ఏసీబీ వలలో అవినీతి చేప | Officer caught taking Bribe | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి చేప

Published Thu, May 14 2015 4:46 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Officer caught taking Bribe

హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణమూర్తి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హన్మకొండ పీఏసీఎస్ వైస్‌ చైర్మన్ కంకల సదానందం నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ చిక్కాడు. పీఏసీఎస్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు సదానందంను కృష్ణమూర్తి రూ.2 లక్షలు లంచం అడిగాడు. సదానందం ఇంతకు ముందే రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.50 వేలు కూడా ఇచ్చేందుకు సదానందం సిద్ధమయ్యగా.. మరో పదివేల రూపాయలు అదనంగా ఇవ్వాలని కృష్ణమూర్తి డిమాండ్ చేయడంతో సదానందం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ పధకం ప్రకారం ఆయన నివాసంలో లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడ్ని జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement