధికారులను కలవండి. అడంగల్లో కూడా మీ నాయనమ్మ పేరు నమోదు చేస్తారు. స్వర్ణకుమారి : మా ఆయన పేరు మీద ఈ గ్రామంలో 37 సెంట్ల స్థలం ఉంది. ఆయన చనిపోయారు. నాకు రేషన్కార్డు తప్ప మరే ఇతర ఆధారం లేదు. ఆ స్థలం నా పేరు మీద మార్చుకునే వీలుందా సార్? జేసీ : తప్పకుండా వీలవుతుందమ్మా. నీ వద్ద ఉన్న రేషన్కార్డు ఆధారంగా ఆయన డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకుని రెవెన్యూ అధికారులను కలవండి. 45 రోజుల్లో దాన్ని మీ పేరు మీద బదిలీ అయిపోతుంది. జేసీ : ఏం పెద్దయ్యూ పింఛన్ అందుతోందా? పెద వరదయ్య : నాకు 66 ఏళ్ల వయసు. అయినా నాకు పింఛన్ అందడం లేదు సారూ... ఆధార్కార్డులో 64గా నమోదవడం వల్లే ఈ సమస్య వచ్చింది. ఏం చేయాలి సార్? జేసీ : 65 ఏళ్లు దాటితేనే పింఛన్ అందుతుంది. ఆధార్ కార్డులో పొరపాటుగా నమోదవడం వలన ఇలా జరిగింది. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పింఛన్ అందేలా చూస్తా.. జేసీ : (రైతులందరినీ ఉద్ధేశించి) కొత్తగా వచ్చిన వీఆర్ఓ బాగానే సహకరిస్తున్నారా? లేక ఇబ్బంది పెడుతున్నారా? రైతులు : బాగానే పని చేస్తున్నారు సార్. సమస్యలపై ఆరా.. గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన జేసీ గ్రామంలోని రోడ్డు వెంట నడుస్తూనే రైతులను సాదరంగా పలకరించారు. దారిన పోతున్న కృష్ణయ్య అనే ఒక రైతును ఆపి రుణమాఫీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జేసీ : ఏం పెద్దయ్యా నీ పంటరుణం మాఫీ అయిందా..? కృష్ణయ్య : మా ప్రాంతంలో అసలు అరటి పంటే వేయం. కానీ పంట రుణాలను అరటి తోటల సాగుకు తీసుకున్నట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీని వల్ల మాకు తీవ్ర అన్యాయం జరిగింది. జేసీ : అలాగా.. దీనిపై స్వయంగా ఆర్డీవోతో విచారణ జరిపిస్తా. వాణిజ్య పంటలే పండిస్తున్నట్లు తేలితే రుణ మాఫీ జాబితాను తిరిగి సరిచేసే ప్రయత్నం చేస్తాం. మాతంగి నాగేశ్వరరావు : మా తండ్రి రామారావు నవంబర్ 15వ తేదీన ఇసుక తోలే పనిలో ఉండగా కృష్ణానదిలో మునిగి చనిపోయారు. ఆపద్బంధు కింద మా కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా చూడండయ్యా.. జేసీ : దరఖాస్తు చేసుకుంటే తప్పక సాయమందేలా చూస్తాం. పంట పొలాల్లో రైతులు, కూలీలతో.. జేసీ : పనులు పుష్కలంగా దొరుకుతున్నాయా? కూలీ ఎంత దక్కుతుంది? మస్తాన్, రైతు కూలీ : ఫర్వాలేదు సార్.. షేక్ హిదయతుల్లా, రైతు: పత్తికి మద్ధతు ధర దక్కడం లేదండి, అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది జేసీ : దగ్గరలో ఉన్న సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్తే గిట్టుబాటు ధర దక్కుతుంది. ఇప్పుడు అమ్మకాల ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతు బ్యాంకు ఖాతాలోనే నేరుగా నగదు జమ అవుతుంది. వెంకటేశ్వరరావు, నిమ్మరైతు : వ్యవసాయంపై మమకారంతో రైల్వే ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా. 2007లో క్రాప్ లోన్ తీసుకుని నిమ్మ సాగుచేశా. లాంఫారం శాస్త్రవేత్తల సూచనల మేరకు అందులో అంతర్ పంటలు కూడా వేస్తున్నానండి. ప్రస్తుతం రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. జేసీ : పేరు ఎందుకు లేదో విచారణ జరిపించి, న్యాయం జరిగేలా చూస్తా. అంతర్ పంటలు వేసుకునే విత్తనాల కొనుగోలుకు అవసరమయ్యే సబ్సిడీ కూడా అందేలా కృషిచేస్తా. -
అంతా కొత్త వాళ్లతో...
‘గోవిందా గోవిందా’, ‘స్వామి రారా’ తరహాలో ‘ఓం మంగళం మంగళం’ పేరుతో ఓ కామెడీ థ్రిల్లర్ రూపొందనుంది. ‘మధుర’ శ్రీధర్, డా. ఎం.వి.కె. రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సంజీవరెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా విశేషాలను ‘మధుర’ శ్రీధర్ తెలియజేస్తూ -‘‘మాఫియా నేతృత్వంలో నడిచే కథ ఇది. కథానుగుణంగా నటీనటులందరూ కొత్తవారైతేనే బాగుంటుందనిపించింది. అందుకే ఆన్లైన్లో స్టార్హంట్ నిర్వహించనున్నాం. జనవరి 15లోగా నటీనటుల్ని ఎంపిక చేసి, అదే నెలాఖరులో షూటింగ్ మొదలు పెడతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సహనిర్మాత: రాజ్ కందుకూరి. -
‘ముచ్చర్ల’లో హడావుడి
ముచ్చర్ల ప్రాంతంలో ఆదివారం ఉన్నతాధికారులు హడావుడి చేశారు. ఫార్మాసిటీకి అనువైన భూములను పరిశీలించారు. 3న సీఎం కేసీఆర్తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కందుకూరు మండలం ముచ్చర సమీపంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్చంద్ర, టీఐఐసీ ఎండీ జయేష్రంజన్, కలెక్టర్ ఎన్.శ్రీధర్, మహబూబ్నగర్ కలెక్టర్ ప్రియదర్శిని, జేసీ చంపాలాల్ ముచ్చర్ల పరిసరాల్లో పర్యటించారు. సర్వే నంబర్లు, మ్యాప్లతో ప్రభుత్వ భూముల పరిధిపై ఆరా తీశారు. అదే రోజు సీఎం పర్యటించనున్న మంచాల సమీపంలోని రాచకొండ గుట్టల్లో ఓఎస్డీ అడిషనల్ ఎస్పీ రాధాకిషన్రావుతోపాటు పోలీస్ ఉన్నతాధికారులు మోహన్రెడ్డి, శివరాంరెడ్డి పర్యటించారు. సమీప తండాలను పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి. కందుకూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు అవసరమైన భూముల పరిశీలనకు ఉన్నతాధికారుల బృందం ఆదివారం కందుకూరు మండలంలోని ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూములను పరిశీలించింది. ఈ నెల 3న మండల పరిధిలోని ముచ్చర్ల, మహబూబ్నగర్ జిల్లా ఆమన్గల్లు మండలం పరిధిలోని భూములను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ తో పాటు ఫార్మారంగ సంస్థల అధినేత లు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలివచ్చింది. పరిశ్రమల ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్చంద్ర, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, టీఎస్ ఐఐసీ ఎండీ జయేష్రంజన్తో పాటు రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల కలెక్టర్లు ఎన్.శ్రీధర్, ప్రియదర్శినిలతోపాటు ఆయా జిల్లాల ఉన్నతాధికారులు తరలివచ్చారు. ఉన్నతాధికారులు ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 288లోని ప్రభుత్వ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మ్యాప్ల ద్వారా ఎక్కడ ఎంత భూమి లభ్యమవుతుందో తెలుసుకున్నారు. సర్వే నంబర్ 288లోని 2747 ఎకరాలతో పాటు మహబూబ్నగర్జిల్లా పరిధిలోని సర్వేనంబర్ 260లో ఉన్న 1800 ఎకరాల భూములు ఫార్మాసిటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయా లేదా అనే విషయాన్ని సర్వే మ్యాప్ల ద్వారా పరిశీలించారు. సీఏం ఏరియల్ వీక్షణానికి వచ్చేటప్పటికీ సరిహద్దులు కన్పించేలా పెద్ద పెద్ద జెండాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు జిల్లాల డీఎఫ్ఓలు, ఏడీఏలు, జేసీలు కూర్చొని రికార్డులను సిద్ధం చేయాలన్నారు. కాగా ఆ భూములకు దగ్గర్లో ఉన్న మీర్కాన్పేటలోని సర్వేనంబర్ 112, 120ల్లోని 1200 ఎకరాల భూమి విషయమై ఆరా తీశారు. అనంతరం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి వెనుదిరిగారు. నాలుగు హెలిప్యాడ్లు.. కాగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని భూముల పరిశీలనకు సీఎం బృందాన్ని తీసుకొచ్చే నాలుగు హెలికాప్టర్ల కోసం ఆ భూముల్లో అనువైన స్థలాలను ఎంపిక చేసి హెలిప్యాడ్లు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సిబ్బందిని ఆదేశించారు. భోజన వసతి, లోనికి వెళ్లడానికి మార్గాన్ని సిద్ధం చేయాలని సూచించారు. వారి వెంట రెండు జిల్లాల జేసీలు చంపాలాల్, శర్మ, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ టీవీ శశిధర్రెడ్డి, ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ, ఆర్డీఓ యాదగిరిరెడ్డి, తహసీల్దార్ సుశీల, జెడ్పీటీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి, స్థానిక సర్పంచ్ నర్సింహ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆశ్చర్యంగా చూసిన స్థానికులు.. కాగా సీఎం కేసీఆర్ ఫార్మాసిటీ నెలకొల్పనున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఉన్నతాధికారుల బృందం ఆఘమేఘాల మీద హెలికాప్టర్లో రావడంతో స్థానికులు ఆశ్చర్యంతోపాటు సంబరపడుతున్నారు. మహబూబ్నగర్జిల్లా పరిధిలోని పిరమిడ్ ప్రాంగణంలో హెలికాప్టర్లో ఉన్నతాధికారులు, వాహనాల్లో స్థానిక అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫార్మసిటీ ఏర్పాటుకు ఇంత వేగంగా పనులు జరుగుతుండటంపై స్థానికులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
చామంతులు.. ప్రగతి కాంతులు!
హైదరాబాద్కు చెందిన శ్రీధర్(9705524169), శ్రీనివాస్లు మండల పరిధిలోని కొడిప్యాక శివారులో 10 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. సాగుకు యోగ్యం కావనుకున్న నేలలో చామంతి సాగు చేపట్టారు. మొత్తం భూమిలో చామంతికి సంబంధించిన మ్యారీగోల్డ్తోపాటు వివిధ రంగుల చామంతి పూలను సాగు చేస్తూ హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. మూడు నెలలకు కోతకు వచ్చే ఈ పంటను ప్రతినిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తోట పనులను చూసుకునేందుకు నాయుడు అనే వ్యక్తిని నియమించారు. తరచూ వచ్చిపోతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అతనికి వివరిస్తుంటారు. ఎకరా భూమిలో సుమారు 10నుంచి 12వేల మొక్కలు సాగు చేయవచ్చన్నారు. ఒక చామంతి మొక్కను సీజన్ను బట్టి రూ.4 నుంచి రూ.12కు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. మూడు నెలల పాటు మొక్కను సంరక్షించేందుకు సుమారు రూ.40నుంచి రూ.50 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూడు నెలల తర్వాత ఒక మొక్క నుంచి కిలోన్నర నుంచి రెండు కిలోల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు పువ్వులు చేతికి వస్తాయని చెప్పారు. కిలో పూలకు మార్కెట్లో స్థిరంగా రూ.40 నుంచి రూ.70 వరకు పలుకుతుందని తెలిపారు. దీపావళి, కార్తీకపౌర్ణిమ, బతుకమ్మ పండుగ తదితర సీజన్లలో వీటి ధర కిలోకు రూ.200 నుంచి రూ.300 వరకు కూడా పలుకుతుందన్నారు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నందున కూలీల అవసరం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం చామంతి సాగు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఇతర ప్రాంతాలతో పాటు స్థానిక రైతులు కూడా తమ తోటను చూసేందుకు వస్తున్నారని తెలిపారు. సలహాల కోసం సంప్రదించాలన్నారు. -
కలెక్టర్ క్షమాపణ చెప్పాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పింఛన్లు రాలేదని చెప్పుకునేందుకు వెళ్లిన వికలాంగుల పట్ల కలెక్టర్ దౌర్జన్యంగా వ్యవహరించడం గర్హనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు అందె రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో వీహెచ్పీఎస్ నేతలపై జిల్లా యంత్రాంగం చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్, ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడి చేపట్టేందుకు వచ్చిన పలువురు వికలాంగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వారిని విడుదల చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వికలాంగులను కించపర్చేలా వ్యవహరించిన కలెక్టర్ శ్రీధర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుడైన వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కాళ్ల జంగయ్యను కలెక్టర్ తన చాంబర్నుంచి సిబ్బందితో గెంటివేయించారని అన్నారు. దళితునిపట్ల అనుచితంగా వ్యవహరించిన కలెక్టర్, సిబ్బందిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. అదేవిధంగా కలెక్టర్ శ్రీధర్ 24గంటల్లో వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ధర్నాలు, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వికలాంగుల పట్ల కలెక్టర్ చేసిన పరుషపదజాలానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. కలెక్టర్పై మానవ హక్కుల సంఘంలోనూ ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా వికలాంగుల సంఘ నేతల వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ.. కలెక్టర్ సేవలను కొనియాడుతూ టీఎన్జీఓ నేతలు బుధవారం ప్రతికా ప్రకటన చేయడం కొసమెరుపు. -
లెనిన్ ఆశయాలు సాధించాలి
విజయవాడ స్పోర్ట్స్ : అంతర్జాతీయ ఆర్చర్, కోచ్ చెరుకూరి లెనిన్ నాలుగో వర్ధంతి నగరంలో చెరుకూరి లెనిన్ -వీఎంసీ ఆర్చరీ అకాడమీలో శుక్రవారం జరిగింది. అకాడమీ ఆవరణంలో లెనిన్ విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు ప్రసంగించారు. గద్దె రామ్మోహన్రావు మాట్లాడుతూ సంప్రదాయ విలువిద్య క్రీడలో అహర్నిశలు శ్ర మించి కామన్వెల్త్ గేమ్స్లో తన శిష్యబృందంతో పతకాలు సాధించడంలో సఫలీకృతుడయ్యారని గుర్తుచేశారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని క్రీడా రాజధానిగా తీర్చిది ద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. రియో ఒలింపిక్స్లో దేశానికి ఆర్చరీ పతకాన్ని అందించే క్రీడాకారులు శిక్షణ పొందుతున్న చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి అవసరమైన కొరియన్ కోచ్ నియామకంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. చెరుకూరి లెనిన్ స్ఫూర్తితో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని సూచించారు. మేయర్ శ్రీధర్ మాట్లాడుతూ చిన్నతనంలో ద్రాణాచార్యుడిగా పిలిపించుకున్న ఘనత ఒక్క లెనిన్కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు నగర పాలక సంస్థ సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ పతక విజేత పూర్వాష సుధీర్ షిండే సన్మాన కార్యక్రమంలో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ రఘునందన్రావు, పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు సమక్షంలో కొరియన్ కోచ్ కావాలని లెనిన్ తండ్రి చెరుకూరి సత్యనారాయణ కోరారని, స్పందించిన సీపీ తక్షణమే బడ్జెట్ ఎంత కావాలని కోరగా, రూ.1.39 కోట్లకు నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి, స్పాన్సర్ల నుంచి సేకరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి కె.పి.రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీవో పి.రామకృష్ణ, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ చైర్మన్ రామ్ బొబ్బా, జిల్లా చైర్మన్ కె.పార్థసారథి, కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఐద్వా నాయకురాలు వనజకుమారి, అకాడమీ ఆర్చర్లు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అకాడమీకి రూ.లక్ష విరాళం ఆసియా క్రీడల్లో తన కుమార్తె కాంస్య పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన చెరుకూరి ఓల్గా-వీఎంసీ అకాడమీకి పూర్వాష సుధీర్ షిండే తండ్రి సుధీర్షిండే (మహారాష్ట్ర-అమరావతి) లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. తొలుత విశాఖపట్నం హుదూద్ బాధితల కోసం సీఎం సహాయ నిధికి ఇవ్వాలని రూ.లక్ష చెక్కును ఆయన ఎమ్మెల్యేలకు ఇవ్వగా వారు అకాడమీకి ఇవ్వాలని సూచించా రు. ఈ మేరకు ఆ చెక్కును తన కుమార్తె పూర్వాషతో కలిసి ఎమ్మెల్యేల చేతులు మీదుగా చెరుకూరి సత్యనారాయణకు అందజేశారు. -
