infant
-
తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి హాస్పిటల్లో 28వ తేదీ ఉదయం 10: 30ని.లకు సంధ్యా కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో ప్రాబ్లమ్ కారణంగా చనిపోయే అవకాశం ఉందని బావించిన తల్లిదండ్రులు.. ఆ శిశువును బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు.బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులతో కాటికాపరి అలర్ట్ అయ్యాడు. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు కాటికాపరి, బిడ్డను పూడ్చి పెట్టేందకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
USA: చిన్నారిని ఓవెన్కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
శిశువు రక్షణ అందరి బాధ్యత! కానీ ఇప్పటికీ..
పుట్టిన బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని తల్లితో పాటు ఆ కుటుంబం కూడా తపిస్తుంటుంది. అయితే, ఈ విషయంలో సరైన అవగాహన ఉండటం లేదనేది వైద్యుల మాట. ఎందుకంటే, ఇప్పటికీ భారతదేశంలో నవజాత శిశు మరణాల రేటు ఆందోళనకరంగానే ఉంది. యూరప్లో 1990ల మొదట్లో శిశు మరణాల రేటును తగ్గించడానికి చర్యలు తీసుకోవడంలో, అవగాహన కల్పించేందుకు నవంబర్ 7ను శిశు రక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అమెరికా, మిగతా దేశాలు కూడా ఈరోజు శిశు రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. నవజాత శిశువులలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, శిశు మరణాల రేటును తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రెగ్నెన్సీ అని తెలియగానే కాబోయే తల్లితోపాటు, ఆ కటుంబం కూడా జాగ్రత్త పడాలి. మన దగ్గర రక్తహీనత సమస్య, పోషకాహార లేమి ఎక్కువ. దీనివల్ల బేబీ గ్రోత్ మందగిస్తుంది. గర్భిణుల్లో హైపో థైరాయిడ్ సమస్య ఎక్కువ చూస్తున్నాం. ఐరన్ లోపం, రసాయనాల ఆహారం తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటుంది. తల్లి ఆరోగ్యం సరిగాలేకపోతే లోపల బేబీ శరీర, మానసిక ఎదుగుదలపైన ప్రభావం చూపుతుంది. బీపీ, షుగర్.. వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేవారు ముందునుంచే వైద్యులు చెప్పిన టైమ్కి వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. తల్లి మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి. అందుకు, సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం ముఖ్యం. వైద్యులు చెప్పిన సూచనలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబం అంతా భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. – డాక్టర్ శిరీషా రెడ్డి, గైనకాలజిస్ట్, తార్నాక, హైదరాబాద్ ప్రమాదాలను ముందే పసిగట్టాలి నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువుండి పుట్టడం, ఇన్ఫెక్షన్స్, పోషకాహార లోపం వల్ల శిశు మరణాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఏడాదిలోపు పిల్లలను నవజాత శిశువులు అంటారు. ఈ సమయంలో సులువుగా ఇన్ఫెక్షన్స్ సోకుతుంటాయి. అందుకే, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఏడాదిలోపు వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించగలిగితే ఆ తర్వాత వచ్చే సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే పట్టడం అవసరం, ఆరోగ్యం కూడా. ఆ తర్వాత వారికి ఇచ్చే పోషకాహారం చాలా ముఖ్యం. దీంతోపాటు వ్యాక్సినేషన్ చేయించడం ముఖ్యం. ఎందుకంటే, నిమోనియా, డయేరియా వల్ల మరణాలు ఎక్కువ. అందుకే, ప్రభుత్వం కూడా డయేరియా, న్యూమోనియా.. వ్యాక్సినేషన్ జాబితాలో చేర్చింది. పిల్లల వైద్యనిపుణుల పర్యవేక్షణ చాలా అవసరం. కొన్ని గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవచ్చు. కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ముఖ్యం అని తెలుసుకోవాలి. ఇక నవజాత శిశువులకు దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచంపై నుంచి కింద పడటం వంటివి. చిన్న దెబ్బలు కూడా పెద్దవి కావచ్చు. మదర్ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్లో ఉన్నప్పుడు బిడ్డను చూసుకునేవారుండరు. ఇలాంటప్పుడు కూడా శిశువు సంరక్షణ ప్రమాదంలో పడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కుటుంబం జాగ్రత్త వహించాలి. – ప్రియాంకరెడ్డి, పిడియాట్రిషియన్, మాదాపూర్, హైదరాబాద్ ఒకరి ద్వారా మరొకరికి సూచనలు మేం గర్భిణులపై ఎక్కువ ఫోకస్ పెడుతుంటాం. ఎందుకంటే, వారి ఆరోగ్యం బాగుంటేనే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. ఆరోగ్యం, పౌష్టికాహారంతో పాటు ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లేవరకు ఎలా చూసుకోవాలో ఆమెకే కాదు, ఇంటిల్లిపాదికీ కౌన్సెలింగ్ ఇస్తాం. ఎంత చెప్పినా వినిపించుకోని వారు కొందరుంటారు. అయినా వారిని వదలకుండా తల్లి అయిన వారితో కౌన్సెలింగ్ ఇప్పిస్తాం. చార్ట్ ప్రకారం వాళ్లు తీసుకోవాల్సిన పోషకాహారం, మందులు కూడా అంగన్వాడీ నుంచి ఇస్తుంటాం. చంటిపిల్లల విషయంలో మేం తగు జాగ్రత్తలు చెప్పడంతో పాటు, ఏ సమయానికి వ్యాక్సిన్లు వేయించాలి, ఎలా చూసుకోవాలి అనే విషయాలపైన తల్లులకు ఒకరి ద్వారా మరొకరు సూచనలు చేసుకునేలా కౌన్సెలింగ్ చేస్తుంటాం. దీనివల్ల నవజాత శిశు మరణాల రేటు తగ్గడమే కాకుండా శిశువులు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. – వెంకటరమణ, అంగన్వాడీ టీచర్, ఖాసింపేట, సూర్యపేట జిల్లా (చదవండి: మత్తు కోసం పాము విషమా?..అందుకోసం పార్టీల్లో..) -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్కు మించి సౌకర్యాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా లేని అత్యాధునిక వైద్య సదుపాయాలను ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వెల్లడించారు. విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిన నవజాత శిశు వైద్య విభాగాలు ఎస్ఎన్సీయూ(స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్), ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లను గురువారం మంత్రి ప్రారంభించారు. ప్రసూతి విభాగంలో ఇప్పటికే 250 పడకలు అందుబాటులో ఉండగా.. అదనంగా 40 పడకలను నవజాత శిశు వైద్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. తక్కువ బరువు, కామెర్లు వంటి అనారోగ్య కారణాలతో అప్పుడే పుట్టిన శిశువులకు అత్యవసర విభాగ అవసరాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.5.53 కోట్లతో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 ఎస్ఎన్సీయూలు, ఎన్ఐసీయూలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అదనంగా రూ.31.51 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 12 అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇక్కడి ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణ పనులను సైతం త్వరలో ప్రారంభిస్తామని రజిని తెలిపారు. కాగా, రాజీవ్నగర్లోని ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాశ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును ఆడించిన కానిస్టేబుల్..
అహ్మదాబాద్: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్లోని ఓదావ్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. గుజరాత్లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి: హరిద్వార్లో రాకాసి మేఘం.. చూస్తే..! -
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్లోని అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే! ఎందుకంటే..
సాక్షి, నాగ్పూర్: కొందరు పనిని దైవంలా భావిస్తున్నారు. ఏమీ ఆశించకుండా.. తమ వంతు ప్రయత్నం చేసుకుంటూ పోతారు. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితాలను సైతం పక్కన పెడుతుంటారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం వెలుగు చూశాయి. తాజాగా.. ఓ మహిళా ఎమ్మెల్యే సైతం అలాంటి నిబద్ధతను కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. చేతిలో రెండు నెలల చంటి బిడ్డతో సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సరోజ్ అహిరే. చంటి బిడ్డను బ్లాంకెట్లో చుట్టుకుని ఆమె అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది అతి చర్యగా అనుకుంటారని ఏమో.. ఆమె తన వివరణ సైతం ఇచ్చుకుంది. నేను ఇప్పుడు ఒక తల్లిని. కానీ, ఇంతకు ముందు నుంచే ప్రజల ప్రతినిధిని. గత రెండున్నరేళ్లుగా కరోనా వల్ల అసెంబ్లీ సెషన్ నాగ్పూర్లో నిర్వహించలేదు. ఇప్పుడు నిర్వహిస్తున్నారు. తల్లిని అయినప్పటికీ.. నా విధిని నేను నిర్వహించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమాధానాలు చెప్పాలి కదా అని వివరణ ఇచ్చారామె. దియోలాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సరోజ్ అహిరే.. సెప్టెంబర్ 30వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆమెకు పలువురు అభినందనలు తెలపడంతో పాటు.. బాధ్యతకు పెద్ద పీట వేస్తూ ఆమె చేసిన పనిని అభినందించారు కూడా. అందులో సీఎం ఏక్నాథ్ షిండే కూడా ఉన్నాడు. -
ప్రకాశం: పసికందును బలిగొన్న వానరం
సాక్షి, ప్రకాశం: జిల్లాలో శుక్రవారం ఘోరం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరుబయట నిద్రపోతున్న ఓ చిన్నారిని ఈడ్చుకెళ్లి కిందపడేసింది వానరం. ఈ క్రమంలో తలకు తీవ్రగాయం కావడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర-సుమతీ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు. రెండు నెలల కిందటే బిడ్డకు జన్మనిచ్చింది సుమతీ. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. పసికందును ఆరుబయట మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి.. పసికందును మంచం మీద నుంచి ఈడ్చుకెళ్లింది. గట్టిగా కిందపడేయడం.. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యవసాయ సామాగ్రి ఆ పసికందుపై పడడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. అలికిడికి అక్కడికి వచ్చిన తల్లి.. రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి కన్నీరుమున్నీరు అయ్యింది. పసికందు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
Police Ramya: అమ్మా.. నీకు వందనం
ఆకలితో అలమటిస్తున్న పసికందుకు పాలిచ్చి రక్షించినందుకు పోలీసు అధికారిణిని హైకోర్టు న్యాయమూర్తితో సహా పలువురు అధికారులు ప్రశసించారు. ఈ ఘటన కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కోజికోడ్ చెవాయూర్ పోలీస్టేషన్లో సివిల్ పోలీస్ ఆఫీసర్గా ఎంఆర్ రమ్య విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన నవజాత శిశువు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందుని తల్లి వద్ద నుంచి ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. పని నిమిత్తం బెంగుళూరు వెళ్లిన తండ్రితోనే ఆ పసికందు ఉండవచ్చనే అనుమానంతో వాయనాడ్ సరిహద్దులోని పోలీస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ఉన్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద ఉన్న శిశువు ఆకలితో అలమటించి సొమ్మసిల్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే బిడ్డ షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి చేరు పోలీస్ అధికారి రమ్య తాను పాలిచ్చే తల్లినని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చారు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఆ సమయంలో ఆమె చూపించిన ఉదార సేవకు ముగ్ధుడై హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు. ఈ మేరకు పోలీస్ అధికారి రమ్యకు జడ్జి సర్టిఫికేట్ను పోలీస్ చీఫ్ అనిల్ అందించడమే ఆమె కుటుంబసభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. అంతేకాదు ఆకలితో అలమటించిన పసికందు పట్ల సానుభూతితో రమ్య వ్యవహరించిన తీనే పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని ఉన్నతాధికారులు అన్నారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
