Gram Panchayat
-
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
నలభై ఏళ్లుగా మద్యానికి దూరం.. కాట్రేవ్
చౌటుప్పల్ రూరల్: ఇప్పుడు ఏ పల్లెలో చూసినా బెల్ట్ షాపుల జోరుతో మద్యం ఏరులై పారుతోంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కాట్రేవ్ గ్రామంలో మాత్రం మద్యం జాడే కనిపించదు. గ్రామంలో నాలుగు దశాబ్దాలుగా సంపూర్ణ మద్య నిషేధం అమలవుతోంది. అప్పట్లో గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటును ఇప్పటికీ కొనసాగిస్తూ.. తమ ప్రత్యేకతను నిలుపుకొంటున్నారు కాట్రేవ్ గ్రామ ప్రజలు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని గ్రామాల్లోనూ కొన్నేళ్లు మద్యం విక్రయాలు, వినియోగంపై నిషేధం పెట్టుకోవడం గమనార్హం. కాట్రేవ్లో అయితే సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోంది.గ్రామ యువత కూడా దూరమే..కాట్రేవ్ గ్రామం ఒకప్పుడు ఆరెగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ఐదేళ్ల కింద నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. సుమారు 700కుపైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో అంతా రైతులే. రోజంతా వ్యవసాయ పనుల్లో మునిగిపోతారు. సాయంత్రానికి ఇంటికొచ్చి సేదతీరుతారే తప్ప మద్యం జోలికి వెళ్లరు. ఈ గ్రామం నుంచి బయట పట్టణాల్లో ఉద్యోగం, ఉపాధి, చదువు కోసం వెళ్లిన యవత కూడా.. ఈ గ్రామానికి ఎప్పుడూ మద్యం తీసుకురారు. ఇక్కడ వినియోగించరు. మద్య నిషేధమేకాదు.. అభివృద్ధిలోనూ కాట్రేవ్ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. పక్కనే ఉన్న దివిస్ పరిశ్రమ అందించే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)’ నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్రతి ఇంటికి శుద్ధిచేసిన సురక్షిత నీరు అందించేలా ఏర్పాటు చేసుకున్నారు. పక్కనే ఉన్న ఆరెగూడెంలోనూ రెండు దశాబ్దాలుగా మద్యం విక్రయాలు లేవు.గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామస్తుల సహకారంతోనే కొనసాగిస్తున్నా..నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ గ్రామంలో మద్యపానం అలవాటు లేదు. 40 ఏళ్ల కింద పెద్దలు పెట్టుకున్న కట్టుబాటును.. గ్రామస్తుల సహకారంతో కొనసాగిస్తున్నాం. అభివృద్ధిలోనూ ముందుకెళ్తున్నాం.– బచ్చ రామకృష్ణ మాజీ సర్పంచ్, కాట్రేవ్ -
ఈ ఊరు మాది.. అందరూ ఖాళీ చేయండి!
కిషోర్కుమార్ పెరుమాండ్ల, మహబూబ్నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్ఖాన్దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా.. చమన్ఖాన్దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్ఖాన్దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు. భూమి మొత్తం మాదేనంటూ.. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్కు వినతిపత్రం అందజేశారు. మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?! గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఊరొదిలి పొమ్మంటే ఎలా? నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది? – భీమయ్య గ్రామకంఠం కిందే ఉంది.. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – ఆంజనేయులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం చమన్ఖాన్దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, గద్వాల -
చిన్నపల్లెపై చిన్నచూపు!
ఊరిలో 108 మంది జనాభా... 69 మంది ఓటర్లు.. ప్రాథమిక పాఠశాల.. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురే విద్యార్థులు.. ఒక్కరే మాస్టారు.. ఊరికి ఒకవైపు కిన్నెరసాని, మరో వైపు వాగులు.. వర్షాకాలమైతే ఊరు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమీపంలోని కాస్త పెద్ద ఊరికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్ల మేర గతుకులు, బురద రోడ్డు దాటాలి. ఇది దాటేందుకు కనీసంగా గంటన్నర సమయం పడుతుంది. గుండెపోటుకు గురైతే రోడ్డు దాటే లోపు మృత్యువాత పడటమే.. అసలు ఇంతవరకు అంబులెన్స్ ఆ గ్రామానికి ఒక్క సారి కూడా రాలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీ ‘దొంగతోగు’ దుస్థితి ఇది. గ్రామంలో మద్యం విక్రయాలు లేకుండా అంతా ఏకతాటిపై ఉన్న ఆ ఏజెన్సీ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోగు గ్రామ పంచాయతీ దయనీయ స్థితిపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.. (సాక్షిప్రతినిధి, ఖమ్మం) : పాలనా సౌలభ్యం కోసం గుండాల గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న దొంగతోగు 2018లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. కేవలం 80 మంది జనాభా, 35 మంది ఓటర్లతో రాష్ట్రంలోనే అతి చిన్న గ్రామ పంచాయతీగా ఏర్పాటైనా నేటికీ సమస్యలు సమసిపోలేదు. తొలి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచినా ప్రభుత్వ ప్రోత్సాహకం మాత్రం అందలేదు. వర్షం వస్తే కిన్నెరసానికి వరదతో వాగులు.. వంకలు పొంగిపొర్లడం, కనీస రహదారి సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలు అక్కడ నిత్యకృత్యం. మండల కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరం గుండాల నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు కాగా, ఆళ్లపల్లికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వాగులు పొంగిపొర్లితే ఇక్కడికి చేరుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆళ్లపల్లి మండలంలో ఈ గ్రామాన్ని కలిపినా దూరాభారంతో ఆ మండల కేంద్రం వైపు కూడా గ్రామస్తులు వెళ్లడం లేదు. పాలనా కేంద్రంగా బడి.. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ భవనంలోనే అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఐటీడీఏ నుంచి రూ.16 లక్షలు మంజూరైనా ఇప్పటికీ పునాది పడలేదు. దీంతో పాఠశాల భవనంలోనే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే ఈ బడికి చేరుకునేందుకు ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు సాహ సం చేయాల్సిందే. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు కూడా రాకపోవడంతో ఆ పల్లె అభివృద్ధికి నోచుకోలేదు. మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించినా వరదలతో పైపులైన్లు ధ్వంసమై ఏడాదిగా గ్రామానికి తాగునీరు రావడం లేదు. ఆరు కిలోమీటర్లు.. అవస్థలు.. దొంగతోగు సమీపంలోని ముత్తాపురం నుంచి ఇక్కడికి ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే వర్షం వస్తే పొంగే వాగులు, వంకలు, గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. గ్రామం నుంచి గర్భిణులు, అస్వస్థతకు గురైన వారు వైద్యం కోసం గుండాల ఆస్పత్రికి వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. రెండు నెలల క్రితం గుండె పోటుకు గురైన ఓ వ్యక్తిని ఈ దారిలో ట్రాక్టర్పై గుండాలకు, అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లే సరికే మృతి చెందాడు. రోడ్డు లేకపోవడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబులెన్స్ రాలేదు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధుల కింద ఆరు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనా అటవీ శాఖ అనుమతి లభించలేదు. ఇటీవల రెండు కిలోమీటర్లకు అనుమతి రాగా, పనులు ప్రారంభమయ్యాయి. మద్యం అమ్మకుండా.. గ్రామంలో 27 కుటుంబాలున్నాయి. అంతా పోడు వ్యవసాయం చేస్తుంటారు. వర్షాధారంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది పంటలు సేద్యమవుతున్నాయి. పోడు పట్టాలు రావడంతో వారి ఖాతాల్లో వానాకాలం రైతుబంధు డబ్బు పడింది. ఆదివాసీ కుటుంబాలన్నీ ఏకగ్రీవంగా సర్పంచ్ని ఎన్నుకున్నట్లే.. గ్రామంలో మద్యం అమ్మకూడదని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్, నలుగురు వార్డు సభ్యులు ఉన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు వస్తుండడంతో సందడి నెలకొనాల్సిన ఈ గ్రామంలో పాత కష్టాలే కళ్లముందు కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్త పంచాయతీ అయితే రోడ్డు, మంచినీటి వసతి, కొత్త పంచాయతీ భవనం వస్తాయనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. గ్రామ ప్రొఫైల్ ♦ గ్రామ పంచాయతీ: దొంగతోగు (రాష్ట్రంలో అతి చిన్నది) ♦ 2018లో గుండాల పంచాయతీ నుంచి వీడి నూతన పంచాయతీగా ఏర్పాటు. ♦ తొలుత 35 మంది ఓటర్లు ♦ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల జాబితా ప్రకారం 69 మంది ఓటర్లు. ♦ మొత్తం ఓటర్లలో పురుషులు 36, స్త్రీలు 33 మంది ♦ మొత్తం జనాభా : 108 మంది ♦ పురుషులు : 44, స్త్రీలు : 64 మంది రోడ్డే ప్రధాన ఇబ్బంది.. ముత్తాపురం నుంచి రోడ్డు పడితేనే మా గ్రామ సమస్యలు తీరుతాయి. పైపులైన్లు ధ్వంసం కావడంతో ట్యాంకు నుంచి మంచినీళ్లు రావడం లేదు. పంచాయతీకి ఇచ్చిన చిన్న ట్రాక్టర్ రిపేరు వచ్చినా చేయించలేకపోతున్నాం. నిధులు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. – కొమరం బాయమ్మ, సర్పంచ్, దొంగతోగు రోడ్డు ఉంటే ప్రాణం దక్కేది.. నా భర్త అక్టోబర్ 20న గుండెపోటుతో చనిపోయాడు. గుండె నొప్పి వస్తే బండి మీద గుండాల తీసుకెళ్లాం. అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అక్కడ వైద్యం పొందుతూ చనిపోయిండు. ఆరు కిలోమీటర్ల రోడ్డుపై గంటకు పైగా ప్రయాణించి గుండాల వేళ్లే సరికి నొప్పి ఎక్కువైంది. అదే రోడ్డు బాగుంటే త్వరగా ఆస్పత్రికెళ్తే ప్రాణాలు దక్కేవి. గర్భిణులను మొన్నటివరకు ఎడ్ల బండిపై తీసుకెళ్లారు. ఇప్పుడు ట్రాక్టర్లలో ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. –పూణె అనంతలక్ష్మి, దొంగతోగు -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్కాల్కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్: వీరమ్మాళ్ @ 89
‘సేవకు వయసుతో పని ఏమిటి?’ అంటోంది 89 సంవత్సరాల వీరమ్మాళ్. ఈ బామ్మ తమిళనాడులోని అరిట్టపట్టి గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్. రకరకాల కార్యక్రమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరమ్మాళ్ తన ఆరోగ్య రహస్యం ‘నిరంతర కష్టం’ అంటోంది... మామూలుగానైతే బామ్మల మాటల్లో ‘మా రోజుల్లో’ అనేది ఎక్కువగా వినబడుతుంది. అది ఆ వయసుకు సహజమే కావచ్చుగానీ 89 సంవత్సరాల వీరమ్మాళ్ ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. నలుగురితో కలిసి నడుస్తుంది. వారి కష్టసుఖాల్లో భాగం అవుతుంది. వీరమ్మాళ్ విలేజ్ ప్రెసిడెంట్గా ఉన్న మధురైలోని అరిట్టపట్టి గ్రామాన్ని తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర తొలి బయో డైవర్శిటీ సైట్గా ఎంపిక చేసింది. అరిట్టపట్టిలో పుట్టి పెరిగి అక్కడే వివాహం అయిన వీరమ్మాళ్కు ఆ గ్రామమే ప్రపంచం. అలా అని ‘ఊరి సరిహద్దులు దాటి బయటకు రాదు’ అనే ముద్ర ఆమెపై లేదు. ఎందుకంటే గ్రామ సంక్షేమం, అభివృద్ధి కోసం ఉన్నతాధికారులతో మాట్లాడడానికి పట్టణాలకు వెళుతూనే ఉంటుంది. ‘ఫలానా ఊళ్లో మంచిపనులు జరుగుతున్నాయి’ లాంటి మాటలు చెవిన పడినప్పుడు పనిగట్టుకొని ఆ ఊళ్లకు వెళ్లి అక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తుంటుంది. తన గ్రామంలో అలాంటి కార్యక్రమాలు అమలయ్యేలా కృషి చేస్తుంటుంది. ‘స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం’ అనే మాట గట్టిగా వినిపించని రోజుల్లోనే స్వయం–సహాయక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేది. రైతులకు వ్యవసాయ రుణాలు అందేలా ఆఫీసుల చుట్టూ తిరిగేది. మహిళలు గడప దాటి వీధుల్లోకి వస్తే... ‘ఇదేం చోద్యమమ్మా’ అని గుసగుసలాడుకునే కాలం అది. వీరమ్మాళ్ మాత్రం గ్రామంలోని రకరకాల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఊళ్లు తిరిగేది. ఎవరు ఎలా మాట్లాడుకున్నా పట్టించుకునేది కాదు. ఆమె దృష్టి మొత్తం సమస్యల పరిష్కారంపైనే ఉండేది. విలేజ్ ప్రెసిడెంట్గా వాటర్ ట్యాంకులు, వాగులు దాటడానికి వంతెనలు నిర్మించింది. జల్ జీవన్ మిషన్ కింద ఎన్నో ఇండ్లకు తాగునీరు అందేలా చేసింది. వీధిలైట్ల నుంచి వీధుల పరిశుభ్రత వరకు అన్నీ దగ్గరి నుంచి చూసుకుంటుంది. అలా అని ఊళ్లో అందరూ వీరమ్మాళ్కు సహకరిస్తున్నారని కాదు. ఎవరో ఒకరు ఏదో రకంగా ఆమె దారికి అడ్డుపడుతుంటారు. వారి నిరసన వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంటుంది. అలాంటి వారికి వీరమ్మాళ్ తరపున గ్రామస్థులే సమాధానం చెబుతుంటారు. గ్రామంలో వృథాగా పడి ఉన్న భూములను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంపై దృష్టి పెట్టింది వీరమ్మాళ్. ‘పనికిరాని భూమి అంటూ ఏదీ ఉండదు. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా, వృథాగా వదిలేస్తున్నామా అనే దానిపైనే ఆ భూమి విలువ ఆధారపడి ఉంటుంది’ అంటుంది వీరమ్మాళ్. ‘వీరమ్మాళ్ అంకితభావం గురించి ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. గ్రామ అభివృధ్ధికి సంబంధించి ఎంతోమందికి ఆమె స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు అరిట్టపట్టి విలేజ్ ఫారెస్ట్ కమిటీ హెడ్ ఆర్’ ఉదయన్. రోజూ ఉదయం అయిదు గంటలకు నిద్ర లేచే వీరమ్మాళ్ వంటపని నుంచి ఇంటి పనుల వరకు అన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. పొలం పనులకు కూడా వెళుతుంటుంది. ‘బామ్మా... ఈ వయసులో ఇంత ఓపిక ఎక్కడిది?’ అని అడిగితే– ‘నా గ్రామం బాగు కోసం నా వంతుగా కష్టపడతాను... అని అనుకుంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. అదే శక్తిగా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దేవుడు నన్ను ఈ భూమి మీది నుంచి తీసుకుపోయే లోపు గ్రామ అభివృద్ధి కోసం నేను కన్న కలలు సాకారం కావాలని కోరుకుంటున్నాను’ అంటుంది వీరమ్మాళ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుప్రియ సాహు అరిట్టపట్టి గ్రామానికి వచ్చి బామ్మను కలుసుకుంది. ‘వీరమ్మాళ్ బామ్మతో మాట్లాడడం, ఆమె నోటి నుంచి గ్రామ అభివృద్ధి ప్రణాళికల గురించి వినడం అద్భుతమైన అనుభవం’ అంటుంది సుప్రియ. -
18న ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నా
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల సాధనకు పది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సోమవారం నుంచి తీవ్రం చేయాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయపార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ (సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్టీయూలతో కూడిన) శనివారం నిర్ణయించింది. అలాగే 20న సమ్మె పరిష్కరించాలంటూ అన్ని గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేయాలని, 21న కలెక్టరేట్ల ముట్టడి చేపట్టాలని తీర్మానించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 21 తర్వాత నీరు, కరెంట్, వీధి దీపాలు సహా అన్ని అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరించింది. డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఈనెల 6న ప్రారంభించిన సమ్మె నేటికి పదో రోజుకు చేరనుంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో వివిధ కేటగిరీల్లో 50 వేల మంది పనిచేస్తున్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయడంతోపాటు పీఆర్సీలో నిర్ణయించినట్టు రూ.19 వేలు కనీస బేసిక్ పే ఇవ్వాలని, అప్పటిదాకా స్వీపర్లకు రూ.15,600, పంప్ ఆపరేటర్లు, ఎల్రక్టీషియన్లు, డ్రైవర్లు, కారోబార్, బిల్ కలెక్టర్లకు రూ.19,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పది రోజులుగా సమ్మె చేస్తున్నా జేఏసీని ప్రభుత్వం చర్చలకు పిలవకపోగా సమ్మెను నీరుగార్చేందుకు పోటీ కార్మికులను నియమించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్ ఆరోపించారు. -
అనుమతులకు అష్టకష్టాలు... ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మహబూబ్నగర్ న్యూటౌన్: గ్రామాల్లో ఇంటి నిర్మాణ అనుమతులకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా.. పాత ఇంటిని పునర్నిర్మించుకోవాలన్నా.. అనుమతులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంతకాలం గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉన్న అనుమతుల ప్రక్రియ ప్రస్తుతం టీఎస్బీపాస్ పరిధిలోకి వెళ్లింది. దీంతో అనుమతులు తీసుకునే విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. టీఎస్ బీపాస్లో ఇంటి నిర్మాణ అనుమతుల కోసం మీసేవా కార్యాలయంలో గాని లేదా సిటిజన్ లాగిన్లో గాని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విధానం ఇంకా గ్రామీణ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. గతంలో ఈ పంచాయతీ ద్వారా అనుమతుల ప్రక్రియను సులువుగా నిర్వహించుకునేవారు. టీఎస్బీపాస్ వచ్చాక ఈ పంచాయతీ పోర్టల్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో టీఎస్బీపాస్ విధివిధానాలపై అవగాహన లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. తద్వారా గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతోపాటు ఆయా నిర్మాణా లకు సంబంధించి ఇంటి నంబర్లు, నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా కొత్తగా నిర్మాణం చేపట్టే ఇళ్ల విషయంలో ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా గ్రామ పంచాయతీలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. ముడా పరిధిలో.. ఇదిలా ఉండగా మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులను ఎలా తీసుకోవాలో అధికారులకు సైతం స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇళ్ల నిర్మాణాలకు తీసుకోవాల్సిన అనుమతులు సైతం టీఎస్బీపాస్లో దరఖాస్తు చేయాలి. అయితే అనుమతుల ప్రక్రియ మూడు కేటగిరీలలో జరగాల్సి ఉంది. గ్రామ పంచాయతీ, ముడా, డీటీసీపీ పరిధిలో అనుమతుల ప్రక్రియ జరుగుతుంది. ఏ కేటగిరీలో ఎన్ని గజాల వరకు అనుమతులు ఇస్తారు.. అందుకు కావాల్సిన పత్రాలు ఏమేం కావాలి.. అనేదానిపై ఎవరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం. కార్యదర్శుల నిస్సహాయత టీఎస్బీపాస్ ద్వారా గ్రామాల్లో ఇంటి నిర్మాణ, ఇతర అనుమతుల ప్రక్రియపై గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇప్పటి వరకు శిక్షణ ఇవ్వకపోవడంతో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయతీ పోర్టల్ను ప్రభుత్వం నిలిపివేయడం, గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే అనుమతులన్నీ టీఎస్ బీపాస్ ద్వారానే తీసుకునేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు దారితీస్తోంది. మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ముడాలోకి వెళ్లిన గ్రామాలకు సంబంధించి అభివృద్ధి పనులు, అనుమతులు తదితర అంశాలపై పంచాయతీ కార్యదర్శులకు, సర్పంచ్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో మొత్తం 441 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మహబూబ్నగర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 143 గ్రామ పంచాయతీలు మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళ్లాయి. ఈ–పంచాయతీ పోర్టల్లో ఆప్షన్లు లేకపోవడం, టీఎస్ బీపాస్పై అవగాహన లేకపోవడం పంచాయతీల అభివృద్ధికి శాపంగా మారుతోంది. ముడా పరిధిలోకి వెళ్లిన గ్రామాల్లో ఇప్పటివరకు ముడా ఆధ్వర్యంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. ముడా ఏర్పాటై 16 నెలలు కావొస్తున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. త్వరలో శిక్షణ ఇస్తాం ముడా పరిధిలోకి వచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇస్తాం. ఆయా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, రికార్డుల నిర్వహణ, అనుమతులు వంటి అశాలపై అవగాహన కల్పిస్తాం. ముడా సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. – మజీద్, ముడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ -
ఆర్బీకేల పనితీరు బాగుంది
భీమడోలు: రైతులకు అనేక రకాల సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాల పనితీరు బాగుందని స్వచ్ఛ భారత్ మిషన్ సంయుక్త కార్యదర్శి, జలశక్తి శాఖ డైరెక్టర్ జితేంద్ర శ్రీవాత్సవ కొనియాడారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కార్యక్రమంలో పారిశుధ్య పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా భీమడోలు, దుద్దేపూడి గ్రామ పంచాయతీలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ జె. వెంకట మురళీతో కలిసి జితేంద్ర శ్రీవాత్సవ సందర్శించారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుతీరును సంబంధిత అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులపై హౌసింగ్ అధికారులను అడిగారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సచివాలయ వ్యవస్థలోని ప్రతి విభాగం పనితీరు, అది ఏ విధంగా ఉపయోగపడుతున్నదీ వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొలుత సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, మత్స్యశాఖ సహాయకులు, ఇంజనీరింగ్ శాఖల సహాయకులు జాబ్చార్ట్తో పాటు వారు చేసే సేవలపై ఆరా తీశారు. మంచి స్పర్శ.. చెడు స్పర్శ (గుడ్ టచ్.. బ్యాడ్ టచ్) కార్యక్రమంపై నువ్వేం చేస్తావు.. అంటూ మహిళా కానిస్టేబుల్ని ప్రశ్నించగా.. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలుచేస్తోందని, తాను ఉన్నత పాఠశాలల బాలికలు, కళాశాలల్లో యువతులు, డ్వాక్రా మహిళలకు దీనిపై విస్తృత ప్రచారం చేస్తూ అవగాహన కలి్పస్తున్నానని ఆమె తెలిపింది. కియోస్క్ పనితీరుపై ఆరా.. ఆ తర్వాత రైతుభరోసా కేంద్రంలోని కియోస్క్ యంత్రాన్ని చూసిన ఆయన వీఏఏ (విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్) రూప నుంచి ఈ యంత్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆరా తీశారు. కియోస్క్ యంత్రంలో రైతులు తమకు కావాల్సిన ఎరువులను బుక్ చేసుకుంటారని, వాటి నగదును చెల్లిస్తే రైతుల చెంతకే ఎరువులు చేరుకుంటాయని ఆమె వివరించారు. రైతులకు మద్దతు రేటుకే అందుబాటులో ఉంటున్నాయని, ఈ విధానంలేని తరుణంలో రైతులు దళారుల వద్ద ఎక్కువ రేటుకు కొనుగోలు చేసుకునేవారని ఎండీ జె. వెంకటమురళి ఆయనకు వివరించారు. అక్కడే ఉన్న సర్పంచ్ పాము సునీతామాన్సింగ్ను కియోస్క్ యంత్రం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతోందని ప్రశ్నించారు. ఆర్బీకే సేవలవల్ల రైతులు సంతృప్తికరంగా ఉన్నారని, ఈ విధానం లేనప్పుడు రైతులు సాగుకు తీవ్ర ఇబ్బందులు పడేవారని సర్పంచ్ వివరించారు. దీంతో రైతుభరోసా కేంద్రాల పనితీరు బాగుందని, రైతులకు సంతృప్తికరమైన సేవలు అందుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో జితేంద్ర శ్రీవాత్సవ మొక్కలు నాటారు. నూజివీడు సబ్కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ఈడీ ఊరి్మళాదేవి, జెడ్పీ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్, డీపీఓ ఏవీ విజయలక్షి్మ, ఎంపీపీ కనమాల రామయ్య, జెడ్పీటీసీ తుమ్మగుంట భవానీరంగ, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Karnataka assembly election 2023: ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.కోటి
సాక్షి, బళ్లారి: కర్ణాటకలో అధికారంలోకి వస్తే ప్రతి గ్రామ పంచాయతీకి రూ.కోటి, కళ్యాణ కర్ణాటక ప్రాంతాభివృద్ధికి రూ.5,000 కోట్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శుక్రవారం కలబురిగి జిల్లాలోని జేవర్గీ సభలో హోరు వానలోనూ రాహుల్ ప్రసంగించారు. ‘బళ్లారిలో రూ.5,000 కోట్లతో వస్త్ర పరిశ్రమను తెస్తాం. జిల్లాను ప్రపంచ జీన్స్ హబ్గా, జీన్స్ రాజధానిగా మారుస్తాం. 50 వేల ఉద్యోగాల భర్తీని పూర్తిచేస్తాం’ అని అన్నారు. ‘ప్రతీ పనికి కాంట్రాక్టర్ల నుంచి మంత్రులు 40 శాతం కమిషన్ గుంజారు. ఈ ప్రభుత్వ దోపిడీతో బళ్లారి ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు’’ అని ఆరోపించారు. తాము 150 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తంచేశారు. -
Telangana: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండింది. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్కు సంబంధించి 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్కు సంబంధించి 5 పురస్కారాలు సాధించి రాష్ట్రం సత్తా చాటింది. దీన్దయాళ్ పురస్కారాల్లో 9 కేటగిరీల్లోని 27 అవార్డులకుగాను 8 అవార్డులు సాధించి రాష్ట్రాలవారీగా అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు పంచాయతీలు తొలి ర్యాంకు సాధించగా మరో రెండు పంచాయతీలు రెండో ర్యాంకు, ఇంకో రెండు పంచాయతీలు మూడో స్థానంలో నిలిచాయి. అలాగే నానాజీ పురస్కారాల్లో 7 కేటగిరీలకుగాను ఐదు (వాటిలో ఒకటి ప్రథమ స్థానం) అవార్డులు లభించాయి. తెలంగాణ వివిధ కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపికైన విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆర్థిక సలహాదారు డాక్టర్ బిజయకుమార్ బెహరా ఓ లేఖ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి తెలియజేశారు. ఈ నెల 17న ఢిల్లీ విజ్ఞాన్భవన్లో జరిగే ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్సెంటివైజేషన్ ఆఫ్ పంచాయత్స్ కమ్ అవార్డ్ సెర్మనీ’లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. మార్కుల ఆధారంగా ర్యాంకులు.. ఏటా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందిస్తోంది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా, ఆన్లైన్లో పంచాయతీల ద్వారా నామినేషన్లను తీసుకొని 9 అంశాల్లో (థీమ్లలో) ఉత్తమ గ్రామ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ప్రకటిస్తోంది. అయితే ఈ ఏడాది నుంచి అవార్డులను 9 అంశాల్లో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడవ బహుమతులుగా అవార్డులు ఇస్తోంది. ఇందులో ప్రతి అంశానికి వంద మార్కులకు సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాల్లో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో ఉత్తమ పంచాయతీలను ప్రకటిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి, ఆయన బృందానికి అభినందనలు సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లెప్రగతి కార్యక్రమాల అమలు వల్లే రాష్ట్రానికి ఈ ఘనత లభించిందని, తెలంగాణను అవార్డులు వరించాయని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు ఆయన బృందాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇందుకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేశారు. అవార్డులు రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (సెకండ్ ర్యాంకు) ► ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (థర్డ్ ర్యాంకు). ► కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (సెకండ్ ర్యాంకు) ► గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (ఫస్ట్ ర్యాంకు) దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 ► ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (ఫస్ట్ ర్యాంకు) ► తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (ఫస్ట్ ర్యాంకు) ► సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్పల్లి (ఫస్ట్ ర్యాంకు) ► స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (ఫస్ట్ ర్యాంకు) ► పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (సెకండ్ ర్యాంకు) ► సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం చీమల్దారి (సెకండ్ ర్యాంకు) ► క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్పూర్ (థర్డ్ ర్యాంకు) ► స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం గంభీర్రావుపేట (థర్డ్ ర్యాంకు) చదవండి: హైదరాబాద్కు ప్రధాని మోదీ.. తెలంగాణలో వేడెక్కిన రాజకీయం -
దీపావళి కానుకగా ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన పర్యాటక మంత్రి
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆనంద్ సింగ్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు గిఫ్ట్ బాక్సులను పంపారు. ఐతే మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్లో రూ. లక్ష రూపాయలు నగదు, 144 గ్రాముల గోల్డ్, 1 కేజీ వెండి, సిల్క్ చీర, ధోతీ, డ్రై ఫ్రూట్ బాక్స్ ఉన్నాయి. కానీ గ్రామ పంచాయతీ సభ్యులకు పంపిన గిఫ్ట్ బాక్స్లో తక్కువ మొత్తంలో నగదు, బంగారం తప్పించి అన్ని ఇతర వస్తువులు ఉండటం గమనార్హం. (చదవండి: ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!) -
ఎల్ఈడీ వీధిలైట్లపై వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై కొన్ని పంచాయతీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటుకు సంబం ధించి బలవంతంగా తీర్మానాలు చేయించేందుకు ప్రయత్నించడంపై కొన్ని గ్రామాల సర్పంచ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పంచాయతీకి అవసరమనుకుంటే తీర్మానం చేస్తుంది తప్ప.. తీర్మానాలు చేయాల్సిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యా లయం ఆదేశాలివ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా తీర్మానాలు చేసేందుకు కొందరు సర్పంచ్లు నిరాకరిస్తున్నారు. ఎల్ఈడీ వీధిదీపాల విషయమై ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, తదితర జిల్లాల్లో సర్పంచ్ల సంఘాలు సమావేశాలు నిర్వహించినప్పుడు వ్యతిరేకత వ్యక్తమైనట్టు సమాచారం. బలవంతపు తీర్మానాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాలని, ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేపట్టాలనే ఆలోచనలో సర్పంచ్లు ఉన్నారు. తక్కువ ఖర్చయ్యే వ్యవస్థగా మార్చేందుకు.. విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా గ్రామాల్లోని సంప్రదాయ వీధి దీపాలను విద్యుత్ తక్కువ ఖర్చయ్యే ఎల్ఈడీ వీధిదీపాల వ్యవస్థగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిద్వారా వీధి దీపాల నిర్వహణ వ్యయం తగ్గి పంచాయతీలపై భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ ప్రాజెక్ట్ అమ లుకు ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీల నెలవారీ గ్రాంట్ల నుంచి ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)æ సంస్థకు బకాయిలు చెల్లించేలా తీర్మానాలు చేయాల ని సూచించింది. ఈ మేరకు ఆమోదం తెలు పుతూ పంచాయతీలు వెంటనే తీర్మానాలు చేసేలా చూడాలంటూ జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవోలు) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది« శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. దీంతో డీపీవోలు తీర్మానాల కోసం సర్పంచ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాక సంబంధి త డీపీవోలు ఈఈఎస్ఎల్ సంస్థతో ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంది. అయితే ఎల్ఈడీ దీపాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీలు వీటి ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వీధిదీపాల నిర్వహణ బాధ్యతను తమ నుంచి తప్పించి మరొక సంస్థకు అప్పగించే ప్రయత్నాలపై సర్పంచ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఈడీ వ్యవస్థతో ఇబ్బందులు పంచాయతీల్లో ఎల్ఈడీ లైట్లు పెట్టాలంటూ రెండేళ్ల క్రితమే ఒత్తిడి తెచ్చారు. కానీ మేము ఒప్పుకోలేదు. తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పుడు మళ్లీ తీర్మానాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి కూడా మేము అంగీకరించేది లేదు. మున్సిపాలిటీలకు, పంచాయతీలకు వీధిలైట్ల నిర్వహణ, తదితరాల్లో తేడాలుంటాయి. ఎల్ఈడీల నిర్వహణ బాధ్యత అప్పగించే సంస్థ ఆఫీసులు జిల్లా కేంద్రాల్లో ఉంటాయి. ఏదైనా సమస్య తలెత్తితే సకాలంలో మరమ్మతులు చేయడం కష్టమవుతుంది. ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – అంజనీప్రసాద్, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు -
మండల, జిల్లా పరిషత్లకూ ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోవడంతో నీరసించిన మండల పరిషత్లు, జిల్లా పరిషత్తులకు ఆర్థిక ఆసరా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ఏడాది పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసే నిధులలో 15 శాతం మండల పరిషత్లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్లకు, 70 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.2,625 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 660 మండల పరిషత్లకు రూ.393.75 కోట్లు అందనున్నాయి. 13 జిల్లా పరిషత్లకు మరో రూ.393.75 కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలకు రూ.1,837.5 కోట్లు జనాభా ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2015 నుంచి నిలిచిన నిధులు.. 2015 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్లకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా వంద శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయించారు. మండల, జిల్లా పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని కేంద్రం సూచించినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే విమర్శలున్నాయి. మరోవైపు పంచాయతీలకు నిధులు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో సర్పంచులు అధికారం చలాయించారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు నిధుల కేటాయింపుపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు 70 : 15 : 15 నిష్పత్తిలో నిధులు కేటాయించేందుకు రాష్ట్రం అనుమతి తీసుకుంది. ఈసారి మరో మెలిక.. పంచాయతీరాజ్ సంస్థలకిచ్చే నిధులలో 50 శాతం బేసిక్ గ్రాంట్స్ రూపంలో, మిగిలిన 50 శాతం టైడ్ గ్రాంట్స్ రూపంలో విడుదల చేయనున్నట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖలు రాసింది. బేసిక్ గ్రాంట్ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ కార్యక్రమాల అమలుకు వ్యయం ఆధారంగా టైడ్ గ్రాంట్స్ను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం లేఖలో స్పష్టం చేసింది. -
వీధులకు వాళ్ల పేర్లు.. ఎందుకంటే..
ఊళ్లలో కాని, పట్టణాల్లో కాని మనం ఉంటున్న వీధి పేర్లు ఎప్పటినుంచో ఉన్నవే. పైగా కొన్నింటి వీధుల పేర్ల చరిత్ర మనకు ఎంత మాత్రమూ తెలియదు. అయితే ఇప్పుడు గుజరాత్లోని కచ్ జిల్లాకు చెందిన కుక్మా గ్రామ పంచాయితీ వాళ్లు తమ పరిధిలోని వీధులకు ఓ ప్రత్యేకత తీసుకువస్తున్నారు. హిమాని మార్గ్, శివానీ మార్గ్, సోనాలి మార్గ్, రుచితా మార్గ్, భూమి మార్గ్, అశ్విని మార్గ్, గుల్జార్ మార్గ్, ఉర్వి మార్గ్, శిల్పా మార్గ్, కోమల్ మార్గ్, జియా మార్గ్, పాలక్ మార్గ్, కృపా మార్గ్, ఖుషి మార్గ్, హెన్షి మార్గ్, పూజా మార్గ్.. ఇలా తమ గ్రామాలకు చెందిన 16 మంది ప్రతిభావంతులైన కూతుళ్ల పేర్లను వీధులకు పెట్టబోతున్నారు. వీళ్లంతా చదువులో ప్రతిభ కనబరిచి, ఉద్యోగాలలో రాణిస్తూ ఇంటికి, ఊరికి పేరు తెచ్చినవారే. కుక్మా పంచాయతీ సర్పంచ్ కంకుబెన్ వాంకర్ 2018 సెప్టెంబరులో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ పదహారు మంది అమ్మాయిల పేర్లు పెట్టడానికి ఇటీవలే పంచాయతీ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్నీ ఆమోదించారు. కుక్మా పంచాయితీ.. కచ్ జోన్ ప్రధాన కార్యాలయమైన భుజ్ తహసీల్ పరిధిలోకి వస్తుంది. కచ్ జిల్లా మహిళా, శిశు అభివృద్ధి అధికారి గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ వల్ల స్ఫూర్తివంతమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే కుక్మా గ్రామ పంచాయితీ తీరుతెన్నులు తెలుసుకోవడానికి ఐదు జిల్లాల నుండి సర్పంచ్లు వచ్చారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలనే చేపట్టాలని, ఇది మహిళాభ్యున్నతికి తోడ్పడేలా ఉందని వారు కొనియాడారు. -
కేంద్రంతో సమానంగా... పంచాయతీలకు నిధులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు సమృద్ధిగా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వచ్చే బడ్జెట్లో పంచాయతీల అభివృద్ధికి రూ.2,714 కోట్లను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. దీంతో స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. గురువారం ఎంసీహెచ్ఆర్డీలో ‘కొత్త పంచాయతీరాజ్ చట్టం’పై అదనపు కలెక్టర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు కేటాయిస్తోందని, తద్వారా గ్రామ పంచాయితీలకు ప్రతీ నెల రూ.339 కోట్లు విడుదల చేస్తోందని తెలిపారు. దేశానికే ఆదర్శంగా రూ.45వేల కోట్లతో మిషన్ భగీరథను పూర్తి చేసి గ్రామాలకు శుద్ధమైన తాగు నీటిని అందిస్తున్నామని, తాగునీటి సరఫరా ఖర్చు భారం గ్రామపంచాయతీలపై వేయడం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేయాలనే.. పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర గ్రామీణ విధానాన్ని అమలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రంగా ఉండడంతోపాటు సమగ్ర అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో ‘పల్లె ప్రగతి’ని రూపొందించామని, మొదటి దశ స్ఫూర్తిని కొనసాగించే విషయంలో ఆశించిన మేరకు జరగలేదనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కూడా ఇలాగే ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్లు పల్లె ప్రగతి ఒరవడిని కొనసాగించడంలో చొరవచూపాలని పిలుపునిచ్చారు. వైకుంఠధామం, డంపింగ్ యార్డులు, ఇంకుడుగుంతలు, నర్సరీలు, హరితహారం, ఉపాధిహామీ పథకంలో నిధుల వినియోగం, దాతల విరాళాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ, మిషన్ భగీరథ నల్లాల పరిశుభ్రత, వా ల్టా అమలు, జరిమానాల విధింపుపై అదనపు కలెక్టర్లు పకడ్బందీగా వ్యవహ రించాలని ఆదేశించారు. సదస్సులో ఆ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ ఎం.రఘునందన్ రావు, స్పెషల్ కమిషనర్ సైదులు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ బెనహార్ దత్ ఎక్కా పాల్గొన్నారు. -
పన్ను చెల్లించండి బంగారం గెలవండి
ముంబై: పన్ను రాబడి పెంచుకోవడానికి మహారాష్ట్రలోని ఓ గ్రామం వినూత్న ప్రయోగం చేపట్టింది. వచ్చే సంవత్సరం మార్చి 15 లోపు గ్రామపంచాయతీ పన్ను బకాయిలు చెల్లిస్తే వారిని లక్కీడ్రాకు ఎంపిక చేస్తామని, లక్కీడ్రాలో వారు బంగారం గెలుపొందవచ్చని ప్రకటించింది. సంగ్లీ జిల్లా కడేగావ్ తాలూకాలోని వాంగీ అనే గ్రామపంచాయతీ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పన్ను బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లించిన వారి పేర్లతో లక్కీడ్రా తీస్తామని, లక్కీడ్రాలో తొలి రెండు స్థానాల్లో వచ్చినవారు 5 గ్రాములు, 3 గ్రాముల బంగారపు ఉంగరాలు, మూడో స్థానంలో నిలిచిన వారు 2 గ్రాముల బంగారు నాణెం గెలుచుకుంటారని తెలిపింది. ఈ పథకానికి మంచి స్పందన వస్తోందని వాంగీ గ్రామ సర్పంచ్ విజయ్ హన్మానే తెలిపారు. -
గ్రామాల్లో మిషన్ అంత్యోదయ సర్వే
సాక్షి, నిజామాబాద్: పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు, ఆ పల్లెల వికాసమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ అంత్యోదయ క్రింద ‘సబ్కీ యోజన సబ్కా వికాస్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో ప్రతి గ్రామ పంచాయతీ వారిగా కార్యదర్శులు 29 అంశాలలో సర్వే చేస్తున్నారు. నెలాఖరులోగా సమగ్ర సమాచారం సేకరించి ప్రత్యేక యాప్లో డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సర్వే తీరు తెన్నులపై ప్రత్యేక కథనం.. అన్ని శాఖల సమన్వయంతో.. కేంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలు, గ్రామ పంచాయతీల అభి వృద్ధే ధ్యేయంగా అడుగు వేస్తోంది. అందులో ప్రధానంగా పేదరిక నిర్మూలన, మౌళిక వసతు ల కల్పన, మెరుగైన రవాణా, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది. మరేమి అభివృద్ధి జరిగాలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో ప్రజల భాగస్వా మ్యం వంటి అంశాలను తెలుసుకోవడానికి మిషన్ అంత్యోదయ సర్వే చేపడుతుంది. ఇందు లో బాగంగా 29 అంశాలకు చెందిన సమగ్ర సమాచారం తెలిసేలా 146 ప్రశ్నలను రూపొందించారు. ఆయా ప్రశ్నల సమాధానాలతో మిషన్ అంత్యోదయ యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 1062 గ్రామ పంచాయతీల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. సేకరిస్తున్న అంశాలివే.. సర్వేను పార్ట్–ఏ, పార్ట్–బీ విభాగాలుగా విభజించి సర్వే చేస్తున్నారు. పార్ట్ ఏలో నియోజక వర్గం, జనాభా, గృహాలు వంటి ప్రాథమిక సమచారంతో మొదలయ్యే సర్వేలో వ్యవసాయం, చిన్న నీటి వనరులు, భూ అభివృద్ధి, పశుసంవర్థక, మత్స్య, ఇంటి నిర్మాణం, తాగునీరు, రహదారులు, విద్యుత్, సామాజిక ఆస్తుల వివరాలు, భూ వివరాలు, లైబ్రరీ, అందుబాటులో ఉన్న బ్యాంకులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, రవాణా, విద్యా సౌకర్యం, మార్కెటింగ్, ఆరోగ్యం, పారిశుధ్యం, మహిళా శిశు సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, ఖాదీ, చేనేత, పరిశ్రమలు, సామాజిక అటవీ విభాగంచిన్న తరహా పరిశ్రమలు మొదలైన అంశాలు, పార్ట్ బీలో నమోదు చేస్తున్నారు. సమగ్ర, సమాచార సేకరణలో పల్లె వికాసానికి మరేం చేయాలో స్పష్టత రానుంది. మిగిలింది 11రోజులే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1062 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,334 గ్రామాలు కలవు. డిసెంబర్ 16 నాటికి 856 గ్రామ పంచాయతీలు మిషన్ అంత్యోదయ యాప్ను డౌన్లోడ్ చేసుకోగా 73 గ్రామ పంచాయతీలు మాత్రమే సర్వేను పూర్తి చేశాయి. రూపొందించిన సర్వే ఆధారంగా గ్రామ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలి. గ్రామ కార్యదర్శులు పారదర్శకంగా సర్వే వివరాలు నమోదు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సర్వే నత్తనడకన కొనసాగుతోంది. కొందరు గ్రామ కార్యదర్శులు కూర్చున్నచోటు నుండే సెల్ఫోన్ ద్వారా సమాచారం సేకరించి నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంత మందికి అందుతున్నాయన్న సమాచారం కూడా పక్కాగా నమోదు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచాలి గ్రామ పంచాయతీల పరిధిలో 29 అంశాల్లో చేస్తున్న సర్వే ద్వారా ప్రతి గ్రామం యొక్క అభివృద్ధి వివరాలు తెలుస్తాయి. సర్వే వివరాలు గ్రామ సభ ముందుంచి చర్చించాలి. సర్వే వివరాలు పారదర్శకంగా నమోదు చేస్తే వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు పెట్టుకోవచ్చు. – పెద్ది మురళి, యుఎఫ్ ఆర్టీఐ జిల్లా కనీ్వనర్ -
అక్రమాలకు అడ్డు రేఖ
నడుస్తున్న జేసీబీని పట్టుకొని వేళ్లాడుతున్న ఒక మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజస్తాన్లోని మండావలాలో ఇది జరిగింది. అసలు విషయం ఏంటంటే.. మండావలా సర్పంచ్ పేరు రేఖా దేవి. అదే గ్రామానికి చెందిన వాఘా రామ్ అనే వ్యక్తి గ్రామ పంచాయతీకి చెందిన భూమిని ఆక్రమించుకున్నాడట. అప్పటి నుంచి సర్పంచ్ రేఖా దేవి అతని మీద ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం శూన్యం. వాఘా రామ్ ఆక్రమించుకున్న గ్రామ పంచాయతీ భూమిలో ఈ మధ్య అక్రమ కట్టడమేదో చేపట్టే పనిలోనూ పడ్డాడట. అందులో భాగంగానే జేసీబీ వాహనాన్ని తెచ్చి నిర్మాణపనులూ మొదలుపెట్టాడు. ఇది తెలిసిన రేఖాదేవి ఉన్నపళంగా అక్కడికి వచ్చి ఆ కట్టడాన్ని ఆపే ప్రయత్నంలో లోడర్ బకెట్ను పట్టుకుంది. అది గమనించి కూడా జేసీబీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ఆ లోడర్ను పైకెత్తాడు. దాంతో రేఖాదేవి దానికి వేలాడింది. డ్రైవర్ అక్కడితో ఆగకుండా వాహనాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా పరిగెత్తుకుంటూ వచ్చి రేఖాదేవిని పట్టుకొని కిందకు దిగడంలో సాయపడ్డారు. ‘‘డ్రైవర్ కావాలనే ఇలా చేశాడు. ముందు నా మీద నుంచి తీసుకెళ్లి తర్వాత నా వెహికిల్నూ ఢీ కొట్టాలనుకున్నాడు. ఆగస్టు నుంచి ఈ భూమి వాఘా రామ్ కబ్జాలో ఉంది. ఇప్పుడు దీంట్లో అక్రమ కట్టడానికీ సాహసిస్తున్నాడు’’ అని చెప్తున్న అతనికి రేఖాదేవి కొంతమేరకు అడ్డురేఖ గీసినట్లే అయింది. -
నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో..
రాజ్ఘర్/భోపాల్ : కులం కుంపటి నెత్తినబెట్టుకుని ఊరేగుతున్న కొందరు ‘పెద్ద మనుషులు’ కళ్లునెత్తికెక్కి ప్రవర్తించారు. దళితుడి చేతిలో అత్యాచారానికి గురైన కారణంగా.. తమకు విందు భోజనాలు ఏర్పాటుచేస్తేనే ఓ యువతి పవిత్రత పొందినట్లని తీర్పునిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. వివరాలు.. రాజ్ఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో దామోదర్ (పేరుమార్చాం) కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన కూతురు(16)పై ఓ దళిత యువకుడు గత జనవరిలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. అయితే, నిందితుడు తక్కువ కులంవాడు కావడంతో... యువతి మలినమైందని కుల పంచాయతీ పెద్దలు తేల్చారు. కులం మొత్తానికి విందు ఏర్పాటు చేసి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలని హుకుం జారీ చేశారు. అప్పటివరకు ఆ కుంటుంబాన్ని బహిష్కరిస్తున్నట్టు తీర్పు చెప్పారు. కూతురికి జరిగిన అన్యాయంపై ఓ పక్క ఆ తండ్రి ఆవేదనకు గురవుతోంటే... పంచాయతీ పెద్దల మతిలేని తీర్పు అతనికి మరింత భారమైంది. ఆర్థికస్థితి అంతంత మాత్రమే కావడంతో తామెలాంటి విందు ఇవ్వలేమని దామోదర్ వేడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళా శిశుసంక్షేమం అధికారులకు సమాచారం ఇచ్చాడు. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, తమ ప్రాథమిక విచారణలో దామోదర్ ఆరోపణలు నిజం కాదని తేలినట్టు పోలీసులు చెప్తుండటం గమనార్హం. -
పురపాలనలోకి శంషాబాద్
శంషాబాద్: అంతర్జాతీయ ఎయిర్పోర్టుతో ప్రపంచపటంలో చోటు సంపాదించుకున్న శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఆదివారం నుంచి పురపాలనలోకి అడుగులు పెట్టింది. అరవై ఏళ్ల గ్రామీణ పాలన శనివారంతో ముగిసింది. 1959 అక్టోబరు 29 శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమై 2019 ఏప్రిల్ 20 నాటికి ముగిసింది. అరవై ఏళ్ల వ్యవధిలో మొత్తం 8 మంది సర్పంచ్లుగా పనిచేశారు. ఇందులో మామిడి దయానంద్రెడ్డి 1970 నుంచి 1988 వరకు రికార్డు స్థాయిలో సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత కూడా మరో దఫా 1995 నుంచి 2001 వరకు ఐదేళ్ల పాటు శంషాబాద్ సర్పంచ్గా పనిచేశారు. అందరోని అబాదీగా.. శంషాబాద్ గ్రామాన్ని నిజాం పాలనలో అందరోని అబాదీగా పిలిచేవారని పూర్వీకులు చెబుతుంటారు. గ్రామానికి నాలుగు వైపులా గౌనీలు (పెద్ద ఎత్తున దర్వాజాలు) ఉండి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఆ తర్వాత నిజాం బంధువులైన శంషాద్బేగం పేరిట దీనిని శంషాబాద్గా మార్చినట్లు చరిత్ర చెబుతోంది. చారిత్రక కట్టాడాలకు నెలవు శంషాబాద్ చారిత్ర కట్టడాలకు నెలవైన ప్రాంతం. శంషాబాద్ పాత గ్రామంలో పాత పోలీస్స్టేషకు సుమారు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ కట్టడానికి ఇప్పటికే ‘హెరిటేజ్’ గుర్తింపు కూడా దక్కింది. నేటికీ ఠాణాగా ఈ భవనం సేవలందిస్తోంది. పాలరాతి కొండపై వెలిసిన చోళరాజుల కాలం నాటి సిద్దులగుట్ట దేవాయలం ఎంతో ప్రసిద్ధి చెందింది. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం కలిగితే పిల్లలకు సిద్దప్ప, సిద్దులు, సిద్దేశ్వర్ నామకరణ చేస్తూ ఉంటారు. శంషాబాద్తో పాటు పరిసర ప్రాంతాలో ఈ పేర్లతో వందల సంఖ్యల్లో ఉంటారు. శంషాబాద్ మొదటి సర్పంచ్ సిద్దప్ప అయితే.. చివరి సర్పంచ్ సిద్దేశ్వర్ కావడం కూడా ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఆలయానికి సమీపంలో ఉన్న వేట బంగళా కూడా నేటికీ రాజదర్పాని ఒలకబోస్తోంది. దీంతో పాటు శంషాబాద్ (ఉందానగర్) రైల్వేస్టేషన్ పాతభవనం కూడా ఎంతో చారిత్రాత్మకమైనది. దీంతో దశాబ్దాలకాలంగా శంషాబాద్ ప్రజలకు వైద్యసేవలందించిన పాత బంగళా కూడా నాడు ‘ముసాఫిర్ ఖానా’ ప్రయాణికుల విడిది కేంద్రంగా కొనసాగిందని చరిత్రలో ఉంది. ఇలా ఎన్నో చరిత్రలకు శంషాబాద్ వేదికగా మారింది. మినీభారత్గా... శంషాబాద్కు పారిశ్రామిక వాడతో పాటు 2008 మార్చి 23 నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రారంభం కావడంతో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్క జీవనం సాగిస్తున్నారు. సమీపంలో పారిశ్రామిక వాడ సైతం ఉడడంతో శంషాబాద్ జనాభా గత పదేళ్లలో భారీగా పెరిగింది. శంషాబాద్ పట్టణంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలు కలుపుకుని సుమారు యాభైవేలకు పైగా జనాభా ఉంది. దీనికి తోడు వాణిజ్య, వ్యాపారా కేంద్రాలతో నిత్యం రాకపోకలు సాగించే వారు వేలల్లో ఉంటారు. నిబంధనలు తూచ్.. చారిత్రాత్మకమైనన శంషాబాద్లో అక్రమ కట్టడాలు ఎక్కువగానే వెలస్తున్నాయి. 111 జీవో నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమార్కులు వందల సంఖ్యలో భారీ నిర్మాణాలను చేపట్టారు. పట్టణంలోని ఫిరంగి నాలాను మురుగుకాల్వలా మార్చారు. ఫిరంగినాలాను ఆక్రమంచి నిర్మాణాలు చేపట్టినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడ ఫిరంగి నాలా ఉనికి ప్రశ్నార్థంకగా మారుతోంది. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వాటికి కావాల్సిన నీటి వసతి కోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. రహదారులపై కూడా బోర్లు వేసే దారుణ పరిస్థితులు శంషాబాద్లో నిత్యకత్యంగా మారుతున్నాయి. కొత్త పాలనలోకి అడుగులు పెట్టిన సందర్భంగానైనా అడ్డుకట్టపడుతుందా.. అందుకు అనుగుణంగా అధికార వ్యవస్థ పనిచేస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి కమిషనర్గా.. శంషాబాద్ మేజర్ గ్రామ పంచాయతీతో పాటు గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లి, సాతంరాయి కొత్వాల్గూడతో కలిపిన శంషాబాద్ మున్సిపాలిటీకి తొలి కమిషనర్గా చాముండేశ్వరీ నియమితులయ్యారు. ఇప్పటికే ఆమె మున్సిపాలిటీలో భాగమైన గొల్లపల్లి, తొండుపల్లి, ఊట్పల్లిలో పురపాలనను ప్రారభించారు. పౌరుల భాగస్వామ్యంతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తొలి కమిషనర్ అన్నారు. -
పంచాయతీల్లో ‘డ్రై డే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ‘డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు.. వాటి చుట్టూ పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు.. తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. కలెక్టర్లు, డీపీవోలకు ఆదేశాలు.. పంచాయతీల్లో పారిశుధ్యం, హరితహారం, వీధిలైట్లు, పన్నుల వసూలు తదితరాలకు సంబంధించి గత నెలలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మరిన్ని ఉత్వర్వులిచ్చింది. ఈ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీలకు పంపించి, వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా అన్ని జిల్లాల్లో మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు (క్యాంపెయిన్) చేపట్టాలని సూచించింది. కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పాటు ప్రతీ గ్రామ పంచాయతీలో వివిధ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. తాజా ఆదేశాలు... అన్ని గ్రామాల్లోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలి. ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్ నిర్మించి ఉంటే కంపోస్ట్ తయారీకి చర్యలు ప్రారంభించాలి. ఠి రోజు విడిచి రోజు మురుగుకాల్వలు శుభ్రపరచాలి. ఖాళీ ప్రదేశాల్లో పొదలు, తుప్పలను తొలగించాలి. ఠి ఉపయోగించని బావులను పూడ్చాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటిని పూడ్చేయాలి. ఠి స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, మార్కెట్లు శుభ్రపరిచేందుకు ఒకరోజు కేటాయించాలి. ఠి రాష్ట్రం లోని 12,751 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఠి రైతులు తమ పొలాల్లోని గట్లు, బావుల చుట్టూ మొక్కలు నాటేలా చూడాలి. ఠి గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. ఠి గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. -
పన్ను వసూళ్లు @ 17.28 కోట్లు
సాక్షి,ఆదిలాబాద్ అర్బన్: ఇంటి పన్ను వసూళ్లలో ఉమ్మడి జిల్లా కొంత మెరుగుపడింది. పన్నులు వసూలు చేయడంలో ఎప్పుడు వెనుకబడి ఉండే ఆదిలాబాద్ ఈ ఏడాది ముందు వరుసలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. జిల్లాల వారీగా పన్ను వసూలు లక్ష్యాన్ని ముందుగానే చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగు జిల్లాల పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చాలెంజ్గా తీసుకొని వసూలు చేస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులతోపాటు సిబ్బంది నానాఅవస్థలు పడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా పన్ను కూడా వసూలు అవుతోంది. గడిచిన రెండు నెలల్లో భారీగా పన్ను వసూలు అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. పన్ను వసూలు శాతాన్ని జిల్లాల వారీగా గమనిస్తే.. రెండు నెలల కిందట 28వ స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం 61 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ఏడోస్థానం సాధించింది. మంచిర్యాల జిల్లా 58.79 శాతం, కుమురంభీం జిల్లా 57.64 శాతం పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది స్థానాలను పదిలం చేసుకున్నాయి. ఇక నిర్మల్ జిల్లా 47.75 శాతం పన్ను వసూలు చేసి 20వ స్థానంలో ఉంది. అయితే అధికారులు వసూలు చేసే పన్నులో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది ఇంటి పన్ను (ట్యాక్స్) కాగా, రెండోది నాన్ ట్యాక్స్ ఉంది. జిల్లా లక్ష్యం వసూలైంది శాతం ఆదిలాబాద్ రూ.5,06,50,733 రూ.3,08,98,625 61 మంచిర్యాల రూ.4,60,93,108 రూ.2,70,98,771 58.79 కుమురంభీం రూ.3,51,85,189 రూ.2,02,82,159 57.64 నిర్మల్ రూ.4,08,82,404 రూ.1,95,22,580 47.75 మొత్తం రూ.17,28,11,434 రూ.7,82,79,555 56.2 నెల రోజుల్లో సాధ్యమేనా.? ఆయా జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీల వారీగా ఇంటి పన్ను వసూలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం గత రెండు నెలల నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. అయితే నవంబర్, డిసెంబర్లోనే పన్ను వసూలు చేపట్టిన సిబ్బంది అంతగా శ్రద్ధ చూపకపోవడంతో తక్కువగా వసూలైంది. దీనికి తోడు అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల సందడి కూడా తోవడంతో వసూలు లక్ష్యం మందగించింది. జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు గ్రామాల్లో జోరుగా పన్ను వసూలు జరుగుతోంది. ఒక్కో ఇంటికి రూ.85 నుంచి రూ.350కిపైగా వసూలు చేస్తున్నారు. ఇందులో కొంత మంది ఇంటి యాజమానులు రెండేళ్ల పన్ను కట్టని సంఘటనలు ఉన్నాయి. ప్రతీ ఏటా జనవరి, ఫిబ్రవరిలో పన్ను వసూలుకు ఉరుకులు పరుగులు పెట్టే అధికారులు ఈ ఏడాది ముందుగానే లక్ష్యాన్ని చేరుకునేలా కనిపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా ఇరవై ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. అయితే ఈ ఇరవై ఏడురోజుల్లో రూ.9,45,31,879 లను వసూలు చేయగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు.. గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు చేసేందుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక బృందా లను నియమించారు. నాలుగైదు పంచాయతీల కు ఒక బృందం చొప్పున సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. ఈ బృందాలలో పంచాయతీ కార్యదర్శి, కారోబర్, వీసీవో, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, ఇతర అధికారులు ఉన్నారు. అయితే జిల్లాలో ఇది వరకే కొన్ని జీపీలో 100 శాతం పన్ను వసూలైంది. అయితే ఆ పంచాయతీ పరిధిలోని అధికారులు, సిబ్బంది వందశాతం చేరుకొని పంచాయతీల్లో పన్ను వసూలు చేయడంలో భాగస్వాములు అవుతున్నారు. సిబ్బంది ఎక్కువై పన్ను వసూళ్ల లక్ష్యం త్వరగా చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు పంచాయతీ కార్యదర్శులు, ఏవోపీఆర్డీలకు వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశారు. పన్ను వసూళ్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను ఈ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో జిల్లాలో పన్ను వసూలు సిబ్బంది సుమారు 220 నుంచి 250 మంది వరకు ఉన్నట్లు , బృందాలుగా పన్ను వసూలు చేస్తే పని సులువుగా ఉంటుందని చెబుతున్నారు. నెలాఖరులోగా లక్ష్యాన్ని చేరుకుంటాం ఇంటి పన్ను వసూలు ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాం. ఈ రెండు నెలల్లో భారీగా పన్ను వసూలైంది. జిల్లాలో కొన్ని జీపీల్లో ఇప్పటికే వందశాతం ఇంటి పన్ను వసూలైంది. పన్ను వసూలుకు ప్రణాళికతో ముందుకెళ్లడంతో అన్ని జీపీల్లో వంద శాతం వసూలు చేస్తున్నాం. గడువులోగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. – సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ -
ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు
సాక్షి, హైదరాబాద్:గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలనైనా ఇకపై ఎన్నికల ట్రిబ్యునళ్లు పరిష్కరించనున్నాయి. ఈ మేరకు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు ఇతరు లు ఎవరైనా వీటి ముందు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే జూనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్ సివిల్ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్గా విచారణ జరుపుతారు. అలాగే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి లేదా అధికారులు కూడా ఎన్నికల ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. 30 రోజుల్లోగా పిటిషన్... గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజులలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 30వ రోజున ట్రిబ్యునల్ తెరచి లేనిపక్షంలో ఆ మరుసటిరోజు పిటిషన్ వేసుకోవచ్చు. పిటిషనర్లు తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలి. పిటిషన్తోపాటు సెక్యూరిటీ డిపాజిట్గా రూ.1,000 జమ చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని పిటిషన్లను ట్రిబ్యునల్ తిరస్కరించొచ్చు. పిటిషన్ కాపీలను ప్రతివాదికి అందజేయడంతోపాటు ట్రిబ్యునల్ నోటీస్ బోర్డులో అతికించాలి. తన ఎదుట దాఖలైన పిటిషన్లపై సీపీసీ నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితి మేరకు ట్రిబ్యునల్ విచారణ జరపాల్సి ఉంటుంది. సాక్షుల విచారణకు, ఆధారాల స్వీకరణకు ట్రిబ్యునల్కు అధికారం ఉంటుంది. సాక్షులు తాము ఎన్నికల్లో ఎవరికి ఓటేశామో తెలియజేయాల్సిన అవసరంలేదు. ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఎన్నికల పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేదు. పిటిషనర్లు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వారందరి అనుమ తితో పిటిషన్ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇతర పార్టీలకు నోటీసు జారీచేసి విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదైనా పిటి షన్ ఉపసంహరణకు అనుమతినిచ్చినప్పుడు ట్రిబ్యునల్ ఆ నిర్ణయాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ అధికారులకు తెలియజేయాలి. ట్రిబ్యునళ్ల విధులు, అధికారాలివీ.. ►పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి. ►ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, అతడు/ఆమె ఏజెంటు, అతడు/ఆమె ఆమోదం పొందిన ఏ వ్యక్తి అయినా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. వారి ఎన్నికను రద్దు చేయడమే కాకుండా ఆరేళ్లపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు. సదరు వ్యక్తిని అంతే కాలానికి ఓటేయడానికి వీలు లేదని ఆదేశించే అధికారం కూడా ట్రిబ్యునల్కు ఉంది. ►గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పక్షంలో ఆ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల్లో అర్హులైనవారిని గెలుపొందినట్టుగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీచేయొచ్చు. -
పంచాయతీ కార్మికులకు బెదిరింపులా?: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: న్యాయమైన డిమాండ్లకోసం సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరపకుండా భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వానికి మంచిదికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు జారీచేయడాన్ని ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పూనుకోకుండా, వారి న్యాయమైన కోరికలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి మూడేళ్ల క్రితమే హామీ ఇచ్చిన ప్రభుత్వం, వాటి అమలుకు చర్యలు తీసుకోకుండా సమ్మెను అణిచివేయాలని ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు. -
పంచాయతీకో నర్సరీ
నేరడిగొండ(ఆదిలాబాద్): పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం.. గ్రామాలను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా పల్లెలు, పట్టణాల్లో విరివిగా మొ క్కలు నాటిస్తుండగా.. దీనిని ఉద్యమంలా కొనసాగించేందుకు ప్రతీ పంచాయతీలో న ర్సరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. పాత పంచాయతీలతోపాటు కొత్త గ్రామపంచాయతీల్లోనూ మొక్కలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతులు నివాస, పరిసర ప్రాంతాల్లో నాటేందుకు అవసరమైన మొక్కలను ఆ గ్రామ పరిధిలోని నర్సరీలోనే పెంచే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పూలు, పండ్ల మొక్కలతోపాటు ప్రజలకు అవసరమైన మొక్కల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా.. పంచాయతీ పరిధిలోని నర్సరీలో మొక్కలు పొందే విధంగా చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ నూతన చట్టం ప్రకారం ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు బాధ్యతను గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖలకు అప్పగించింది. జిల్లాలోని 467 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలకు అదనంగా కొత్త నర్సరీలు ఏర్పాటు చేయాలని, ప్రతీ పంచాయతీలో నర్సరీ ఉండాలని సూచనల్లో పేర్కొంది. దీంతో పాత, కొత్త గ్రామపంచాయతీల పరిధిలో నూతన నర్సరీలు ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 15లోగా ఏర్పాటు.. గ్రామాలను పచ్చని తోరణాలుగా మలిచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతీ పంచాయతీలో ప్రభుత్వం నర్సరీని ఏర్పాటు చే స్తోంది. ఇప్పటివరకు మండలానికి రెండు నుంచి ఐదు నర్సరీలు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య ను పెంచి ప్రతీ గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసే లా మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థలాలను ఎంపిక చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు సూచించింది. ఈ నెల 15వ తేదీలోగా నర్సరీల వారీగా స్థలాలను నిర్ణయించి.. నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు వన సేవకులను కూడా గుర్తించాలని సూచించింది. ఆగస్టు 31లోగా ఎంపిక చేసిన నర్సరీ స్థలాల్లో నీటి సౌకర్యం, పైపులైన్ నిర్మాణం ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు అవసరమైన టేకు స్టంప్స్, విత్తనాలు సిద్ధం చేసుకొని వాటిని నాటేందుకు పాలిథిన్ సంచులు సమకూర్చుకోవాల్సి ఉంది. సెప్టెంబర్ 15లోగా నర్సరీల్లో విత్తన బ్యాగులు ఏర్పాటు చేసేందుకు బెడ్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అక్టోబర్ 20లోగా పాలిథిన్ బ్యాగుల్లో మట్టిని నింపి సిద్ధం చేసుకోవాల్సి ఉంది. అక్టోబర్ 31లోగా వాటిలో ఆయా పండ్ల విత్తనాలు, టేక్ స్టంప్స్ నాటాల్సి ఉంది. 467 నర్సరీలు. జిల్లాలో 467 నర్సరీల ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో మండలంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 20 నర్సరీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 నర్సరీలు పెంచేలా ప్రభుత్వం జిల్లా అధికారులకు సూచనలు చేసింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 419 నర్సరీల్లో 99లక్షల మొక్కలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల్లో 41లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికలు రూపొందించారు. ఆ ప్రకారం జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. జనాభా ప్రాతిపదికన మొక్కల పెంపకం.. ప్రభుత్వం కొత్త పంచాయతీల్లో ఏర్పాటు చేసే న ర్సరీల్లో జనాభా ప్రాతిపదికన మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ పంచా యతీ పరిధిలో గ్రామాలు, స్థానికులు వినియోగించుకునేలా నర్సరీల్లో మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టింది. వెయ్యికి పైగా జనాభా ఉన్న గ్రామంలో లక్ష మొక్కలు పెంచేలా నర్సరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తే అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం శాతా న్ని పెంచాలని సూచించింది. గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసే నర్సరీల్లో మొక్కల పెంపకం స్థానికుల అభీష్టం మేరకే ఉండనున్నది. రైతుల పొలాల్లో నాటేందుకు, నివాస పరిసరాల్లో నాటేందుకు అనువైన మొక్కలు పెంచేందుకు ప్ర భుత్వం నిర్ణయించింది. స్థానిక రైతులు, ప్రజలు తమకు అవసరమైన మొక్కలను సూచిస్తే.. వాటిని మాత్రమే ఆ నర్సరీల్లో పెంచేలా ప్రణాళికలు రూపొందించింది. వీటిలో అత్యధిక శాతం పూలు, పండ్ల మొక్కలను మాత్రమే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొక్కల రక్షణకు గ్రామ కమిటీలు.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి, రక్షణకు ప్రభుత్వం గ్రామ కమిటీలు వేయనుంది. పంచాయతీ పరిధిలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితోపాటు గ్రామంలో మొక్కల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులు, యువకులను ఇందులో సభ్యులుగా నియమించనుంది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ, మొక్కల రక్షణ, పెంపకం అంతా కమిటీలే చూసుకోవాలి. వాటి నిర్వహణకయ్యే ఖర్చు ప్రభుత్వం భరించనుంది. నర్సరీల నిర్వహణకు ఉపాధిహామీ పథకంలోని కూలీలను వినియోగించుకునేలా వీలు కల్పించింది. కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలో కొత్త నర్సరీల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేసేలా ఫీల్డ్ అసిస్టెంట్లు, మండలస్థాయి సిబ్బందికి సూచనలు చేశాం. ప్రభుత్వం విధించిన గడువులోగా జిల్లాలో నర్సరీలు ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాం. డీఆర్డీఓ ఆధ్వర్యంలో 419, అటవీ శాఖ ఆధ్వర్యంలో 48 నర్సరీల ఏర్పాటుకు దాదాపు స్థలాల ఎంపిక పూర్తయ్యింది. ఆయా స్థలాల్లో అవసరమైన వసతులు త్వరితగతిన సమకూర్చి లక్ష్యాలను చేరుకుంటాం. – రాథోడ్ రాజేశ్వర్,జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి -
విలీనం, విడదీయడం.. ప్రభుత్వ వ్యవహారం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలో గ్రామాలు, కాలనీలను కలపడం, విడగొట్టడం వంటివి ప్రభుత్వ పరిధిలోని వ్యవహారాలని, వాటి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ కాలనీని కొత్తగా ఏర్పాటుచేస్తున్న రామగోవిందాపురం గ్రామ పంచాయతీలో కలపడం లేదంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని గాంగారం గ్రామ పరిధిలోని ప్రకాశ్నగర్కు చెందిన కె.పుల్లయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, అభ్యంతరాలు ఏవైనా ఉంటే వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యంతరంపై ఏం నిర్ణయం తీసుకున్నారో వారికి తెలియచేయాలని అధికారులను ఆదేశించింది. -
వివాహ నమోదుతో పలు లాభాలు
మాచవరం(గురజాల): గ్రామ పంచాయతీల్లో వివాహాల నమోదు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. దీంతో ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆడపిల్ల ల వివాహాలకు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు సక్రమంగా అందడంలేదు. అన్ని కులాలు, మతాల వారు వివాహాలను నమో దు చేయించుకోవాలని చట్టంలో పొందుపరిచారు. వివాహం అయిన 60 రోజుల్లోగా నమోదు చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఎలా నమోదు చేసుకోవాలో తెలియక, సరైన అవగాహన లేకపోవడంతో వివాహాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంలేదు. పథకాలపై అవగాహన అవసరం వివాహ రిజిస్ట్రేషన్ చట్టం 2012 వివాహ నమోదు బాధ్యత ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. ఆడపిల్లకు 18 ఏళ్లు, మగ పిల్లవాడికి 21 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసి గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ముస్లిం, గిరిజన, ఆదర్శ వివాహాలు చేసుకున్న వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గిరిజనులకు గిరిజన పుత్రిక, ముస్లింలకు దుల్హన్ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి రూ. 50 వేలు ప్రోత్సాహక నగదు అందుతుంది. ఇటీవల ఎస్సీలకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక ప్రకటించింది. నమోదు ఇలా చేసుకోవాలి వివాహం చేసుకున్న గ్రామంలో పంచాయతీ కార్యదర్శికి ముందుగా సమాచారం ఇచ్చి నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. వధువు, వరుడు ఆధార్ కార్డులు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, వ్యక్తిగత ఫొటోలు(పాస్పోర్టులు), పెళ్లి కార్డులు, పెళ్లి ఫోటో, ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. వీటిని పరిశీలించిన కార్యదర్శి రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. వివాహం జరిగిన 20 నుంచి 60 రోజుల్లో నమోదు చేసుకోవచ్చు. 20 రోజుల్లో అయితే ఉచితంగా, 60 రోజుల్లోపు అయితే రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
ఆగిన టాయిలెట్ నిర్మాణం.. మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి, బెంగళూరు : మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రభుత్వాధికారులు నిలిపివేయడంతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి దిగింది. ఈ ఘటన కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. కర్నాటకలోని దావణగెరె జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో.. ఒక కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకుంటోంది. ఇందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిధులు కూడా విడుదలయ్యాయి. మొదట్లో నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన గ్రామ పంచాయితీ తరువాత.. సరైన పత్రాలు లేవని నిర్మాణాన్ని నిలిపివేసింది. టాయిలెట్ నిర్మాణాన్ని గ్రామపంచాయితీ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన మహిళ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అనూహ్య ఘటనతో గ్రామపంచాయితీ అధికారులు అక్కడనుంచి పరారయ్యారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై దావణగెరె జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే.. నిర్మాణంలో ఉన్న టాయిలెట్ని ఆపడమేంటని జిల్లా అధికారులు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు కారణమైన 14 మంది గ్రామ పంచాయితీ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎన్ఓసీ కావాలా..? రూ.2 కోట్లు ఇవ్వాలి!