ఆగిన శ్వాస.. ఆవిరైన ఆశ
చిన్నారి గిరిజ బతికొస్తుందనుకున్నవారికి నిరాశే మిగిలింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. గిరిజ మృత్యువాత పడిందన్న వార్త ఆమె కుటుంబీకులనే కాదు.. మూడు రోజులుగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని తీవ్ర విషాదంలో ముంచింది. ఆదివారం ఉదయం బోరుబావిలో పడి మృతి చెందిన చిన్నారి గిరిజను అధికారులు మంగళవారం రాత్రి 8:15కు బయటకు తీశారు. 56 గంటలపాటు శ్రమించిన యంత్రాం గం.. 45 అడుగుల లోతులో కూరుకుపోయిన గిరిజ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీసుకురాగలిగింది. కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతోపాటు మంత్రి మహేందర్రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. గిరిజ అంత్యక్రియలు మంగళవారం రాత్రి 9.30కు ఆమె స్వగ్రామమైన ఎంపీపటేల్గూడలో నిర్వహించారు. ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకున్న ఆమె తల్లి సునీత సమాధి పక్కనే గిరిజ భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఇబ్రహీంపట్నం/ మంచాల: భయపడినంత దారుణం జరిగిపోయింది. నిర్లక్ష్యం చిన్నారి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. నీళ్లు పడకపోవడంతో పూడ్చకుండా వదిలేసిన బోరుబావి ఐదేళ్ల చిన్నారి గిరిజ పాలిట మృత్యుకుహరంగా మారింది.. బోరుబావిలో పడిపోయిన గిరిజను రక్షించేం దుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యా యి. దాదాపు 56 గంటలపాటు కొనసాగిన సుధీర్ఘ శ్రమ అనంతరం గిరిజ బోరుబావిలోనే తుదిశ్వాస విడిచిందన్న సమాచారాన్ని మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటల తరువాత అధికారికంగా ధృవీకరించారు. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన చివరకు విషాదంగానే ముగిసింది. ఫలించని అధికారుల ప్రయత్నాలు.. చిన్నారి గిరిజను ప్రాణాలతో సురక్షితంగా కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం చివరి దాకా చేసిన ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. చిన్నారి గిరిజ బోరుబావిలో పడిం దన్న సమాచారం తెలిసిన వెంటనే.. అధికార యంత్రాంగం మొత్తం మంచాల గ్రామానికి కదిలింది. ఆపదలో ఉన్న చిన్నారిని కాపాడేం దుకు సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నాలు కొనసాగాయి. విధి వక్రీకరించింది.. మానవ ప్రయత్నాలేవి ఫలించలేదు.. గిరిజను కాపాడే అన్ని ప్రయత్నాలు.. గిరిజ ప్రాణాలపై ఆమె బంధువులు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యే విధంగా ఫలితం వచ్చింది. ప్రాణాపాయం నుంచి బయటపడుతుందని భావించిన చిన్నారి గిరిజ.. విగతజీవిగా బోరుబావిలోంచి బయటపడుతుందన్న చేదు నిజం చిన్నారి బంధువులతోపాటు అధికార యంత్రాంగాన్ని కూడా విషాదంలోకి నెట్టింది. గిరిజ బోరుబావిలో పడిపోయిందన్న సమాచారం తెలిసినప్పటి నుంచి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిన ఆమె అమ్మమ్మ అయిలమ్మ, తండ్రి అయిలయ్య ఇతర బంధువులు మరింత కుంగిపోయారు. నిద్రాహారాలు మాని.. బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను ప్రాణాలతో కాపాడేందుకు ఉన్నతాధికారులు నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ.రెడ్డి కనబర్చిన శ్రద్ధ ఇతర ఉద్యోగలకు ఆదర్శంగా నిలి చింది. దాదాపు రెండు రోజుల పాటు జేసీ అర్ధరాత్రి దాటిన తరువాత కూడా రెస్క్యూటీంకు అందుబాటులో ఉన్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్రెడ్డి, కలెక్టర్ శ్రీధర్ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అడుగడుగునా ఆటంకాలే.. బోరుబావిలో ఉన్న గిరిజ పరిస్థితిని తెలుసుకునేందుకు దాదాపు రెండు రోజుల పాటుగా ఉత్కంఠ తప్పలేదు. బోరుబావిలో ఉన్న గిరిజ ను సురక్షితంగా కాపాడేందుకు చేపట్టిన తవ్వకాల్లో అడుగడునా ఆటంకాలే ఎదురయ్యాయి. దాదాపు 45 అడుగుల లోతులో గిరిజ పడిపోయిందని ధృవీకరించుకుని ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ సోమవారం ఉదయం వరకే కొలిక్కి వస్తుందని అందరూ భావించారు. 35 అడుగుల మేరకు తవ్వకాలు జరిపిన తరువాత బండరాయి అడ్డురావడంతో తవ్వకాలకు అం తరాయం ఏర్పడింది. 50 అడుగులకంటే అధికంగా సమాంతర తవ్వకాలు చేపడితే గిరిజను బయటకు తీయవచ్చని నిర్ధారణకు వచ్చి తవ్వకాలను ప్రారంభించిన రెస్క్యూటీంకు 41 అడుగుల తవ్వకాల అనంతరం మళ్లీ బండరాయి అడ్డుతగలడంతో మరో రెండు గంటల్లో పని పూర్తవుతుందనుకుంటున్న తరుణంలో మరిం త జాప్యం ఏర్పడింది. -
రాజకీయ ‘పిడి’కిలి
శేషాచలం అడవుల్లో ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్న స్మగ్లర్లపై ‘పిడి’కిలి బిగించడంలో కలెక్టర్ సిద్ధార్థ్జైన్ దాటవేత ధోరణి అవలంబిస్తుండడంలో ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై ఆయన సంతకం చేయకపోవడం గమనార్హం. ఆ ఫైలుపై ఇన్చార్జ్ కలెక్టర్ హోదాలో శ్రీధర్ సంతకం చేసి ప్రభుత్వానికి పంపడంతో.. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై శుక్రవారం పీడీ చట్టాన్ని ప్రయోగించింది. కలెక్టర్ సిద్ధార్థ్జైన్ తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండడంపై పోలీసు వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసిన విషయం విదితమే. ఆ టాస్క్ఫోర్స్, పోలీసుల నేతృత్వంలో ఇప్పటిదాకా 191 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్కు ఎస్పీ ప్రతిపాదనలు పంపితే, కలెక్టర్ సంతకం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలి. పీడీ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుచేసిన సలహా మండలి సమావేశమై.. ఆ నివేదికపై చర్చించి, ఆమోదముద్ర వేయవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు. రాష్ట్ర సలహా మండలి ఆదేశాల మేరకే పీడీ చట్టాన్ని స్మగ్లర్లపై ప్రయోగిస్తారు. కానీ.. ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ పంపిన ఫైలుపై కలెక్టర్ సిద్ధార్థ్జైన్ సంతకం చేసి, ప్రభుత్వానికి పంపడంలో దాటవేత వైఖరిని అనుసరిస్తున్నారు. తాజాగా ఐదుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని ఎస్పీ జి.శ్రీనివాసరావు పంపిన ఫైలుపై సంతకం చేయకపోవడం అందుకు తార్కాణం. సంతకం చేయరెందుకో... వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి మండలం అప్పయ్యగారిపల్లెకు చెందిన గట్టుబాబు అలియాస్ శివప్రసాద్నాయుడు 20 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడు. చిత్తూరుకు చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంతనాయుడుపై 11 కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రానికి చెందిన పుల్లకుమార్పై 13, విజయ్కుమార్పై 13 స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. రాయచోటికి చెందిన రెడ్డెప్పరెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయి. ఈ ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్పీ జి.శ్రీనివాసరావు ద్వారా వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు 20 రోజుల క్రితం ఫైలు పంపారు. ప్రభుత్వ కార్యాకలాపాల్లో జిల్లా అధికారయంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోన్న కలెక్టర్.. తాను మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయకుండా నాన్చుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తొమ్మిది మంది అంతర్జాతీయ ఁఎర్ర* స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించే ఫైలు కూడా కలెక్టర్ సంతకం చేయడంలో వెనుకంజ వేశారు. శ్రీధర్ చొరవతో తొమ్మిది మందిపై పిడికిలి.. అంతర్జాతీయ స్మగ్లర్లు ఆయిల్ రమేష్, రియాజ్ ఖాన్, హమీద్ ఖాన్, లక్ష్మణ్ నాయక్, లక్ష్మణన్, మహ్మద్ రఫీ, అసిఫ్ అలీ ఖాన్, విక్రమ్ మెహందీ, శరణన్లను జూలై 15న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ యాక్ట్ను ప్రయోగించేందకు అనుమతి ఇవ్వాలని అప్పటి చిత్తూరు ఎస్పీ రామకృష్ణ జూలై 16న కలెక్టర్ సిద్ధార్థ్జైన్కు ప్రతిపాదించారు. దీనిపై కలెక్టర్ దాటవేత ధోరణి అవలంబించారు. అనంతరం కలెక్టర్ సిద్ధార్థ్జైన్ సింగపూర్ పర్యటనలో ఉన్న వారం రోజుల్లో అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఇన్చార్జ్ కలెక్టర్గా వ్వయహరించారు. ఆ తొమ్మిది మంది స్మగ్లర్లపై పీడీ యాక్ట్ను ప్రయోగించేందుకు ఆగస్టు 27న ఈయన అనుమతి ఇచ్చారు. శ్రీధర్ అప్పట్లో పంపిన నివేదికను సెప్టెంబర్ 19న పరిశీలించిన పీడీ చట్టం సలహా మండలి ఇన్చార్జ్ కలెక్టర్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసింది. ఆ తొమ్మిది మంది అంతర్జాతీయ స్మగ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీధర్ చొరవ వల్లే ఆ తొమ్మిది మందిపై ప్రభుత్వం పీడీ చట్టాన్ని ప్రయోగించిందని పోలీసులు స్పష్టీకరిస్తున్నారు. -
వాడు చాలా బాగా రాసిండు
... ఇది మా నాన్న ప్రశంస మాడభూషి శ్రీధర్ కాలమిస్టుగా న్యాయశాస్త్ర ఆచార్యుడిగా పరిచయం. సామాజిక, రాజకీయ విశ్లేషకులుగా తెలిసిన వ్యక్తి. ఆ మధ్య కేంద్ర సమాచార కమిషనర్గా ఎదిగారనీ తెలుసు. అంతకంటే ముందు ఆయన పాత్రికేయుడు. పాత్రికేయుల కోసం పాఠాలు రాసిన మేధావి. ఎంత ఎదిగినా కౌమార దశలో తండ్రి నుంచి అందుకున్న ప్రశంసా వాక్యమే మకుటంగా భావిస్తారాయన. మీ బాల్యం, చదువు ఎక్కడ? అంతా వరంగల్లోనే. నాన్న ఎం.ఎస్ ఆచార్య, స్వాతంత్య్ర సమరయోధులు, జనధర్మ వారపత్రిక, వరంగల్ వాణి దినపత్రికల వ్యవస్థాపకుడు, సంపాదకుడు. అమ్మ రంగనాయకమ్మ గృహిణి. చదువు అంటారా... ఇంటికి దగ్గరగా ఉన్న చెట్టుకింద బడిలో, వరంగల్ లా కాలేజ్, ఉస్మానియా యూనివర్శిటీలలో సాగింది. న్యాయశాస్త్రంలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసి మళ్లీ జర్నలిజంలో పి.జి ఎందుకు చేయాలనిపించింది? మీ ప్రశ్న చిన్నదే. దానికి సమాధానం చెప్పాలంటే నా జీవిత పుస్తకాన్ని తెరవడమే. పెండేకంటి లా కాలేజ్లో లా క్లాసులు తీసుకుంటూ రచన జర్నలిజం కాలేజ్లో బీసీజే, ఎంసీజే చేశాను. న్యాయశాస్త్రం, జర్నలిజం, సమాచార చట్టం... మొత్తం ఎన్ని పుస్తకాలు, వ్యాసాలు రాసి ఉంటారు? పుస్తకాలు 30కి పైగా. వ్యాసాలు వేలల్లో ఉంటాయి. న్యాయశాస్త్రాన్ని విశ్లేషిస్తూ వ్యాసాలు రాసిన తొలి తెలుగు వ్యక్తి మీరేనేమో! పెద్దలున్నారు. విస్తృతంగా రాసింది నేనే కావచ్చు. సమాచార హక్కు చట్టం సామాన్యుడికి ఎంత వరకు అందుబాటులోకి వచ్చిందంటారు? సామాన్యుడికి సమాచారం కోసం నిలదీసి అడిగే హక్కునిచ్చింది. అధికార వర్గాల్లో సమాచారాన్ని ఇచ్చి తీరాల్సిందే, ఇద్దాం అనే పరిస్థితులు వస్తున్నాయి. ఈ చట్టం సామాన్యుడిని సాధికారిక శక్తిగా మారుస్తుంది. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఏమనిపించింది? అది యాదృచ్ఛికమైన అద్భుత సంఘటన. సిఫార్సు లేకుండా దరఖాస్తు ఆధారంగా ఎంపిక కావడం అంటే ఈ వ్యవస్థ నాకు ఇచ్చిన గౌరవం అనిపించింది. కష్టపడితే ఫలితం ఉన్నతంగా ఉంటుందనిపించింది. అప్పటి విధులకు- ఇప్పటి విధులకూ తేడా? జర్నలిస్టుగా, రచయితగా, టీచర్గా అప్పుడు సమాచారం ఇవ్వడం నా బాధ్యత. సమాచారాన్ని ఇప్పించడం ఇప్పటి విధి. ఇందుకు అధికారం తోడుంది. మీరు నమ్మే సిద్ధాంతం?... జ్ఞానాన్ని ఇతరులకు చెప్పాలి. అందుకు నేను ఎంచుకున్న మార్గం అక్షరం. కలం గొప్పదని నమ్ముతారా?... నేనూ నిరూపించాను. ఉదయంలో ‘తిరుమల లీలలు’ పేరుతో తిరుమలలో జరుగుతున్న అక్రమాల మీద 9 పరిశోధన వ్యాసాలు రాశాను. నేను రాసిన వాటిలో 90 శాతం రుజువు చేశాను. కలం గొప్పదే. మీ రచనలను నాన్నగారు మెచ్చుక్ను సందర్భం? నాకప్పుడు పదహారేళ్లు. ఎమర్జెన్సీ సమయంలో ‘మనకు స్వరాజ్యం వచ్చింది. కానీ, స్వాతంత్య్రం రాలేదు’- అనే ఇతివృత్తంతో ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ అనే వ్యంగ్యరచన చేశాను. అప్పుడు నాన్న... అమ్మతో ‘ఇంత లేడు. వీడు ఇందిర ప్రభుత్వాన్ని విమర్శిస్తాడా’ అని నిలదీశారు. చివరగా ‘అయినా వాడు చాలా బాగా రాసిండు’ అన్నారు. అది నాకు అద్భుతమైన ప్రశంస. ఇప్పుడాయన లేకపోయినా... ఆయన ముఖం, ధోతి చేతిలో పట్టుకుని అంటున్న తీరు కళ్లల్లో మెదులుతూనే ఉంటుంది. పాత్రికేయునిగా- న్యాయశాస్త్ర బోధకునిగా వృత్తిలో తేడా ఎలా అనిపించేది? రెండూ విద్యాబోధనలే. పాత్రికేయ వృత్తిలో వెనువెంట కష్టాలు, కేసులు, బెదిరింపులు... ఉంటాయి. కేసు ఫైలయ్యేటంతటి సాహసాలు చేశారా?... ఎన్నో. టీటీడీ వారి కేసు పదకొండేళ్లు నడిచింది. ఎక్కువ ఆత్మసంతృప్తినిచ్చిన రచన? ...ప్రతిదీ సంతృప్తినిచ్చేదే. అయోధ్య తీర్పు విశ్లేషణ కోసం చాలా కష్టపడ్డాను. ఇటీవల మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును విశ్లేషించాను. మరొకటి రాసే వరకు అదే. ఎన్ని గంటలు పనిచేస్తారు? ఎంతసేపు నిద్రపోతారు? ఎప్పుడూ లెక్కపెట్టుకుంటూ పనిచేయలేదు. ప్రెస్లో రాత్రి రెండు వరకూ పనిచేసేవాడిని. ఇప్పటికీ పన్నెండయినా రాసుకుంటూ ఉంటాను. నా నిద్ర నాలుగు గంటలే.పిల్లలు, శ్రీమతి గురించిన వివరాలు... పాప వసుప్రద లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది. బాబు సంపత్ రామానుజం ఉద్యోగం చేస్తున్నాడు. నా శ్రీమతి వేదకల్యాణి మా మేనమరదలే. ఆప్టోమెట్రిస్టు. మీ ప్రమేయం ఏ మాత్రం లేకుండా మీరు బాధితులైన సందర్భం ఉందా? 1978లో చాంద్రాయణ గుట్టలో అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. 25 మంది ఆటో ఆపి నన్ను దింపి కొట్టారు. కేవలం హిందువుననే ఏకైక కారణంతో దెబ్బలు తిన్నాను. దైవికంగా బతికి బయటపడ్డాను. కొట్టిన వారి మీద కోపం రాలేదా?... రాజకీయాల కోసమే ఆ మతకల్లోలాలు. కొట్టేవాడికి, దెబ్బలు తినేవాడికి ఏ పగలూ లేవు. ఎవరి మీద కోప్పడాలి? జీవితానికి మీరిచ్చే నిర్వచనం?... నా దృష్టిలో జీవితం అంటే నిరంతరం పని చేయడమే. అదే మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. సోమరితనం ప్రధాన శత్రువు. మీ మీద వృత్తిపరంగా నాన్న ప్రభావం తెలుస్తోంది. అమ్మ నుంచి ఏం నేర్చుకున్నారు? అమ్మతో సాన్నిహిత్యం అపారం. అమ్మ రోజంతా కష్టపడేది. అమ్మ కోసం ఏదో చేయాలనిపించేది. వంటలో సాయం చేసేవాడిని. రోజంతా పనితో అలసిపోయేది. అమ్మకోసం రోజూ రాత్రి వంటగది నేనే కడిగేవాడిని. అది పెద్ద పని అని కాదు. ఆ వయసులో అమ్మకు చేయగలిగిన సాయం. అది నాకూ- అమ్మకూ ఆత్మీయమైన పని కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయవద్దని కలెక్టర్ నాన్నతో చెప్పినందుకు నాన్న బాగా కోప్పడ్డారు. అప్పుడు అమ్మ ‘వాడు రాసిన వ్యాసాన్ని ఎవరికిచ్చారు’ అన్నది. ‘నాకే ఇచ్చాడు’ అన్నారాయన. ‘మరి మీరోసారి చూసుకోవాల్సింది’ అన్నది మెల్లగా. ఆమె అమాయకంగా అన్న అద్భుతమైన మాట అది. -
హీరో అయిన మరో నృత్య దర్శకుడు
నృత్య దర్శకులు హీరోలుగా మారడం అన్నది దక్షిణాది చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు. ప్రభుదేవా, లారెన్స్, హరికుమార్ లాంటి నృత్య దర్శకులు కథా నాయకులుగా మారినవారే. ఇప్పడీ కోవలో తాజాగా మరో నృత్య దర్శకుడు చేరారు. ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం పోకిరి మన్నన్. శ్రీనిధి ఫిలింస్ పతాకంపై కన్నడ నిర్మాత రమేష్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్ఫూర్తి హీరోయిన్గా నటిస్తున్నారు. రాఘవమాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎటి ఇంద్రవర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల థియేటర్లో జరిగింది. నృత్య కళాకారుల సంఘం అధ్యక్షుడు మారి ఆధ్వర్యంలో నిర్మాత కలైపులి ఎస్.ధాను చిత్ర ఆడియోను ఆవిష్కరించగా, తొలి అప్రతిని నటుడు శాంతను అందుకున్నారు. ఈ సందర్భంగా ధాను మాట్లాడుతూ నృత్య దర్శకుడు ప్రభుదేవాలోని ప్రతిభను గుర్తించి దర్శకత్వం చెయ్యమని సలహా ఇచ్చానన్నారు. కొంతకాలం తర్వాత ఆయన తన వద్దకు వచ్చి ఒక తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారన్నారు. అలాగే ప్రభుదేవా శిష్యుడు శ్రీధర్ కూడా హీరోగా రాణిస్తారనే నమ్మకం తనకుందన్నారు. విజయ్ నటించిన పోకిరి, రజనీకాంత్ నటించిన మన్నన్ చిత్రాలు ఘన విజయం సాధించాయన్నారు. ఆ రెండు చిత్రాల పేరుతో రానున్న పోకిర మన్నన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నానన్నారు. నిర్మాత కర్ణాటక నుంచి వచ్చి తమిళంలో చిత్రం నిర్మించారని, ఆయనకు అన్ని విధాలా తన సహకారం ఉంటుందని ధాను భరోసా ఇచ్చారు. -
ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే
దీపావళికి అమ్మకాలు బాగుంటాయ్ జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ శ్రీధర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే ఉంటుందని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) తెలిపింది. దిగుమతుల కట్టడి, సెంటిమెంటు తదితర కారణాలతో గత కొంత కాలంగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కొత్త ప్రభుత్వం, మార్కెట్ ఆశావహంగా ఉండడంతో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2014-15లోనూ రూ.4 లక్షల కోట్ల వ్యాపారం నమోదు కావొచ్చని అంచనాలున్నాయని జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ జి.వి.శ్రీధర్ ఆదివారమిక్కడ మీడియాతో పేర్కొన్నారు. దీపావళి సీజన్లో 10-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రూ.28 వేల ధర సరైందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మైనింగ్ ధరకు బంగారం లభిస్తోందని వివరించారు. రెండో అతిపెద్ద వినియోగదారు అయిన భారత్లో పన్నులు, దిగుమతి విధానం, రూపాయి విలువ వంటి అంశాలు సైతం అంతర్జాతీయంగా ధరను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఏకీకృత ధర దిశగా..: దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీజేఎఫ్ ఎప్పటి నుంచో కోరుతోందని శ్రీధర్ తెలిపారు. ఆరు నెలల్లో బంగారం డిపాజిట్ స్కీంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ప్రజల వద్ద 20,000 టన్నుల బంగారం ఉంది. ఇందులో 5% తిరిగి వ్యవస్థలోకి వచ్చినా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. దొంగ రవాణాకు కట్టడి పడుతుంది. ముడి బంగారాన్ని బ్యాంకులు డిపాజిట్లుగా సేకరించాలి. ఈ బంగారాన్ని రుణం రూపంలో ఆభరణాల వర్తకులకు ఇవ్వాలి. వర్తకులు తిరిగి బంగారాన్ని బ్యాంకులకు చెల్లించేలా స్కీం రావాలి’ అని అన్నారు. ఏపీ, తెలంగాణలో 20-30% వ్యాపారం తగ్గిందని ట్విన్సిటీస్ జువెల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నకాషి, పచ్చి సెట్టింగ్ వర్క్, అన్కట్ డైమండ్ నగల తయారీలో భాగ్యనగరిదే పైచేయి అని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు. -
రుణమాఫీ రూ.950 కోట్లు
తాండూరు రూరల్: జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.950 కోట్లు మాఫీ కానున్నాయని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. సోమవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలోని అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీతో జిల్లాలోని రెండు లక్షల మందికిపైగా రైతులు లబ్ధిపొందనున్నారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో వివరాలు తీసుకున్న అనంతరం 31న జిల్లాస్థాయి కమిటీలో సమావేశమై నివేదికపై చర్చిస్తామన్నారు. జిల్లాస్థాయి సమావేశం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రుణమాఫీ అయిన రైతుల పేర్లను ప్రకటిస్తామన్నారు. రుణాల మాఫీ ప్రక్రియ ముగిసిన తర్వాత వచ్చేనెల రెండో వారంలో రైతులకు కొత్త రుణాలు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వేగవంతంగా కంప్యూటరీకరణ చేస్తున్నామని చెప్పారు. -
‘సర్వే’కు సహకరించాలి
మేడ్చల్: సమగ్ర కుటుంబ సర్వే కోసం ఈనెల 19న జిల్లాలోని ప్రజలంతా ఇళ్లలో ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. మంగళవారం మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వేపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబ యజమానితో పాటు, కుటుంబసభ్యులు ఇంట్లో ఉండి సర్వే కోసం వచ్చే అధికారులకు సహకరించాలని సూచించారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, సర్వే విధుల్లో ఉన్నవారు, అత్యవసర కేసుల్లో ఆస్పత్రుల్లో ఉన్న వారు, ఇతర ప్రాంతాల్లో చదువుల కోసం వెళ్లినవారు మినహా అందరూ ఇళ్లకు చేరుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీఓలు.. మండల స్థాయి, పట్టణప్రాంతాల్లో కమిషనర్లను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. గ్రామానికి స్పెషల్ ఆఫీసర్తో పాటు, సెక్టోరియల్ అధికారులను నియమించినట్లు వివరించారు. ప్రతీ 30 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్వేలో 80 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, 20 శాతం ప్రైవేటు ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. బుధవారం నాటికి వారికి శిక్షణ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నోడల్, సెక్టోరియల్, ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను ముందుగానే సందర్శించి ఇళ్లకు నంబర్లు కేటాయించారా లేదా, విభజన ఎలా చేశారు, సంచార కుటుంబాలు, అనాథాశ్రమాలు ఎమైనా ఉన్నాయా లాంటి వివరాలు సమగ్రంగా సేకరించాలని సూచించారు. పూర్తి సమాచారాన్ని ఎన్యూమరేటర్లకు 19న గ్రామాలకు చేరకముందే అందించాలన్నారు. సర్వే విధుల్లో ఉన్న ఉద్యోగులు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఉదయం 6 గంటల లోపు చేరుకోవాలన్నారు. అక్కడే అల్పాహారం ముగి ంచుకుని 8 గంటల లోపు సామగ్రితో గ్రామాలకు వెళ్లి సర్వేను ప్రారంభించాలన్నారు. సర్వే పూర్తయ్యాక పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో అందజేసి అక్కడే భోజనం చేసి వెళ్లాలన్నారు. సర్వే ఫార్మెట్ను ముందుగానే ఎన్యూమరేటర్లకు ఇచ్చి రెండు మూడుసార్లు చదువుకునేలా సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్రావు, తహశీల్దార్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీడీఓ శోభ, మండల ప్రత్యేకాధికారి ఉమ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ దూకుడు
‘పెట్టుబడుల ఆకర్షణలో కొత్త ఒరవడిని సృష్టిస్తాం. తగవుల్లేని భూముల కేటాయింపుతో పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరుస్తాం. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలోని విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం మా ప్రధాన కర్తవ్యం’ అని జిల్లా కలెక్టర్ నడిమట్ల శ్రీధర్ స్పష్టం చేశారు. గురుకుల్ ట్రస్ట్, యూఎల్సీ, సీలింగ్, అసైన్మెంట్ భూముల సర్వేలో దూకుడు ప్రదర్శిస్తూ... గతి తప్పిన సర్కారీ శాఖలను గాడిలో పెట్టే దిశగా కార్యాచరణ సిద్ధం చేసిన కలెక్టర్ శ్రీధర్ సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... -సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రభుత్వ భూముల పరిరక్షణ ప్రాధాన్యాతాంశాల్లో మొదటిది ప్రభుత్వ భూ ముల పరిరక్షణ. తెలంగాణకు ఆయువు పట్టయిన జిల్లాలోని విలువైన భూములను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. జిల్లాలోని వివిధ కేటగిరీల కింద పంపిణీ బదలాయించిన 1.50 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేస్తున్నాం. తద్వారా అన్యాక్రాంతమైన భూములను గుర్తిస్తున్నాం. వివిధ సంస్థలకు కేటాయించిన 39 వేల ఎకరాల్లో ఆయా సంస్థలు ఏ మేరకు వాడుకున్నాయనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. సుమారు 13వేల ఎకరాలు ఇంకా వినియోగంలోకి రాలేదని గుర్తించాం. ఇందులో ఎంత విస్తీర్ణం వృథాగా ఉందనేది నిర్ధారించుకుంటున్నాం. అదేవిధంగా ఆక్రమణకు గురైన గురుకుల్ ట్రస్ట్లో భూముల సర్వే పూర్తయింది. 200 ఎకరాల్లో బహుళ అంతస్తులు, మరో 200 ఎకరాల్లో చిన్నపాటి నిర్మాణాలు వెలిశాయి. మిగతా భూమి ఖాళీగా ఉన్నట్లు గుర్తించాం. ట్రస్ట్ భూమిలో వెలిసిన కట్టడాలకు ఎలాంటి అనుమతి లేదు. ఇప్పటికే కొన్నింటిని జీహెచ్ఎంసీ కూల్చేసింది. మిగతావాటి విషయంలోనూ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. గురుకుల్ ట్రస్ట్ భూములు కొనవద్దని, వ్యాపారాలు నిర్వహించకూడదని ప్రజలను చైతన్యపరుస్తూ నోటీసు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం. ‘ఎన్’ కన్వెన్షన్లో తమ్మిడి కుంట.. ‘ఎన్’ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో 3.24 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్లు సర్వేలో తేలింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నాం. గురుకుల్ ట్రస్ట్ భూమిని క్రమబద్ధీకరించాలని యూఎల్సీ వద్ద 2,833 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ భూములపై కోర్టుల్లో కూడా కేసులు ఉన్నందున.. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అడుగులు వేస్తాం. పరిశ్రమలకు లిటిగేషన్ లేని భూములు.. పరిశ్రమల స్థాపనకు మంచి వాతావరణం కల్పిస్తాం. భూ కేటాయింపులు, అనుమతులను సరళతరం చేసే దిశగా ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తోంది. ఐటీ, ఫార్మా రంగాలకు అనువైన మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు భూములను సమీకరిస్తున్నాం. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న 13వేల ఎకరాల భూములేగాక వేర్వేరు చోట్ల బిట్లుబిట్లుగా ఉన్న ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా క్లియర్గా ఉన్న భూములను పరిశ్రమలకు కేటాయించేలా జాబితా రూపొందిస్తున్నాం. ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ తయారు చేసేలోగా ల్యాండ్ బ్యాంక్ను రెడీ చేసుకోవాలని నిర్ణయించాం. చేతులు మారిన అసైన్డ్ భూములు వెనక్కి.. భూమిలేని పేదలకు పంపిణీ చేసిన లక్ష ఎకరాల అసైన్డ్భూములను కూడా సర్వే చేయిస్తున్నాం. అసలైన లబ్ధిదారులుగాకుండా ఇతరులకు వీటిని విక్రయించినట్లు తేలితే ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం. శివారు మండలాల్లో 2,500 ఎకరాల యూఎల్సీ భూములను కూడా రీసర్వే చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. దళితుల సమగ్రాభివృద్ధి.. దళితుల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించాం. మండల ం యూనిట్గా ఒక బస్తీని ఎంపిక చేసి.. ఆ బస్తీ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతాం. మౌలిక సదుపాయాల కల్పన, గ్రంథాలయం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను చేపడతాం. దీనికోసం ఎస్సీ సబ్ప్లాన్ నిధులను వినియోగిస్తాం. జిల్లావ్యాప్తంగా భూమిలేని 4,700 కుటుంబాల్లో తొలి విడతగా పంద్రాగస్టున కొందరికి భూ పంపిణీ చేస్తాం. ఇప్పటికే భూమి ఉన్నా.. వ్యవసాయానికి అనువుగా లేని రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు విత్తనాలు, డ్రిప్, ఇరిగేషన్ తదితర రాయితీలను వర్తింపజేయనున్నాం. పనిదొంగల భరతం పడతా.. సమయపాలన పాటించని ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తా. ప్రతి రోజూ కలెక్టరేట్ నుంచి ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తా. ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారా? లేదా అనే ది తెలుసుకునేందుకు నేరుగా కార్యాలయాలకే ఫోన్ చేస్తా. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాల్సినతహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయశాఖ, పాఠశాలలు, హాస్టళ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు హాజరుపై అంచనాకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. 64 మందికి శ్రీముఖాలు విదినిర్వహణలో అలసత్వం వహించిన ఉద్యోగులపై కలెక్టర్ ఎన్.శ్రీధర్ సీరియస్ అయ్యారు. గతవారంలో వరుసగా రెండ్రోజుల పాటు కొందరు అధికారులతో సంక్షేమ వసతిగృహాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. అనంతరం వారి నుంచి వచ్చిన నివేదికలపై సమీక్షించారు. అయితే ఇందులో చాలావరకు వసతిగృహ అధికారులు, ప్రభుత్వ వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించి తీవ్రంగా పరిగణించారు. విధుల్లో అలసత్వం వహించిన 64 మందికి షోకాజ్నోటీసులు జారీ చేశారు. ఇందులో 32 మంది సంక్షేమాధికారులు కాగా, మిగిలిన వారు పీహెచ్సీ వైద్యులు, కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కలెక్టర్ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
ఎన్నాళ్లు ఇలా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరతపై రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని చాలా స్కూళ్లలో టీచర్లు ఉండకపోవడంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని పలు ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, దాన్ని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్లో విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా రూ.38 కోట్లతో చేపట్టిన 653 అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాకపోవడమేమిటనీ ప్రశ్నించారు. మోడల్ స్కూల్ భవనాల నిర్మాణ పనుల జాప్యంపైనా మంత్రి మండిపడ్డారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని మండలాల్లో తాను పర్యటించినప్పుడు ఉపాధ్యాయుల కొరతను గుర్తించానని, దీన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో డీఈఓ సోమిరెడ్డి, సర్వశిక్షాభియాన్ పీఓ కిషన్రావు, వయోజన విద్యాసంచాలకులు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అనుకున్నది ఒకటి..అయ్యింది ఒకటి మూవీ స్టిల్స్
-
పడకేసిన ‘ప్రజ్ఞ’
గూడూరు : వసతిగృహాల్లోని పరిస్థితులను మెరుగుపరిచేందుకు గతంలో జిల్లా కలెక్టర్గా వ్యవహరించిన శ్రీధర్ ప్రజ్ఞ కార్యక్రమాన్ని రూపొందించారు. క్షేత్రస్థాయిలో ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకుని, తదనుగుణంగా చర్యలు చేపట్టేలా ప్రజ్ఞ రూపకల్పన జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని 87 బీసీ, 156 ఎస్సీ, 25 ఎస్టీ వసతిగృహాలకు కంప్యూటర్లు అందజేశారు. ప్రతి వసతిగృహానికి నెట్ సౌకర్యం కల్పించారు. కానీ కంప్యూటర్, నెట్ వినియోగంపై వార్డెన్లకు శిక్షణ మాత్రం ఇవ్వలేదు. దీంతో అవి మూలనపడి పథకం అమలు లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. తప్పని పడిగాపులు కంప్యూటర్లు వినియోగించే విధానం తెలియకపోయినా ప్రతి వసతిగృహానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంది. దీంతో వార్డెన్లు నెట్ సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. విద్యుత్ కోతలు, నెట్ పనిచేయకపోవడం, కంప్యూటర్లు ఖాళీగా లేకపోవడం తదితర కారణాలతో గంటల కొద్ది అక్కడే పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. కంప్యూటర్లు అందజేసినపుడే శిక్షణ కూడా ఇచ్చివుంటే ఈ పడిగాపులు తప్పేవని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా పోస్టులు ఖాళీ వసతిగృహాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి వసతి గృహానికి ఒక వార్డెన్తో పాటు కుక్, కామాటి, వాచ్మన్ ఉండాలి. కానీ చాలా వసతి గృహాల్లో తగినత మంది సిబ్బంది లేని పరిస్థితి. జిల్లాలోని 87 బీసీ వసతిగృహాల్లో 150 పోస్టులు ఖాళీనే. ఎస్సీ వసతిగృహాలు 156 ఉండగా, వాటిలో సుమారు 200 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. 25 ఎస్టీ వసతిగృహాల్లోనూ 20 పోస్టులు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి. పలు వసతిగృహాల్లో వార్డెన్ ఒక్కరే ఉన్నారు. ఆయన నెట్ సెంటర్కు వెళితే గంటల తరబడి విద్యార్థులను పర్యవేక్షించే వారు కరువవుతున్నారు. వార్డెన్లకు కంప్యూటర్ల ఆపరేటింగ్పై శిక్షణ ఇస్తే ఈ సమస్యకు చెక్ పడుతుంది. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
‘రంగారెడ్డి’కి కొత్త కలెక్టర్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పాలనలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త కలెక్టర్గా నియమితులైన నడిమట్ల శ్రీధర్ తనకు ఉత్తర్వులు అందిన అరగంట వ్యవధిలోనే బాధ్యతలు స్వీకరించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇటువంటి కీలక పోస్టులో చేరే అధికారులు ఒకట్రెండు రోజులు సమయం తీసుకోవడం ఆనవాయితీ. రెవెన్యూపరంగా ముఖ్యమైన జిల్లా కావడంతో తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు అందుకున్నదే తడువు ఎన్ .శ్రీధర్ కలెక్టర్ సీట్లో వాలిపోయారు. కాగా, బదిలీ అయిన బి.శ్రీధర్కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనను ఏపీ రాష్ట్ర కేడర్కు పంపే అవకాశముంది. రాష్ట్ర విభజన అనంతరం శ్రీధర్ బదిలీ అనివార్యమని తెలిసినప్పటికీ, అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుపై కేంద్రం ఇంకా మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు స్థానచలనం కల్పించకూడదని ఇరురాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అయితే, ఐఏఎస్ వర్గాలు హాట్సీటుగా భావించే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పోస్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. వివిధ మార్గాల్లో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, సమర్థుడు, సీనియర్ అధికారిగా పేరున్న ఎన్.శ్రీధర్ ైవె పు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ రాజీవ్శర్మ తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించారు. దీంతో వడివడిగా కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు బాధ్యతలు అప్పగించిన బి.శ్రీధర్ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. గత ఏడాది జూలై 2న జిల్లా కలెక్టర్గా నియమితులైన శ్రీధర్ సమర్థవంతంగా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహా సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ప్రశంసలందుకున్నారు. ‘ప్రభుత్వ భూముల పరిరక్షణకు పెద్దపీట వేస్తా. జిల్లాను పెట్టుబడులకు అనువైన కేంద్రంగా మలుస్తా. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అభివృద్ధి అంతరాలను రూపుమాపుతా. హార్టికల్చర్ హాబ్గా మార్చడం, విద్యాప్రమాణాలు పెంపొందించడం నా ముందున్న ప్రథమ ప్రాధాన్యాలు’ - కలెక్టర్ ఎన్.శ్రీధర్ సర్వీసులో బదిలీలు సర్వసాధారణమే. పనిచేసిన స్వల్పకాలంలోనే రంగారెడ్డి జిల్లా ప్రజలు తనను అక్కున చేర్చుకోవడం మరవలేనిది. ఇక్కడ పనిచేయడం సంతృప్తినిచ్చింది. పాలనా సమయంలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. - బదిలీ అయిన కలెక్టర్ బి.శ్రీధర్ -
డాక్టర్ శ్రీధర్కు అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, సన్షైన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ శ్రీధర్ కస్తూరికి 2014 సంవత్సరానికి ప్రతిష్టాత్మాక అంతర్జాతీయ కార్డియాక్ ఫోరం పురస్కారం లభిచింది. ఫ్రాన్స్లోని ప్యారిస్కు చెందిన ప్రఖ్యాత కార్డియాక్ ఫోరం యూరో పీసీఆర్-14 బహూకరించే ఈ అవార్డు ఈసారి శ్రీధర్ను వరిచింది. ఇటీవల మెయిన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు దేశవిదేశాల నుంచి 12257 మంది హృద్రోగ నిపుణులు హాజ రు కాగా, 60 దేశాల నుంచి 934 ప్రొసీజర్లు పోటీ పడ్డాయి. ఇందులో శ్రీధర్ చేసిన ‘ఆర్థోప్లాస్టీ విత్ స్టెంటింగ్ ఆఫ్ లాంగ్ సెగ్మంట్ టోటల్ ఆక్లూషన్ ఆఫ్ డిసెండింగ్ థొరాసిక్ ఆర్ట్ అండ్ అబ్డామినల్ ఆర్టా తకాయాసు ఆర్టాయిటీస్ విత్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ- యాంజియోగ్రఫీ ఫాలో ఆప్’ (గుండె నుంచి కాలికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళానికి ఆపరేషన్ లేకుండా స్టెంట్తో రక్తనాళాన్ని పునరుద్ధరించడం) చికిత్స రెండో అత్యుత్తమ క్లినికల్ ప్రొసీజర్గా ఎంపికైనట్లు సన్షైన్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ గురువారెడ్డి శుక్రవారం విలేకరులకు చెప్పారు. -
ఎవరు.. విజేత
నేడు తేలనున్న ఫలితాలు హై టెన్షన్లో అభ్యర్థులు టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోరు సాక్షిప్రతినిధి, వరంగల్ : రెండు వారాల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఓట్ల లెక్కింపు మొదలయ్యేందుకు కొన్ని గంటల సమయమే ఉండడంతో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. నియోజకవర్గంలో తమకు వచ్చే ఓట్లు, ప్రత్యర్థులకు పోలయ్యే ఓట్లు ఎన్ని అని గంటకోసారి లెక్కలు వేసుకుంటున్నారు. ఒంటరిగా ఉంటే టెన్షన్ పెరుగుతుందనే ఆందోళనతో నిత్యం ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఇప్పటి వరకు కాలం వెళ్లదీశారు. కాగా, జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొంది. పాలకుర్తి, ములుగు, నర్సంపేట, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉంది. మున్సిపల్ ఎన్నిల ఫలితాలను చూసుకుని కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ధీమాగా ఉంది. అదేవిధంగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల లెక్కలతో టీఆర్ఎస్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తమవేనని గట్టి నమ్మకంతో ఉంది. తెలంగాణలో తొలి ప్రభుత్వం తమదేనని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు.. జిల్లాలోని 10 స్థానాలు తమ పార్టీ వారే గెలుస్తారని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. వీరి అంచనాలు, ప్రకటనలు తీరు శుక్రవారం తేలిపోనుంది. జనగామలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నుంచి ప్రధానంగా పోటీ సాగింది. మున్సిపల్ ఎన్నికలను బట్టి కాంగ్రెస్.. పరిషత్ ఎన్నికల ఫలితాల ఆధారంగా టీఆర్ఎస్ గెలుస్తుందని రెండు పార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, కొండా సురేఖ పోటీకి దిగిన వరంగల్ తూర్పు నియోజకవర్గం ఫలితంపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. నరేంద్రమోడీ హవాతో గణనీయంగా విజయం వరిస్తుందని బీజేపీ అభ్యర్థి రావు పద్మ భావిస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎర్రబెల్లి స్వర్ణల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. బీజేపీ వర్గాలు సైతం విజయం తమదేననే ధీమాతో ఉన్నాయి. నర్సంపేటలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్ధి పెద్ది సుదర్శన్రెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్, కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్, మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి మంద కృష్ణమాదిగల మధ్య పోటీ ఉంది. స్టేషన్ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి టి.రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి జి.విజయరామారావుల మధ్య పోటీ ఉంది. పాలకుర్తిలో పోటీ రసవత్తరంగా ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుధాకర్రావు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు విజయం తమదేనని ధీమాతో ఉన్నారు. ములుగు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సీతక్క, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి ఎ.చందులాల్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. పరకాల నియోజకవర్గంలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి ఎం.సహోదర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకటరామిరెడ్డి, టీడీపీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి, బీజేపీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు మధ్య పోరుతో ఇక్కడి ఫలితాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి. మహబూబాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం.కవిత, టీఆర్ఎస్ నుంచి బానోత్ శంకర్నాయక్ల మధ్య పోటీ ప్రధానంగా ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి డి.ఎస్.రెడ్యానాయక్, టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. వైఎస్సాఆర్సీపీ అభ్యర్థి సుజాతమంగీలాల్ ఇతర పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. -
టెన్త్లో స్ప్రింగ్డేల్ విద్యార్థుల సంచలనం
తిరుపతి(మంగళం), న్యూస్లైన్ : తిరుపతి-కరకంబాడి రోడ్డులోని స్ప్రింగ్ డేల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో సంచలనం సృష్టించారు. ఐదు సంవత్సరాలుగా టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు వందశాతం ఉతీర్ణత సాధిస్తున్నారని ఆ పాఠశాల కరస్పాండెంట్ కేఎస్.శ్రీధర్, కార్యదర్శి కేఎస్.వాసు తెలిపారు. టెన్త్ పరీక్షలు 32 మంది విద్యార్థులు రాయగా అందరూ ఉతీర్ణత సాధించారన్నారు. ఏఎస్.క్రితిక్ 10పాయింట్లు సాధించాడని, 9.8 పాయింట్లు నలుగురు, 9.7 పాయింట్లు ఏడుగురు, ఎ1గ్రేడ్లు 20మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హైస్కూల్లో... పదవ తరగతి ఫలితాల్లో శ్రీవెంకటేశ్వర చిల్డ్రన్స్ హై స్కూల్లోని 16 మంది విద్యార్థులు 10 పాయింట్లు సా ధించారు. ఆర్. కేతన్, డి. సౌమ్యచౌదరి, పి. సంహిత్కుమార్, ఎం.యామిని, ఎం శాందిలయ్య, పి.శ్రీహిత్కుమార్, విష్ణుదత్త, ఎం.దొరబాబు, కె.సుకీర్త్, ఎంవీడీ.కార్తీక్రాజా, ఎస్.కమలేష్, కె.మనీషాప్రసాద్, ఎ.లిఖిత, సి.సేతురామ్, ఎం.చరిష్మ, టి.జాహ్నవిప్రియ 10కి 10పాయింట్లు సాధించారని కేఎస్. వాసు తెలిపారు. తమ పాఠశాలలో 290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 289 మంది ఉతీర్ణత సాధించారని తె లిపారు. 9.8 పాయింట్లు 42 మంది, 9.7 పాయింట్లు 103 మంది, 9.5 పాయింట్లు 113 మంది సాధించారని తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, అధిక ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. -
నిఘా అంతంతమాత్రమే!
వికారాబాద్, న్యూస్లైన్:ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలుచేయాలని, అభ్యర్థుల ప్రచారం, ఖర్చుపై నిఘా ఉంచాలని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడాన్ని నిరోధించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను స్పష్టంగా ఆదేశించారు. నిఘాకు అవసరమైన కెమెరాలు, వీడియో కెమెరాలను సమకూర్చుకొని ఎన్నికలు ప్రశాం తంగా జరిగేందుకు కృషి చేయాలన్న ఆయన ఆదేశాలను వికారాబాద్ సెగ్మెంట్లో అంతగా పట్టించుకుంటున్నట్టు కన్పించడం లేదు. కెమెరాలు పగలే పనిచేస్తాయి... వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సబ్ కలెక్టర్ ఆమ్రపాలి నియోజకవర్గంలో నిఘా కోసం ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం, సభలతో పాటు, వాహనాల తనిఖీ, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ కోసం కొత్తగా ఆరు కెమెరాలను రూ.30వేల ఖర్చుతో కొనుగోలు చేయించారు. అయితే ఈ కెమెరాలు పగటిపూట బాగానే పనిచేస్తున్నా రాత్రిపూట సమస్యలు తలెత్తుతున్నాయని సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల సిబ్బంది వాపోతున్నారు. రాత్రివేళ ఓటర్లను ప్రలోభపెట్టే సంఘటనలు తమ దృష్టికి వస్తున్నా చిత్రీకరిద్దామంటే కెమెరాలు పనిచేయడం లేదంటున్నారు. ఇదే విషయాన్ని ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నతాధికారి దృష్టికి తీసుకుపోగా... ఆ కెమెరాలతోనే సర్దుకుపోవాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, ఈ విషయమై జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ ఈ నెల 7న స్పందిస్తూ నాణ్యతలేని కెమెరాలను రాత్రిపూట వాడొద్దని, ప్రైవేటుగా వీడియో కెమెరాలను అద్దెకు తీసుకొని ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారం రోజులవుతున్నా కలెక్టర్ ఆదేశాలను వికారాబాద్లో ఎన్నికల అధికారులు అమలు చేస్తున్న దాఖలాలు లేవు.మరోవైపు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలూ వికారాబాద్లో అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ వాహనాలు ఉన్న వారు వాటిని వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి ఆమ్రపాలి ఆదేశించారు. అయితే ఎన్నికల విధులకు వాడుతున్న సొంత వాహనాలకు సరిపడ డీజిల్ ఇవ్వడం లేదని పలువురు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం గంటసేపు పెరగడంతో జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 50శాతం ఓట్లు పోలయ్యాయని, ఈ దఫా కనీసం 70శాతం ఓట్లు పోలయ్యేలా చూస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని వర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నామన్నారు. రెండున్నర నెలలుగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా 3.47 లక్షల ఓట్లు జాబితాలో చేరాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీధర్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు నగర శివారు గ్రామ పంచాయతీల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, ఇదే తరహాలో సాధారణ ఎన్నికల్ని కూడా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 సెగ్మెంట్లలో డబుల్ ఈవీఎంలు.. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాల నుంచి మొత్తం 330 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో 10 సెగ్మెంట్లలో 15కు మించి అభ్యర్థులుండడంతో అక్కడ రెండో ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో జిల్లాకు అదనంగా ఆరు వేల ఈవీఎంలు అవసరమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. ఈసీఐఎల్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అదనపు ఈవీఎంలు జిల్లాకు చేరుతాయి అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,469 పోలింగ్ కేంద్రాలుండగా.. ఓటర్ల సంఖ్య ఆధారంగా మరో 573 పోలింగ్ కేంద్రాలు అవసరమని ఎన్నికల సంఘానికి సూచించామని, దీనికి ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందని చెప్పారు. దీంతో జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 5,042 కు చేరిందన్నారు. 1,600 ఓటర్ల కంటే ఎక్కువున్న పోలింగ్ కేంద్రానికి అదనపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్లు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని, ఇందుకు సంబంధిత ఉన్నతాధికారి నుంచి లేఖ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లను నియోజకవర్గంలో ఒక చోట ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామన్నారు. అనంతరం ఓటువేసి బాక్సులో వేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లకు పోలింగ్కు ముందే ఓటర్ స్లిప్పులు అందిస్తున్నామని, ఈ స్లిప్పులు చూపిస్తే ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన పనిలేదని అన్నారు. పోలింగ్బూత్ల వారీగా ప్రత్యేక తేదీలు ప్రకటించి ఓటర్ స్లిప్పులు బూత్స్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతమే లక్ష్యంగా.. జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించిందని కలెక్టర్ తెలిపారు. అయితే శివారు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు నిరాసక్తత చూపారని, నిజాంపేటలో కేవలం 25శాతం మాత్రమే ఓటింగ్ జరగడం గమనార్హమన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై మరింత చైతన్యపర్చాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, ఐటీ కార్యాలయాల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కనిష్టంగా 70శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లిక్కర్ డీలర్లకు గత ఏడాది ఇదే సమయంలో ఏమేరకు స్టాకు సరఫరా చేశామో.. ఇప్పుడు కూడా అంతే మోతాదులో స్టాకు ఇస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మానవీయక్షణాలు
ఈ తరహా డాక్టర్లకు సాక్షి ఫ్యామిలీ సలాం డాక్టర్ అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆ వృత్తికి మరెంతో ప్రతిష్ఠ. అలాంటి గౌరవప్రతిష్ఠలు కేవలం కొందరు రోగుల వ్యధలనూ, బాధలను తీర్చడం వల్ల మాత్రమే డాక్టర్లు పొందడం లేదు. కొన్నిసార్లు భావోద్వేగాలకు లోనై ప్రవర్తించడం వల్ల, మాన్యులైనప్పటికీ సామాన్యుల్లా వ్యవహరించడం వల్ల మాన్యతలు పొందుతున్నారు, పొందుతుంటారు. గాఢనిద్రలకు కటీఫ్ చెబుతారు. వ్యాధులకు కటాఫ్ డేట్ ప్రకటిస్తారు. ఆపరేషన్లతో రోగాన్ని ‘కట్’ చేస్తారు. ఇన్ని కటకటలకు లోనవుతారు కాబట్టే వారికా గౌరవకటాక్షాలు. కొందరు డాక్టర్ల సంక్లిష్ట కేసుల సంక్షిప్త వివరాలు వారి మాటల్లోనే... జీవితానికి ఆవల..! శ్రీధర్ కళ్లు మూసుకుని ఉన్నాడు. అయితే అతడు నిద్రపోతున్నాడా లేదా అని చెప్పడం కష్టం. ఒకవేళ పట్టినా అది కలత నిద్రే. కళ్ల ముందు తన కుటుంబమే కనిపిస్తోంది. రేపు తాను లేని సమయంలో వాళ్ల పరిస్థితేమిటి? వణికిపోయాడు శ్రీధర్. ఆ ఊహే అతడిని భయందోళనలకు గురిచేసింది. కూతురు చిన్ని పాప. బిడ్డకు ఊహ తెలియదు. భార్యకు లోకం తెలియదు. ఎలా బతుకుతారు వాళ్లు? శ్రీధర్ ఇలా ఆలోచించడానికి కారణం అతడికి ఉన్న టర్మినల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. అన్ని విధాలా ఆరోగ్యవంతుడైన తనకది వచ్చిన కారణం తెలియదు. వచ్చిందని తెలిశాక భవిష్యత్తు తెలియదు. ఇప్పటికి తెలిసిందల్లా ఎవరైనా ఒకరు జీవన్మృతుడిలా మరణిస్తే, వారు దానం చేసిన కిడ్నీని స్వీకరించడమే. ఇలా అనుకుంటుండగా ఫోన్ మోగింది. టైమ్ చూస్తే రాత్రి ఒంటిగంటన్నర. ఆ వేళప్పుడు తనకు చేసేవారెవరూ ఉండరు. ‘‘ఈ దురదృష్టవంతుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో’’ అనుకుంటూ ఫోనెత్తాడు. అవతలి గొంతు మాట్లాడుతోంది...‘‘ హలో నేను... మీ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ను. ఈ వేళప్పుడు మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు సారీ. అయితే... మీరు తక్షణం బయలుదేరాలి. ఎందుకంటే... ఎవరైనా జీవన్మృతుల నుంచి కిడ్నీ కావాలంటూ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కదా. అదృష్టంకొద్దీ అది దొరికింది. వెంటనే ఆసుపత్రికి రాగలరా’’ అంటోంది ఆ స్వరం. ఎప్పట్నుంచో వారానికి మూడు రోజులు తప్పనిసరిగా డయాలసిస్ అనే బాధను మౌనంగా అనుభవిస్తూ... జీవితాన్ని దాదాపుగా ఆసుపత్రికి అంకితం చేసినట్లు గడిపే బాధ నుంచి ఇకపై విముక్తి దొరకబోతోందా? నిజంగా నమ్మొచ్చా? కానీ ఆ గొంతు చెబుతున్న చివరి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అవి పూర్తిగా ముగిసీ ముగియకముందే... ‘‘తక్షణం వస్తున్నా’’ అంటూ బయల్దేరాడు శ్రీధర్. ఇక్కడ డాక్టర్గా నాదొక మాట. శ్రీధర్ది చాలా సంక్లిష్టమైన కేసు. బతుకుతాడని ఎవరూ అనుకోలేదు. కానీ మరొకరి దురదృష్టం అతడి అదృష్టంగా పరిణమించింది. బతికాడు. కానీ శ్రీధర్కు వచ్చిన జబ్బు మనదేశంలో ప్రతి ఏటా 200 మందికి వస్తోంది. కానీ కిడ్నీలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. కానీ వీళ్లలో పదిశాతం మందికి కూడా కిడ్నీలు దొరకడం లేదు. కాబట్టి మిగతావారంతా మౌనంగా మరణించాల్సి వస్తోంది. స్వర్గంలో ప్రతి వారికీ ఓ దివ్యరూపం ఉంటుంది. మట్టిలో కలిసిపోయే ఈ అవయవాల అవసరం అక్కడ ఎవరికీ ఉండదు. అందుకే ఇక్కడి అవయవాలను ఇక్కడే ఇచ్చేయండి. స్వర్గార్హతను మరింతగా సంపాదించుకోండి. అన్నట్టు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఒక మాట చెబుతున్నా. శ్రీధర్కు కిడ్నీ ఇచ్చిన వ్యక్తి ఒక యువడాక్టర్. డాక్టర్లు జీవితం ఇస్తారని అందరూ అనుకుంటారు. అది మాత్రమేకాదు... ఆ డాక్టర్ శ్రీధర్కు కిడ్నీ ఇచ్చినట్టే... మరో ఇద్దరికి చూపునిచ్చాడు. మరో సిర్రోసిస్ రోగికి కాలేయం ఇచ్చాడు. చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతూ కార్డియోమయోపతి వ్యాధితో బాధపడుతున్న ఇంకో వ్యక్తికి హృదయం పంచాడు. అవును... కొందరు డాక్టర్లు కారుణ్యాల పుట్టలు. బతికి ఉండగానే కాదు... చచ్చిపోయాకా బతికిస్తారు. చివరగా... శ్రీధర్కు రక్తాన్ని వడపోసే ఓ అవయవం దొరికింది. ఇకపై అతడు జీవితాన్ని కాచి వడపోస్తాడు. ఇక అతడు తన బాధ్యతలు నెరవేరుస్తాడు. సమస్త సంతోషాలను భార్యాబిడ్డల ఒళ్లో పోస్తాడు. (వ్యాస రచయిత ప్రముఖ నెఫ్రాలజిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత) -
నేను సచిన్ని కాదు...
బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని జీరోగా మారిన ఓ మధ్యతరగతి క్రికెటర్ కథతో ‘ఐ యామ్ నాట్ సచిన్’ చిత్రం రూపొందనుంది. స్నేహగీతం, ఇట్స్ మై లవ్స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాల దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ ఈ చిత్రానికి నిర్దేశకుడు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి.సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం మే నెలలో మొదలు కానుంది. జీవీఎస్ ప్రకాష్ రచన చేస్తున్నారు. -
సిక్కోల్లో భీమవరం బుల్లోడు సందడి
శ్రీకాకుళం కల్చరల్ : ‘భీమవరంబుల్లోడు’ సినిమా యూనిట్ సోమవారం శ్రీకాకుళం పట్టణంలోని కిన్నెర హాల్లో సందడి చేసింది. సినీ ప్రేక్షకులను అలరించింది. సినిమాల్లోని కొన్ని డైలాగ్లు చెబుతూ, పాటలకు డ్యాన్స్ చేస్తూ హీరో, హీరోరుున్లు సునీల్, ఎస్తేరులు ఉర్రూతులూగించారు. అనంతరం సునీల్ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో పాటలు, కథ ఎలా ఉందని అడిగారు. హీరోయిన్ ఎస్తేరు మాట్లాడుతూ మంచి హిట్ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ అనూప్ రూబెన్స్ పలు గీతాలను ఆలపించారు. వీరితో పాటుగా నటులు సత్యం రాజేష్, పృధ్విరాజ్, థియోటర్ మేనేజర్ వరప్రసాద్లు పాల్గొన్నారు. తెలుగు ‘గోవిందా’ కావాలనుంది హిందీ హీరో గోవిందా వలే తెలుగు గోవింద కావాలని ఉందని భీమవరం బుల్లోడు హీరో సినీల్ అన్నారు. స్థానిక కిన్నెర థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో విలేకరులతో కాసేపు ముచ్చటించారు. హిందీలో గోవిందా ఇటు కమెడియన్గా, అటు హీరోగా చేసిన సక్సెస్ చూసిన తరువాత ఈ కోరిక కలిగిందన్నారు. తడాఖాలాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పక నటిస్తానన్నారు. హీరోగా అయితే డైటింగ్ చేసి స్లిమ్స్గా ఉండేందుకు ప్రయత్నించాలన్నారు. హీరో ఛాన్సుకన్నా కమెడియన్గా చేయడం చాలా ఇష్టమన్నారు. ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ చాలా బాగుందన్నారు. కవి దూర్జటి రచించిన ‘భక్త కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. అలాగే, నల్లమల బుజ్జి, మోహన్లు నిర్మిస్తున్న మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేయడమంటే చాలా ఇష్టమన్నారు. అందు లో చుదువుకోసం సహాయం చేసేం దుకు ఎప్పుడూ ముందుంటానన్నా రు. రాజకీయాలంటే ఇష్టంలేదన్నా రు. ఈ సినిమాకు మాటల రచయిత అయిన సీపాన సురేష్ మీజిల్లా వాడేనని తెలిపారు. అందుకే విజయోత్సవాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించామన్నారు. హిందీ సినిమాలో అవకాశం వస్తే నటిస్తానని, కానీ తెలుగు సినీ పరిశ్రమను విడిచిపెట్టనన్నారు. శ్రీధర్కు సత్కారం భీమవరం బుల్లోడు సినిమా మాటల రచయిత జిల్లాకు చెందిన సీపాన శ్రీధర్ను స్నేహితులు శంకర తరఫున హీరో సునీల్ దుశ్శాలువతో, దండతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన స్వగ్రామం టెక్కలి అన్నారు. తల్లిదండ్రులు రమణమ్మ, సత్యనారాయణ ఆశీస్సులతో సినిమా ఇండస్ట్రీకి వెళ్లానన్నారు. తను బీఈ చదివానని, సినిమా హిట్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. -
నగారా మోగింది
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) పురపాలికల సమరానికి ముహూర్తం ఖరారు చేసింది. సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన ఎస్ఈసీ.. ఈనెల 30న జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. వార్డుల పునర్విభజన ప్రక్రియపై న్యాయస్థానంలో కేసు పెండింగ్లో ఉన్నందున మేడ్చల్ పురపాలక సంఘానికి ప్రస్తుతం ఎన్నికలు జరపడంలేదని పేర్కొంది. మిగతా బడంగ్పేట, పెద్ద అంబర్పేట, ఇబ్రహీంపట్నం నగర పంచాయతీలుసహా తాండూరు, వికారాబాద్ మున్సిపాలిటీలకు ఒకే రోజున పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. 1.98 లక్షల మంది ఓటర్లు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం. కొత్తగా పనుల మంజూరు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టకూడదని ఆదేశాలిచ్చాం. కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అభ్యర్థుల ప్రచార సరళిని కూడా నిశితంగా పరిశీలించనున్నాం. మద్యం, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పరిశీలకులను కూడా వినియోగిస్తాం. ఎన్నికలకు ఐదు మున్సిపాలిటీలకే పరిమితమైనా, కోడ్ జిల్లా అంతటికీ వర్తిస్తుంది. ఐదు పురపాలికల పరిధిలో 1,98,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 119 వార్డులకు జరిగే ఈ ఎన్నికల్లో 174 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను వాడనున్నాం. సాంకేతిక ఇబ్బం దులు తలెత్తితే అప్పటికప్పుడు అమర్చడానికి పది శాతం ఈవీఎంలను అందుబాటులో ఉంచనున్నాం. సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెడుతున్న తిరస్కరణ ఓటు(నోటా) విధానం మున్సిపాలిటీ ఎ న్నికల్లో అమలు చేయడంలేదు. పాత ఈవీఎంలను వినియోగిస్తున్నందున నోటా అమలు సాధ్యపడడంలేదు. కేసు పెండింగ్లో ఉండడంతో... మేడ్చల్ నగర పంచాయతీకి ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడంలేదు. న్యాయస్థానంలో కేసు ఉన్నందున ఎన్నికల కమిషన్ ఈ పట్టణ ఎన్నికలను వాయిదా వేసింది. శివార్లలోని 35 గ్రామ పంచాయతీలను పన్నెండు కొత్త మున్సిపాలిటీల పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలకు ఇంకా ప్రభుత్వం ఆమోదముద్ర వేయలేదు. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన అనంతరం వీటి ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రతి బూత్కు నలుగురు పోలింగ్ సిబ్బంది స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి బూత్కు నలుగురు విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాం. పోలింగ్ అధికారి, సహాయ పోలింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుం టారు. వీరికి అదనంగా 10శాతం సిబ్బందిని ఇస్తున్నాం. పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జోనల్ అధికారులను రంగంలోకి దించుతాం. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నాం. ఆయా మున్సిపాలిటీ ల ప్రత్యేకాధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమావేశమై.. పోలీసు బలగాల అవసరాలపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించా. -