10 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం చేసి ఆదుకోరూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న పాప పేరు హన్విక. ఆమె వయసు కేవలం 10 నెలలు. ఇంత చిన్న వయసులోనే పాప అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఈ చిన్నారి డెంగ్యూ షాక్ సిండ్రోమ్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్తో పోరాడుతోంది. పసిపాప పరిస్థితి అత్యంత దీనస్థితికి చేరుకుంది. ఆ పాప తల్లిదండ్రులు దీప్తి, రవి కిరణ్ హైదరాబాద్లో నివసిస్తున్నారు. కూతురు వైద్యం కోసం ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. అయినా పాప ఆరోగ్యం కుదుట పడకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమ కూతురు తీవ్రమైన ఇన్ఫనైట్ డెంగ్యూ, హైపర్ ఫెరిటినిమా, ట్రాన్స్మినిట్స్, కోగులోపతితో బాధపడుతోందని, దాతలు తోచిన సాయం చేసి, ఆదుకోవాలని ఆమె తండ్రి రవి కిరణ్ అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఉద్యోగం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప పేరు: ఆర్ హన్విక తండ్రి పేరు: రవి కిరణ్ తల్లి: దీప్తి గూగుల్ పే నంబర్: 8019872446 బ్యాంక్ అకౌంట్ వివరాలు అకౌంట్ నంబర్: 403901502892 బ్యాంక్ - ఐసీఐసీఐ, సేవింగ్స్ ఖాతా ఖాతాదారుని పేరు: ముసిలమ్మోళ్ల దీప్తి సాయి ఐఎఫ్ఎస్ఈ కోడ్: ICIC0000008 -
ప్రేమ పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, ప్రాణాలతో బయటపడిన చిన్నారి
సాక్షి, మెదక్: వారిది ప్రేమ వివాహం. ఆనందంగా సాగుతున్న వారి కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. ప్రమాదంలో తల్లి చనిపోవడంతో, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సంఘటన కొల్చారం మండల కేంద్రంలోని మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారిలో మంగళవారం జరిగింది. కొల్చారం ఏఎస్ఐ తారాసింగ్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెౌదిన చండూరి ప్రకాశ్ రెండో కూతురు మృతురాలు వంకిడి ప్రవల్లికకు(23) అదే మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన వంకిడి విజయ్ కుమార్తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగుంది. వీరిది ప్రేమ వివాహం. వీరికి 7 నెలల పాప అక్షిత సిందూర ఉంది. పాపకు సోమవారం రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతోంది. భార్యాభర్తలిద్దరూ మెదక్ పట్టణంలోని ఆస్పత్రిలో వైద్యం చేయించేందుకు ధర్మసాగర్ నుంచి బైక్పై బయలుదేరారు. మండల కేంద్రం కొల్చారం లోని సత్యసాయి పారా బాయిల్డ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైకును కొల్చారం గ్రామానికి చెందిన గుండు రామకృష్ణయ్య తన బైకుతో వెనుక నుంచి ఢీ కొట్టాడు. దీంతో ప్రవల్లిక, పాప ఎగిరి కింద పడ్డారు. ప్రవల్లిక తీవ్రంగా గాయపడగా, పాప అక్షిత స్వల్పంగా గాయపడింది. వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతి చెందింది. ఈ ప్రమాదంలో రామకృష్ణయ్యకు స్వల్పగాయాలయ్యాయి. రామకృష్ణయ్య అజాగ్రత్తగా బైకు నడపడంవల్లే ప్రమాదం జరిగిందని, మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. చదవండి: అసభ్యకర మెసేజ్లతో నటికి వేధింపులు.. సహజీవనం చేయాలని ఒత్తిడి -
710 గ్రాముల బరువుతో 27 వారాలకే చిన్నారి జననం.. 112 రోజులు ఎన్ఐసీయూలోనే
సాక్షి, హైదరాబాద్: ఏడు వరుస అబార్షన్ల తరువాత ఎనిమిదో సారి పుట్టిన పాప లోకాన్ని చూడగలిగింది. కానీ, కేవలం 710 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో పాటు 38 వారాలకు జరగాల్సిన ప్రసవం 27 వారాలకే జరగడం..పాప శరీరాకృతి పూర్తిగా లేకపోవడం వంటి పరిణామాలను సవాల్గా తీసుకున్న సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్యులు ఆ చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించారు. 112 రోజుల పాటు ఎన్ఐసీయూలో అత్యుత్తమ వైద్య సేవలందించి పునర్జన్మను ప్రసాదించారు. బుధవారం సనత్నగర్ ఈఎస్ఐసీ పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ అపరాజిత డిసౌజా వివరాలు వెల్లడించారు. మేడ్చల్కు చెందిన వినోద్కుమార్ భార్య రూబీదేవి వరుసగా ఏడు సార్లు గర్భస్రావం కావడంతో పాటు ఎనిమిదోసారి గర్భం దాల్చిన తరువాత తీవ్రమైన గైనిక్ సమస్యలతో 18వ వారంలోనే ఆస్పత్రికి చేరింది. 27వ వారంలో పాపకు జన్మనిచ్చింది. అయితే పాప కేవలం 710 గ్రాములు మాత్రమే ఉండడంతో అవయవాలు పూర్తిగా ఆకారం దాల్చలేదు. దీంతో చిన్నారిని ఎన్ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్స్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కోదండపాణి, ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో చికిత్స అందించారు. పాపను 112 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి బరువును 1.95 కిలోలకు తీసుకువచ్చి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దారు. సనత్నగర్ ఈఎస్ఐసీ వైద్యులు తమ పాప ప్రాణాలను నిలిపేందుకు చేసిన కృషిని తాము దగ్గరుండి చూశామని, వారి రుణం తీర్చుకోలేదని పాప తల్లిదండ్రులు వినోద్కుమార్, రూబీదేవి పేర్కొన్నారు. బుధవారం డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పాప తల్లిదండ్రులు వైద్య సేవలందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పైసా ఖర్చు లేకుండా ఈఎస్ఐసీలో అత్యుత్తమ వైద్యం అందించారన్నారు. -
Baby Massage: ఆవనూనె.. లేదంటే వెన్న, మీగడతో మసాజ్ చేస్తే..
Winter Care Tips In Telugu: Massage For Babies Helpful: శీతాకాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి. ►శీతాకాలంలో మసాజ్కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే. ►మసాజ్ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. ►మసాజ్కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది. గదిని వెచ్చబరచాలి.. ►నూనె పట్ల తీసుకునే జాగ్రత్తలతోపాటు మసాజ్ చేయడానికి ముందు దుస్తులు తొలగించడంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వేసవిలో చేసినట్లు ఒకేసారి దుస్తులన్నీ తీసేయరాదు. ముందు సాక్స్, ప్యాంటు తీసి కాళ్లకు మసాజ్ చేయాలి. అప్పుడు కాళ్ల మీద మందపాటి టవల్ కప్పి ఆ తర్వాత చేతులకున్న మిటెన్స్, స్కార్ఫ్, చొక్కా తీసి పై భాగానికి మసాజ్ చేయాలి. ►వీటన్నింటికంటే ముందు గదిని వెచ్చబరచాలి. రూమ్ హీటర్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి చంటిబిడ్డ ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ తప్పకుండా ఉండాలి. మసాజ్ మొదలు పెట్టడానికి పది నిమిషాల ముందు రూమ్ హీటర్ ఆన్ చేయాలి. హీటర్ నుంచి వచ్చే గాలిని నేరుగా పాపాయికి తగలనివ్వకూడదు. హీటర్ సాధ్యం కానప్పుడు సాంబ్రాణి పొగ లేదా ధూప్ స్టిక్తో గదిని వెచ్చబరచవచ్చు. నిజానికి జలుబుకు కారణం మసాజ్ కాదు ►సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే... పక్క దుస్తులకు నూనె జిడ్డు అంటకుండా ఉండడానికి మసాజ్ చేసేటప్పుడు పాపాయిని ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెడుతుంటారు. ఈ సీజన్లో మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ప్లాస్టిక్ షీట్ చల్లగా ఉంటుంది. పాపాయికి జలుబు చేసే ప్రమాదం ఉంది. అందుకే పాతబడిన దుప్పటిని హీటర్ ముందు పెట్టి గోరువెచ్చగా చేసిన తర్వాత పాపాయిని పడుకోబెట్టాలి. ►పాపాయి చర్మ సంరక్షణకు, కండరాల వ్యాయామానికి మసాజ్ను మించిన ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి శీతాకాలంలో కూడా చక్కగా మసాజ్ చేయవచ్చు. ఈ కాలంలో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకుండా వేసవిలో మసాజ్ చేసినట్లే పాపాయిని దుస్తులు లేకుండా ఎక్కువ సేపు చలిగాలికి ఉంచినప్పుడు జలుబు చేస్తుంది. ఈ జలుబుకి కారణం మసాజ్ కాదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే. -
అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డ రైలు పట్టాలపై..
సాక్షి, విజయనగరం/ఒడిశా: అమ్మ పొత్తిళ్లలో ఉండాల్సిన ఆ పసిబిడ్డ రైలు పట్టాలపై అచేతనంగా పడి ఉన్నాడు. ఏ తల్లి కన్నబిడ్డో... ఆ తల్లిదండ్రులకు ఏం కష్టం వచ్చిందోగాని ఇలా పట్టాలపై పడేశారు. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. రైలు పట్టాలపై రెండు నెలల పసికందు మృతదేహం ఆదివారం లభ్యమైంది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కంట కాపల్లి – కొత్త వలస రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై రెండు నెలల మగ పసికందు మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఆదివారం గుర్తించారు. బిడ్డ శరీరంపై లేత నీలిరంగు టీషర్ట్ ధరించి ఉంది. గుర్తు తెలియని రైల్లోంచి జారి పడిపోయిందా? లేక ఎవరైనా తెచ్చి పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్ఐ రవివర్మ తెలిపారు. పసికందు ఆచూకీ తెలిసిన వారు విజయనగరం రైల్వే జీఆర్పీ పోలీసుల నుగానీ 9490617089, 9666555214 నంబర్లకు సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రి మార్చురీకి తరలించినట్టు తెలిపారు. రైలు పట్టాలపై గుర్తు తెలియని పసికందు మృతదేహం -
తల్లికి పాజిటివ్ ఉన్నా.. శిశువుకు పాలు ఇవ్వొచ్చా?
సాక్షి, మహబూబ్నగర్: ‘కరోనా పాజిటివ్ వచ్చిన తల్లి.. శిశువుకు పాలు ఇవ్వొచ్చు. కాకపోతే పాలు ఇచ్చే సమయంలో తల్లి రెండు మాస్కులు ధరించాలి.’ కేవలం పాలు ఇచ్చే సమయంలో మాత్రమే శిశువును దగ్గరకు తీసుకోవాలి, ఇతర ఆలనాపాలన మాత్రం నెగిటివ్ ఉన్న మహిళతో చేయించాలి. శిశువుకు లక్షణాలు ఉంటే కావాల్సిన మందులు వాడాలి. పరీక్షలు మాత్రం చేయించాల్సిన అవసరం లేదు. చిన్నారులకు మాస్కు పెట్టలేం కనుక అధిక లక్షణాలతో పాజిటివ్ ఉండే తల్లులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. తరచూ శిశువు పట్టుకోకుండా పాలు ఇచ్చే సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కొంత దూరం ఉండడం ఉత్తమం.’ అని ప్రముఖ చిన్న పిల్లల డాక్టర్ రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పలువురు కాలర్స్ అడిగిన సందేహాలను నివృత్తి చేయడంతో పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్లో 3 నుంచి 4శాతం చిన్నారులు అధికంగా కరోనా బారినపడుతున్నారు. కాకపోతే ఎవరూ కూడా తీవ్ర సమస్యలకు గురికాకుండా స్వల్ప లక్షణాలతో రికవరీ అవుతున్నారు. సెకండ్ వేవ్లో వందలో పదిశాతం చిన్నారులు కరోనా లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇందులో ప్రధానంగా జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నారులలో ఎవరిలో కూడా ఆయాసం కన్పించడం లేదు. పిల్లలకు ఒకటి లేదా రెండు రోజుల పాటు జ్వరం వస్తుంటే పారాసిటమాల్ ప్రతి ఆరు గంటలకు ఓసారి వేయాలి. మల్టీవిటమిన్, కొద్దిగా లక్షణాలు అధికంగా యాంటీబయోటిక్స్ వాడాలి. తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చి పిల్లలకు ఆ రోజు నెగిటివ్ వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. మళ్లీ రెండు రోజుల తర్వాత వారిలో లక్షణాలు బయటపడుతాయి. వారిలో ఉండే టీకా, రోగనిరోధక శక్తివల్ల లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. 24గంటల నుంచి 48 గంటల పాటు పారాసిటమాల్ వేసిన కూడా జ్వరం తగ్గకపోతే అప్పుడు కరోనా పరీక్షలకు వెళ్లాలి.’ అని పేర్కొన్నారు. ప్రశ్న: మా తల్లిదండ్రులతో పాటు నాకు పాజిటివ్ వచ్చింది. నాకు చిన్నారి ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్: మీ పాపను కొంత దూరంగా పెట్టండి. ఏదైనా అత్యవసరం ఉండి, పాలు ఇవ్వాల్సిన సమయంలో చేతులకు గ్లౌజ్, రెండు మాస్కులు పెట్టుకొని శిశువును పట్టుకోవాలి. పాపకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే మందులు వాడండి. ప్రశ్న: మా పాపకు 8 ఏళ్లు నా తల్లిదండ్రులతో ఉంటుంది. ఇటీవల వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ పాపకు నెగిటివ్ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాపకు మళ్లీ పరీక్ష చేయించాలా? డాక్టర్: పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు పాపను కొంత దూరం పెట్టండి. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మళ్లీ పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. జ్వరం ఉంటే పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నలుగురం ఉంటే మా చిన్న బాబుకు తప్పా అందరికీ పాజిటివ్ వచ్చింది. మాతో పాటు బాబు ఉండవచ్చా? డాక్టర్: మీ ముగ్గురు కూడా ఇంట్లో వేరువేరుగా ఉంటూ మాస్కులు వాడండి. నెగిటివ్ ఉన్న బాబును మాత్రం ప్రత్యేకంగా ఉంచండి. ఆ బాబుకు ఏదైనా లక్షణాలు ఇతర సమస్య ఏదైనా ఉంటే పరిశీలించండి. లక్షణాలు లేకపోతే పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ప్రశ్న: చిన్న పిల్లలలో కరోనా లక్షణాలు ఎలా గుర్తించాలి. తుమ్ములు రావడం కూడా కరోనా లక్షణమేనా? డాక్టర్: సాధారణంగా చిన్న పిల్లలలో ప్రస్తుతం జ్వరం, దగ్గు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ మూడింటిలో రెండు లక్షణాలు రెండు కంటే ఎక్కువ రోజులు ఉంటే ఓసారి పరీక్ష చేసు కోవాలి. తుమ్ములు రావడం కరోనా లక్షణం కాదు. ప్రశ్న: మా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చింది. మా 8 ఏళ్ల బాబు వారితో ఉండేవాడు. అతడికి పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్: కొందరి పిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరిలో వైరస్ పెద్దగా ప్రభావం చూపదు. మళ్లీమళ్లీ పరీక్షలు చేయకండి. ఏదైనా లక్షణాలు కన్పిస్తే అవి కూడా మూడు రోజుల పాటు తగ్గకుండా ఉంటే అప్పుడు చూడండి. లక్షణాలు కనిపిస్తే మల్టీ విటమిన్ సిరఫ్, పారాసిటమాల్ వాడండి. ప్రశ్న: మా ఇంట్లో నిమోనియా వచ్చిన వ్యక్తి ఉన్నాడు. కరోనా నేపథ్యంలో పిల్లలు అలాంటి వారికి దూరంగా ఉండాలా? డాక్టర్: సాధారణంగా నిమోనియా వచ్చిన వారికి పిల్లలను దూరంగా పెట్టడం చాలా ఉత్తమం. అతనికి దగ్గు కూడా ఉంటుంది కనుక ఎప్పుడూ మాస్కు పెట్టండి. ఇలాంటి వారికి వైరస్ తొందరగా సోకుతుంది. ప్రశ్న: నాకు పాజిటివ్ ఉంది. నా పాప ప్రస్తుతం మూడు నెలల శిశువు. పాపకు పరీక్ష చేయలేదు. తల్లి పాలు ఇవ్వొచ్చా? డాక్టర్: శిశువుకు పాలు ఇచ్చే సమయంలో తల్లిగా మీరు రెండు మాస్కులు పెట్టుకోవాలి. కరోనా ఉన్నా..పాలు ఇవ్వొచ్చు. పాపకు రెండురోజుల పాటు జ్వరం లేదా ఇతర లక్షణాలు ఉంటే టానిక్స్తో పాటు ఇతర మందులు వాడండి. మూడేళ్ల పైబడిన పిల్లలకు మాత్రమే మాస్కులు పెట్టవచ్చు. పిల్లల్లోజ్వరం, దగ్గు, కంట్లో నలత, గొంతు నొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, 8 ఏళ్లు పైబడిన వారికి వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తే అప్పుడుఅనుమానించాలి. ముఖ్యంగా కిడ్నీ, గుండె జబ్బులు, లివర్ సమస్య, ఎదుగుదల లోపం ఉన్న వారు హైరిస్క్లో ఉన్నట్లు. వీరికి వైరస్ కొంచెం త్వరగా సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు పాజిటివ్ ఉన్న సమయంలో ఆహారం విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. - డాక్టర్ రాఘవేంద్రకుమార్ -
సోనూసూద్ ఔదార్యం.. పసిబిడ్డకు ప్రాణం పోశాడు!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాయం కోసం తన వద్దకు వచ్చినవారందరికీ అండగా నిలుస్తూ కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు. ఎంతో మందికి సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. నష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ని కొనియాడింది. ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన పోతు మహేశ్, లక్ష్మీప్రియ దంపతులకు రెండు నెలల కిందట నెలలు నిండకముందే కొడుకు పుట్టాడు. అయితే బాబు 900 గ్రాముల బరువుతో జన్మించాడు. అవయవాలు ఎదగలేదని, స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పదిహేను రోజుల తర్వాత బాబును హైదరాబాద్లోని రెయిన్బో హాస్పిటల్కు తరలించగా.. అక్కడ నాలుగు వారాలకు కొంత కోలుకున్నాడు. అయితే బిల్లు రోజురోజుకు పెరుగుతూ రూ.7లక్షలు దాటింది. అప్పటి నుంచి మహేశ్ డబ్బులు లేకపోవడంతో తెలిసినవారిని సాయం అడిగాడు. చదవండి: సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం! కరీంనగర్లోని ఒక వ్యక్తి బాబు పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన వెంటనే స్పందించి 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఎంత ఖర్చయినా భరిస్తానని, బాబుకు మెరుగైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో బాబుకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చిన్నారి మరో 300 గ్రాముల బరువు పెరిగాడు. ఇన్ఫెక్షన్ తగ్గుతూ తల్లిపాలు తాగుతున్నాడు. చదవండి: హీరో ఔదార్యం.. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం -
మాయదారి కరోనా.. పసిపిల్లలనూ వదలడం లేదు!
కరోనా మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడం లేదు. పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరినీ కాటేస్తోంది. కరోనా బారిన మహిళకు జన్మించిన శిశువు మృతి చెందిన సంఘటన ఆందోళన రేకిత్తిస్తోంది. అహ్మదాబాద్/సూరత్: కోవిడ్తో బాధపడుతున్న తల్లికి జన్మించిన బిడ్డ కరోనాతో మృత్యువాత పడిన ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి శిశువు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ నెల 1న సూరత్ నగరంలోని డైమండ్ ఆస్పత్రిలో జన్మించిన శిశువును మరో ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై ఉంచి వైద్యం చేశామని వైద్యులు తెలిపారు. బిడ్డ ప్రాణాలు రక్షించేందుకు తమకు తెలిసిన అన్ని రకాల వైద్య పద్ధతులను ఉపయోగించామని, అయితే ప్రయోజనం లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న వైద్యుడి సీరాన్ని తీసి బిడ్డకు ఎక్కించామని, రెమిడిసివిర్ ఇంజెక్షన్ సైతం ఇచ్చి చూశామని అయితే బిడ్డ ప్రాణాలను రక్షించలేకపోయామని పేర్కొన్నారు. ‘నవజాత శిశువును కాపాడటానికి మా వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంత వరకు గుజరాత్ కరోనావైరస్ బాధితులలో ఈ నవజాత శిశువు అతి పిన్న వయస్కులలో ఒకర’ని కోవిడ్ నుంచి ఇటీవల కోలుకున్న సూరత్ మాజీ మేయర్ డాక్టర్ జగదీష్ పటేల్ అన్నారు. శిశువు చికిత్స కోసం తన రక్త ప్లాస్మాను ఆయన దానం చేశారు. కాగా, తాపి జిల్లాకు చెందిన 14 రోజుల పసిబాలుడు కరోనా బారిన పడి సూరత్ కొత్త సివిల్ ఆసుపత్రిలో బుధవారం మరణించాడు. గతేడాది మొదటివేవ్ కంటే ఈసారి ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ బారిన పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే కొత్త స్ట్రెయిన్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకిన కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు కోవిడ్ వ్యాపిస్తోందని అహ్మదాబాద్కు చెందిన శిశువైద్యుడు డాక్టర్ నిశ్చల్ భట్ చెప్పారు. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం గుజరాత్లో శనివారం నాటికి 49,737 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ చదవండి: లాన్సెట్ సంచలన నివేదిక: గాలి ద్వారానే కోవిడ్ అధిక వ్యాప్తి సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరం.. గంటల వ్యవధిలో వైరస్ లోడ్ కమ్యూనిటీ స్ప్రెడ్ -
ఉస్మానియా ఆసుపత్రిలో పాపం పసిపాప!
సాక్షి, అఫ్జల్గంజ్: పసిపాపను ఓతల్లి ఉస్మానియా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన ఘటన అఫ్జల్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, ఆసుపత్రి వర్గాల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఓ తల్లి వెన్నుముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పసిపాపను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తీసుకు వచ్చింది. వైద్యులు పాపను మెరుగైన చికిత్స నిమిత్తం ఏఎంసీ వార్డుకు తరలించారు. వార్డుకు చేరుకున్న కొద్ది సేపటి తర్వాత ఇప్పుడే వస్తాను, పాపను చూడండి అని ప్రక్క బెడ్పై ఉన్న పేషంట్కు చెప్పి సదరు మహిళ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది అవుట్ పోస్టు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా మహిళను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపకు ఉన్న వ్యాధి కారణంగా వదిలి వెళ్లారా? ఆడపిల్ల అని వదిలి వెళ్లారా? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స అనంతరం పాపను శిశు విహార్కు తరలిస్తామని తెలిపారు. చదవండి: అమానుషం: ఒకే ఆటోలో వచ్చారని.. అమానవీయం: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
25 మంది మరణించారు.. 6 నెలల బాలుడు బ్రతికాడు!
కైరో : ఈజిప్టులోని కైరోలో శనివారం అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిన ఘటనలో 25 మంది మృత్యువాత పడగా.. మరో 26 మంది గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం శిథిలాల కిందనుంచి 6 నెలల బాలుడ్ని సహాయక సిబ్బంది ప్రాణాలతో వెలికి తీశారు. ఈ ఘటనలో బాలుడి తల్లి,తండ్రి, అక్క మృత్యువాత పడ్డారు. అతడి అన్న ఆచూకీ లభించలేదు. దీంతో సహాయకసిబ్బంది అతడి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా ఉంది. కాగా, బిల్డింగ్ కూలటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నాణ్యతలో లోపం కారణంగానే బిల్డింగ్ కూలిపోయినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. దీనిపై దర్యాప్తు చేయటానికి ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చదవండి, చదివించండి : ఒబామా కుటుంబంలో విషాదం -
బీరు తాగిన తల్లి, మరణించిన పసికందు
మేరీల్యాండ్: ఒక మహిళ బీర్ తాగి తన పాప పక్కన పడుకుంది. ఆమెకు పసికందుతో పాటు 4 యేళ్ల కూతురు కూడా ఉంది. తాగి వచ్చిన ఆ మహిళ పసిపాపకు పాలుపట్టింది, డైపర్ మార్చింది, తలుపులు అన్ని లాక్ చేసి జాగ్రత్తగానే పడుకుంది. కానీ తెల్లారి లేచేసరికి ఆ పసికందు కదలడం లేదు. ఆమె పెదాలన్ని నీలం రంగులోకి మారిపోయి కదలకుండా బెడ్ మీద ఉంది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పాప మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన మేరీ ల్యాండ్లో జరిగింది. మేరీ ల్యాండ్కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్ పార్టీలో 2 బీర్లు, కొంచెం మద్యం సేవించింది. తరువాత వెళ్లి తన నాలుగేళ్ల చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాప వద్ద పడుకుంది. అయితే బీర్ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది. అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా బీర్ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో మోరిసన్ను విడుదల చేశారు. అమెరికాలో ఈ ఒక్కటే కాదు ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు. చిన్నారులతో కలిసి పడుకోవడం కాకుండా వారికి వేరే ఊయల లేదా బెడ్ను ఏర్పాటు చేయాలని అమెరికా ఆరోగ్య భద్రత నిపుణులు సూచిస్తున్నారు. కానీ 64 శాతం మందికి పైగా మహిళలు వారి పిల్లలతో కలిసి ఒకే బెడ్ పై నిదురిస్తున్నారు. చదవండి: ఈతకని వచ్చి గుహలో చిక్కుకుపోయాడు -
54 రోజుల చిన్నారిపై తండ్రి కర్కశత్వం
తిరువనంతపురం : మద్యం మత్తులో ముక్కు పచ్చలారని శిశువుపై కన్నతండ్రి దాడికి తెగబడ్డాడు. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన కేరళలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూన్ 19వ తేదీన కేరళకు చెందిన 40 ఏళ్ల షైజు థామస్ అనే వ్యక్తి మద్యం మత్తులో 54 రోజుల సొంతబిడ్డపై దాడికి పాల్పడ్డాడు. విపరీతంగా కొట్టి, మంచంపై పడేశాడు. దీంతో చిన్నారి తీవ్రగాయాలపాలైంది. ( భర్తకు తెలియకుండా అప్పులు.. ఆపై సొంతింట్లోనే..) ఆ తర్వాత తన కూతురు ప్రమాదవశాత్తు మంచంపైనుంచి కింద పడిపోయిందని చెప్పి ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే అతడి మాటలను వైద్యులు విశ్వసించలేదు. వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు థామస్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. -
చిన్నారి ఏడుపు.. పాలు అందించిన పోలీస్
