పెన్షన్ల లిస్టులో తన పేరులేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఓ విషాద ఘటన యాదగిరిగుట్ట మండలం దాసరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాలయ్య అనే 80ఏళ్ల వృద్ధుడు పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పంచాయతీ వద్ద అంటించిన లిస్టులో తన పేరులేదని తెలిసి ఆవేదన చెందడంతో ఒక్కసారిగా గుండెనొప్పివచ్చింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు.