సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లోని ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పను నియమించనున్నారు. ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఓబీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా నిమ్మలను నియమిం చాలని ప్రధానిని కోరినట్లు టీడీ పీ వర్గాల సమాచారం. గతంలో ఈ పదవిని ఎంపీ దత్తాత్రేయ నిర్వహించారు. ఆయన్ను కేంద్ర కేబినెట్లోకి తీసుకున్న నేపథ్యంలో నిమ్మల పేరును బాబు సూచించినట్లు తెలిసింది.