రాంచీ : కరోనా ఓ వైపు మానవాళిపై మృత్యు ఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ప్రజల నుంచి మానవత్వం పరిమళిస్తోంది. లాక్డౌన్లో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఎంతో మంది అండగా ఉంటూ తనదైన సాయం అందిస్తున్నారు. ఇలాంటి ఎన్నో అపురూప దృశ్యాలు మన కంటికి తారసపడతునే ఉన్నాయి. తాజాగా అలాటి ఓ సన్నివేశం మరోసారి కంటపడింది. ఈ సంఘటన జార్ఖండ్లో చోటుచేసుకుందిది. నాలుగు నెలల పిల్లవాడితో మెహరున్నీసా అనే మహిళ బెంగుళూరు నుంచి గోరఖ్పూర్కు శ్రామిక్ రైల్లో ప్రయాణం చేస్తోంది. రైలు హటియా రైల్వే స్టేషన్లో ఆగడంతో శిశువు పాల కోసం ఏడవడంతో తల్లి తన పిల్లవాడి కోసం పాలు కావాలని స్థానికంగా ఉన్న అధికారులను కోరింది. (‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’) మెహరున్నీసా దీన స్థితిని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుశీల అనే మహిళా పోలీస్ అధికారి(ఏఎస్సై) తెలుసుకుంది. ఆమె ఇల్లు స్టేషన్కు సమీపంలో ఉండటంతో తన ఇంటికి వెళ్లి శిశువు కోసం సీసాలో పాలు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని రాంచీ పోలీస్ అధికారులు ట్విటర్లో పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో పోలీసు అధికారి పాల సీసాను మెహరున్నీసాకు అందించిన ఫోటోను కూడా రాంచీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా గత నెలలో ఇలాంటి ఘటనే భోపాల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైలులో గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగేళ్ల చిన్నారికి ఆర్పీఎఫ్ జవాన్ పాల ప్యాకెట్ కొని తెచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. (చైనాతో దౌత్య యుద్ధం చేయాల్సిందే! ) दिनांक 14 जून 2020 को हटिया रेलवे स्टेशन पर ट्रेन संख्या 06563 बेंगलुरु से गोरखपुर जाने वाली श्रमिक स्पेशल ट्रेन का सुबह 06:00 बजे आगमन हुआ. इस ट्रेन से यात्रा कर रही एक महिला यात्री (नाम- मेहरून्निसा )ने स्टेशन पर कार्यरत रेल सुरक्षा बल की महिला कर्मचारी ASI, श्रीमती 1/2 pic.twitter.com/KVj52XEYZp — DRM Ranchi (@drmrnc) June 14, 2020 -
‘సెల్యూట్ పోలీస్.. మీపై గౌరవం పెరిగింది’
ముంబై : ముంబై పోలీస్ అధికారి చేసిన ఓ పని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఏం చేశాడని అనుకుంటున్నారా. నెలలు నిండని ఓ పసి ప్రాణాన్ని కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్ కోలేకర్ అనే వ్యక్తి ముంబైలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు విధులకు వెళ్తుండగా.. 14 రోజుల శిశువు ప్రమాదవశాస్తు సేప్టీ పిన్ను మింగేసింది. రోడ్డుపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల నుంచి విషయం తెలుసుకున్న కోలేకర్ చిన్నారిని ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబానికి సహాయం చేశాడు. తన సొంత వాహనంలో చిన్నారిని సమయానికి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు శిశువుకు చికిత్స అందిచి సేఫ్టీ పిన్ను బయటకు తీశారు. (టీచర్గా మారిన మాజీ ఎమ్మెల్యే ) ఈ విషయాన్ని ముంబై పోలీసులు గురువారం ఉదయం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారడంతో కానిస్టేబుల్ చేసిన పనికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ‘సెల్యూట్ ముంబై పోలీస్...మీ మీద మాకున్న గౌరవం మరింత పెరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. (గుడ్న్యూస్: నెలాఖరుకు కోవిడ్-19 డ్రగ్ ) When in doubt, find your nearest cop! A 14 day old baby was choking on a safety pin he had accidentally swallowed. PC S.Kolekar spotted the worried parents on the road & rushed the kid to KEM using his own vehicle, where the child received timely treatment.#MumbaiFirst pic.twitter.com/yCVNxFQKvW — Mumbai Police (@MumbaiPolice) June 18, 2020 -
ఆసుపత్రి నిర్లక్ష్యం: తల్లీబిడ్డలకు కరోనా
ముంబై : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోజుల పసిబిడ్డకు, బిడ్డ తల్లికి కరోనా వైరస్ సోకింది. ఈ విషాద ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతి ఈ నెల 26న ఇంటివద్ద ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పసిబిడ్డ పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమె భర్త తల్లీబిడ్డలను చెంబూర్ ఆసుపత్రిలో చేర్చాడు. అక్కడ సరైన చికిత్స అందటం లేదన్న కారణంతో కుర్లా బాబా ఆసుపత్రికి మార్చాడు. ఆ ఆసుపత్రిలోనూ అదే పరిస్థితి ఎదురుకావటంతో అక్కడినుంచి కస్తూర్భా ఆసుపత్రికి వారిని తీసుకెళ్లాడు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డలలో కరోనా లక్షణాలను గుర్తించి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు తేలింది. కాగా, చెంబూర్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలకు వైరస్ సోకిందని, వారిని కరోనా పేషంట్ బెడ్ మీద ఉంచటమే ఇందుకు కారణమని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చదవండి : కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !! -
9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం
కోల్కతా : చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలపై రోజురోజుకి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తన మన తేడా లేకుండా మనుషులు మృగాళ్లుగా మారి అరాచాకాలకు తెగబడుతున్నారు. వీటిని అరికట్టడానికి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు కృషి చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దిశ కేసులోని నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్కౌంటర్ చేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే. తాజగా నెలలు నిండని ఓ పసిపాపపై కామాంధుడైన మేనమామ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో వెలుగు చూసింది. వివరాలు.. శ్యాంపూర్ పరిధిలోని బార్గావ్ ప్రాంతంలో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ బుధవారం పాపకు బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తిరిగి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన అనంతరం శిశువుకు రక్తస్రావం కావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో శ్యాంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అనుప్ ప్రమానిక్గా గుర్తించారు.కాగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) యాక్ట్ కింద నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చదవండి : దిశ నిందితుల ఎన్కౌంటర్ సోదరి వరస యువతిపై మృగాడి దాష్టీకం స్నేహితుడితో కలిసి భార్యపై లైంగికదాడి -
అర్థరాత్రి కారడవిలో 11 నెలల పాప ఒంటరిపోరాటం.. వైరల్
పుట్టిన ప్రతిజీవీ బతకడం కోసం పోరాటం చేస్తుంది. మనిషి కూడా అంతే.. చివరికి పాలుతాగే శిశువు కూడా తన ప్రాణాలు కాపాడుకోవాలనీ.. అపాయం నుంచి బయటపడాలనీ చుట్టూ ఉన్న పరిస్థితులతో పోరాడుతుంది. నమ్మబుద్ధి కావడం లేదా..? కేరళలో 11 నెలల శిశువు అర్థరాత్రి సమయంలో కారడవిలో ఒంటరిగా తనను తాను బతికించుకోవడం కోసం చేసిన ప్రయత్నం చూస్తే ప్రతి జీవీ బతికేందుకు చేసే ప్రయత్నం అర్థమవుతుంది. రాత్రి 10 గంటల సమయంలో ఎస్యూవీ వాహనం నుంచి 11 నెలల పసికందు కిందికి జారిపడిపోయింది. ఇలా పాప పడ్డ స్థలం ఏ పట్టణమో.. గ్రామమో కాదు.. కారడవి. ఏనుగులు సహా అనేక క్రూర జంతువులు సంచరించే ప్రాంతం ఇది. కానీ ఈ పసికందు.. కిందపడ్డ వెంటనే ఏం చేసిందో చూడండి. తల్లిఒడిలో నుంచి కింద పడిపోయినట్లు ఆ పసిమెదడుకు ఎలా తెలిసిందో.. చుట్టూ కళ్లుపొడుచుకున్న కనిపించని చీకటిలో తనను తాను ఎలా రక్షించుకునేందుకు ఎలా అన్వేషించిందో ఈ సీసీటీవీ ఫుటేజీ మనకు చూపుతోంది. కింద పడ్డ పాప చుట్టూ చూసింది.. దూరంగా చెక్ పోస్ట్ వద్ద నుంచి వెలుతురు ఆ చిట్టికళ్లకు కనిపించింది. అంతే.. వెలుతురు ఉంటే మనుషులు ఉంటారనుకుందేమో.. తనను రక్షిస్తారని భావించిందేమో.. ఆ పసిబిడ్డ పాకుతూ పాకుతూ ఆ వెలుతురు వైపుగా వెళ్లింది. చెక్ పోస్ట్ వద్ద కాపలాగా ఉన్న అటవీశాఖ సిబ్బంది.. పసికందును రక్షించారు. పసిపాప కారడవిలో పడిపోయినా.. ఆమె తల్లిదండ్రులు 40 కిలోమీటర్లు ముందుకు వెళ్లిపోయారు. అప్పుడు మెలుకువ వచ్చి పాప పడిపోయిందని గుర్తించి పోలీసులకు తెలిపారు. ఇంతలో పాపను అటవీశాఖ సిబ్బంది దగ్గర్లో ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్లారు. ముఖం మొత్తం కొట్టుకుపోయి ఉంది. రక్తం కారుతున్న పాపకు డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ చిట్టితల్లి పేరు రోహిత.. ఈ సంఘటన జరిగింది కేరళ రాష్ట్రంలోని రాజమల ప్రాంతంలో.. ప్రస్తుతం పాప తల్లిదండ్రుల వద్ద హాయిగా ఉంది. ఈ సంఘటన మానవజీవన పరిణామక్రమంలోని ప్రాథమిక దశను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మనిషి పుట్టుక ఈ ప్రపంచంలో ఎలా జరిగిందో కోతి నుంచి మనిషిగా మారినప్పుడో.. లేదా ఓ శిశువుగా మనిషి తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు జీవికను కొనసాగించడం కోసం తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని.. అర్థం చేసుకుంటూ ఈ పసికందులాగే పోరాడి ఉంటాడు. అర్థరాత్రి వేళ ఈ 11 నెలల చిట్టితల్లి తన తెలివితేటలను ఎలా ఉపయోగించి తనను తాను అడవిలోని జంతువుల నుంచి.. రోడ్డుపై వెళ్లే వాహనాల నుంచి ఎలా కాపాడుకుందో.. తొలి మానవుడు కూడా అలాగే పోరాడి ఉంటాడు. అందుకే.. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది మన బతుకే. పుట్టినపుట్టుకను కడదాకా కొనసాగించడం.. ఆ కొనసాగించడం కోసం చేసే జీవన పోరాటమే ఇప్పుడు ఆవిష్కృతమైన నేటి సమాజం. చూడండి.. అర్ధరాత్రి రోడ్డు మీద పాప.. వైరల్ వీడియో చదవండి: రాత్రిపూట రోడ్డుపై అంబాడుతూ పాప.. వైరల్ వీడియో -
11 నెలల పాప అర్థరాత్రి కారడవిలో ఒంటరిపోరు.. వైరల్
-
రాత్రిపూట రోడ్డుపై అంబాడుతూ పాప.. వైరల్ వీడియో
రాత్రి సమయంలో వేగంగా వెళ్తున్న జీప్ నుంచి 11నెలల పాప ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. జీప్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించలేదు. ముందుకు వెళ్లిపోయారు. వేగంగా వెళ్తున్న వాహనం నుంచి బయటపడినా చిన్నారికి మాత్రం ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. వాహనం వెళ్లిపోయిన తర్వాత రహదారిపై పాప అటు-ఇటు పాకుతూ కనిపించింది. రాత్రి సమయంలో పాప రోడ్డుపై అంబాడుతూ కనిపించడంతో స్థానికులు గుర్తించి కాపాడారు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చారు. కేరళలోని మున్నార్ ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అక్కడే రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. -
వేగంగా వెళ్తున్న జీప్ నుంచి కిందపడిపోయిన పాప
-
శిశువును అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): పుట్టిన శిశువు మగబిడ్డ కావడంతో జన్మనిచ్చిన తల్లికి సైతం ఆ శిశువును చూపించకుండా ఓ వైద్యురాలు ఆడిన నాటకం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పుట్టిన బిడ్డను తనివితీరా చూసుకోవాలన్న ఆ తల్లి తాపత్రయాన్ని సైతం పట్టించుకోని ఆ వైద్యురాలు బిడ్డను అప్పటికపుడు వేరే ప్రాంతానికి తరలించేసింది. గత్యంతరం లేని ఆ అభాగ్యురాలి తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది. బందరు మండలం సత్రవపాలెంకు చెందిన చిన్నం వెంకటనరసమ్మ కూలి పనులు చేస్తుంటుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. అంగవైకల్యంతో ఉన్న ఆమెకు సంబంధాలు రాకపోవడంతో తల్లితోనే కలసి ఉంటుంది. ఇదిలా ఉండగా కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. విషయం వివరంగా చెప్పి ఆపరేషన్ చేయాలని కోరింది. అందుకోసం వైద్యురాలు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా నరసమ్మ తగిన మొత్తంలో ముట్టజెప్పింది. ఆదివారం కనకదుర్గను ఆస్ప త్రిలో చేర్చగా సోమవారం ఆమెకు ఆపరేషన్ చేశారు. కనకదుర్గ మగబిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డను సదరు వైద్యురాలు తల్లికి చూపించకుండా ఉంచింది. అలా రోజు, రెండు రోజులు, మూడు రోజులు గడవగా అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి నరసమ్మ వైద్యురాలిని కలిసి పుట్టిన బిడ్డను చూపించాలంటూ వేడుకుంది. పుట్టింది బిడ్డ కాదు గడ్డ మాత్రమే అంటూ వైద్యురాలు బుకాయించింది. గత్యం తరం లేని నరసమ్మ చివరికి పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్సీషియనే బిడ్డను అపహరించి మచిలీపట్నం దాటించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శిశువు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ తతంగాన్ని తప్పుదారి పట్టించేందుకు పలువురు టీడీపీ నేతలు తెర వెనుక కథ నడిపినట్టు విమర్శలు వస్తున్నాయి. -