రెండేళ్లలో మూడింతలు
టార్గెట్.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి ఏడాదిలో పదేసిరెట్లు, వందేసి రెట్లు సంపాదించిన వారి కథలు చూస్తూనే ఉంటాం. కాకుంటే అలాంటివారు ఒకరో ఇద్దరో ఉంటే... డబ్బులు పోగొట్టుకున్నవారు మాత్రం వందలు, వేలల్లో ఉంటారు. కాకపోతే మంచి షేర్లలో పరిమిత లాభాన్ని ఆశిస్తూ పెట్టుబడి పెట్టిన వారికి మాత్రం షేర్లు మంచి లాభాలనే ఇస్తుంటాయి. అలాంటి ఓ విజయమే ఇది... నా పేరు శ్రీధర్. చిరుద్యోగిని. మా తాతయ్య 2012లో రిటైరయ్యాడు. వచ్చిన డబ్బుల్లోంచి మా అమ్మకు లక్ష రూపాయలిచ్చాడు. మా అమ్మ నాకు బైక్ కొనుక్కోవడానికి దాంట్లోంచి రూ.25 వేలు ఇచ్చింది. అప్పుడే మా కంపెనీ క్యాబ్ సౌకర్యం ఏర్పాటు చేయటంతో నాకు బైక్ అవసరం లేకపోయింది. అమ్మ ఇచ్చిన డబ్బులు ఏం చేయాలా... అని ఆలోచించా. బ్యాంకులో వేస్తే సురక్షితమే కానీ ఎక్కువ రాబడి రాదు. ఎక్కువ రాబడి వచ్చేది రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో మాత్రమే. కానీ 25 వేలు రియల్ ఎస్టేట్కు ఎటూ చాలదు. స్టాక్ మార్కెట్లోనైతే చేయొచ్చు. అలా అనుకున్న తరవాత... ఏ షేర్ కొనాలనేది పెద్ద సమస్య అయింది. అప్పట్లో స్టాక్ మార్కెట్లో ఐటీ, ఫార్మా షేర్ల హవా సాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులున్నాయి కనుక ఐటీ షేర్ల జోలికి వెళ్లకూడదనుకున్నా. మిగిలింది ఫార్మా. అప్పట్లో సన్ ఫార్మా బాగా పెరిగేది. భారత్లోని టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటి కావటంతో పాటు, అమెరికా జనరిక్స్ మార్కెట్లో కూడా మంచి ఆదాయం ఆర్జిస్తోందని పేపర్లో చదివా. కొనాలా వద్దా అనుకుంటుండగానే ఆ షేర్ రూ.1,800 నుంచి రూ.2,300కు దూసుకెళ్లింది. మెడికల్ షాపులకు చెప్పిన టైమ్కు డెలివరీ చేయడం, ఇన్వాయిస్లు, క్రెడిట్ నోట్లు అన్నీ పర్ఫెక్ట్గా చేసే కంపెనీల్లో ఇదొకటని మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసే మిత్రుడొకడు చెప్పాడు. కంపెనీ పనితీరు బాగుంటే షేరు పనితీరు కూడా బాగుంటుందన్న అంచనాతో ఒక్కో షేర్ను రూ.2,300 చొప్పున 10 సన్ ఫార్మా షేర్లు కొన్నా. నా పెట్టుబడి రూ.23,000. నేను కొన్న కొన్ని రోజులకే ఈ షేర్ను స్ల్పిట్ చేశారు. రూ.5 ముఖ విలువ ఉన్న షేర్ను రూ.1 ముఖ విలువ ఉన్న 5 షేర్లుగా విభజించారు. దీంతో నా దగ్గరున్న 10 షేర్లు 50 అయ్యాయి. షేర్ ధర 2,500 నుంచి రూ.500కు సర్దుబాటయింది. తరవాత మెల్లగా పెరిగి రూ.800కు చేరింది. ఆ సమయంలో 1:1 బోనస్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో నా దగ్గరున్న 50 షేర్లు 100 అయ్యాయి. షేర్ ధర రూ.400కు సర్దుబాటయింది. ప్రస్తుతం రూ.644 పైనే ఉంది. అంటే నా పెట్టుబడి దాదాపు మూడు రెట్లయినట్లు లెక్క. అది కూడా రెండేళ్లలోనే. పెపైచ్చు ఈ రెండేళ్లలో కంపెనీ నుంచి రూ.1,000 పైనే డివిడెండ్ అందింది. అదీ నా ఇన్వెస్ట్మెంట్ కథ. -
కూతురి కిరాతకం
ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన వైనం వివాహేతర సంబంధం వద్దని మందలించినందుకు దారుణం బెంగళూరు, న్యూస్లైన్ : చెడుదారిలో వెళ్తున్న కన్న కూతురుని మందలించిన పాపానికి ఆ తల్లి దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం సాయంత్రం నగర శివార్లలోని తావరకెరె పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నగర శివార్లలోని బ్యాడరహళ్లిలోని కెంపేగౌడ నగరలో నివాసం ఉంటున్న గంగాంబిక (47) హత్యకు గురైంది. ఆమె కుమార్తె చైత్ర, ప్రియుడు శ్రీధర్ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం తావ రకెరె పోలీసులు తెలిపారు. వివ రాలు... మాగడి తాలుకా సాతనూరు గ్రామ పంచాయతీలోని కోండహ ళ్లికి చెందిన గంగరాజప్ప, గంగాంబిక దంపతులు శ్రీమంతులు. వీరి ఒక్కగానొక్క కుమార్తె చైత్ర, కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఐదేళ్ల క్రితం జగదీష్ అనే వ్యక్తితో చైత్ర వివాహం జరిపించారు. వీరికి భవాని (4) అనే కుమార్తె ఉంది. కుటుంబ సమస్యల కారణంగా చైత్ర ఎనిమిది నెలలుగా పుట్టింటిలో ఉంటోంది. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో చైత్ర ఓ కారు డ్రైవర్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ శ్రీధర్ చైత్ర ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం చుట్టుపక్కల మహిళల ద్వారా తల్లి గంగాంబిక చెవిన పడింది. దీంతో ఆమె చైత్రను తీవ్రంగా హెచ్చరించింది. అయినా చైత్ర ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం శ్రీధర్ చైత్ర ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఇంటిలో ఉన్న సమయంలో గంగాంబిక గొడవ చేసింది. బయటకు వెళ్లమని శ్రీధర్ను హెచ్చరించింది. ఆ సమయంలో శ్రీధర్ను వెనుకేసుకొస్తూ చైత్ర తల్లితో వాగ్వాదానికి దిగింది. ఇదే సమయంలో తీవ్ర ఆవేశంలో ఉన్న శ్రీధర్, చైత్రలు కలిసి గంగాంబిక గొంతు నులిమి హత్య చేశారు. ఆమె మరణించడంతో వారు అక్కడి నుంచి జారుకోడానికి యత్నించారు. అయితే గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు పారిపోతున్న చైత్ర, శ్రీధర్ను వెంటాడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
సీఎం కార్యదర్శిపై టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్పై టీడీపీ ఎమ్మెల్యే పి.మహేందర్రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ విరుచుకుపడ్డారు. వారిద్దరూ గట్టిగా అరుచుకోవడంతో అక్కడే ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. బుధవారం అసెంబ్లీలోని సీఎం చాంబర్ సమీపంలోనే ఈ సంఘటన జరిగింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. మహేందర్రెడ్డికి సంబంధించిన మెడికల్ కాలేజీ ఫైలుపై శ్రీధర్ వ్యతిరేక నోట్ పొందుపరిచారు. దీంతో అది పెండింగ్లో పడింది. దీనిపై మాట్లాడేందుకు మహేందర్రెడ్డి అక్కడికి వచ్చారు. శ్రీధర్ వద్దకు వెళ్లి ఫైల్పై వ్యతిరేకంగా ఎందుకు రాశారని ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడున్న పరిస్థితిపై తనకు అందిన నివే దికలను అనుసరించి అలా రాశానని శ్రీధర్ చెప్పారు. అలా ఎందుకు రాస్తావు.. ఇలా రాయాలి కదా అంటూ మహేందర్ ఒక నోట్ను ఆయనకు చూపించారు. మీరు చెప్పినట్లు రాయడానికి తాను ఇక్కడ లేనని, తనకు జీతం ఇస్తున్నది ప్రభుత్వం తప్ప మీరు కాద ని, కావాలంటే సీఎంకు ఫిర్యాదు చేసుకోవచ్చని శ్రీధర్ స్పష్టంచేశారు. కోపం పట్టలేని మహేందర్ తీవ్రపదాలతో శ్రీధర్పై విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటుండంతో అక్కడే ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్రెడ్డి, రావత్లు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. మహేందర్ తీవ్రంగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను శ్రీధర్, ఇతర అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మహేందర్రెడ్డి తీరుపై ఐఏఎస్ అధికారుల సంఘానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విధుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులకు ఆటంకం కలిగించిన, దాడులకు తెగబడిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను మళ్లీ పోటీ కి వీల్లేకుండా అనర్హులుగా ప్రకటించే అవకాశమున్నందున మహేందర్పై ఆ విధమైన చర్యలు తీసుకొనేలా ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించామని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
పెద్దపల్లి, న్యూస్లైన్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. చేసిన పనులను ఎంబీ రికార్డు చేసేం దుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో పంచాయతీరాజ్ ఏఈ. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో గ్రామంలోని గాంధీనగర్లో మాజీ సర్పంచ్ గుండా మురళి రూ.2లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మించారు. గత నెలలో పనులు పూర్తి కావడంతో బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరగగా ఎంబీ రికార్డు చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈ మంచాల శ్రీధర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనన్నా ఏఈ వినకపోవడంతో రూ.15 వేలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పెద్దపల్లిలోని ఈఈ కార్యాలయానికి వెళ్లిన మురళి ఏఈని కలిశాడు. కార్యాలయం గేటు వద్ద మురళి నుంచి ఏఈ శ్రీధర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందని, అరికట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, విద్యావంతులపై ఉందని చెప్పారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇది మంచి పరిణామమని అన్నారు. పనిచేస్తే ఏం మిగల్లేదు - మురళి, బాధితుడు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కోటా నిధుల నుంచి రూ.2 లక్షల విలువ గల సీసీ రోడ్డు డిసెంబర్లో మంజూరైంది. వెంటనే నిర్మాణం పూర్తి చేశా. బిల్లు కోసం నెల రోజులుగా తిరుగుతున్న. రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సహించలేకపోయా. మొత్తం పని చేస్తేనే రూ.20 వేలు కూడా మిగలలే. ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
ఆంధ్రా, తెలంగాణలో చట్టాలు వేరుగా ఉన్నాయి
ముదిగొండ, న్యూస్లైన్: ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కేంద్ర కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ‘భూమి హక్కుల చైతన్య యాత్ర’లో భాగంగా ఆదివారం ఆయన ముదిగొండ మండలం మేడేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రాంతంలోని భూ సమస్యలకు సంబంధించి నూతన చట్టాలు తీసుకురావాలనే అంశంపై రైతులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని అన్నారు. భూ కొనుగోలు, వారసత్వ మార్పు చేసిన తర్వాత పట్టాల్లో మార్పులు చేయడానికి రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. భూములన్నీ రీసర్వే, సెటిల్మెంట్లు చేయాలని తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నాలుగు ృందాలు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులు, వ్యవసాయ కూలీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకుని నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పాలకులకు చెప్పేందుకు భూ సమస్యలపై యాత్రలు చేస్తున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాలను పంచుకుంటున్నారే తప్ప ఆ గ్రామాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నివసిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు తమ దృష్టికి తీసుకువస్తున్నారని, రైతుల అభిప్రాయాలను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అందజేస్తామని అన్నారు. విలేకరుల సమావేశంలో గ్రామీణాభివృద్ధి సంస్థ దేశ డెరైక్టర్ గ్రేగర్, రాష్ట్ర డెరైక్టర్ ఎం. సునీల్కుమార్, రీసెర్చ్ మేనేజర్ సంతోష్, ప్రతినిధులు రవీందర్, రమేష్, ప్రభాకర్, మేడేపల్లి సర్పంచ్ కొత్తపల్లి నాగలక్ష్మి, రైతులు సామినేని ిహ మవంతరావు, పయ్యావుల లింగయ్య, పోటు ప్రసాద్ పాల్గొన్నారు. -
అసెంబ్లీలో గొంతెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
తెలంగాణపై మాట్లాడిన చీఫ్ విప్ గండ్ర దయాకర్రావు, వినయ్, శ్రీధర్కు కూడా అవకాశం ఎర్రబెల్లి, దాస్యం నడుమ వాగ్వాదం వరంగల్, న్యూస్లైన్ : ఆరు దశాబ్దాల తెలంగాణ ఏ ర్పాటు కల సాకారమయ్యే సమయంలో బిల్లుకు అడ్డం కులు సృష్టించడం సరైంది కాదు. ఇప్పటికే సీమాంధ్ర పాలనలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరి గింది. ఆత్మగౌరవం, స్వయం పాలన లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నాం. శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తూ .. స్వాగతం తెలియజేస్తున్నామంటూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చ సందర్భంగా జిల్లాకు చెందిన చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. అలాగే, దాస్యం వినయ్భాస్కర్, కొండేటి శ్రీధర్కు మాట్లాడే అవకాశం లభించింది. అయితే, ఎర్రబెల్లి తన ప్రసంగంలో అమరువీరుల కుటుంబాలను ఆదుకోలేదంటూ టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. దీంతో వినయ్భాస్కర్ కూడా తాను మాట్లాడిన సమయంలో దయాకర్రావుపై విరుచుకుపడ్డారు. తమ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్రావును డీలర్ దయాకర్రావు అంటారని.. ఆయన ప్రస్తుతం డీలర్ నుంచి డాలర్ స్థాయికి ఎదిగారని మండిపడ్డారు. ఈక్రమంలో ఇరువురి నడుమ వాడీవేడీ విమర్శలు చోటుచేసుకున్నాయి. కాగా, వినయ్భాస్కర్, కొండేటి శ్రీధర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే.. ఆజంజాహిని మింగేశారు: వినయ్ నిజాం హయంలో వరంగల్లో ఏర్పాటు చేసిన ఆజం జాహి మిల్లును మింగేశారు. భూమి కూడా లేకుండా చేశారు. సీమాంధ్రపాలనలో జిల్లాకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఇంత కంటే ఉదాహరణ అవసరం లేదు. ఇక మహబూబ్నగర్ జనం వలసబాట పట్టగా, రంగారెడ్డి, హైదరాబాద్ రైతులు వారి భూముల్లోనే కూలీలుగా మారారు. నల్లగొండ ప్రజలకు ఫ్లోరైడ్ మహమ్మారి మిగలగా, చేనేత కార్మికులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి. అలాగే, ఖమ్మంలో భూగర్భ వనులను కొల్లగొట్టారు. ఈక్రమంలో స్వయం పాలన కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరవీరులయ్యారు. తెలంగాణ పదాన్ని శాసనసభలో మాట్లాడకుండా టీడీపీ హయంలో నిషేధించారు. షరతులు లేని తెలంగాణ కావాలి: కొండేటి షరతులు లేని తెలంగాణ కావాలి. రాష్ట్ర ఏర్పాటుసందర్భంగా హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు విధించరాదు. అనేక మంది అమరుల త్యాగఫలితం, కాంగ్రెస్ పార్టీ సాహసోపేత నిర్ణయం వల్ల తెలంగాణ సాకారమైంది. బడుగువర్గాల నేత అంబేద్కర్ ఆలోచన మేరకే తెలంగాణ ఆకాంక్ష ఫలించే సమయం ఆసన్నమైంది. నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయినప్పటికీ వచ్చిన మేరకు కృషి చేశాను. ఎయిర్పోర్ట్, డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రద్ధ వహించాను. రానున్న తెలంగాణ రాష్ట్రంలో మరింత అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. -
10వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి ఫిబ్రవరి 10 నుంచి 25వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించేం దుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సదస్సుల ఏర్పాటుపై గురువారం రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ బి.శ్రీధర్ మంత్రికి వివరించారు. జిల్లాస్థాయిలో ముందుగా రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 37 మండలాల్లో 25 మంది తహసీల్దార్లు మూడేళ్లకు పైబడి పనిచేస్తున్నారని, వీరిని బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ చంపాలాల్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మంజూరు ఇంతేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రబీ సీజన్లో నిర్దేశించిన పంట రుణ లక్ష్యం సాధనలో బ్యాంకర్లు వెనుకబడటంపై కలెక్టర్ బి.శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని సూచించారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరుపై సమీక్షిస్తూ రబీ సీజన్లో రుణ లక్ష్యం రూ.268.55 కోట్లకు గాను ఇప్పటివరకు కేవలం రూ.161.99కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ వందశాతం రుణాలివ్వాలన్నారు. రుణ పురోగతిలో వెనుకబడిఉన్న దక్కన్ గ్రామీణ బ్యాంకు, ఎస్బీహెచ్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు కంట్రోలింగ్ అధికారులను వివరణ కోరగా.. రికవరీ లేకపోవడంతో రుణ మంజూరులో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ మండల స్థాయిలో రికవరీ క మిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వికారాబాద్, పరిగి, గండేడ్, దోమ మండలాల్లో రుణ మం జూరు అతి తక్కువగా ఉందన్నారు. స్వయం ఉపాధి యూనిట్లకు సంబంధించి లబ్ధిదారులతో వెంటనే ఖాతాలు తెరిపించి రుణాలు మంజూ రు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, జేడీఏ విజయ్కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిని బలిగొన్న పోలీసు జీపు
చేవెళ్ల రూరల్, న్యూస్లైన్: పోలీసు జీపు ఓ వ్యక్తిని బలిగొని ఓ కుటుంబాన్ని రోడ్డుపాల్జేసింది. పండుగపూట విషాదం చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని ఇబ్రహీంపల్లి సమీపంలోని జాజుగుట్ట వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, స్థానికులు మృతదేహంతో ఠాణా ఎదుట ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. ఇబ్రహీంపల్లికి చెందిన బీరప్పొళ్ల కుమార్(26) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం ఆయన బైకుపై గ్రామ సమీపంలోని జాజుగుట్టకు వెళ్తున్నాడు. అదే సమయంలో చేవెళ్ల నుంచి పరిగి కోర్టుకు నిందితులను తీసుకెళ్తున్న పోలీసు జీపు అతివేగంగా వస్తూ అతడి బైకును ఢీకొంది. దీంతో కుమార్ రోడ్డుపై పడిపోయాడు. ఆయన పొట్టపైనుంచి పోలీసు జీపు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు జీపును ఆపకుండా చేవెళ్ల ఠాణాకు వెళ్లారు. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీధర్ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని గమనించారు. ఆయన సూచన మేరకు కుమార్ను అంబులెన్స్లో నగరానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. చేవెళ్ల ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన జీపును, డైవర్ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఠాణా ఎదుట ఆందోళన.. కుమార్ మృతితో గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున చేవెళ్లకు చేరుకున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతదేహంతో ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు అప్రమత్తమై చేవెళ్ల సర్కిల్లోని సిబ్బందిని రప్పించారు. రెండుగంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని డీఎస్పీ శ్రీధర్ ఆందోళనకారులకు సర్దిచెప్పారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. తమకు స్పష్టమైన హామీ వచ్చేవరకు పోస్టుమార్టం నిర్వహించొద్దని ఆందోళనకారులు అక్కడ భీష్మించారు. దీంతో డీఎస్పీ శ్రీధర్ జిల్లా ఎస్పీ రాజకుమారితో ఫోన్లో మాట్లాడారు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సమస్య సద్దుమణిగింది. ఎస్పీ ఆదేశాల మేరకు చేవెళ్ల ఎస్ఐ లక్ష్మీరెడ్డి అంత్యక్రియల కోసం రూ. 10 వేలు అందజేశారు. -
పండుగపూట దారుణం
పరిగి, న్యూస్లైన్: పండుగపూట దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆమెపై అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పరిగి సమీపంలోని తుంకలగడ్డ వాగులో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన కొందరు పట్టణవాసులకు ఓ మహిళ మృతదేహం తుంకులగడ్డ వాగులో కనిపించింది. అర్ధనగ్నంగా ఉంది. సమాచారం అందుకున్న పరిగి సీఐ వేణుగోపాల్రెడ్డి, చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, ఎస్ఐ లకా్ష్మరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి మెడకు చిన్న టవల్ బిగించి ఉంది. తలపై గాయాలు ఉన్నాయి. అర్ధనగ్నంగా పడిఉన్న ఆనవాళ్లను బట్టి ఆమెపై దుండగులు అత్యాచారం జరిపి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసు జాగిలం పరిగి పట్టణంలోకి వచ్చి కాసేపు తెలుగుతల్లి విగ్రహం చౌరస్తాలో ఆగింది. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తాకు వెళ్లింది. దీనిని బట్టి.. దుండగులు మహిళను హత్య చే సిన తర్వాత పరిగి వరకు నడుచుకుంటూ వచ్చి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఏదైనా వాహనంలో ఎక్కి వెళ్లి పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హతురాలు ఆకపచ్చరంగు జాకెట్టు, పసుపురంగు చీర ధరించి ఉంది. ఆమెకు 40-45 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి పోలీసులు తెలిపారు. -
అతిగా మద్యం తాగి సీఐఎస్ఎఫ్ ఎస్సై మృతి
సూళ్లూరుపేట, న్యూస్లైన్ : అతిగా మద్యం సేవించి షార్లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెక్టార్-ఏలో ఎస్సైగా పనిచేస్తున్న యుకే తిమ్మయ్య (60) మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని కచ్చేరివీధిలోని కృష్ణాలాడ్జిలో శనివారం జరిగింది. తిమ్మయ్య మృతి చెందిన విషయాన్ని గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ట్రైనీ డీఎస్పీ జే కులశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు. గదిలోని అతని బ్యాగ్ను పరిశీలించగా సీఐఎస్ఎఫ్ ఎస్సైగా గుర్తించి షార్ సీఐఎస్ఎఫ్ కమాండెంట్ శ్రీధర్కు సమాచారం అందించారు. కమాండెంట్, ఇతర సీఐఎస్ఎఫ్ సిబ్బంది మృతదేహాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కూర్గ్ జిల్లా హమ్మత్ గ్రామానికి చెందిన యూకే తిమ్మయ్య షార్ కేంద్రం భద్రతా దళంలో ఎస్సైగా పని చేస్తున్నారు. మరో అయిదారు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. కుటుంబ విభేదాలతో భార్యకు దూరంగా షార్లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. గతనెల 28 నుంచి 31 వరకు ఆరోగ్యం సరిగా లేదని విధులకు సెలవు పెట్టారు. ఈ నెల ఒకటిన కాలు వాచిందని షార్ అసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. వాస్తవంగా ఈనెల 1న విధుల్లో చేరాల్సి ఉండగా రెండు రోజుల నుంచి లాడ్జిలో రూం తీసుకుని మద్యం సేవిస్తూనే ఉన్నాడు. లాడ్జి సిబ్బంది వద్దని వారించినా మాట వినకుండా అతిగా మద్యం సేవించాడని తెలిపారు. మైకంలో కాలు జారిపడిపోయాడా! గొంతు ఎండుకు పోయి చనిపోయాడా! అనే విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. షార్ భద్రతా సిబ్బంది కమాండెంట్ మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం పర్యటనపై చిచ్చు
కరీంనగర్ సిటీ, న్యూస్లైన్ : రాష్ట్ర విభజనకు ముందే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి.. తన పేరును ‘శిలాక్షరాల్లో’ చిరస్థాయిగా నిలుపుకోవాలనే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఆశలకు ఆటంకాలు ఎదురయ్యేలా ఉన్నాయి. సీఎం సమైక్యాంధ్ర జపం చేస్తూ తెలంగాణను అడ్డుకుంటున్నారని పార్టీలకతీతంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్ర విభజన ఖాయం కానున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి కాకుండానే కిరణ్కుమార్రెడ్డి హడావుడిగా జనవరి 5న ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధమయ్యారు. సొంతపార్టీ నేతలకు, చివరకు మంత్రి శ్రీధర్బాబుకు సైతం చెప్పకుండానే.. ఇంజినీరింగ్ అధికారుల ద్వారా సమాచారం అందించినట్లు తెలిసింది. దీంతో మంత్రితోపాటు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం పర్యటన విషయమై తనకు సమాచారం లేదని మంత్రి శ్రీధర్బాబు శనివారం కరీంనగర్లో విలేకరులతో వెల్లడించారు. తెలంగాణ విషయంలో ప్రజల పాలిట నరరూప రాక్షసుడిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే హెలిక్యాప్టర్ దిగకుండా తరిమికొడతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని ఇప్పటికే సీపీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు సన్నద్ధమవుతున్నారు. -
పాపం.. ఆండాలమ్మ
‘మనసు మనసుతో ముడి వేస్తావ్.. మనిషి ప్రేమతో పెనవేస్తావ్... ఆడినంతసేపాడుకుని బొమ్మలన్నీ విసిరేస్తావ్.. ఈ మాయలన్నీ నీకే తెలుసని.. ఏమాయా తెలియని మనిషి హృదయాలను వేధిస్తున్నావ్... పచ్చగా ఉన్న బతుకులను.. ఎండమావి చేసి చూస్తున్నావ్..’ అంటూ ఓ సినీ కవి తన పాటకు అక్షరరూపమిస్తే.. ఆ రూపానికి నిజ స్వరూపం ఈ అభాగ్యుల జీవిత చిత్రం. ఒకరేమో.. ఒకప్పుడు భర్త, బిడ్డలు.. కార్లు, అంతస్తులతో బాగా బతికి.. నేడు రోడ్డున పడితే.. మరొకరు తోడూనీడా లేక.. నా అన్నవారు కానరాక చస్తూ బతుకుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రోడ్డు పక్కన షెడ్డు కింద.. చలికి తట్టుకోలేక.. నిండా దుప్పటి కప్పుకుని.. బిక్కుబిక్కుమంటూ చూస్తు న్న ఈ అభాగ్యురాలిపేరు ఆండాలమ్మ (80). ఒకప్పుడు ప్రొద్దుటూరు పట్టణంలో కార్లు ఉన్న కుటుంబాల్లో ఈమె కుటుంబం ఒకటి. సుమారు 40 ఏళ్ల కిందట భర్త లోకయ్యనాయుడుతో కలిసి మద్రాసు నుంచి వ్యాపారం కోసం వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. పాత మార్కెట్లో పెద్ద చెప్పుల దుకాణం నడుపుకుంటూ బాగా బతికారు. ఇంటి పెద్ద మరణంతో.. లోకయ్యనాయుడు,ఆండాలమ్మలకు శ్రీధర్, కృష్ణకుమార్లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో కృష్ణకుమార్ ఆర్ఎంపీ వైద్యుడిగా పేరొందాడు. పెద్ద కుమారుడు తండ్రికి చేదోడుగా ఉంటూ వ్యాపారా న్ని చూసుకునే వాడు. కొన్నేళ్ల కిందట లోకయ్యనాయుడు గుండెపోటు తో మృతి చెందాడు. శ్రీధర్ వ్యాపారాన్ని సరిగా చూసుకోలేక పోయాడు. ఉన్నదంతా పొగొట్టుకోవడం తో ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. చివరికి శ్రీధర్ ఫిల్మ్ ఆపరేటర్గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. శ్రీధర్ గుండెపోటుతో మృతి... ఫిల్ము ఆపరేటర్గా పని చేస్తున్న శ్రీధర్ కూడా కొన్ని నెలల కిందట గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆండాలమ్మ కోలుకోలేక పోయింది. ఈ క్రమంలో చిన్న కుమారుడు కృష్ణకుమార్ మతి స్థిమితం కోల్పోవడంతో అండాలమ్మ మరింత కుంగిపోయింది. ఈ దశలో ఇంటి బాడుగ కూడా కట్టలేని స్థితిలో ఆండాలమ్మ అనాథగా రోడ్డుపాలైంది. చిన్న కుమారుడు మతి స్థిమితం కోల్పో యినా వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చి ‘అమ్మాబాగున్నావా’ అని పలకరించి వెళుతుంటాడని అండాలమ్మ ఆవేదనతో తెలిపింది. బంధువులంతా మద్రాసులోనే ఉన్నారని తెలిపింది. తండ్రి పోలీస్శాఖలో... ఆండాలమ్మ తండ్రి గోవిందస్వామినాయుడు పోలీస్శాఖలో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అన్న జీఎం స్వామి కూడా పోలీస్శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. అండాలమ్మ పరిస్థితి చూసి స్థానికులు చలించి పోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -న్యూస్లైన్, ప్రొద్దుటూరు టౌన్ -
ఫైనల్లో శ్రీధర్, మదన్
జింఖానా, న్యూస్లైన్: ఐటీఎఫ్ సీనియర్ టెన్నిస్ టోర్నీ 65+ విభాగంలో శ్రీధర్, మదన్ ఫైనల్స్లోకి దూసుకెళ్ళారు. శాప్ టెన్నిస్ కాంప్లెక్స్లో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీధర్ 6-1, 6-3తో టాప్ సీడ్ అరవింద్పై నెగ్గగా... మదన్ 6-2, 6-2తో సూర్యనారాయణరాజుపై విజయం సాధించాడు. 45+ డబుల్స్ విభాగం సెమీఫైనల్లో టాప్ సీడ్ అలోక్-పవన్ జోడి 6-1, 6-2తో అర్జున్-మీర్జా జోడిపై, సతీష్ చంద్ర-వెంకట రామరాజు జోడి 7-6, 6-5తో మేఘనాథ్-విశ్వనాథ్ జోడిపై గెలిచి ఫైనల్స్కు అర్హత సాధించాయి. 35+ డబుల్స్ సెమీఫైనల్స్లో అలోక్-దిలీప్ జోడి 6-1,6-4తో విక్రమ్-శ్రీనాథ్ను, మహేష్-వాహిద్ జోడి 7-6, 6-4తో వినాయక్-సతీర్థ్ జోడిని ఓడించి ఫైనల్స్కు చేరుకున్నాయి. మిగతా ఫలితాలు 35+ సింగిల్స్ క్వార్టర్ఫైనల్స్: సతీర్థ్ 6-0, 6-5తో విజయ్పై, అర్జున్ 6-3, 5-7, 6-0తో మహేష్పై, దిలీప్ 6-3, 6-2తో విక్రమ్పై నెగ్గారు. 45+ సింగిల్స్ క్వార్టర్ఫైనల్స్: పవన్ 6-0, 6-0తో అరోర యశ్పాల్పై, సతీష్ చంద్ర 7-6, 6-0తో సింగ్ పన్వార్పై, రుద్రరాజు 6-1, 6-2తో ధీరజ్పై, మేఘనాథ్ 7-5, 7-5తో కుమార్పై గెలిచారు. 55+ సింగిల్స్ క్వార్టర్ఫైనల్స్: అజిత్ 6-2, 6-4తో రత్నాకర రావును, సురేష్ 6-4,6-4తో రామన్ను, జానకిరామ్ 6-4, 6-1తో ప్రమోద్ కుమార్ను ఓడించారు. -
అర్హులను ఓటర్లుగా నమోదు చేయాలి
కడప కలెక్టరేట్, న్యూస్లైన్: ఓటర్ల నమోదు కార్యక్రమానికి ఈ నెల 23తో గడువు ముగుస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఈఆర్ఓలు, ఏఈ ఆర్ఓలతో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడా రు. క్లెయిమ్స్లు, అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తులను తక్షణ మే పరిష్కరించాలని చెప్పారు. సాయంత్రంలోపు వీలైనంత ఎక్కువగా వీటిని పరిష్కరించాలన్నారు. సోమవారం ఎన్నికల కమిషన్ అధికారులతో హైదరాబాదు జూబ్లీ హాలులో కలెక్టర్ల సమావేశం ఉన్నందున అర్జీల పరిష్కారంపై శ్రద్ధ చూపాలన్నా రు. పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటు లో ఉండాలన్నారు. వీరితోపాటు ఐకేపీ సిబ్బంది, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండడం వల్ల 18-19 ఏళ్ల ఓటర్లు, లింగ నిష్పత్తి వివరాలను బూత్ లెవెల్లో సులభంగా పరిశీలించే అవకా శం ఉంటుందన్నారు. తొలగించిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. సిద్దవటం మండలంలోని ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసు సిబ్బందిని ఓటర్ల జాబితాలో నమోదు చేయించాలని రాజం పేట సబ్ కలెక్టర్, తహశీల్దార్లను ఆదేశించారు. ఇతర మండలాల్లోని తహశీల్దార్లు సంబంధిత స్టేష న్ హౌస్ అదికారులతో సంప్రదించి పోలీసు సిబ్బంది అంతా ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని కోరారు. డూప్లికేట్ ఓటర్లను, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారిని జాబితాల్లోంచి తొలగించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. బోగస్ ఓట్లపై ఫిర్యాదులపై స్పందించాలని ఆదేశించారు. జేసీ నిర్మల, ఏజేసీ సుదర్శన్రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఆన్లైన్లోనే ఎక్కువగా నమోదు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఆదివారం ముగి సింది. అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఇప్పటికే నాలుగు పర్యాయాలు స్పెషల్ క్యాంపియన్ డేలు నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి చేపట్టిన ఈ కార్యక్రంలో యువత నమోదుపై ప్రత్యేక శ్ర ద్ధ చూపారు. జిల్లా జనాభా గణాంకాల ప్రకారం చూ స్తే 18-19 ఏళ్లు నిండిన యువత నాలుగు శాతం ఉంది. ముసాయిదా జాబితాను పరిశీలిస్తే వీరి నమోదు చాలా స్వల్పంగా ఉంది. దీంతో వీరిపై ప్రత్యేక దృష్టి సారించి ఓటర్లుగా నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. జిల్లాలోని కళాశాలల్లో నమోదుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ ప్రక్రియ ప్రారంభమయ్యాక గతానికి భిన్నంగా ఎక్కువ మంది ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు చేసుకోవడం విశే షం. ఇంకా నమోదు చేసుకోని వారు సోమవారం కూడా నమోదు చేసుకోవచ్చు. కనిపించని బీఎల్ఓలు .. చివరి ఆదివారం పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు కచ్చితంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కొన్ని చోట్ల బీఎల్ఓలు కని పించకుండా పోయారు. దీంతో ఓటు నమోదు, ఇతర క్లెయిమ్స్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గౌస్నగర్ ఉర్దూ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఉండగా, అక్కడ బీఎల్ఓలు కనిపించకుండా పోయారు. -
డీఎంహెచ్ఓ సరెండర్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎం హెచ్ఓ)పై అవినీతి ఆరోపణలు గుప్పుమనడంతో కలెక్టర్ బి.శ్రీధర్ విచారణకు ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపిన వైనంపై శనివారం ‘తనిఖీల లోగుట్టు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్.. డీఎంహెచ్ఓ సుధాకర్నాయుడును ప్రభుత్వానికి సరెండర్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయన అవినీతిపై స్పష్టమైన ఆధారాలు లభించినందున ఆయనను సాగనంపడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఫైళ్లు సమర్పించడం ద్వారా తనను తప్పుదారి పట్టించినట్లు గుర్తించిన కలెక్టర్ డీఎంహెచ్ఓ వ్యవహారశైలిని సీరియస్గా పరిగణించారు. ఈ మేరకు ఆయనకు చార్జి మెమో జారీచేయాలని డీఆర్ఓ వెంకటేశ్వర్లును ఆదేశించారు. తాజాగా ఆస్పత్రుల తనిఖీల్లో భాగంగా అవినీతికి పాల్పడుతున్నట్లు కథనాలు వెలువడడం.. అందుకు ఆధారాలు కూడా లభించడంతో సుధాకర్నాయుడుపై చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు కలెక్టర్ ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. -
ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రచ్చబండలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు చేరవేయడంలో మండల అధికారులు జాప్యం చేయడంపై కలెక్టర్ బి.శ్రీధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ మెజారిటీ లబ్ధిదారులకు ఇంకా మంజూరు పత్రాలు అందకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం జిల్లాపరిషత్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసీల్దార్లతో రచ్చబండ కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు. పట్టణ ప్రాంతంలో దాదాపు 75శాతం మందికి మంజూరు పత్రాలు ఎందుకు పంపిణీ చేయలేదని కలెక్టర్ మున్సిపల్ అధికారులపై మండిపడ్డారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్ మున్సిపాలిటీల పరిధిలో పంపిణీ ప్రక్రియ సరిగా లేదని, గ్రామీణ ప్రాంతాలైన ఘట్కేసర్, బంట్వారం, శామీర్పేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. రచ్చబండ కింద జిల్లాకు మంజూరైన రేషన్ కూపన్లలో కేవలం 59శాతం మాత్రమే లబ్ధిదారులకు అందాయని, పట్టణ ప్రాంతాల్లో కేవలం 49శాతమే పంపిణీ జరిగాయన్నారు. మొత్తంగా ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రేషన్ కూపన్లను వీఆర్ఓలు, రేషన్ డీలర్ల ద్వారా కాకుండా తహసీల్దార్ కార్యాలయం ద్వారానే తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులను చైతన్యపర్చాలని, ఇందుకు ఈనెల 6వ తేదీ నుంచి 30 వరకు గ్రామాల్లో పర్యటించి సర్పంచ్ల సమక్షంలో గ్రామసభలు నిర్వహించాలన్నారు. దీపం పథకం కింద జిల్లాలోని పట్టణ ప్రాంతంలోనే ఇంకా 13వేల గ్యాస్ కనెక్షన్లు పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొత్తగా 18వేల కనెక్షన్లు మంజూరు కానున్నాయన్నారు. గ్రౌండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తేనే కొత్తవి మంజూరు చేయడం సులభమవుతుందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల వివరాల నివేదికను వెంటనే జి ల్లా యంత్రాంగానికి సమర్పించాలని కలెక్టర్ తనిఖీ బృందాలను ఆదేశించారు. సమావేశంలో సబ్కలెక్టర్ ఆమ్రపాలి, జెడ్పీ సీఈఓ రవీందర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత రచ్చబండ జిల్లాలో గందరగోళంగా మారింది. కార్యక్రమం ముగిసి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు ఎంతమందికి రచ్చబండ ఫలాలను అందించారో లెక్క తేలడం లేదు. దీంతో యంత్రాంగం అయోమయంలో పడింది. క్షేత్రస్థాయిలో అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. లెక్కలు తేల్చే మార్గం కన్పించక జిల్లా ప్రణాళిక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో గత నెల 11వ తేదీ నుంచి మూడో విడత రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1,10,662 రేషన్ కూపన్లు, 27,890 పింఛన్లు, 40,353 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, వీటిని ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఈ కార్యక్రమాల్లో మంజూరు పత్రాలు అందించాలి. అయితే అనివార్య కారణాల వల్ల రెండ్రోజులు ఆలస్యంగా రచ్చబండ మొదలుపెట్టినప్పటికీ.. నవంబర్ 26లోపు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కానీ ఈ కార్యక్రమం ద్వారా ఎంతమందికి మంజూరుపత్రాలు ఇచ్చారో లెక్క మాత్రం తేలలేదు. ఆన్‘లైన్’ తప్పింది.. వాస్తవానికి రచ్చబండ కార్యక్రమంలో మంజూరు పత్రాలను అందించిన వెంటనే ఆయా వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్లను ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో వివరాల నమోదు ప్రక్రియ తప్పుల తడకగా సాగింది. ఆన్లైన్లో ఉన్న వివరాలకు, క్షేత్రస్థాయిలో పంపిణీ చేసిన లబ్ధిదారుల వివరాలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గత వారం రచ్చబండ వివరాలను కలెక్టర్ బి.శ్రీధర్ సమీక్షిస్తూ పొంతన లేని వివరాలను గుర్తించి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సరైన వివరాలు వెబ్సైట్లో పొందుపర్చాలని సూచించారు. ఇందుకు వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. కానీ మెజారిటీ మండలాల్లో వివరాలను మార్చలేదు. ముఖ్యంగా రేషన్ కూపన్లకు సంబంధించిన వివరాల్లో తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోంది. స్థానికంగా ఎంపీడీఓ, తహసీల్దార్ మధ్య సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా.. రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన తీరు, ఇతర అంశాలపై బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని అధికారులు ఉత్కంఠగా ఉన్నారు. -
ఇద్దరు పోలీసు అధికారుల బదిలీ
చేవెళ్ల/ శంషాబాద్, న్యూస్లైన్: చేవెళ్ల డీఎస్పీ కె.శిల్పవల్లి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో వెయిటింగ్లో ఉన్న శ్రీధర్ను నియమించారు. 2012 మార్చి 2న చిత్తూరు నుంచి బదిలీ అయి చేవెళ్ల డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శిల్పవల్లి 20 నెలల పాటు విధులను నిర్వర్తించారు. చేవెళ్ల డీఎస్పీగా నియమించబడిన శ్రీధర్ రెండుమూడు రోజుల్లో చార్జి తీసుకోనున్నట్లు సమాచారం. శిల్పవల్లి ఎక్కడికి బదిలీ అయ్యారో తెలియరాలేదు. అదేవిధంగా శంషాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ సైతం బదిలీ అయ్యారు. శ్రీనివాస్ రెండేళ్లు ఇక్కడ ఏసీపీగా పనిచేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరు బాధ్యతలు చేపట్టలేదు. ఆక్టోపస్లో విధులు నిర్వహిస్తున్న భద్రేశ్వర్ మరో రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలిసింది. -
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్ శ్రీధర్
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: ప్రజలు ప్రస్తావించే అన్ని సమస్యలూ ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని, దశలవారిగా వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సంబంధించి రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర ప్రధాన సమస్యలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో కొత్తగా 30వేల రేషన్కార్డులు, 15వేల ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 29 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ సౌకర్యాన్ని వర్తింపజేశామని ఆయన అన్నారు. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి డిసెంబర్ నెల నుంచి బియ్యం, పెన్షన్లు మంజూరైన వారికి నవంబర్ నుంచి పెన్షన్ అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్సీలకు లక్ష రూపాయలు, ఎస్టీలకు లక్షా ఐదు వేలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇళ్లు మంజూరైన వారు వెంటనే ఇళ్లను కట్టుకోవాలని కోరారు. ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు లేనివారికి(గతంలో మంజూరైన వారికి) స్థలాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఓఆర్ఆర్ పరిధి లోపల ఉన్న వారికి నిబంధనల ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని కలెక్టర్ చెప్పారు. అంతకు ముందు సర్పంచ్లు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీనిచ్చారు. డ్రైనేజీ, రోడ్లు వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తామని, 13వ ఫైనాన్స్ నిధులతో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. వివిధ అభివృద్ధి పనుల గురించి నెలకోసారి సర్పంచ్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలుకు నిధులు లేవని, నిధుల మంజూరుకు కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. పట్నం నగరపంచాయతీ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వరప్రసాద్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి నారాయణరెడ్డి, ఎంపీడీఓ అనిల్కుమార్, సర్పంచ్లు ఏనుగు శ్రీనివాస్రెడ్డి, పాశం అశోక్గౌడ్, బొడ్డు నిర్మల, పోరెడ్డి సుమతి, రచ్చబండ మండల కమిటీ సభ్యుడు కొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కంబాలపల్లి హన్మంత్రెడ్డి, మండల సీపీఎం కార్యదర్శి సామెల్ తదితరులు మాట్లాడారు. -
భూ పందేరంపై కొరడా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి...రూ.160 కోట్ల విలువైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. గుట్టుగా సాగిన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్... బాధ్యుడైన రాజేంద్రనగర్ ఆర్డీఓ నాగేందర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి...శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నవ్ఖల్సా సర్వేనంబర్ 66లోని ప్రభుత్వ భూమిలో 8 ఎకరాలను ఓ ప్రైవేట్ వ్యక్తికి కౌలుదారు హక్కుచట్టం(38ఈ) కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారు. 2011లో కౌలుదారులకు అనుకూలంగా అప్పటి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ఆర్డీఓ నాగేందర్ సమర్థిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజుల్లోనే ఈ ఫైలుకు మోక్షం కల్పించినట్లు విచారణలో తేలింది. కాగా ఇటీవల తనిఖీల్లో భాగంగా సదరు భూమిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఈ అవినీతి బాగోతాన్ని వెలికి తీశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఆర్డీఓ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన సీరియస్గా పరిగణించారు. ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూమిని కట్టబెట్టినట్లు కలెక్టర్ సోమవారం ఆర్డీఓ నాగేందర్ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే అప్పటి తహశీల్దార్ పద్మశ్రీపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ లేఖరాశారు. అలాగే అప్పటి స్థానిక సర్వేయర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. -
ప్రేమికుల హృదయాల్లో స్థానం
‘‘నేను దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇది. ప్రేమికుల హృదయాల్లో కచ్చితంగా ఈ చిత్రానికి స్థానం దక్కుతుంది. అంత కంటెంట్ ఈ సినిమాలో ఉంది’’ అని దర్శకుడు ఎస్.ఐ.మహేంద్ర చెప్పారు. అజయ్ మంతెన, జియానా జంటగా గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ‘ఎంత అందంగా ఉన్నావె’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో నిర్మాత మాట్లాడుతూ -‘‘నేను గతంలో ‘మంగళ’ తీశాను. ఈ సినిమాలో ప్రేమ, వినోదం అన్నీ ఉన్నాయి’’ అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని అజయ్ మంతెన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా సహనిర్మాతలు అశోక్ సోని, మహమ్మద్ రఫీ, మనోజ్ మాట్లాడారు. -
13 నుంచి 26 వరకు మూడో విడత రచ్చబండ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఈ నెల 13 నుంచి 26 వరకు మూడోవిడత రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులకు పింఛన్లు, రేషన్ కూపన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాల ఫలాలు అందించనున్నట్లు చెప్పారు. మొదట మోమిన్పేట మండల కేంద్రంలో ఈ నెల 13న కార్యక్రమం ప్రారంభమవుతుందని, రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా సమాచార శాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నిర్దేశించిన తేదీల వారీగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. -
షార్లో భద్రత అత్యంత కట్టుదిట్టం
సూళ్లూరుపేట, న్యూస్లైన్ : భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మంగళవారం పీఎస్ఎల్వీ సీ25 ప్రయోగాన్ని దృష్టిలో ఉంచుకుని సీఐఎస్ఎఫ్ కమాండెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళాలతో అత్యంత భారీ భద్రత ఏర్పాటు చేశారు. షార్ భద్రతకు ఉన్న సుమారు 700 మంది సిబ్బందితో భద్రతను అత్యంత అప్రమత్తంగా ఏర్పాటు చేశారు. షార్ మొదటిగేట్ వద్ద వాహనాలను నఖశిఖ పర్యంతం తనిఖీలు చేశారు. చిన్న బ్యాగులను సైతం ఈ సారి నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్లో స్కాన్ చేసి అనుమతించారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో భద్రతను పెంచారు. బంగాళాఖాతం వైపు నుంచి కోస్ట్గార్డ్స్, సబ్మెరైన్ దళాలు పహారా కొసాగించాయి. షార్ కేంద్రంలో సాయుధ భద్రతా సిబ్బందితో గస్తీ ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్కు వెళ్లే వాహనాలను తనిఖీ చేసేందుకు స్థానిక పోలీసులతో కలిపి అటకానితిప్ప వద్ద అవుట్పోస్టు ఏర్పాటు చేశారు. పులికాట్ పరిసర ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు గస్తీ ముమ్మరం చేశారు. ఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో 60 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షార్కు సమీప ప్రాంత గ్రామాలైన వేనాడు, ఇరకం దీవుల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట నుంచి షార్కు వెళ్లే రోడ్డులో, వేనాడు రోడ్డు, పేర్నాడురోడ్డు, కారిజాత రోడ్డులో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. 11 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో దావాదిగుంట వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేశారు.