బీబీనగర్ (నల్లగొండ) : అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు కంప చెట్లలో పడేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం వెంకిరాలలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో పసికందు రోదన విన్న స్థానికులు వెళ్లి చూసేసరికి బొడ్డు పేగు తెగని పసికందు కనిపించింది.
వెంటనే వాళ్లు 108కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది పసికందును స్థానిక ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు పసికందు తల్లిదండ్రుల కోసం గాలింపు చేపడుతున్నారు.
పసికందును పడేశారు..
Published Fri, Aug 21 2015 2:32 PM | Last Updated on Wed, Oct 17 2018 3:53 PM
Advertisement
Advertisement