‘పాప శరీరంలో దెయ్యం ఉంది’
లక్నో : శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా.. అంతరిక్షంలోకి వెళ్లినా మన సమాజంలో పాతుకుపోయిన కొన్ని ముఢనమ్మకాలను మాత్రం తొలగించలేకపోతున్నాం. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా భూత వైద్యులను, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చే పనికిమాలిన సలహాల ప్రకారం మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి సంఘటనే ఒకటి షాజహాన్ పూర్లో చోటు చేసుకుంది. నెలల పసికందుకు జబ్బు చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సింది పోయి భూతవైద్యున్ని కలిశారు తల్లిదండ్రులు. అతడు కాస్తా పాప శరీరంలో చెడు ఆత్మ ఉంది. దాని వల్ల మీ కుటుంబానికి నష్టం వాటిల్లుతుందని చెప్పాడు. పాపను వదిలించుకోకపోతే ప్రాణ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించాడు. దాంతో ఊరి దగ్గర ఉన్న చెరువులో పాపను పడేసేందుకు నిశ్చయించుకున్నాడు కసాయి తండ్రి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ లోపు అక్కడికి చేరుకోవడంతో చిన్నారిని సురక్షితంగా కాపాడారు. అనంతరం పాప తండ్రితో పాటు, మాంత్రికున్ని కూడా అరెస్ట్ చేశారు. -
ఒక జననం : ఒక మరణం
కోలకతా: సృష్టికి ప్రతిసృష్టి చేసే బ్రహ్మ వైద్యుడు అని ప్రతీతి. ఈ అంశాన్ని మరోసారి నిరూపించిన ఒక వైద్యుడు...అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. నిర్జీవంగా పడివున్న అపుడే పుట్టిన నవజాత శిశువుకు ప్రాణంపోసిన వైద్యుడు బిభాస్ ఖుతియా(48) లేబర్ రూంలోనే కుప్పకూలిపోవడం, క్షణాల్లో ఊపిరి ఆగిపోవడం పలువురిని కలవరపర్చింది. పశ్చిమ బెంగాల్లోని ఈస్ట్మిడ్నాపూర్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పురిటినొప్పులతో సోనాలి మాజి ఆరోగ్యం కేంద్రానికి వచ్చింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న డాక్టర్ బిభాస్ ఆమెకు ప్రసవం చేశారు. కానీ పుట్టిన బిడ్డలో చలనం లేకపోవడంతో తక్షణమే వైద్యం అందించి పాపకు ఊపిరి పోశారు. దీంతో కోలుకున్న శిశువు ఏడవడం మొదలు పెట్టడంతో వూపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే తీవ్రమైన గుండెనొప్పితో బిభాస్ కుప్పకూలిపోయారు. వెంటనే నర్సు పరోమి బెరా ఇతర సిబ్బంది ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. పటిండాలో పీహెచ్సీలో గత 15ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. డా. బిభాస్ ఖుతియా. ఆరోగ్యంకేంద్రంలో సిబ్బంది కొరతతో వున్న సందర్భంలో బిభాస్ 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటూ, సేవలందించే వారని సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. గతంలోనే యాంజియో గ్రామ్ చేసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినప్పటికీ ఆయన నిర్లక్ష్యం చేశారనీ, అదే ఆయన ప్రాణాలు తీసిందని వాపోయారు. మరోవైపు బిభాస్ అకాల మరణంపై జిల్లా వైద్యశాఖ ముఖ్య అధికారి నిటాయ్ చంద్ర మండల్ సంతాపం వ్యక్తం చేశారు. చాలా నిబద్ధతతో విధులను నిర్వహించేవారని గుర్తు చేసుకున్నారు. వృత్తిపట్ల ప్రేమ, నిబద్ధత ఉండటం ఎంత అవసరమో.. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అంతే ముఖ్యమని ఆయన మరణం నిరూపించిందని వ్యాఖ్యానించారు -
నర్సు నిర్వాకం : రెండు ముక్కలుగా శిశువు
జైపూర్: ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఉదంతం ఒకటి రాజస్థాన్లో జరిగింది. తీవ్ర నిర్లక్ష్యంతో పుట్టబోయే బిడ్డని ఈ లోకాన్ని చూడకముందే పొట్టన పెట్టుకుని, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఓ నర్సు. రాజస్థాన్, జైసల్మేర్లోని రాంగఢ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...దీక్షా కన్వర్ అనే మహిళకు నొప్పులు మొదలు కావడంతో జైసల్మేర్లోని రాంగఢ్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే ప్రసవ సమయంలో అక్కడి నర్సు శిశువును బలవంతంగా లాగింది. దీంతో శిశువు రెండు ముక్కలుగా విడిపోయింది. బిడ్డ కాళ్లు, సగం భాగం మాత్రమే బయటకి వచ్చి, మిగిలిన తల భాగం గర్భంలోనే ఉండిపోయింది. అయితే ఈ సంగతిని దాచిపెట్టి, మాయమాటలు చెప్పిన సదరు నర్సు..లోపల మాయ ఉండిపోయిందంటూ వేరే ఆసుపత్రికి పంపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ మహిళను జోధ్పూర్లో వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అసలు విషయాన్ని గుర్తించి, కుటుంబసభ్యులకు పరిస్థితి వివరించారు. ఆపరేషన్ చేసి, తల్లిని రక్షించారు. ఈ సంఘటనతో హతాశులైన బంధువులు, దీక్ష భర్త తిలోక్ భాటి ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. అంతేకాదు మద్యం సేవించిన ఆసుపత్రి సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని తిలోక్ భాటి ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శిశువు మొండెం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. -
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
సాక్షి, గుంటూరు : గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (జీజీహెచ్)లో దారుణం చోటుచేసుకుంది. మహిళకు కాన్పు చేయించటంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడం వల్ల శిశువు మృతి చెందింది. తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శిశువు మృతదేహన్ని త్వరగా తీసుకెళ్లాలని వైద్యులు ఆదేశించారు. అంతటితో ఆగకుండా రూ. 500 ఇస్తేనే మృత దేహాన్ని అప్పగిస్తామని బాధితులను సిబ్బంది బెదిరించారు. బాధితులు ఈ విషయాన్ని సూపరింటెండెంట్కు తెలియజేసినా పట్టించుకోలేదు. దీంతో ఆస్పత్రి ముందు బాధితుల బంధువులు ఆందోళనకు దిగారు. తమ బిడ్డ శరీరంపై గాయాలయ్యాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోంచారు. -
ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్ : చిన్నారి మృతి
చండీగఢ్ : హర్యానాలోని సోనిపట్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ తన్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో నవజాత శిశువు ప్రయాణిస్తున్న అంబులెన్స్ చిక్కుకుపోవడం చిన్నారి మరణానికి దారితీసింది. నవజాత శిశువు మరణించిన ఘటనపై నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. చిన్నారిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా,తన్వర్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని బంధువులు తెలిపారు. కాంగ్రెస్ ర్యాలీ కారణంగా 45 నిమిషాల పాటు అంబులెన్స్ నిలిచిపోవడంతో నవజాత శిశువైన తమ కుమారుడు మరణించాడని చిన్నారి తండ్రి రోదించారు. అంబులెన్స్లో ఆక్సిజన్ సదుపాయం లేదన్నారు.తమను తొలుత సోనిపట్ ఆస్పత్రికి అటు నుంచి రోహ్తక్ ఆస్పత్రికి రిఫర్ చేశారని, ఆస్పత్రికి తీసుకువెళుతుండగా కాంగ్రెస్ ర్యాలీ కారణంగా గంటన్నర ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చిన్నారి మరణించాడని నవజాత శిశువు బంధువులు చెప్పారు. రోడ్డుపై నిలిచిన అంబులెన్స్కు దారిఇవ్వాలంటూ డ్రైవర్ పలుమార్లు సైరన్ మోగించినా ఫలితం లేకపోయిందన్నారు. అయితే ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాలుడి తండ్రి పేర్కొన్న వీడియో తమవద్ద ఉందని తన్వర్ చెప్పారు. అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుందని తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్తలు రోడ్డును క్లియర్ చేసి అంబులెన్స్ను పంపించివేశారని తెలిపారు. -
తిరుమలలో అమానుషం
తిరుపతి: తిరుమలలో అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు రోజుల వయసున్న శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శ్రీవారి ఆలయం ముందున్న కల్యాణకట్ట వద్ద శిశువు ఏడుస్తూ కనిపించడంతో అటుగా వెళ్తున్న భక్తులు, విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో శిశువును చేర్చారు. ఈ ఘటనపై విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా శిశువును ఎవరు వదిలి వెళ్లారని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
మళ్లీ కూతురే..! బయటపడ్డ తండ్రి రాక్షసత్వం
సాక్షి, మహబూబాబాద్: మానవత్వం మంట గలిసింది. మహిళలు, శిశువులపై దేశవ్యాప్తంగా రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతుండగా.. మరోవైపు మగ సంతానం కోరుకుంటూ కసాయి తండ్రులు, కుటుంబ సభ్యులు ఆడశిశువు అని తెలియగానే పురిట్లోనే తమ బిడ్డను కడతేర్చుతున్నారు. భ్రూణహత్యలకూ పాల్పడుతున్నారు. తాజాగా.. మూడో కాన్పూలోనూ కూతురే పుట్టిందని ఓ తండ్రి మానవత్వాన్ని మరచి ప్రవర్తించాడు. అప్పుడే పుట్టిన బిడ్డను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని నెల్లికుదురు మండలం మెతిరాజుపల్లిలో కట్టకాలువ తండాలో చోటుచేసుకుంది. వివరాలు.. కట్టకాలువ తండాకు చెందిన భానోత్ అనిత, ఈశ్వర్ దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు. మూడో కాన్పులోనైనా కొడుకు పుడతాడని భావించారు. అనిత పురుడు కోసం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం భర్తతో సహా వచ్చారు. అయితే, మూడో కాన్పులో సైతం కూతురు పుట్టడంతో.. ఈశ్వర్ తనకు కూతురు వద్దని చెప్పినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎంత చెప్పినా వినకుండా ఆస్పత్రి నుంచి భార్య, అప్పుడే పుట్టిన పసికందును తీసుకొని సొంతూరుకు చేరుకున్న ఈశ్వర్ పసికందు ప్రాణాలు తీసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అదృశ్యమైన మగ శిశువు ఆచూకీ లభ్యం
-
శిశువు కిడ్నాప్.. గంటల వ్యవధిలో వీడిన మిస్టరీ
సాక్షి, ఆదిలాబాద్ : కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరణ ఘటనను మరువకముందే ఆదిలాబాద్లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్లో మగశిశువు అపహరణకు గురయ్యాడు. శిశువు అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఈ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. శిశువును అపహరించిన మహిళను ఇచ్చోడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలు లేకపోవడంతోనే తాను శిశువును అపహరించానని నిందితురాలు పుష్పలత అంగీకరించారు. దీంతో మగశిశువును తిరిగి తల్లి మమత ఒడికి చేర్చారు. బిడ్డ కనిపించకపోవడంతో తల్లిడిల్లిపోయిన తల్లి మమత.. తిరిగి శిశువు ఒడికి చేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 2న నార్మూర్ మండలం చోర్గామ్కు చెందిన మమత డెలివరీ కోసం రిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఆమె ఈ నెల 7న మగశిశువుకు జన్మనిచ్చారు. మంగళవారం తెల్లవారుజామున రిమ్స్ ఆస్పత్రిలో తల్లి ఒడి నుంచి చిన్నారి మాయమైంది. శిశువు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన మమత, ఆమె బంధువులు రిమ్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన గురించి తెలియడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. పట్టణంలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేసి.. శిశువుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళ కోసం గాలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే నవజాత శిశువుతో అనుమానాస్పదంగా కనిపించిన పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. తనది ఆదిలాబాద్ పట్టణమేనని, తనకు పిల్లలు లేకపోవడంతో శిశువును ఎత్తుకెళ్లానని పుష్పలత పోలీసులకు తెలిపారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన శిశువును రెండురోజుల్లోనే హైదరాబాద్ పోలీసులు బీదర్లో కనుగొన్న సంగతి తెలిసిందే. -
గర్భక్షోభ
-
కోఠి మెటర్నిటీ హాస్పిటల్లో కిడ్నాపైన శిశువు క్షేమం
-
రెండు రోజుల పసిబిడ్డను చర్చిలో వదిలి వెళ్లారు
-
పసికందును చర్చిలో వదిలేశారు..
కొచ్చి: నవ మాసాలు మోసిన ఆ తల్లికి పుట్టిన రెండు రోజులకే పాప నచ్చలేదో.. ఆ తండ్రికి ఆ బిడ్డ ఏం పాపం చేశాడో..లేక ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ రెండు రోజుల పసికందుని చర్చిలో వదిలేసి వెళ్లారు ఓ జంట. ఈ విచార ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళలోని త్రిశూర్ సమీపంలోని సెయింట్ జార్జ్ ఫోర్నే చర్చి వద్ద శుక్రవారం సాయంత్రం ఓ జంట రెండు రోజుల పసికందుని వదిలి వెళ్లారు. వారు వెళ్లాక కొద్ది సేపటికి అక్కడి భద్రత సిబ్బందికి పాప ఏడుపు వినిపించింది. వెళ్లి చూసే సరికి చర్చి ప్రాంగణంలో పసికందు ఏడుస్తూ కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ పాపను ఆసుపత్రికి తరలించారు.సీసీ పుటేజీ పరిశీలించగా శుక్రవారం సాయంత్రం 8.15గంటలకు ఆ జంట మరో బిడ్డతో వచ్చి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్లారు. వెళ్లే ముందు పాప నుదిటిపై ఓ ముద్దు కూడా పెట్టారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా పాప తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను వదిలి వెళ్లాడానికి గల కారణాలు విచారణ తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. -
నిర్లక్ష్యం: కన్నుతెరవకుండానే కన్నుమూశాడు
లక్నో: వైద్యుడి నిర్లక్ష్యం ఆ పసికందు పాలిట శాపమైంది. ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఉత్తర ప్రదేశ్లోని సుల్తాన్పూర్ దారుణం చోటు చేసుకుంది. 26 సంవత్సరాల రేష్మీకి పురిటినొప్పులు రావటంతో సుల్తాన్పూర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మగబిడ్డను ప్రసవించటంతో ఆ కుటుంబంలో సంతోషం నెలకొంది. అయితే కాన్ఫు చేసిన వైద్యుడు బొడ్డు తాడును కత్తిరించే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ పసిగుడ్డు పీకను కొసేశాడు. కళ్లు తెరకుండానే ఆ పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అటుపై మృత శిశువు జన్మించిందని కుటుంబ సభ్యులను నమ్మించే యత్నం చేశాడు. అయితే గొంతుపై కత్తి గాటు గమనించిన బంధువులు వైద్యుడిని నిలదీయటంతో అసలు విషయం చెప్పి క్షమాపణలు కోరాడు. ఆగ్రహించిన కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వైద్యుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మృగాన్ని మాకు వదిలేయండి.. అంతుచూస్తాం
-
సాబ్... ఈ మానవ మృగాన్ని మాకు వదిలేయండి
ఇండోర్ : మధ్యప్రదేశ్లో 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకెళ్లి మరీ ఆ మానవ మృగం కిరాతకానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఓ సెల్లార్లో రక్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని నవీన్ గడాకే(21) గా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్ను శనివారం జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అప్పటికే కోర్టు వద్దకు చేరుకుని కొందరు ప్రజలు, సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల జీపు నుంచి దిగుతున్న నవీన్ను చూడగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు యువకులు అతన్ని పక్కకు లాక్కెల్లి పిడి గుద్దులు గుప్పించారు. సాబ్.. దయచేసి వీడిని మాకు వదిలేయండి.. వీడి అంతుచూస్తాం.. అంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇంతలో పెద్ద ఎత్తున్న పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టి నవీన్ను పక్కకు తీసుకెళ్లారు. ఆపై నిందితుడిని పరుగు పరుగున న్యాయస్థానం లోపలికి తీసుకెళ్లారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. చిన్నారి తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారనీ, నిందితుడు నవీన్.. ఆ కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. చిన్నారులపై రేప్కు మరణశిక్ష! ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదం -
పసిగుడ్డుపై మానవ మృగం హత్యాచారం
సాక్షి,ఇండోర్: మైనర్ బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులపై జరుగుతున్న క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దేశంలో ఏదో ఒక మూల చోటుచేసుకుంటున్న అఘాయిత్యాల తీరు, హత్యలు ప్రతీ మనిషినీ ఆందోళనలో పడేవేస్తోంది. రోజుకో హత్యాచార ఘటన కలవరం పుట్టిస్తోంది. గత కొన్నిరోజులుగా కథువా, ఉన్నావ్, సూరత్, చత్తీస్ఘడ్..ఇలా ఈ జాబితా పెరుగుతూ పోవడం నిజంగా అవమానకరం. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి మౌన సాక్ష్యంగా మిగిలింది. 6నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. శుక్రవారం మధ్యాహ్నం ఒక సెల్లార్లో రక్తపు మడుగులో పడివున్న శిశువు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని సునీల్ భీల్(21) గా గుర్తించారు. పాప శరీరంలోని ప్రయివేటు భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించినట్టు పోలీసులు చెప్పారు. బాధితురాలు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారనీ, నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై స్వర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
నవజాత శిశువు మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట పీహెచ్సీలో అప్పడే పుట్టిన శిశువు కరీంనగర్ తరలిస్తుండగా మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లికి చెందిన ఓరుగంటి వర్షిత(29) శనివారం పుటిరినొప్పులతో ఇల్లంతకుంట పీహెచ్సీకి ప్రసవానికి వచ్చింది. సిబ్బంది సుఖప్రసవం కోసం ప్రయత్నించారు. సాయంత్రం 5గంటలకు విధుల్లో ఉన్న స్టాఫ్నర్సులు జగదీశ్వరీ, రేణుక, రాజశ్రీలు సిరిసిల్ల జేసీ మీటింగ్లో ఉన్న వైద్యాధికారి లతకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో సుఖప్రసవం చేయాలని వారికి ఆదేశించారు. రాత్రి 7గంటలకు ప్రసవం చేశారు. మగశిశువు ఉమ్మనీరు మింగడంతో పాటు, మెడకు బొడ్డుపేగు చుట్టుకుని జన్మించాడు. గంట తరువాత కరీంనగర్ తరలించగా అప్పటికే మృతిచెందాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసవం చేయకపోవడంతోనే శిశువు మృతిచెందిందని, స్టాఫ్నర్సులు వైద్యాధికారికి ఫోన్ చేసి ఆమె చెప్పిన ప్రకారం ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం పీహెచ్సీకి చేరుకుని వైద్యాధికారులు లత, రామకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఓ పక్క శిశువు మరణించాడనే పుట్టెడు దు:ఖంలో ఉన్న వర్షితకు కేసీఆర్ కిట్ ఇచ్చేందుకు స్టాఫ్నర్సులు ప్రయత్నించారు. దీంతో వారిపై ‘నా కొడుకును చంపేశారు... కిట్ ఇస్తున్నారా..?’ అంటూ వర్షిత ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఘోరం : గుక్కపట్టి ఏడుస్తుంటే విసిగిపోయి...
సాక్షి, న్యూఢిల్లీ : గుక్కపట్టి ఏడుస్తున్న పసికందుతో కన్న ప్రేమను మరిచి కర్కశంగా వ్యవహరించిందో తల్లి. విసుగుపుట్టి తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయగా.. ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఢిల్లీలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్కు చెందిన నేహా 25 రోజుల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి పాలు పట్టిస్తున్నప్పటికీ గుక్కపట్టి ఏడుస్తోంది(అనారోగ్య సమస్య ఉందని చిన్నారి తండ్రి చెబుతున్నాడు). దీంతో అసహనానికి లోనైన నేహ దారుణానికి పాల్పడింది. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్త కుప్పలో పడేసింది. పాప కనిపించపోయేసరికి కుటుంబ సభ్యులంతా కంగారుపడగా.. తాను కూడా వారితోపాటు వెతికినట్లు నటించింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని వారు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సాక్ష్యులను విచారణ చేపట్టగా స్థానికుడొకరు నేహ చెత్తకుండీలో ఏదో మూట పడేయటం చూశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ తల్లిపై అనుమానం మొదలైంది. ఈ క్రమంలో వారు ఆమెను గట్టిగా ప్రశ్నించగా.. ఆమె నేరం ఒప్పుకుంది. చిన్నారి ఏడుస్తుంటే తట్టుకోలేకనే తాను ఆ పని చేసినట్లు వివరించింది. దీంతో పోలీసులు హుటాహుటినా చెత్త కుప్ప వద్దకు వెళ్లారు. కొన ఊపిరితో ఉన్న పసికందును ఆస్పత్రికి తరలించి బతికించే ప్రయత్నం చేశారు. అయితే తలకు బలమైన దెబ్బ తలగటంతో ఆ పసికందు ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో పోలీసులు నేహను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఉప్పల్లో దారుణం
-
ఉప్పల్లో దారుణం
హైదరాబాద్ : ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మూడు నెలల చిన్నారి చంపి అనంతరం తలను ఓ భవనంపై పడేశారు. హనుమంతు అనే వ్యక్తి తన ఇంటిపై చిన్నారి తలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి అడిషనల్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్ గిరి డీసీపి ఉమామహేశ్వర శర్మ తదితరులు చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా చిన్నారి ఎవరైందనే విషయం తెలియాల్సి ఉందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి హైలెవెల్ ఎంక్వైరీ జరిపించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
మృత్యుంజయుడు!
నర్సాపూర్రూరల్ : పాడుబడిన బావిలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. కాగజ్మద్దూరు గ్రామంలో ఆదివారం పాడుబడిన బావి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు తొంగి చూశా రు. పాడుబడిన బావిలో గాజుపెంకులు, చెత్తాచెదారం మధ్యలో శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..8 మీట ర్ల లోతులో ఉన్న శిశువును క్షేమంగా పైకి తీసుకొచ్చి నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. కాలుకు చిన్న గాయం తప్ప ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించారు. పుట్టిన మరుక్షణమే శిశువును బావిలో పడివేసి ఉంటారని వైద్యు లు భావిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి లోని చైల్డ్వెల్ఫేర్ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వెంకటరాజాగౌడ్ చెప్పారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేత సునీతారెడ్డి.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిశువుకు ‘మృత్యుం జయుడు’అనే పేరు పెట్టించాలన్నారు. -
గోనె సంచిలో పసికందు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచిలో కట్టేసి వదిలివెళ్లారు. స్థానిక పచ్చిపులుసు కళ్యాణ మండపం వద్ద ఈ ఘటన జరిగింది. గోనె సంచిలో నుంచి ఏడుపు విని అటుగా వెళ్తున్నవారు పాపను అక్కున చేర్చుకున్నారు. అనంతరం పసికందును చికిత్స కోసం నిడదవోలు ఆస్పత్రికి తరిలించారు. కాగా, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. పాపను ఎవరు వదిలి వెళ్లారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ఆ వ్యక్తి చేసిన పనికి హ్యాట్సాఫ్
సాక్షి, ముంబై : అమన్... రాత్రికి రాత్రే నగరానికి హీరో అయిపోయాడు. ఓ చిన్నారిని కాపాడటమే కాదు.. సురక్షితంగా ఆస్పత్రికి చేరేంత వరకు ఓ పెద్ద ఉద్యమాన్నే నడిపాడు. ముంబైకి చెందిన అమన్ ఆదివారం సాయంత్రం భందూప్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఓ శిశువు రోదనలు వినిపించాయి. ఆటోలో ఎవరో ఆ చిన్నారిని వదిలేసి పోయారు. అటుగా చాలా మంది వెళ్తున్నప్పటికీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. కానీ, అమన్ మాత్రం పోలీసులకు సమాచారం అందించేందుకు యత్నించగా... అవతలి నుంచి స్పందన రాలేదు. దీంతో అమన్ ఆ పసికందు ఫోటోలను ఆదివారం రాత్రి తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. తనకీ ఏం చేయాలో పాలుపోవటం లేదని సందేశం ఉంచాడు. అంతే రాత్రికి రాత్రే ఆ ఫోటోలకు అనూహ్యరీతిలో స్పందన వచ్చింది. కొందరు ఆ ఫోటోలను ముంబై పోలీసు శాఖకు చేరవేసేదాకా పోస్టులు చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు స్పందించి అతన్ని సంప్రదించారు. సియోన్ ఆస్పత్రికి తరలించి ఆ చిన్నారికి చిక్సిత్స అందజేయిస్తున్నారు. ప్రజలంతా అమన్ను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ప్రశంసలు కురిపిస్తూ అతని ఫోటోలు పోస్ట్ చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా ఆ శిశువును వదిలింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. .@Jugadu_banda alert citizens like you on the streets of Mumbai, play a major role in making it a safe city! Thank you for making sure the child reaches safe hands #ThankYouMumbai pic.twitter.com/giiyD2z7Os — Mumbai Police (@MumbaiPolice) November 20, 2017 -
చెత్త కుప్పలో చిన్నారి
-
నేనేమి చేశాను పాపం..!
విజయనగరం: మీరు కోరుకుంటేనే కడుపులో పడ్డాను. అమ్మ జోలపాట వినాలని, చేతి ముద్ద రుచి చూడాలని, నాన్న చేతిని పట్టుకుని నడవాలని ఆశ పడ్డాను. అమ్మ కడుపులోంచి ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురు చూశాను. నేనేమి చేశాను ప్రాపం..! నెలలు నిండక ముందే ఆయువు తుంచేశారు... ఆశలన్నీ చిదిమేశారు. బాహ్య ప్రపంచాన్ని చూపకుండానే అనంతలోకాలకు పంపించేశారు. అమ్మతనం.. నాన్న కమ్మదనాన్ని పంటి బిగువున నలిపేశారంటూ ఓ శిశువు మృత్యుఘోష చూపరులను కలచివేసింది. విజయనగరంలోని ఓరిగంటివారి వీధి ఎస్సీ బాలికల హాస్టల్కు ఆనుకుని ఉన్న ప్రహారీ పక్కన ముళ్ల పొదల మాటున శనివారం సాయంత్రం ఓ ఆడ శిశువు దర్శనమిచ్చింది. అప్పుడే పుట్టినట్లు ఉన్న బిడ్డను చూసి స్థానికులు చలించిపోయారు. బిడ్డ చనిపోయి ఉండడంతో అయ్యో అంటూ నిట్టూర్చారు. ఎవరో తెచ్చి బిడ్డను పడేసి ఉంటారని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ ఇ. నర్సింగ మూర్తి ఘటనా స్థలానికి చేరుకుని శిశువును ఖననం చేయించారు. -
వైరల్ వీడియో: పుట్టీ పుట్టగానే నడక!
పిల్లలు నడక నేర్చుకోవాలంటే.. కనీసం ఏడాది వయసు రావాలి. మరీ చురుగ్గా ఉండే పిల్లలైతే తొమ్మిదో నెలలో కూడా నడుస్తారు. కానీ, ఈ వీడియోలో కనిపిస్తున్న గడుగ్గాయి మాత్రం పుట్టీ పుట్టగానే నడక మొదలుపెట్టేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మే 26న.. అంటే మూడు రోజుల క్రితం వీడియోను పోస్ట్ ఫేస్బుక్లో చేయగా, ఇప్పటికి 6.8 కోట్ల సార్లు దాన్ని చూశారు. 15 లక్షల సార్లు షేర్ అయింది. 3.25 లక్షల రియాక్షన్లు వచ్చాయి. అప్పుడే పుట్టిన శిశువును నర్సు చేత్తో పట్టుకోగా ముందు ఒక కాలు, తర్వాత మరో కాలు ఎత్తుతూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఈ 41 సెకండ్ల వీడియో ఉంది. అర్లెట్ అరాంటెస్ అనే వ్యక్తి బ్రెజిల్ నుంచి ఈ వీడియోను ఫేస్బుక్లో పెట్టారు. అయితే దీన్ని ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారో మాత్రం తెలియడం లేదు. ఈ విషయమై యూనివర్సిటీ ఆఫ్ రోషెస్టర్ మెడికల్ సెంటర్ ప్రతినిధులు స్పందించారు. ఇది మరీ వింత కాదని, అప్పుడే పుట్టినవారిలో కొంతమందిలో ఇలా కనిపిస్తుందని అన్నారు. దీన్ని 'స్టెప్పింగ్ రిఫ్లెక్స్' అంటారని, దీన్నే కొంతమంది నడకలా భావిస్తే మరికొందరు డాన్సు అనుకుంటారని చెప్పారు. చేతులతో పట్టుకుని వాళ్లను నిలబెడితే కాళ్లు ఒకేచోట ఉంచరని.. అలా అటూ ఇటూ కదిలిస్తుంటారని తెలిపారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఒకరు ఈ బేబీ పేరు ఉసేన్ బోల్ట్ అని అంటే, మరొకరు 9 నెలల పయనం తర్వాత కాళ్లు చాపుతున్నాడు అన్నారు. -
న్యూ బోర్న్ బేబీ అమేజింగ్ వీడియో
పుట్టీ పుట్టగానే ల్యాప్ ట్యాప్ ఆన్ చేసి హల్ చల్ చేసిన పసిపాప యాడ్ గుర్తుందా? శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక టెక్నాలజీకి సింబాలిక్ గా ఆ ప్రకటన రూపొందించడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. అయితే అంతే ఆసక్తికరంగా ఇపుడు ఒక వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. అమేజింగ్ న్యూ బోర్న్ బేబీ వీడియో ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. శిశువు బుడిబుడి అడుగులు వేస్తున్న వీడియో ఫేస్బుక్లో వైరల్ గా మారింది. డాక్టర్ చేతిలో ఉండగానే ఈ శిశువు వడివడిగా అడుగులు వేస్తున్న ఈ అమేజింగ్ వీడియో పలువుర్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ వీడియో ఎపుడు ఎక్కడ తీసారనే వివరాలుమాత్రం అందుబాటులో లేవు. -
ఆ పాపకు చిన్నమ్మ పెట్టిన పేరేంటో తెలుసా?
చెన్నై : ఎంతో మంది ప్రజల మన్ననలు పొంది, అసువులు బాసిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై అభిమానంతో అప్పుడే పుట్టిన ఓ చిన్నారికి 'జయలలిత' అనే పేరును అమ్మ నెచ్చెలి శశికళ పెట్టారు. అమ్మకు గుర్తుగా ఈ పేరును పెట్టినట్టు తెలిసింది. అన్నాడీఎంకే కార్యకర్త అయిన సెంతిల్కుమార్, గాయత్రీలకు ఇటీవలే ఆడపిల్ల జన్మించింది. థేని జిల్లాకు చెందిన సెంతిల్ అమ్మకు అభిమాని. ఆయన ఆటో నడుపుతూ తన జీవనం సాగిస్తున్నాడు. జయలలిత మరణించిన తర్వాత అమ్మపై ఉన్న ప్రేమతో తమ కూతురికి అమ్మ పేరు పెట్టాలని పాపను పోయెస్ గార్డెన్కు తీసుకుని వచ్చాడు. వారి అభిమానికి మురిసిపోయిన అమ్మ నెచ్చెలి శశికళ, ఆ చిన్నారికి జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత మరణించిన అనంతరం అన్నాడీఎంకే చీఫ్గా శశికళ నటరాజన్ నియమితులైన సంగతి తెలిసిందే. శశికళ ప్రస్తుతం పోయెస్ గార్డెన్లో ఉంటున్నారు. -
తల్లి ఒత్తిడితో పుట్టబోయే పిల్లలకు ముప్పు!
న్యూయార్క్: గర్భంతో ఉన్న మహిళ ఎంత ఎక్కువ ఒత్తిడికి గురైతే దాని దుష్ప్రభావం పుట్టపోయే బిడ్డ మానసిక ఆరోగ్యంపై అంత ఎక్కువగా ఉంటుందట. తల్లి ఒత్తిడికి గురయ్యే సమయంలో జన్మించే పిల్లలు కూడా ఒత్తిడి, చదువులో వెనుకబాటు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఓ అధ్యయనంలో తేలింది. గర్భంతో ఉన్న ఎలుకలపై ఈ అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అమెరికాలోని ఓహియో యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురైన ఎలుకల మావి, గుండె, పేగులవాహికల్లోని బ్యాక్టీరియా తీవ్ర మార్పులకు గురైనట్టు గుర్తించారు. వాటికి పుట్టిన పిల్లల్లోనూ ఇలాంటి మార్పులే కనిపించాయి. ఒత్తిడిని తగ్గించే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) అనే ప్రొటీన్ కూడా క్షీణించినట్టు గుర్తించారు. అందుకే గర్బంతో ఉన్న మహిళలను ఎక్కువగా ఆందోళన చెందవద్దని, ఆ సమయంలో అనవసర విషయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారని ఓహియో వర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. -
చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేశారు!
వైరా: ఖమ్మం జిల్లా వైరాలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైరాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది అప్పుడే పుట్టిన పసికందును చనిపోయిందంటూ చెత్తబుట్టలో పడేసింది. అయితే విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పసికందు కదలికలను గుర్తించి షాక్ తిన్నారు. వెంటనే షాక్ నుంచి తేరుకుని శిశువుకు మెరుగైన చికిత్స అందించడానికి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మరికొందరు కుటుంబసభ్యులు వైరాలోని ప్రైవేట్ ఆస్ప్రతి సిబ్బంది నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శిశువు ప్రాణం తీసిన నోట్ల రద్దు !
ముంబై: రద్దు చేసిన పెద్ద నోట్లు ఆస్పత్రి సిబ్బంది స్వీకరించకపోవడంతో ఓ పసికందు మృతి చెందింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ముంబై గోవండీలోని జీవన్జ్యోత్ నర్సింగ్ హోం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బాలుడి తండ్రి జగదీశ్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేగాకుండా పోలీసులు మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలని ఆయనకు సలహా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... గోవండీకు చెందిన జగదీశ్ భార్య కిరణ్కు పురిటి నొప్పులు రావడంతో బుధవారం జీవన్జ్యోత్ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం తరువాత బాలుడు తక్కువ బరువుతో ఉండటంతో వైద్యం ప్రారంభించారు. శిశువు ఆరోగ్యం క్షీణించటంతో అత్యవసర విభాగంలో ఉంచేందుకు రూ.6 వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. కాని, జగదీశ్ వద్ద పాత రూ.500 నోట్లు ఉన్నాయి. ఏటీఎంలు కూడా పనిచేయక పోవడంతో డిపాజిట్ చేయలేక పోయాడు. దీంతో వైద్యం అందించేందుకు వైద్యులు నిరాకరించారు. సమీపంలో ఉన్న డాక్టర్ అమిత్ షా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అక్కడి చేరుకునేలోపు మార్గమధ్యలో పసికందు మరణించాడు. దీంతో తన బిడ్డ చనిపోవడానికి జీవన్జ్యోత్ ఆస్పత్రి సిబ్బందే కారణమని జగదీశ్ ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యం ఆయన ఆరోపణలను తోసిపుచ్చింది. పెద్ద నోట్లు స్వీకరించకపోవడం కాదని, మెరుగైన వైద్యం అందించే సౌకర్యం తమ ఆస్పత్రిలో లేదని, మరో ఆస్పత్రికి తరలించాలని సలహా ఇచ్చామని జీవన్జ్యోత్ ఆస్పత్రి డాక్టర్ కామత్ స్పష్టం చేశారు. అత్యవసర సమయంలో రద్దు చేసిన పెద్ద నోట్లు స్వీకరించాలని రెండు రోజుల కిందట ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. అయినప్పటికీ, ఓ పసికందు బలికావడంపై సంబంధిత మంత్రి ఆ ఆస్పత్రి యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. -
సూర్యాపేటలో దారుణం
సూర్యాపేట: సూర్యాపేటలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువునువదిలి వెళ్లారు. కట్ట పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడి ఉన్న పసికందును ఎలుకలు తినడంతో.. శిశువు మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
విశాఖజిల్లాలో దారుణం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యలమంచిలి నెహ్రూనగర్లో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తుల చెట్లపొదల్లో వదిలి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. -
అచ్చం 'బాహుబలి'లో లాగే..
-
అచ్చం 'బాహుబలి'లో లాగే..
చింతపల్లి: నాలుగు రోజుల నుంచి కుమార్తెకు తీవ్ర జ్వరం.. చికిత్స చేయించాలంటే కాలువ దాటాల్సిందే.. కానీ ఆ కాలువ ఇటీవలి వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలాగైనా తన ఏడాది కుమార్తెను కాపాడుకునేందుకు ఆ కాలువను సైతం ఎదిరించడానికి సిద్ధపడ్డాడు ఓ తండ్రి. సరిగ్గా బాహుబలి సినిమాలో పసికందును చేతితో పైకెత్తి ప్రవాహానికి ఎదురునిలిచిన రమ్యకృష్ణను గుర్తుకు తెచ్చే ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారిలో మంగళవారం చోటు చేసుకుంది. కుడుముసారి గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు ఏడాది కుమార్తెకు నాలుగు రోజులైనా జ్వరం తగ్గకపోగా తీవ్రమైంది. చిన్నారిని చికిత్స కోసం తీసుకెళ్దామంటే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుడుమసారి కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. బంధువులంతా వద్దన్నా కుమార్తెకు వైద్యం చేయించేందుకు కాలువ దాటడానికే సత్తిబాబు సిద్ధమయ్యాడు. పసికందును చేతుల పెకైత్తుకొని అతికష్టమ్మీద కాలువ దాటాడు. తర్వాత సుమారు 5 కిలోమీటర్ల మేర నడిచి మెయిన్రోడ్కు చేరుకొని లోతుగెడ్డ పీహెచ్సీకి తీసుకెళ్లాడు. చికిత్స అనంతరం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యుడు చెప్పడంతో సత్తిబాబు ఊపిరి పీల్చుకున్నాడు. -
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
-
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాలు..గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు కోసం మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తండ్రి చేతిలో బాబును పెట్టారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లి పూడ్చి పెట్టండి అని తండ్రికి చెప్పారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కొద్దిసేపటి తర్వాత ఏడవటం మొదలుపెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణంపోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. -
హెల్త్ విజిటర్పై డీఎంహెచ్వో విచారణ
చింతలపూడి : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో సస్పెన్షన్కు గురైన హెల్త్ విజిటర్ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ కె.కోటేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు. రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ విజిటర్గా పనిచేస్తున్న బి.శాంతకుమారి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత జూలైలో స్ధానిక సుప్రీంపేటకు చెందిన తల్లీబిడ్డా మృతి చెందారు. ఈ ఘటనలోకలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ ఆగస్టులో శాంతకుమారిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలని శాంతకుమారి ఏపీ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై స్వయంగా విచారించి నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్ డీఎంఅండ్హెచ్వోను ఆదేశించడంతో రాఘవాపురం పీహెచ్సీలో విచారణ చేపట్టారు. వైద్యులను, ఏఎన్ఎంలను, ఆశా వర్కర్లను విడివిడిగా విచారించారు. -
మాతాశిశు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
ఎంజీఎం : మాతాశిశు వివరాలతో పాటు హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో కచ్చితమైన సమాచారాన్ని ఆన్లైన్ చేయాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి హరీష్రాజు సూచించారు. వరంగల్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం ఆయా క్లస్టర్ల పరిధిలోని ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఓ హరీష్రాజు మాట్లాడుతూ తప్పుడు వివరాలు నమోదు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ఆవకాశం ఉందన్నారు. పీహెచ్సీలతో పాటు క్లస్టర్ స్థాయిలో వివరాలను ప్రతి నెల అన్ని సెంటర్లలో నమోదు చేయాలన్నారు. అనంతరం ఆన్లైన్లో జరిగే పొరపాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓలు కాంతారావు, రమేశ్గాడ్గిల్, సర్వేలెన్స్ అధికారి కిరణ్, మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, స్వరూపారాణి పాల్గొన్నారు. -
'డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకి అప్పగిస్తాం'
హైదరాబాద్ : శిశువు తారుమారు అయిన ఘటనపై కోఠి మెటర్నటీ ఆసుపత్రి ఆర్ఎంవో విద్యావతి బుధవారం హైదరాబాద్లో స్పందించారు. సమాచార లోపంతోనే ఈ వివాదం ఏర్పడిందన్నారు. ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. డీఎన్ఏ పరీక్ష జరిపి ఎవరి పిల్లల్ని వాళ్లకు అప్పగిస్తామన్నారు. ప్రస్తుతం రజిత, రమాదేవి పిల్లలు మా సంరక్షణలోనే ఉన్నారని విద్యావతి పేర్కొన్నారు. ఆసుపత్రిలో పిల్లలను తారుమారు చేశారని ఆరోపిస్తూ.. రజిత కుటుంబ సభ్యులు మంగళవారం కోఠి మెటర్నిటీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బందికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
ముళ్ల పొదలో ఆడ శిశువు
కాపాడిన గ్రామస్తులు తీగారంలో కలకలం రేపిన ఘటన జఫర్గఢ్/ఎంజీఎం : తల్లి వెచ్చని పొత్తిళ్లలో కునుకు తీయాల్సిన ఓ శిశువు ముళ్లపొద పాలైంది. ఆకలితో పాల కోసం గుక్క పెట్టి ఏడ్చింది. తెల్లవారుజామున ఆ పసికందు ఆక్రందనలు విన్న గ్రామస్తులు ‘అయ్యో బిడ్డా’ అని అక్కున చేర్చుకున్నారు. గుండెలకద్దుకొని ఊరడించారు. ఈ సంఘటన మండలంలోని తీగారం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తీగారం గ్రామంలో పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ముళ్లపొదల నుంచి పసికందు ఏడుపు శబ్దాలు స్థానికులకు వినిపిం చాయి. దీంతో వారు ఆ ఏడుపు వినిపిస్తున్న ముళ్ల పొదల వైపు వెళ్లి చూడగా చిన్నచిన్న గాయాలతో ఓ శిశువు కనిపించింది. మహిళలు ఆ ఆడ శిశువుకు సపర్యలు చేసి, నెత్తికి కుల్ల కుట్టారు. శరీరానికి వెచ్చదనం కలిగేలా దుస్తులు తొడిగి తల్లి ప్రేమను చాటారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై బండారి సంపత్ గ్రామస్తుల ద్వారా సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అప్పటికే గాయాలతో ఉన్న శిశువుకు వైద్యం అందించేందుకుగాను వెంటనే పోలీస్ వాహనంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళల సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు ఎస్సై సంపత్ తెలిపారు. కాగా పుట్టిన శిశువు ఆడ పిల్ల కావడం వల్లనే శిశువు తల్లిదండ్రులు తమకు ఎక్కడ భారమవుతుందోనని ముళ్లపొదల్లో పారేసినట్లుగా ఉందని స్థానికులు తెలిపారు. ఆ పసికందును చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామం లో కలకలం రేపింది. -
చెత్తకుండీలో శిశువు మృతదేహం
ఒంగోలు: ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్లోని ఓ చెత్తకుండీలో పురిటి శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెజబ్బుల ముప్పులో శిశువులు
విజయవాడ (లబ్బీపేట) : భారత్లో పుట్టుకతో గుండెలోపాలతో పుడుతున్న చిన్నారులు రోజు రోజుకు పెరుగుతున్నారని ఇంగ్లండ్లో పీడియాట్రిక్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల అన్నారు. ఆంధ్రా హాస్పటల్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ ఏపీ, కృష్ణాజిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పిల్లల్లో గుండెలోపాలను గుర్తించడం ఎలా అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఇ) ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సీఎంఈకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200ల మందికిపైగా పిల్లల వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సదస్సును తొలుత ఏపీ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ యలమంచిలి రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ పిల్లల్లో గుండెలోపాలు, వాటిని ఎలా గుర్తించాలనే అంశంపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఇంటర్వెన్షనల్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ మిర్జన వెట్కోవిక్ , డాక్టర్ నయన్ షెట్టీ, డాక్టర్ ప్రేమ్సుందర్ వేణుగోపాల్, డాక్టర్ పీవీ రామారావు, డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియో డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
పుట్టిన బిడ్డకూ ఆధార్
పెద్దాస్పత్రిలో ఏర్పాట్లు జనన ధృవీకరణ పత్రం కూడా ప్రజలకు ఎంతో మేలు నెల్లూరు(అర్బన్): ఇక మీదట స్థానిక దర్గామిట్టలోని జనరల్(పెద్దాసుపత్రి) ఆసుపత్రిలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆధార్ను ఇచ్చేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం మొదట దశలో విశాఖపట్టణంతో పాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి పట్టణాలలోని జనరల్ ఆస్పత్రులను ఎంపిక చేసింది. అందులో భాగంగా నగరంలోని పెద్దాసుపత్రిలో ఆధార్కు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంప్యూటర్, ప్రింటర్లను కొనుగోలు చేయబోతున్నారు. ఈ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జూన్ నెల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన ప్రతి జనన, మరణాలకు సంబంధించి ధృవపత్రాలను ఇస్తున్నారు. జననాలకు సంబంధించి తల్లిదండ్రుల ఆధార్ నంబర్ను నోట్ చేయాలని 10 రోజుల క్రితమే ఆదేశాలొచ్చాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా పుట్టిన బిడ్డకు ఆధార్ నంబర్ను ఇవ్వాలని ఆదేశాలొచ్చాయి. బిడ్డకు పేరుపెట్టకుండానే ఫిమేల్/ మేల్ బేబీ అని నమోదు చేసి మొదట ఆధార్ను ఇస్తారు. ఐదారు నెలల తరువాత తల్లిదండ్రులు తమ బిడ్డకు పేరుపెట్టుకుని వస్తే మళ్లీ ఆధార్లో పేరును నమోదు చే స్తారు. దీంతో గ్రామీణ పేదలు ఎక్కడికి తిరగకుండానే కాన్పు జరిగిన చోటే ఆధార్ను సులభంగా పొందే అవకాశముంటుంది. ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడనుంది. కాస్త ఆలస్యం: ఆధార్ నమోదు ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ నెల్లూరు పెద్దాసుపత్రిలో కాస్త ఆలస్యం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు, రూమ్ ఏర్పాటుకు కొద్ది రోజులు పట్టవచ్చు. ఈ విషయమై డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ను ‘సాక్షి’ వివరణ కోరగా స్పందించారు. ప్రింటర్, కంప్యూటర్లు కొనుగోలుకు సంబంధించి కలెక్టర్ ముత్యాలరాజుతో మాట్లాడాల్సి ఉందన్నారు. కలెక్టర్తో మాట్లాడాక వాటిని కొనుగోలు చేసి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా సరిచూసుకుని ఆధార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుడతామని తెలిపారు. ఈ ఆధార్ ప్రక్రియతో పెద్దాసుపత్రిలో కాన్పులు కూడా పెరుగుతాయని భావిస్తున్నామని తెలిపారు. -
పాడుబడిన బావిలో పసికందు శవం
పెగడాపల్లి మండలం నందగిరిలోని ఓ పాడుబడిన బావిలో పసికందు శవం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిశువును వదిలేసిన మహిళ
తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం చైల్డ్ వెల్ఫేర్ సెంటర్కు అప్పగించిన పోలీసులు తెనాలి రూరల్ : కన్న బిడ్డ ఆ తల్లికి భారమయ్యాడో లేక ఆమెకు ఏం కష్టమొచ్చిందోగానీ నాలుగు నెలల పసి కందును వైద్యశాలలో వదిలి వెళ్లిపోయింది. ఆరోగ్యంగానే ఉన్న ఆ శిశువు ప్రస్తుతం వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 24వ తేదీ రాత్రి గుర్తు తెలియని మహిళ తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు శిశువుతో కలిసి వచ్చింది. చాలా సేపు అక్కడే తిరుగాడిన ఆమె అర్ధరాత్రి సమయంలో ఎవరూ చూడకుండా శిశువును వైద్యశాలలో వదిలిపెట్టి వెళ్లిపోయింది. శిశువును గమనించిన సిబ్బంది వారి సంరక్షణలో ఎన్ఐసీయూలో ఉంచి బాగోగులు చూస్తున్నారు. రెండు రోజులు గడిచినా ఎవరూ రాకపోవడంతో వైద్యశాల ఆర్ఎంవో డాక్టర్ సురేష్కుమార్, స్టాఫ్ నర్స్ రజియా.. త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శిశువుకు అన్ని పరీక్షలు చేసి ఆరోగ్యంగానే ఉన్నాడని డాక్టర్ సురేష్ పోలీసులకు స్పష్టం చేశారు. ఎస్ఐ జె. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును బుధవారం గుంటూరులోని చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ అధికారులకు అప్పగిస్తామని ఎస్ఐ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు త్రీ టౌన్ సీఐ ఎ. అశోక్కుమార్ను 94407 96274, తనను 99495 91299 నంబరులో సంప్రదించవచ్చని చెప్పారు. -
మానవత్వమా...నీవెక్కడ
పేగుబంధాలనే తెంచుకుంటున్నారు చేయని తప్పునకు చిన్నారులు బలైపోతున్నారు కలవరం రేపుతున్న వరుస సంఘటనలు సాక్షి, గుంటూరు: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే కాటేస్తున్నారు... మానవత్వం మరిచి పేగు బంధాన్ని సైతం తెంచుకుంటున్నారు.. కామంతో కళ్ళు మూసుకు పోయి కన్నబిడ్డలపైనే అత్యాచారాలకు తెగబడుతున్నారు... పేగుతెంచుకుపుట్టిన బిడ్డలనే కర్కశంగా రోడ్లపై, వాగుల్లో విసిరి పడేస్తున్నారు.. జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనలు అందరి మనస్సులను కలచివేస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే పరిస్థితి ఏస్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. నరసరావుపేట మండలం ఉప్పలపాడు వాగులో ఆదివారం ఉదయం మూడు రోజుల వయస్సు ఉన్న ఇద్దరు ఆడశిశువులు విగతజీవులై పడిఉన్నారు. వీరిద్దరూ కవలలు కావడం గమనార్హం. అమ్మ పొత్తిళ్లల్లో ఒదిగి పడుకోవాల్సిన పసికందులు కాలువలో నిర్జీవంగా పడిఉండటం చూసిన వారికి కంట నీరు ఆగలేదు. సంబంధం లేని వ్యక్తులే అయ్యోపాపం అంటూ నిట్టూరుస్తుంటే ... నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి వారిని విసిరిపడేయడానికి మనస్సు ఎలా ఒప్పిందంటూ అక్కడి వారు శాపనార్థాలు పెడుతున్నారు. అభం శుభం తెలియని ఇద్దరు పసికందులు ఇలా మృతువాతపడడం అందరి హృదయాలను కలిచి వేసింది. గతనెలలో గుంటూరు నగరంలో భార్యపై అనుమానంతో భార్యను, కన్న బిడ్డలను హతమార్చి రైలు కిందపడేసిన సంఘటన అందరిని కంటతడిపెట్టించింది. పట్టణానికి చెందిన రమేష్ అనే వ్యక్తి భార్య నాగలక్ష్మితోపాటు, బిడ్డలు యశ్వంత్ (3), క్రినిష్ (1)లను అతికిరాతకంగా గొంతునులిమి హతమార్చి వారి మృతదేహాలను రైలు పట్టాలపై పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే విషయం బయటకు రావడంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. భార్యపై అనుమానంతోనే మొత్తాన్ని హతమార్చినట్లు పోలీసులకు చెప్పడం గమనార్హం.ఏడాదిన్నర బిడ్డను జీజీహెచ్ఎదుట ఓ తల్లి వదిలి వెళితే ... చిన్నారి ఏడుపు విని అక్కున చేర్చుకోవాల్సిన ఓ వృద్ధురాలు బిడ్డను రూ. వెయ్యిలకు అమ్మజూపిన వైనం నగరంలో పదిరోజుల క్రితం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు గమనించి వృద్ధురాలితోపాటు, చిన్నారిని పోలీసులకు అప్పగించడంతో ఆబాలుడు చైల్డ్ హెల్ప్లైన్కు చేరాడు. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ మనస్సులేని తండ్రి. సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనికి చెందిన కసాయి ఈనెల 22వ తేదీన రాత్రి 7.30 గంటల సమయంలో పూటుగా మద్యం సేవించి కళ్లు మూసుకుపోయి తనకు పుట్టిన ఎనిమిదేళ్ళ కుమార్తెపైనే అతికిరాతకంగా అత్యాచారానికి తెగబడ్డాడు. తల్లి మహంకాళ్లమ్మ ఫిర్యాదుతో కిరాతక తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. -
బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చంటిబిడ్డ మాయం