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి సర్పంచ్ భర్త బల్ల చంద్రశేఖర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. తనకు అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఎన్ఓసీ రాదని, ఇక్కడ ప్లాట్లు విక్రయించలేవని బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే ప్లాట్ల విక్రయాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. తనను అధికార పార్టీ సర్పంచ్ భర్త డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఇన్క్రెడిబుల్ ఇండియా, టుమారో వరల్డ్ వెంచర్ యజమాని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన భువనగిరి రూరల్ పోలీస్లు చంద్రశేఖర్పై కేసు నమోదు చేశారు. రాయగిరి శివారులో రెండేళ్ల క్రితం 300 ఎకరాల్లో ఇన్క్రెడిబుల్ ఇండియా, టుమారో వరల్డ్ పేరుతో వెంచర్ చేసి ఓపెన్ ప్లాట్లు విక్రయిస్తున్నారు. రాయగిరి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 758, 759, 761, 763, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773,774, 775, 776, 795, 796, 797, 799, 800, 801లో ఈ వెంచర్ అభివృద్ధి చేశారు. వెంచర్కు హెచ్ఎండీఏలో అనుమతులు పొందడానికి గ్రామపంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) అవసరం ఉంది. ఇందుకోసం వెంచర్ యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఎన్ఓసీ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ సర్పంచ్ భర్త.. వెంచర్ యజమాని విజయ్కుమార్తో బేరం పెట్టాడు. 3 మూడు ఆప్షన్లను ఇచ్చాడు. వెంచర్కు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.ఒక కోటి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.ఒక కోటితోపాటు 11 మంది వార్డు సభ్యులకు వెంచర్లో 11 ఓపెన్ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని విజయ్ కోరాడు. ఈనెల 19న చంద్రశేఖర్తోపాటు, మరికొందరు వార్డు సభ్యులు వెంచర్ వద్దకు వెళ్లి అక్రమంగా వెంచర్ చేస్తున్నావని గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో గొడవ దృశ్యాలు నమోదయ్యాయి. వెంచర్ యాజమాని విజయ్కుమార్తో చంద్రశేఖర్ నడిపిన బేరసారాలు ఫోన్లో రికార్డు చేశారు. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలతో విజయ్కుమార్ ఈనెల 22న కలెక్టర్తోపాటు, డీసీపీ, ఇతర అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై సర్పంచ్ భర్త చంద్రశేఖర్ను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన సెల్ఫోన్ స్విచ్చాఫ్లో ఉంది. చంద్రశేఖర్పై కేసు నమోదు వెంచర్కు అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసిన భువనగిరి మండలం రాయగిరి సర్పంచ్ భర్త బల్ల చంద్రశేఖర్పై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వెంచర్ అనుమతికి ఇవ్వాల్సిన ఎన్ఓసీ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇవ్వకుండా డబ్బులు అడిగాడని వెంచర్ యజమాని విజయకుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆదివారం వెంచర్ వద్దకు వెళ్లి చంద్రశేఖర్, మరికొంత మంది వెంచర్ కార్యాలయంలోని కుర్చీలను పగులగొట్టి దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
తప్పు చేసిందని భార్యకు దారుణ శిక్ష
ఝాబువా : గ్రామాలలో కుల, తెగ పెద్దల పంచాయితీలు విధించే దారుణ శిక్షలు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళకు భర్తను మోసుకుని పరిగెత్తాలంటూ శిక్ష విధించగా.. అందుకు కారణమైన వారిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. భిల్లా తెగ ఎక్కువగా నివసించే ఝాబువా జిల్లా ఖేడి గ్రామంలో పది రోజుల క్రితం వివాహిత అయిన ఆ గిరిజన మహిళ మరో గిరిజన వ్యక్తితో వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెనక్కి రాగా.. పంచాయితీ పెద్దలు కలుగజేసుకుని ఆ భర్తకు సర్దిచెప్పి పంపారు. అయితే ఆమె చేసిన తప్పు కోసం కఠిన శిక్ష విధించాల్సిందేనంటూ భర్త, అతని తరపు బంధువులు ఆమెను అందరి సమక్షంలో చితకబాదారు. ఆపై పంచాయితీ పెద్దలు రెండు కిలో మీటర్లు భర్తను మోస్తూ పరిగెత్తాలంటూ ఆ మహిళకు శిక్ష విధించారు. ఆమె అలా పరిగెడుతున్న సమయంలో భుజాలపై ఉన్న భర్తతోపాటు గ్రామస్తులు కూడా ఆమెను కొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరిది, మామయ్యతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. -
అన్ని పంచాయతీలకు డంప్ యార్డులు
- డీపీఓ పార్వతి - అయ్యలూరు డంప్యార్డు పరిశీలన నంద్యాలరూరల్: జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో డంప్యార్డులు నిర్మిస్తామని జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి అన్నారు. సాలిడ్æ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద దశల వారీగా నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. అయ్యలూరు డంప్యార్డును మంగళవారం ఆమె పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయించాలని సర్పంచ్ తప్పెట రామలక్ష్మమ్మకు సూచించారు. సాలిడ్æ వేస్ట్మేనేజ్మెంట్ పథకంతో పల్లెల్లో పారిశుధ్య సమస్య పరిష్కారమవుతుందన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త సేకరించి డంప్యార్డుకు తరలించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామన్నారు. దీంతోపాటు సేకరించిన చెత్తలోని గాజు, ఇనుప ముక్కలు, పాత చెప్పులను వేరు చేసి డంప్యార్డు ద్వారా విక్రయించడం వల్ల పంచాయతీలకు ఆదాయం లభిస్తుందన్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించకుండా డంప్యార్డుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలన్నారు. కర్నూలు డీఎల్పీఓ విజయ్కుమార్, అనంతపురం డీపీఎం బృందం, అయ్యలూరు డంప్యార్డు నిర్మాణ పనులను పరిశీలించి లోటుపాట్లపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ మహ్మద్దౌలా, పీఎస్ అక్బర్వలి, గ్రామ నాయకులు శ్రీనివాసులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ పంచాయతీ నిర్మాణం
గ్రామ పంచాయతీ.. మూడంచెల వ్యవస్థలో మొదటి అంచె. రాష్ట్రంలో ఉన్న జనాభా మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు.. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా 300 మందికి తగ్గకుండా జనాభా ఉన్న గ్రామాల్లో ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేస్తారు. గ్రామపంచాయతీ నిర్మాణం కింది విధంగా ఉంటుంది. గ్రామసభ వార్డు సభ్యులు కోఆప్టెడ్ సభ్యులు శాశ్వత ఆహ్వానితులు సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీ కార్యనిర్వహణాధికారి/సెక్రటరీ. గ్రామసభ గ్రామసభను పంచాయతీ వ్యవస్థకు ఆత్మగా, హృదయంగా, స్థానిక శాసనసభగా వర్ణిస్తారు. ప్రతి పంచాయతీలో గ్రామసభ ఉంటుంది. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ సంవత్సరానికి కనీసం రెండు పర్యాయాలు సమావేశం కావాలి. గరిష్ట సమావేశాలకు పరిమితి లేదు. ఏటా ఏప్రిల్ 14న, అక్టోబర్ 3న తప్పకుండా సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జనవరి 2, జూలై 4న కూడా జరపాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. గ్రామ సభకు సర్పంచ్ లేదా ఉప సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. రెండు పర్యాయాలు గ్రామసభ సమావేశాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. తిరిగి సంవత్సరం వరకు ఎన్నికకు అర్హులు కాదు. ఓటు హక్కు కలిగిన వారిలో 50 మంది లేదా 10 శాతం మంది ప్రజలు కోరితే గ్రామసభ సమావేశం నిర్వహించాలి. గ్రామసభకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామసభ విధులు గ్రామ పంచాయతీకి సంబంధించిన పరిపాలన, ఆడిట్ నివేదికలను ఆమోదించడం. గ్రామ పంచాయతీ అభివృద్ధి; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు. బడ్జెట్లో ఆమోదించాల్సిన అంశాలను సూచించడం. పన్ను బకాయిదారుల జాబితా రూపొందించడం. సమాజాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో ద్రవ్య, వస్తు సంబంధమైన విరాళాలు సేకరించడం, అన్ని వర్గాల మధ్య శాంతి ఐక్యతా భావాలను పెంపొందించేందుకు కృషి చేయడం. వార్డు సభ్యులు/ పంచాయతీ సభ్యులు గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. వీరిని ఓటర్లు ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారు. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. 300 వరకు జనాభా ఉంటే 5 వార్డులు 300–500 వరకు 7 వార్డులు 500–1500 వరకు 9 వార్డులు 1500–3000 వరకు 11 వార్డులు 3000–5000 వరకు 13 వార్డులు 5000–10,000 వరకు 15 వార్డులు 10,000–15,000 వరకు 17 వార్డులు 15,000 పైన 19 నుంచి 21 వార్డులు కోఆప్టెడ్ సభ్యులు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి స్వయం సహాయక బృందం నుంచి ఒక ప్రతినిధిని కోఆప్టెడ్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవచ్చు. వీరు సమావేశాల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి తీర్మానాలపై ఓటు చేసే అధికారం ఉండదు. శాశ్వత ఆహ్వానితులు మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు (ఎంపీటీసీ) శాశ్వత ఆహ్వానితుడిగా చర్చలో పాల్గొనవచ్చు. కానీ తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. గ్రామ పంచాయతీ సమావేశం – కోరం సర్పంచ్ కనీసం నెలకొకసారి అయినా పంచాయతీ సమావేశం నిర్వహించాలి. అవసరం అనుకుంటే ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. 90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు. సర్పంచ్ 90 రోజుల లోపు తిరిగి సమావేశం నిర్వహించడానికి అనుమతి ఇవ్వకపోతే పంచాయతీ కార్యదర్శే స్వయంగా సమావేశం ఏర్పాటు చేయొచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల కోరం 1/3వ వంతుగా నిర్ణయించారు. అయితే కోరం లేకున్నా సమావేశం నిర్వహించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాలకు సర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్ అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఒకవేళ ఇద్దరూ హాజరు కాకపోతే ఒక సభ్యుడిని సభకు అధ్యక్షుడిగా నియమించవచ్చు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో కింది సభ్యులు పాల్గొంటారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కోఆప్టెడ్ సభ్యుడు మండల పరిషత్ కోఆప్టెడ్ సభ్యుడు. గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ అధిపతిని సర్పంచ్ లేదా అధ్యక్షుడు అంటారు. సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిలో ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. సర్పంచ్ పదవీ కాలం ఐదేళ్లు. సర్పంచ్గా పోటీ చేయడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. అయితే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడిన సర్పంచ్ను జిల్లా కలెక్టర్ తొలగిస్తారు. గ్రామసభ సమావేశాలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. గ్రామ పంచాయతీ ఆడిట్ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు. సర్పంచ్ తన రాజీనామా విషయంలో గ్రామ పంచాయతీకి నోటీసు ఇచ్చి పదవికి రాజీనామా చేయవచ్చు. అయితే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి వీలు లేనప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించవచ్చు. ఏదైనా కారణం వల్ల సర్పంచ్ పదవి ఖాళీ అయితే నాలుగు నెలల లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. సర్పంచ్ విధులు పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. పంచాయతీ ఆమోదించిన తీర్మానాల విషయంలో నియంత్రణాధికారం ఉంటుంది. ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ పదవి ఖాళీ అయితే 30 రోజుల లోపు ఉప ఎన్నిక ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేయవచ్చు. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పర్యవేక్షణ అధికారం కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీ ఆహార కమిటీ, విద్యా కమిటీ, పారిశుధ్య కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. స్వయం సహాయక సంఘాల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాల మేరకే సర్పంచ్ వ్యవహరించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల అనర్హతకు సంబంధించిన విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తెస్తారు. ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్ను ఎన్నుకుంటారు. జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన తరఫున సంబంధిత అధికారి ఈ ఎన్నికను నిర్వహిస్తారు. సర్పంచ్ కూడా ఈ ఓటింగ్లో పాల్గొనవచ్చు. ఉప సర్పంచ్గా ఎన్నికవ్వాలంటే వార్డు సభ్యులై ఉండాలి. ఉప సర్పంచ్ను అవిశ్వాస తీర్మానం ద్వారా వార్డు సభ్యులు తొలగించవచ్చు. రాజీనామా, తొలగింపు, పదవిలో ఖాళీలు: ఉప సర్పంచ్ తన రాజీనామా పత్రాన్ని మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)కి సమర్పిస్తారు. అవిశ్వాస తీర్మానం: ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. అయితే పదవి చేపట్టిన నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు. అవిశ్వాస తీర్మాన నోటీసుపై సగానికి తక్కువ కాకుండా సభ్యులు సంతకాలు చేసి రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలి. 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. మొత్తం సభ్యుల్లో 2/3 వంతు తక్కువ కాకుండా ఆమోదిస్తే ఉపసర్పంచ్ను తొలగి స్తారు. సస్పెండ్ అయిన సభ్యులకు కూడా ఈ సమయంలో ఓటు హక్కు ఉంటుంది. అధికారాలు: సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్కు ఉంటాయి. -
ఇదెక్కడి పంచాయితీ!
- గ్రామాల్లో వైకుంఠధామాల అభివృద్ధికి ఉపాధిహామీ నిధులు - ప్రహరీ బాధ్యత తమది కాదంటున్న గ్రామీణాభివృద్ధి అధికారులు సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో వైకుంఠధామాల (శ్మశానవాటిక) ఏర్పాటు/ అభివృద్ధి ప్రక్రియ గ్రామ పంచాయతీలకు తలనొప్పిగా మారింది. ఎంపిక చేసిన గ్రామా ల్లో ఒక్కో శ్మశానవాటిక అభివృద్ధికి రూ. 10 లక్షలు కేటాయించిన గ్రామీణాభి వృద్ధి శాఖ, శ్మశాన స్థలాల రక్షణ కోసం ప్రహరీ ఏర్పాటు చేసుకునే బాధ్యత గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేసింది. గ్రామాల్లో ఒక్కొక్క శ్మశాన వాటికకు ప్రహరీ నిర్మించడానికి కనీసం రూ. 10 లక్షల నుంచి గరిష్టంగా రూ. 25 లక్షల దాకా వ్యయమవుతుందని అధికారుల అంచనా. ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ నిధుల నుంచి గాని, దాతల నుంచి విరాళాల రూపంలో గాని వెచ్చించాలని గ్రామీణాభి వృద్ధిశాఖ సూచించింది. అయితే.. రాష్ట్రంలో 90 శాతానికి పైగా గ్రామ పంచాయతీలకు ఈ మేరకు ఆదాయ వనరులు లేకపోవడంతో పలు గ్రామాల సర్పంచులు ప్రహరీల నిర్మాణ వ్యయాన్ని తాము భరించే పరిస్థితి లేదంటూ చేతులెత్తేశారు. మరోవైపు ఆయా గ్రామాల్లో వైకుంఠధామం ప్రహరీ నిర్మాణం కోసం రూ. 5 లక్షలకు పైగా విరాళమిచ్చిన గ్రామస్తులు వారి పెద్దల స్మారకంగా వైకుంఠధామానికి పేరును పెట్టుకునే వెసులుబాటును ప్రభు త్వం కల్పించినా, గత రెండు నెలలుగా ఏ గ్రామంలోనూ విరాళాలిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఉపాధి నిధులే ఇవ్వాలంటున్న కలెక్టర్లు రాష్ట్రంలో మొత్తం 8,685 గ్రామాల్లో శ్మశానవాటికలను ఉపాధిహామీ నిధులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1,050 గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఐదు నుంచి ఏడు గ్రామాలను ఎంపిక చేసి శ్మశాన వాటికల అభివృద్ధి పనులను చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూచించారు. అయితే.. గత నెలరోజులుగా కొన్ని జిల్లాల్లో పర్యటించిన కొన్ని జిల్లాల కలెక్టర్లు.. గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులు లేకపోవడంతో ఉపాధిహామీ నిధుల నుంచే ప్రహరీల ఏర్పాటు చేయాలని లేఖలు రాశారు. ఆ లేఖలకు కమిషనర్ నుంచి స్పందన లేకపోవడం గమనార్హం. వైకుంఠధామం ఏర్పాటుకే పరిమితం.. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న ఒక్కో వైకుంఠధామం ఏర్పాటు/అభివృద్ధికి మాత్రమే ఉపాధిహామీ నిధులను వెచ్చించనున్నారు. ఈ నిధులతో ఒక్కో శ్మశాన వాటికలో రెండు దహన వేదికలు, ఒక స్టోర్రూమ్, సందర్శకుల కోసం ఒక షెడ్, రెండు మరుగుదొడ్లు, సింటెక్స్ ఓవర్హెడ్ ట్యాంక్, సోలార్ లైటింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు భూమి అభివృద్ధి, పొదల తొలగింపు, భూమి చదును, హద్దుల ఏర్పాటు పనులను ఉపాధిహామీ కింద వేరుగా చేపడతారు. అన్ని పనులు పూర్తి కాగానే వైకుంఠధామాన్ని సదరు గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. -
వివాదముంటే సర్కారు వద్దకే
- హెచ్ఎండీఏ, గ్రామ పంచాయతీల మధ్య వివాదం తలెత్తితే ప్రభుత్వాన్ని ఆశ్రయించండి - స్పష్టం చేసిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: తమ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న లే ఔట్లకు సంబంధించి ఆయా పంచాయతీలు అందించే సేవల ఫీజులు, ఇతర చార్జీల విషయంలో హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)–గ్రామ పంచాయతీల మధ్య వివాదం తలెత్తితే ప్రభుత్వాన్ని ఆశ్రయించి పరిష్క రించుకోవాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. హెచ్ఎండీఏతో వివాదం తలెత్తినప్పుడు దాన్ని వినతి రూపంలో పురపాలక శాఖ ముఖ్య కార్య దర్శికి 2 వారాల్లో సమర్పించాలని, ముఖ్య కార్యదర్శి ఆ వినతిపై 2 నెలల్లో నిర్ణయం వెలువరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. సోమవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలోని లే ఔట్లను అభివృద్ధి చేస్తూ భవన అనుమతులిస్తున్న హెచ్ఎండీఏ.. తద్వారా వచ్చే నిధుల్లో ఆయా గ్రామ పంచాయతీలకు వాటా ఇవ్వడం లేదని, దీని వల్ల గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందంటూ రంగారెడ్డి జిల్లా కొంపల్లి గ్రామ సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. పనులు చేయించుకుని, డబ్బులు ఇవ్వ బోమనడం సరికాదని వెల్లడించింది. ‘పంచాయతీ లకు ఇవ్వాల్సిన వాటా ఇస్తేనే కదా అవి అభివృద్ధి చెందేది’ అని వ్యాఖ్యానించింది. -
100 శాతం పన్ను వసూలు గగనమే
► ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా గ్రామాల్లో వసూలైంది 71 శాతమే ► ప్రజాప్రతినిధుల నుంచి అధికారులకు లభించని సహకారం ► పన్నులడిగితే ప్రజలు ఓట్లేయరనే భావనలో ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలు ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఓవైపు ఈ ఏడాది వందశాతం పన్ను వసూళ్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక డ్రైవ్లు చేపట్టగా, మరోవైపు తమ గ్రామాల్లో ప్రభు త్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయనం దున పన్నులెందుకు కట్టాలని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. పన్ను వసూళ్ల కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు సూచిస్తుం డగా, పన్నులు కట్టమని ప్రజలను అడిగితే రాబోయే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరనే భావనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంతే కాకుండా రెండేళ్ల కిందట ‘గ్రామజ్యోతి’ పేరిట అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని ప్రజలకు ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించిందని, ఆ మేరకు గ్రామాల అభివృద్ధికి సర్కారు నిధులు విడుదల చేయకపోవడంతో జనాల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయని సర్పంచులు అంటున్నారు. స్థానిక సంస్థలకు మూడేళ్లుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని, తాజా బడ్జెట్లోనూ కేటాయింపులు లేకపోవడం తమను మరింత నిరాశకు గురి చేసిందని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆస్తి పన్నులు కట్టండంటూ ఇంటింటికీ తిరిగి చెబితే మరింత నవ్వులపా లవుతామని ఎంపీటీసీలు, సర్పంచులు అంటు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,695 గ్రామ పంచాయతీల్లో రూ.435కోట్ల ఆస్తి పన్ను వసూ లు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే.. మరో 10రోజులలో ఆర్థిక సంవత్సరం ముగి యనుండగా, ఇప్పటి వరకు కేవలం రూ.306.80 కోట్లు(71శాతం) మాత్రమే వసూ లైనట్లు అధికారులు లెక్కలు తేల్చారు. -
పంచాయతీ రికార్డులన్నీ ఇకపై ఆన్లైన్లోనే..
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై డీపీవోలతో మంత్రి జూపల్లి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరించాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్)లో శుక్ర వారం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఆస్తులు, పన్నుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని పంచాయతీ రాజ్ కమిషనర్కు, డీపీవోలకు సూచించారు. 5వేల గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల న్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర సమాచా రంతో డేటా బ్యాంక్ నిర్వహించాలని సూచించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి. ఉపాధిహామీ కింద మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా సర్పంచ్లను సమాయత్తం చేయాలని డీపీవోలను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది గాంధీ జయంతిలోగా రాష్ట్రాన్ని 100% బహిరంగ మలవిసర్జన లేకుండా మార్చా లని, అన్ని గ్రామాల్లోనూ 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా కృషిచేయాలని అధికా రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్ఐపాస్ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరి తగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పంచా యతీ సిబ్బందిని హేతుబద్ధీకరించడంతో పాటుగా ఇతర శాఖలకు డిప్యూటేషన్లనూ నిలిపివేశామని కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తెలిపారు. క్లష్టర్ గ్రామాల నుంచి సేకరించిన వివరాలను కమిషనరేట్కు పంపేలా చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు. -
బకాయిలపై ‘పంచాయితీ’!
- పాత బకాయిలు చెల్లించని గ్రామాలకు కరెంట్ నిలిపేస్తున్న డిస్కంలు - 14వ ఆర్థిక సంఘం నిధుల్లోనూ కోత పెడుతున్న ఈవో పీఆర్డీలు - 20 శాతం మినహాయింపుపై మంత్రి హామీ ఇచ్చినా జారీ కాని ఉత్తర్వులు - డిస్కంలు ఇచ్చిన పాత బిల్లులన్నీ అశాస్త్రీయమైనవేనంటున్న సర్పంచ్లు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లుల గ్రహణం ఇంకా వీడలేదు. పాత విద్యుత్ బకాయిలు చెల్లించలేదనే నెపంతో డిస్కంలు పలు గ్రామాలకు కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నాయి. దీంతో పలు గ్రామాల్లో మోటార్లు పనిచేయక మంచినీటి సరఫరా జరగడం లేదు. రాత్రివేళల్లో వీధి లైట్లు కూడా వెలగడం లేదు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్, రంగా రెడ్డి జిల్లాల్లో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలే విద్యుత్ బిల్లులు చెల్లించగా, తెలంగాణ వచ్చాక ఆ భారాన్ని పంచా యతీలపై వేయడమేంటని ఇటీవల సర్పంచుల సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బకాయిల రూపేణా గ్రామ పంచాయతీ లపై పడుతున్న భారాన్ని కొంత మేరకు తగ్గిస్తామ ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ఇటీవల సర్పంచ్లకు హామీ ఇచ్చారు. గతంలో 30 శాతం నిధులను చెల్లించాలని ఆదేశాలుండగా.. ప్రస్తుతానికి 10 శాతం చెల్లిస్తే చాలని సర్పంచులతో మంత్రి పేర్కొన్నారు. అయితే.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాకపోవడంతో విద్యుత్బకాయిల వసూలుపై డిస్కంల సిబ్బంది, ఈవో పీఆర్డీలు భీష్మించుకుని కూర్చున్నారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు అందిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 30 శాతం విద్యుత్ బిల్లులకు చెల్లించాల్సిందేనని ఈవో పీఆర్డీలు అంటుండగా.. చెల్లించని గ్రామాలకు డిస్కంల సిబ్బంది కరెంటును నిలిపేస్తున్నారు. బకాయిలు రూ. 942 కోట్లు గ్రామ పంచాయతీల్లో సుమారు రూ. 942 కోట్ల పాత బకాయిలు పెండింగ్లో ఉన్నాయని డిస్కంలు సర్కారుకు నివేదికను అందజేశాయి. పంచాయతీ లకు ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలను రాబట్టుకోవాలని డిస్కం లకు, పంచాయతీరాజ్ అధికారులకు సర్కారు సూచించింది. అయితే.. శాస్త్రీయ విధానం లేకుండా డిస్కంలు చెబుతున్న బకాయిల లెక్కలను గ్రామ పంచాయతీల సర్పంచ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలను గతంలో సర్కారే చెల్లించిందని, ప్రస్తుతం కూడా బకాయిలను ప్రభుత్వం నుంచే డిస్కంలు రాబట్టుకోవాలని వారు స్పష్టం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్ బకాయిలకే వెచ్చిస్తే.. పంచాయితీల నిర్వహణ కష్టమని వారు వాపోతున్నారు. ముందుకు సాగని మూడోలైన్ పనులు గ్రామ పంచాయతీల్లో వీధిలైట్ల విద్యుత్ వినియోగం లెక్కలను తేల్చేందుకు మూడోలైన్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినా, క్షేత్రస్థాయిలో ఆ మేరకు పనులు జరగడం లేదు. రూ.వందల కోట్లలో విద్యుత్ బకాయిలంటూ గ్రామ పంచాయతీలను షాక్కు గురి చేస్తున్న డిస్కంలను నియంత్రించేందుకు పంచాయతీ రాజ్ ఉన్నతాధికారులు చేసిన మూడోలైన్ ప్రతి పాదనకు ఏడాది కిందటే సర్కారు ఆమోదం తెలిపింది. గృహావసరాల కోసం విద్యుత్ శాఖ వేసిన రెండు లైన్లకు సమాంతరంగా వీధిలైట్లకు ప్రత్యేకంగా మూడో లైన్ (వైర్) ఏర్పాటు చేయాలని, ఇందుకు సుమారు రూ.10 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. -
ఏకగ్రీవాలకు నజరానా
ఆలేరు : ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు శుభవార్త. నజరానాల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పంచాయతీలకు ప్రభుత్వం ఎట్టకేలకు మూడు రోజుల క్రితం నిధులు మంజూరు చేసింది. దీంతో ఆ గ్రామాలు ప్రగతిబాట పట్టనున్నాయి. 2013 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తామని అప్పటి ఉమ్మడి సర్కార్ పేర్కొంది. ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే భారీగా నిధులు ఇస్తామని అప్పటి సర్కార్ ప్రకటించడంతో రాజకీయాలను పక్కన పెట్టి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1176 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లాల విభజనలో భాగంగా జనగామ జిల్లాకు 17 వెళ్లాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో 15వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 7లక్షలు, 15వేలకు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 20 లక్షలు అందిస్తామని ప్రకటించింది. 2013 జూలైలో ఎన్నికలు జరిగాయి. అయితే 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటి సమైక్య రాష్ట్ర ప్రభుత్వం రూ. 5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించింది. తరువాత ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని పెంచింది. ఈ నిధులతో తక్కువ ఆదాయ వనరులు ఉన్న పంచాయతీలు అభివృద్ధి చెందనున్నాయి. గ్రామంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఈ నిధులతో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, అంతర్గత రహదారుల నిర్మాణం, గ్రామపంచాయతీ భవనాలు తదితర పనులకు నిధులు ఖర్చు చేయనున్నారు. దీంతో గ్రామపంచాయితీల్లో కనీస వసతులు మెరుగుపడనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇలా.. తిరుమలగిరి మండలంలో–1, నడిగూడెం–3, డిండి–1, చందంపేట–2, దేవరకొండ–1, పెద్దవూర–6, భూదాన్పోచంపల్లి–2, మునుగోడు–1, నాంపల్లి–3, చండూరు–1, బీబీనగర్–7, భువనగిరి–3, ఆత్మకూరు(ఎం)–5, చౌటుప్పల్–1, నారాయణపురం–3, తుంగతుర్తి–2, పీఏపల్లి–2, మోత్కురు–2, తుర్కపల్లి–1, యాదగిరిగుట్ట–2, హాలియా–5, రాజాపేట–1, చివ్వెంల–3, దామరచర్ల–7, గుర్రంపోడు–2, మేళ్లచెర్వు–1, త్రిపురారం–7, తిప్పర్తి–1, వేములపల్లి–2, బొమ్మలరామారం–3, అర్వపల్లి–1, నూతనకల్లు–3, చిలుకూరు–1,నిడమనూరు–5, మఠంపల్లి–1 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నిధుల కేటాయింపు ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో 334 గ్రామపంచాయతీలు ఉండగా 26 ఏకగ్రీవం అయ్యాయి. రూ. 1.82కోట్ల నిధులు మంజూరయ్యాయి. -
పంచాయతీలు బతికేదెట్లా?
- రాష్ట్ర బడ్జెట్ నుంచి స్థానిక సంస్థలకు నిధులివ్వని సర్కారు - కేంద్రం నేరుగా ఇచ్చిన నిధులపైనా ఆంక్షలు - ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు - సీనరేజీ, స్టాంపు డ్యూటీల్లో వాటాలూ ఇవ్వలేదు - అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయంటున్న సర్పంచులు - రోజువారీ కార్యక్రమాలకూ నిధుల్లేవని ఆందోళన - పరిస్థితి ఇలాగే ఉంటే ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోవడమే కాదు.. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి వాటికీ నిధుల్లేని దుస్థితి నెలకొంది. రెండున్నరేళ్లుగా స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎటువంటి నిధులు ఇవ్వకపోవడంతోపాటు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నేరుగా వచ్చే ఆర్థిక సంఘం నిధులపైనా ఆంక్షలు పెట్టడమే దీనికి కారణం. స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటారుుంపులపై సలహాలు, సూచనలివ్వాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్ఎఫ్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా సుప్తచేతనావస్థలోనే ఉంచిందంటేనే పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఘాలు పేర్కొంటున్నాయి. స్పందించకుంటే ఉద్యమమే! రెండున్నరేళ్లుగా పంచాయతీలకు నయాపైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రమిచ్చే నిధులను చూపి గ్రామజ్యోతి పేరిట ఓ అభూత కల్పనను ప్రజల ముందుకు తెచ్చిందని పంచాయతీరాజ్ చాంబర్ ఆరోపిస్తోంది. పంచాయతీల్లో కేరళ తరహా పాలన తెస్తామంటున్న పాలకులు... ఆ రాష్ట్రంలో మాదిరిగానే స్థానిక సంస్థలకు బడ్జెట్లో 40శాతం నిధులు కేటారుుంచేలా చూడాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునేందుకు వీలుగా ట్రెజరీల్లో ఫ్రీజింగ్ను ఎత్తివేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ‘చలో అసెంబ్లీ’ పేరిట భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఎన్నో సమస్యల్లో పంచాయతీలు ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధుల్లో తొలివిడతగా కేంద్రం రూ.401 కోట్లను కేటారుుంచింది. కానీ ఆ నిధులు విడుదల కాకుండా ట్రెజరీల్లో ఫ్రీజింగ్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవమైన 460 గ్రామ పంచాయతీలకు పారితోషికాలు ఇంతవరకూ విడుదల చేయలేదు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. సీనరేజీ, స్టాంపుడ్యూటీల్లో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లా పరిషత్లకు అందాల్సిన వాటాను కూడా ఇవ్వలేదు. ఇక స్థానిక సంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో 40శాతం కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. అసలు ప్రజాప్రతినిధులకు నెలనెలా రావాల్సిన వేతనాలకు సంబంధించి ఆరు నెలల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు. పంచాయతీల్లో జారుుంట్ చెక్పవర్ను రద్దు చేసి.. సర్పంచులకు మాత్రమే చెక్పవర్ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పునూ నేటికీ అమల్లోకి తీసుకురాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేసినా.. చైర్మన్ను, సభ్యులను నియమించలేదు. గత ఎనిమిదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోరుున విద్యుత్ బిల్లులు రూ.1,050 కోట్లను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు మొత్తుకుంటున్నా స్పందించడం లేదు. పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం వలన అభివృద్ధి కార్యక్రమాలపై పర్యవేక్షణకు వీల్లేకుండా పోరుుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అధికారాలను.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ బదలారుుంచ లేదు. నిధులపై ఆంక్షలు ఎత్తివేయాలి ‘‘గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులున్నా.. వాటిని వాడుకునేందుకు వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా నియంత్రణ (ఫ్రీజింగ్) పెట్టడం దురదృష్టకరం. గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నందున వెంటనే ట్రెజ రీల్లో ఆంక్షలు ఎత్తివేయాలి. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులను నియమించకపోవడం వలన గ్రామాలకు సక్రమంగా నిధులు వచ్చే పరిస్థితి లేదు. కనీసం ప్రజలు చెల్లించిన ఆస్తిపన్నును వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం వీలు కల్పించకపోవడం బాధాకరం..’’ - మెంటేపల్లి పురుషోత్తం, రాష్ట్ర సర్పంచుల సంఘం కన్వీనర్ తప్పించుకు తిరగాల్సి వస్తోంది ‘‘ఎన్నికై మూడేళ్లు దాటినా సర్పంచులు గ్రామాల్లో ఒక్క అభివృద్ధి పనీ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలకు ముఖం చూపించలేక తప్పించుకు తిరగాల్సిన దుస్థితి. రాష్ట్ర బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా పంచాయతీలకు కేటారుుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. రాజ్యాంగం పంచాయతీలకు కల్పించిన అధికారాలను ప్రభుత్వాలు ఇంకా బదలారుుంచకపోవడంతో... పంచాయతీల పాలనలో ఎమ్మెల్యేల జోక్యం పెరిగింది. ఎమ్మెల్యేల ఆదేశాలకే అధికారులు ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్రామసభల్లో నిర్ణయాలకు విలువ లేకుండా పోతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా త్వరలో ‘చలో అసెంబ్లీ’ చేపడతాం..’’ - చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు -
పంచాయతీలకు వసూళ్లే వసూళ్లు
- వారంలో రూ.32.08 కోట్ల ఆస్తి పన్ను వసూలు - 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపు సాక్షి, హైదరాబాద్: పాత నోట్లతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటుకు గ్రామ పంచాయతీల నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. ఈ నెల 11 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో రూ.32,08,29,499 పన్ను వసూలైంది. వారం రోజుల్లో ఆస్తి పన్ను వసూలు తీరు పరిశీలిస్తే.. 11న అత్యధికంగా రూ.8.16 కోట్లు, శుక్రవారం రూ.2.45 కోట్ల పన్ను వసూలు జరిగింది. 9 జిల్లాల్లో రూ.కోటికి పైగా పన్ను చెల్లింపులు జరిగాయి. కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.8.38కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4.96 కోట్ల పన్ను వసూలైంది. సంగారెడ్డి జిల్లాలో రూ.2.54 కోట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.1.75 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.1.32 కోట్లు, ఖమ్మం జిల్లాలో రూ.1.23 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1.21 కోట్లు, సిద్దిపేట జిల్లాలో రూ.1.10 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.1.07 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 10 వరకు రూ.73.50 కోట్ల ఆస్తి పన్ను వసూలవగా, వారం రోజుల్లోనే రూ.32.08 కోట్లు వసూలవడం గమనార్హం. ఈ నెల 24 వరకు పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు ఉన్న వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకొని బకారుులు చెల్లించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. గ్రామాల్లో అన్ని కుటుంబాలు ఆస్తిపన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
శ్మశానంపై పెత్తనం
► ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం ► శవం పూడ్చాలంటే అనుమతి పొందాలంటూ హుకుం ► బాపురంలో బరితెగించిన తెలుగు తమ్ముడు ఎమ్మెల్యే బి.జయనాగేశ్వరరెడ్డి ఆదర్శంగా తీర్చిదిద్దుతానంటూ ఎంపికచేసుకున్న హాలహర్వి పంచాయతీ అది. దాని మజరా గ్రామమే హెచ్ బాపురం. ఆ గ్రామంలో ఎవరు మృతి చెందినా టీడీపీ నాయకుడి కుటుంబం అనుమతితోనే శ్మశానంలో పూడ్చుకోవాలి. వారు కాదంటే ఎవరి ఇంటిముందు వారు పూడ్చుకోవాల్సిందే. ఏకంగా శ్మశానాన్నే కబ్జాచేసేశాడు ఆ ఘనుడు..! - ఎమ్మిగనూరు నందవరం మండలంలోని హాలహర్వి గ్రామ పంచాయతీ మజరా గ్రామం హెచ్.బాపురం. తరతరాలుగా ఆ గ్రామప్రజలకు శ్మశానవాటికగా గ్రామకంఠం బావిగడ్డ ఉపయోగపడుతోంది. అయితే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగ్రామ టీడీపీ నాయకుడు కిష్టప్ప కుటుంబం.. శవరాజకీయాలకు తెరలేపింది. బావిగడ్డ ప్రాంతం తమ పూర్వీకులదనీ, అక్కడ ఎవరైనా శవాన్ని పూడ్చాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనంటూ హుకూం జారీ చేశారు. శ్మశానంలో ఉన్న కంపచెట్లను తాము తప్ప ఎవరూ కొట్టుకోరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు కూడా. మూడు రోజుల క్రితం శుక్రవారం అదే గ్రామానికి చెందిన తెలుగు జయమ్మ(57)మృతి చెందింది. బంధువుల సమక్షంలో ఆమెను ఖననం చేయడానికీ కుటుంబసభ్యులు శ్మశానవాటికకు వెళ్లారు. తీరా అక్కడ తవ్విన గుంతవద్ద టీడీపీ నాయకుడు కిష్టన్న కుటుంబసభ్యులు ఖననాన్ని అడ్డుకొన్నారు. తమకు తెలపకుండా శవం ఎట్లా పూడ్చుతారంటూ వాదనకు దిగారు. గుంతను తవ్వే వారిపై దాడికి దిగడంతో శోక తప్త హృదయాలతో అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు. శ్మశానం దగ్గర గొడవలెందుకనీ చివరకు జయమ్మను తమ ఇంటిముందే పూడ్చుకొని అంత్యక్రియలు జరుపుకొన్నారు. వివిధ గ్రామాల నుంచీ ఖననానికి వచ్చిన వారంతా ఇదెక్కడి ఆచారం.. ఇదేమీ అధికారం.. కాటికాపరులకంటే కఠినంగా టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ శాపనార్థాలు పెట్టడడం గమనార్హం. ఇది దుర్మార్గం శత్రువైనా చనిపోయిన తరువాత అయ్యో పాపం అంటూ సానుభూతి చూపుతాం. కానీ చచ్చిన శవాలమీద రాజకీయాలు చేసి పైశాచిక ఆనందం పొందటం టీడీపీ నాయకులకే చెల్లింది. అధికారంలో ఉన్నామనీ కిష్టప్ప కుటుంబం విర్రవీగుతోంది. మా ముత్తాతల కాలం నుంచీ ఎవరు చచ్చినా బావిగడ్డ దగ్గరే పూడ్చుతాం. తవ్విన గుంతలో శవాన్ని పూడ్చకుండా అడ్డుకోవటం బాధాకరం. శవం పూడ్చాలంటే వీళ్ల అనుమతీ తీసుకోవాలా..ఇదేమీ ఊరు? - వెంకటమ్మ, మృతురాలి ఆడపడుచు మా అనుమతి తీసుకోవాల్సిందే బావిగడ్డ శ్మశానంలో శవాలను పూడ్చాలంటే మా అనుమతి తీసుకోవాల్సిందే. జయమ్మ కుటుంబం అడక్కుండానే గుంత తవ్వడంతో మా వాళ్లు అడ్డుకొన్నారు. ఎవరు చచ్చినా పూడ్చాలంటే అనుమతి తీసుకోవాల్సిందే. - కిష్టప్ప, టీడీపీ నాయకుడు శ్మశానానికి స్థలం కేటాయించాలి చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 ఎకరాలు శ్మశానం కోసం ఇచ్చారు. గ్రామానికి దూరంగా ఉండటంతో గ్రామస్తులంతా బావిగడ్డ వద్దే శవాలను పూడుస్తున్నారు. బావిగడ్డ శ్మశానానికి దగ్గరలో ప్రభుత్వం స్థలం కేటాయించాలి. - ఎంకన్న,గ్రామస్తుడు -
అంతర్జాలంలో ‘పంచాయతీ’
► జిల్లాలో కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు శిక్షణ పూర్తి ► అన్ని వివరాలు ఈ నెల 21లోగా ఆన్లైన్కు ఆదేశాలు ► కంప్యూటర్లతో కార్యదర్శులు, ఆపరేటర్ల కుస్తీ సత్తెనపల్లి :- గ్రామ పంచాయతీల వివరాలన్నింటినీ ఇకపై అంతర్జాలంలో పొందుపరిచేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 17వ తేదీ డివిజన్ల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు గుంటూరులో శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో వనరులు, ఇంటి పన్నులు, జనన, మరణాలు, నిధులు, విధులు తదితర అంశాలను దస్త్రాల నుంచి అంతర్జాలంలో పొందుపరిచే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 10న పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించి ఈ నెల 21 నాటికి పంచాయతీల వారీగా పూర్తి వివరాలను అంతర్జాలంలో నమోదుకు ఆదేశించారు. మండల కేంద్రాల్లో నమోదు ఇలా.. జిల్లాలోని 57 మండల కేంద్రాల్లో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి చెందిన 2013-14 నుంచి 2015-16 వరకు సాధారణ నిధులు, 13, 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులకు చెందిన నగదు జాబితాలు, అన్ని పంచాయతీలకు చెందిన ఇంటి పన్నులు, పన్నేతర, రెమిటెన్స్ వివరాలను పంచాయతీ కార్యదర్శులు నమోదు చేయాల్సి ఉంది. అన్ని పంచాయతీల 2016-17 అభివృద్ధి ప్రణాళికలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల వివరాలను మండలాల ఈవోపీఆర్డీలు నమోదు చేయాలి. 21లోగా నమోదుకు కసరత్తు.. పంచాయతీల సమాచారం ఆన్లైన్ చేసే ప్రక్రియ ఈ నెల 21 నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీడీవో కార్యాలయాల్లో కంప్యూటర్ల ముందు పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు కసరత్తు ముమ్మరం చేశారు. ప్రతి పంచాయతీ సమగ్ర సమాచారం నమోదు చేయాల్సి ఉండటంతో ఈ నెల 21 నాటికి పూర్తి కావడం సాధ్యమయ్యేలా లేదు. అంతర్జాల నమోదులో ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. వారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. -
సర్కార్కు హైకోర్టు షాక్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా సరూర్నగర్ మండల పరిధిలోని మీర్పేట్, జిల్లెలగూడ, కొత్తపేట, బాలాపూర్, జల్లపల్లి, పహాడీ షరీఫ్ గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి మున్సిపాలిటీలుగా మార్చిన వ్యవహారంలో ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 28 అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. పంచాయతీరాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో 28ని కొట్టేసి ఈ ఆరు గ్రామ పంచాయతీల విధుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సరూర్నగర్ మండల ప్రజా పరిషత్ సభ్యుడు తీగల విక్రంరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సింగిల్ జడ్జి జీవోపై స్టేకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పిటిషనర్... ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ను గురువారం జస్టిస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ముందుగా పంచాయతీలకు నోటీసులు జారీ చేసి అభిప్రాయాలను తెలుసుకున్నాకే డీనోటిఫై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా ఈ కేసులో ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన షోకాజ్ నోటీసుల ఆధారంగా ఇప్పుడు డీనోటిఫై నోటిఫికేషన్ జారీ చేశారని...కానీ రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సింగిల్ జడ్జి ఆ తరువాత ఇదే విధంగా బోడుప్పల్ మున్సిపాలిటీ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో మాత్రం జీవో అమలుపై స్టే విధించారని, ఒకే అంశంపై పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు సరికాదన్నారు. ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్రెడ్డి తోసిపుచ్చారు. మున్సిపాలిటీల ఏర్పాటు ప్రభుత్వ విధాన నిర్ణయమని, విధా న నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. తాము పంచాయతీలకు నోటీసులు జారీ చేసినప్పుడు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారని, వారు నోటీసులు ఇస్తే సరిపోతుందని హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జీవో 28 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
లక్ష్యం రూ.78 వసూళ్లు రూ.17 కోట్లు
పంచాయతీ పన్నుల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం జిల్లా యంత్రాంగం తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం ఈనెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో జిల్లా పూర్తిగా వెనుకబడిపోరుుంది. ఈనెల 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇప్పటివరకు 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. దీనిపై ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని గణాంకాలు చెబు తున్నాయి. వసూళ్లలో జాప్యానికి పంచాయతీ సిబ్బంది కొరత కొంత కారణమైనప్పటికీ.. ప్రస్తుతం పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడటం మూలంగానే పన్ను వసూళ్లలో వె నుకబడ్డామని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 962 పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 19.78 శాతం, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ సేకరణలో 26.06 శాతం మాత్రమే వసూలు చేశారు. పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లా చివరి స్థానంలో ఉండడం గమనార్హం. రెండూ అంతే.. పంచాయతీలకు వచ్చే ఆదాయం పన్నులు(టాక్సబుల్), పన్నేతర (నాన్ టాక్సబుల్) అని రెండు రకాలుగా ఉంటాయి. వీటలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఇంటిపన్నులు , నీటి పన్నులు, గ్రంథాలయ పన్నులు ఉంటాయి. రెండోరకం ఆదాయంలో పంచాయతీలు లెసైన్స్లు జారీ చేయడం, సంతలు, తైబజార్, షాపింగ్ కాంప్లెక్స్ల అద్దెలు వంటివి ఉంటాయి. అయితే ఈ రెండింటి విషయంలోనే జిల్లా ప్రగతి అంతంతమాత్రమే. లక్ష్యం రూ.78 కోట్లు.. వసూళ్లు 17 కోట్లు.. జిల్లాలో రెండు రకాల ఆదాయ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.78, 02,98,452గా ఉంది. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం రూ.17,54,77,494 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ.60,48,20,958 వసూలు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగురోజులే గడువు ఉండడం గమనార్హం. పన్నుల ద్వారా రూ.44,40,67,470 ఆదాయం రావల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 8,78,56,929 మాత్రమే సేకరించారు. ఇంకా రూ.35,62,10,541 రావల్సి ఉంది. అంటే సరాసరిన 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. ఇక పన్నేతర ఆదాయం కింద జిల్లాలో రూ.33,62,30,982 రావల్సిండగా ఇప్పటివరకు 8,76,20,555 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ. 24,86,10,427 సేకరించాల్సి ఉంది. ఈ మండలాల్లో 10 శాతంలోపే... పంచాయతీల ఆదాయం 10 శాతంకన్నా తక్కువ సాధించిన మండలాలు పరిశీలిస్తే చేర్యాల -6.21 శాతం,ఖానాపూర్ 7.53 శాతం, పరకాల 7.17 శాతం, రాయపరి ్త 4.59 శాతం, చెన్నారావుపేట 7.53 శాతం సాధించి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. 50 శాతం దాటింది 8 మండలాలే... పన్నుల వసూళ్లలో 50 శాతం లక్ష్యం దాటింది కేవలం ఎనిమిది మండలాలే. వీటిలో నర్సింహులపేట 50.08 శాతం, తాడ్వాయి 56.41 శాతం, ఏటూరునాగారం 66.36 శాతం, గీసుకొండ 53.82 శాతం, గోవిందరావుపేట 63.12 శాతం, గూడూరు 63.46 శాతం,నెక్కొండ 54.58 శాతం, తొర్రూరు 58.56 శాతం వసూళ్లు సాధించారుు. -
సైకో వీరంగం
104 వాహనంపై దాడి.. అద్దాలు ధ్వంసం చివ్వెంల: సైకో వీరంగం సృష్టించాడు. 104 వాహనంపై దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు కొద్ది నెలలుగా మతిస్థిమితం సరిగా లేక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2 నెలల క్రితం పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్పై వచ్చిన నాగరాజు.. తిరిగి గ్రామస్తులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరుస్తున్నాడు. సోమవారం గ్రామంలోకి వచ్చిన 104 వాహనంపై కర్రతోదాడి చేసి సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పంచాయతీలే పవర్ఫుల్
♦ కేరళలో పటిష్టంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ♦ గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీలుగా స్థానిక సంస్థలు ♦ అధ్యయనానికి రాష్ట్రం నుంచి కేరళ బాట పట్టిన ప్రజాప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: అక్కడ ప్రభుత్వమంటే పంచాయతీలే. అభివృద్ధి ప్రణాళికల నుంచి వాటి అమలు వరకు వాటిదే కీలక పాత్ర! కీలక అధికారాలు క్షేత్రస్థాయిలో పనిచేసే పంచాయతీల చేతిలోనే ఉండటంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. కేరళలోని పంచాయతీరాజ్ వ్యవ స్థ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనానికి తెలంగాణ సర్కారు రాష్ట్రం నుంచి జిల్లాల వారీగా కేరళలోని ‘కిలా(కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్)’కు పంపుతోంది.ఇటీవల కరీంనగర్ జిల్లాపరిషత్ చైర్మన్ తులా ఉమ ఆధ్వర్యంలో ఆ జిల్లా జెడ్పీటీసీలు, సర్పంచులు కేరళలోని పాలక్కడ్, త్రిశూర్ జిల్లా పంచాయతీలు, వల్లచిర్ల, మడకతర గ్రామపంచాయతీలను సందర్శించారు. అవినీ తికి దూరంగా అధికార యంత్రాంగం పనిచేస్తుండటం, అంటరానితనాన్ని, కుల వివక్షను సంపూర్ణంగా నిర్మూలించగలగడం, ప్రజాప్రతినిధులంతా జవాబుదారీతనం కలిగి ఉండడమే ‘కేరళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అని అంటున్నారు ‘కిలా’ ఆచార్యులు. ఇతర దేశాల నుంచి కూడా అధికారులు ‘కిలా’లో శిక్షణకు వస్తుండటం విశేషం. అన్నీ ప్రెసిడెంటే... మన దగ్గర పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లు ఉండగా, ఆ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీ, జిల్లా పంచాయతీలని పిలుస్తారు. అయితే.. ఆయా పంచాయతీలనే స్థానిక ప్రభుత్వాలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. ఎందుకంటే.. ఆ పంచాయతీల పరిధిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ స్థానికేతరుల జోక్యం ఉండదు. గ్రామస్థాయిలో పంచాయతీలకు సంపూర్ణ అధికారాలను అక్కడి ప్రభుత్వం కట్టబెట్టింది. పంచాయతీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ల నియంత్రణలోనే ఉంటారు. అభివృద్ధి పనుల్లో నాణ ్యతకు, నిధుల వినియోగానికి పంచాయతీ ప్రెసిడెంట్ జవాబుదారీగా ఉంటారు. రాష్ట్రస్థాయిలో విధానాల రూపకల్పన మినహా క్షేత్రస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు, చివరికి మంత్రుల జోక్యం ఉండదంటే అతిశయోక్తి కాదు. గ్రామ పంచాయతీల పనితీరిలా... గ్రామసభలను వార్డు స్థాయిల్లో(ఆయసభ) నిర్వహించి స్థానిక ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తారు. ప్రతి మూడు నెలలకోమారు తప్పనిసరిగా ఆయా సభలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కృషిభవన్(వ్యవసాయ), వెటర్నటీ ఆసుపత్రి, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ, బాలవాడీలు, డే కేర్ సెంటర్లు, ప్రాథమిక పాఠశాలలు, మత్స్య ఉప కేంద్రాలు, గిరిజన విస్తరణ కేంద్రాలు ఉంటాయి. ఆయా విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికీ, వీరంతా స్థానిక ప్రభుత్వ(పంచాయతీ) ఆధీనంలోనే పనిచేయాలి. పనితీరు బాగోని అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కు ఉంటుంది. ప్రధానంగా ఆస్తి పన్ను, వృత్తి పన్ను, వినోద పన్ను, ప్రకటనల పన్ను రూపేణా సొంత వనరులు కలిగి ఉంటాయి. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 40 శాతం నిధులను నేరుగా కేటాయిస్తోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులూ గ్రామ పంచాయతీ ఖాతాలకే జమ అవుతాయి.కేరళ స్థానిక సంస్థల బలోపేతానికి మూల కారణం వంద శాతం అక్షరాస్యతని మడక్కతర గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ వినయన్ చెప్పారు. స్థానిక పాలనలో విపక్ష సభ్యులను కూడా భాగస్వాములను చేస్తామని, ఇక్కడ కుల వివక్షలేదని పాలక్కడ్ జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ శాంతకుమారి తెలిపారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇలా... గ్రామ పంచాయతీలు 978 బ్లాక్ పంచాయతీలు 152 జిల్లా పంచాయతీలు 14 కమిటీలు: స్టీరింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీలు, సబ్ కమిటీలు, జాయింట్ కమిటీలు, వర్కింగ్ గ్రూపులు -
రోజూ గంట ఉచిత వైఫై!
* పంచాయతీల్లో అందుబాటులోకి ఫైబర్ నెట్వర్క్ * మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు * కేంద్రానికి డీపీఆర్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైబర్ నెట్వర్క్ ప్రాజెక్టు పూర్తై తరువాత ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫైను అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన సవివరమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలోని స్థానిక ప్రజలు వినియోగించుకునేందుకు ప్రతిరోజూ గంటపాటు ఉచితంగా వైఫై సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ప్రతి జిల్లా కేంద్రంలో 25 ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి మండల కేంద్రంలో పది ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఈ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.4,320 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.3,590 కోట్ల ఇవ్వాలని, మిగతా రూ.730 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నివేదిక కేంద్ర టెలికం, ఐటీ శాఖల పరిశీలనలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ అధికారవర్గాలు తెలిపాయి. టెరా రుణానికి సర్కారు గ్యారంటీ ! వాస్తవానికి ఇప్పటికే (కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే) తొలి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తన బినామీ అయిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థకు కట్టపెట్టారు. 22,500 కిలోమీటర్ల మేర ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటునకు గాను రూ.333 కోట్ల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చేశారు. టెరా సంస్థకు ఆంధ్రా బ్యాంకు రూ.266.4 కోట్ల రుణం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని బ్యాంకు షరతు విధించింది. రూ.75 కోట్లను మార్జిన్ మనీ గా చూపించాలని టెరాను కోరింది. దీంతో టెరా సంస్థ.. ఆ మేరకు గ్యారంటీ, మార్జిన్ మనీ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సాధారణంగా ఏ ప్రాజెక్టుకైనా కాంట్రాక్టర్ బ్యాంకు నుంచి రుణం తీసుకునే పక్షంలో.. ఆ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వదు. కానీ టెరాకు మాత్రం ఇస్తుండడం విశేషం. -
నాలుగేసి పంచాయతీలకు ‘ఒకే ఒక్కడు’
* రాష్ట్రంలో మూడు వేలకు పైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీ * ఇన్చార్జి అధికారులతో కుంటుపడుతున్న గ్రామాల అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన కుంటుపడుతోంది. అభివృద్ధి ప్రణాళికలు అటకెక్కుతున్నాయి. గ్రామాభివృద్ధి పనుల గురించి ఒకప్పుడు గ్రామ సర్పంచ్ చుట్టూ ఆ గ్రామానికి చెందిన అధికారులు (కార్యదర్శి, వీఆర్వో..తదితరులు) తిరిగేవారు. అయితే.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. గ్రామ కార్యదర్శి ఎక్కడున్నాడోనని సర్పంచులు వెదుక్కొని ఫైళ్లపై సంతకాల కోసం వారి వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 8,685 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో 3,600 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆయా గ్రామాలకు పక్కన ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. దీంతో ఒక్కో పంచాయతీ కార్యదర్శి కనిష్టంగా నాలుగేసి గ్రామాలకు, గరిష్టంగా ఏడు గ్రామాలకు పనిచేస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో గ్రామ పంచాయతీలను కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన గ్రామజ్యోతి పథకం అమలుపైనా ఈ ప్రభావం పడుతోంది. ఏరోజు ఎక్కడుంటారో తెలియదు.. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏ రోజు ఏగ్రామంలో ఉంటారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది. వారంలో ఏడు రోజులకు గాను ఒక్కోరోజు ఒకో గ్రామంలో పనిచేయాల్సి వస్తోంది. ఒకేరోజు ఆయా గ్రామాల సర్పంచులు సమావేశాలు ఏర్పాటు చేసిన పక్షంలో ఏగ్రామానికి వెళ్లాలో అర్థం కాక పంచాయతీ కార్యదర్శులకు కూడా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అంతేకాక. ఉన్నతాధికారులు పిలిచిన పక్షంలో మండల కేంద్రానికో, డివిజన్, జిల్లా కేంద్రాలకో పరుగులు పెట్టాల్సి వస్తోంది. పలు గ్రామాలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం, పంచాయతీ కార్యదర్శులకు ఎటువంటి అలవెన్స్ ఇవ్వడం లేదు. కనీసం టీఏ, డీఏలను కూడా సర్కారు ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల్లోనూ ప్రతిష్టంభన పంచాయతీరాజ్ విభాగంలో నాలుగు స్థాయి ల్లో(గ్రేడ్ 1,2,3,4) పంచాయతీ కార్యదర్శులుం టారు. ఆయా గ్రామ పంచాయతీల ఆదాయా న్ని బట్టి గ్రేడ్లవారీగా కార్యదర్శులను ప్రభుత్వం నియమిస్తోంది. గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు ఎక్స్టెన్షన్ అధికారులు(ఈవో పీఆర్డీ)గా పదోన్నతులు ఇచ్చే విషయంలో ఎంతోకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. 20 ఏళ్లుగా ఎంపీడీవోలకు పదోన్నతులు లేకపోవడంతో ఈవోపీఆర్డీలకూ పదోన్నతులు లభించడం లేదు. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ పంచాయతీ కార్యదర్శులకు కూడా పదోన్నతులు అందని ద్రాక్షగా మారా యి. గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు ఈవోపీఆర్డీలుగా పదోన్నతులను కల్పిస్తే మరిన్ని పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇటీవల సర్పంచులు కొందరు.. ఆ విభాగం డెరైక్టర్కు విజ్ఞప్తి చేయగా, కార్యదర్శుల నియామకాన్ని ప్రభుత్వం ఆర్థిక భారంగా చూస్తోందని చెప్పినట్లు తెలిసింది. గ్రామజ్యోతి పైనా ప్రభావం! గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామా ల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా గ్రామజ్యోతి కార్యక్రమాన్ని సర్కారు ప్రారంభించింది. ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధిని సాధించేం దుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది. ఈ ప్రక్రియంతా పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంది. అయితే కార్యదర్శుల కొరత కారణంగా అభివృద్ధి కమిటీల సమావేశాలు జరగడం లేదు. ఒకవేళ జరిగి నా ప్రణాళికలను ప్రభుత్వానికి పంపడంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. -
పంచాయతీల అభివృద్ధికి రూ.5 వేల కోట్లు
కేంద్రమంత్రి దత్తాత్రేయ కొలనుపాక(ఆలేరు)/యాదగిరికొండ : తెలంగాణలో గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు మంజూరు చేయనుందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద తాను దత్తత తీసుకున్న నల్లగొండ జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామాన్ని శనివారం మంత్రి సందర్శించారు. అలాగే యాదగిరిగుట్ట దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. గుట్టకు రైల్వే స్టేషన్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. -
2న ఈ- పంచాయత్ ప్రారంభం
తొలి దశలో జనన, మరణ ధ్రువపత్రాలు సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం తల పెట్టిన ఈ-పంచాయత్ వ్యవస్థను గాంధీ జయంతి రోజు(అక్టోబర్ 2)న ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. దీనిద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ-పంచాయత్ల ఏర్పాట్లకు సంబంధించి పంచాయతీరాజ్, ఐటీశాఖ అధికారులతో శుక్రవారం కేటీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో జనన, మరణ ధ్రువపత్రాల వంటి పౌరసేవలను అందిస్తారని, ఆపై జాతీయ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు, ఆసరా పింఛన్ల పంపిణీ అందించనున్నట్లు చెప్పారు. ఆర్థిక సేవల విషయమై పలు బ్యాంకులతో చర్చిస్తున్నామని, ప్రభుత్వం తరఫున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ సేవలను అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ-పంచాయత్ల నిర్వహణ నిమిత్తం విలేజ్ లెవల్ ఎంట్రెప్రెన్యూర్ (వీఎల్ఈ)లను నియమిస్తామని, ఆయా గ్రామాల్లో డిగ్రీ అర్హత కలిగిన మహిళలకే వీఎల్ఈలుగా అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు కేటీఆర్ చెప్పారు. ఈ- పంచాయత్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ టెస్టింగ్ పూర్తయిందని, ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీఎల్ఈలకు శిక్షణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంట ర్నెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా వాటర్గ్రిడ్ పనులతోపాటు ఫైబర్ ఆ ప్టిక్ కేబుల్ వేయాలని, ఇందుకోసం త్వరగా పూర్తిస్థాయి డిజైన్ను రూపొందించాలన్నా రు. సమావేశంలో పంచాయతీరాజ్ ము ఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో మురళి, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
అధికారుల పేరుతో వసూళ్లు
భువనగిరి: ‘మీ వెంచర్ మీద ఫిర్యాదులు వచ్చాయి.. కలెక్టర్ సీరియస్గా ఉండు.. నేను రిపోర్టు పంపానో మీ వెంచర్ మూసుకోవాల్సిందే.. వెంటనే వచ్చి కలుస్తావా లేదా నీ ఇష్టం..’ ఓ వెంచర్యజమానికి గ్రామస్థాయి అధికారి ఫోన్లో హెచ్చరిక...‘మీ గ్రామంలో వెంచర్ అయ్యింది.. అతను సర్పంచ్నే కలిశాడు.. వార్డు సభ్యులను కలువలేదు.. మీరు వెంటనే అతనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయండి.. ఆపై అంతా నేను చూసుకుంటా..’ ఓ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు ఆ గ్రామ అధికారి ఉద్బోధ... ఇదీ భువనగిరి డివిజన్లో ప్రస్తుతం నెలకొన్న రియల్ దందా తీరు. సీఎం కేసీఆర్ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎంతో శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదనుగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి,భువనగిరి, ఆలేరు, బీబీనగర్ మండలాల్లో అత్యధికంగా నూతన వెంచర్లు వెలిశాయి. యాదగిరిగుట్ట అభివృద్ధిని బూచిగా చూపి ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వెలుస్తున్నా యి. కనీసం గ్రామ పంచాయతీ దరఖాస్తు కూడా చేసుకోకుండా వెంచర్ల యజ మానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్ డీపీఓ వంటి అధికారులు ఎప్పటికప్పుడు అక్రమాలపై వేసిన నిఘా క్షేత్రస్థాయి ఉద్యోగులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అక్రమ వెంచర్ల వివరాలను సేకరించాలని చెబితే కొందరు ఉద్యోగులు రియల్టర్లతో బేరసారాలు పెట్టారు.ఫలితంగా ఉన్నతాధికారుల పేరు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని సమాచారం. పంచాయతీ కార్యదర్శులపై కలెక్టర్ ఆగ్రహం భువనగిరిలో డి విజన్స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సమయంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ వెంచర్ల వివరాలు సేకరించి వాటిని తొలగించాలని చెబితే తన పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారట ఈ విషయాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తానని కలెక్టర్ హెచ్చరించారు. తన పేరుతో అక్రమాలకు పాల్పడితే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో చిచ్చు పెడుతున్న వెంచర్లు గ్రామ పంచాయతీ పరిధిలో విచ్చల విడిగా ఏర్పాటవుతున్న వెంచర్లలో అధికారుల పాత్ర క్రియాశీలకంగా మారింది. కొన్ని గ్రామాల్లో సర్పంచ్- వార్డు సభ్యుల మధ్యన వెంచర్ల విషయంలో తీవ్ర స్థాయిలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వార్డు సభ్యులకు అక్రమ వెంచర్ల వివరాలను గ్రామ స్థాయి అధికారులు అందించడంతో వివాదాలను మధ్యవర్తులుగా ఉండి సర్దుబాటు చేస్తున్నారు. అక్రమ వెంచర్ల విషయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్యవివాదాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్తున్నాయి. భువనగిరి మండలం రాయిగిరిలో వెలిసిన 400 ఎకరాల వెంచర్కు అనుమతి విషయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్- వార్డు సభ్యుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం దాడులు చేసుకున్నారు. నూతన వెంచర్లు వెలిసిన చోటే.. నూతన వెంచర్లు వెలిసినచోటే ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులుఎన్ని నిబంధనలు జారీ చేసినా టాస్క్పోర్స్ అధికారులు అక్రమ వెంచర్లు గుర్తించి నోటీస్లు జారీ చేసినా అక్రమాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో అధికారుల అండదండలతో పేర్లు మార్చి కొత్త వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. యాదగిరిగుట్ట, రాయగిరి, వడాయిగూడెం, సైదాపురం, వంగపల్లి, పెద్ద కందుకూరు వంటి గ్రామాల్లో రియల్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. గ్రామాల్లో పలు వివాదాలకు కారణం అవుతున్నాయి. అలాంటి వారిని ఊపేక్షించం, ఎన్. మధుసూదన్, ఆర్డీఓ, భువనగిరి రియల్ వ్యాపారుల మోసాలకు ఆసరాగా నిలిచే ఉద్యోగులను ఊపేక్షించం. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి వారిపై నిఘాపెట్టాం. వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడబోం. అన్ని అనుమతులు తీసుకునే విషయంలో స్థానికంగా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అనుమతులు లేని వెంచర్లను తొలగించాలి. -
పారిశుధ్య కార్మికుల సమ్మె విరమణ
-
పంచాయతీలకు రూ.24.94 కోట్లు
విజయనగరం మున్సిపాలిటీ: అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ఇది తీపి కబురు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరయ్యాయి. 14వ ఆర్ధిక సంఘం కింద రూ24 కోట్ల 94 లక్షల 37వేలను ఈనెల 1వ తేదీన విడుదల చేసింది. 2015-16 ఆర్థిక సం వత్సరంలో తొలి విడతగా కింద ఈ నిధులు మంజూరైనట్లు జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు తెలిపా రు. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలుండగా... ఆ యా పంచాయతీల్లో ఉన్న జనాభా ప్రాతిపదికన ఈ నిధు లు కేటాయించనున్నారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారా మండల ట్రెజరీలకు సోమవారం జమ చేశారు. జమ చేసిన నిధులు నాలుగు, ఐదు రోజుల్లో పంచాయతీల ఖాతాల్లో పడనున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆర్ధిక సంఘం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉండగా.. 14వ ఆర్ధిక సంఘం కింద కేటాయించిన రూ 24.94 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు వినియోగించేందుకు అనుమతిచ్చింది. ఈ నిధులను సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, విధీ దీపాలకు వినియోగిం చే విద్యుత్బిల్లులు చెల్లింపులకు వినియోగించవచ్చు. రక్షిత మంచి నీటి పథకాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ఈ నిధులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. గత ఏడాది జిల్లాలోని 203 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు కేటాయించిన కంప్యూటర్లకు వినియోగించే ఇంటర్నెట్ల బిల్లుల చెల్లింపులు చేసుకోవచ్చు. -
పన్నుల వసూళ్లు వేగవంతం చేయండి
- జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి వికారాబాద్ రూరల్: గ్రామ పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లను జూన్ 30లోపు పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి సూచించారు. శుక్రవారం స్థానిక రవీంద్ర మండపంలో ఈఓపీఆర్డీలు, డివిజన్స్థాయి పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్నుల వినియోగంలో అవకతవకలు జరిగితే సస్పెండ్ చేయడంతోపాటు కార్యదర్శుల నుంచి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. వసూలైన పన్నులను గ్రామాల్లో మంచినీటి సమస్యలు తీర్చేందుకు ఉపయోగించాలన్నారు. దోమ మండలంలో అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి నుంచి రూ. రెండు లక్షలు రికవరీ చేశామని, ఒకసారి అక్రమాల్లో దొరికితే ఇంక్రిమెంట్లు ఉండవని, సస్పెండ్ అవుతారని అన్నారు. మే 15 తేదీలోపు జీపీ రికార్డులను కంప్యూటర్లలో అప్లోడ్ చేయాలన్నారు. వికారాబాద్, నవాబుపేట మండలాలకు సంబంధించిన పంచాయతీ రికార్డులను కంప్యూటరీకరణ వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన యాలాల ఈఓఆర్డీపై డీపీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, ఈఓపీఆర్డీలు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే పిల్లనిస్తం
మెదక్ జిల్లా ఎన్సాన్పల్లిలో గ్రామపంచాయతీ తీర్మానం సిద్దిపేట: ‘మరుగుదొడ్డి ఉంటేనే పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం లేదంటే పిల్లనివ్వం.. ’అంటూ వినూత్నంగా తీర్మానం చేసింది మెదక్ జిల్లా సిద్దిపేట మండంలోని ఎన్సాన్పల్లి గ్రామ పంచాయతీ. ప్రజలందరికీ కనిపించేలా పంచాయతీ కార్యాలయం ఎదుట బోర్డు ఏర్పాటు చేసి బహిరంగానే ప్రచారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి కారణం.. 2013-14లో సంవత్సరానికి ఎన్సాన్పల్లి గ్రామాన్ని నిర్మల్ పురస్కార్కు అధికారులు ప్రతిపాదించారు. దీంతో ప్రజలు, పురస్కార సాధనకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. మరుగుదొడ్డి లేని కొన్ని కుటుంబాల కారణంగా అర్హత సాధించలేక దూరమైపోయింది. అందుకు గానూ గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా పై నిర్ణయం తీసుకుంది. గ్రామంలో 4,888 మంది జనాభాకు 1400 కుటుంబాలు, 1034 ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1019 ఇళ్లకు నిర్మల్ పురస్కార్కు ప్రతిపాదించినప్పటికే మరుగుదొడ్ల నిర్మాణాలు జరిగాయి. ఇంకో 15 ఇళ్లు మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సి ఉంది. దీనికి గానూ గ్రామ పంచాయతీ వద్ద బోర్డు ఏర్పాటు చేసినట్లు గ్రామ పాలక వర్గం చెబుతోంది. -
‘ఏకగ్రీవ’ నజరానా ఏదీ..?
భువనగిరి : గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన స్థానాలకు ఇస్తామన్న నజరానా నేటి కీ అందలేదు. ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. సంవత్సరన్నర కాలంగా నగదు బహుమతి కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్లకు నిరాశే మిగులుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దంపట్టే విధంగా ఉందని ఏక గ్రీవ పంచాయతీల సర్పంచ్లు, ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయితీలకు రూ. 5 నుంచి రూ.7లక్షల వరకు ఒక్కో పంచాయతీకి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా గల 1169 గ్రామపంచాయతీల్లో 103 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2013 జూలైలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహక బహుమతిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7.21కోట్లు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇంతవరకు ఆ నిధుల జాడేలేకపోవడంతో సర్పంచ్లు పాలకవర్గ సభ్యులువాటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఏకగ్రీవ నిధులు వస్తే తమ గ్రామాల్లో మరిన్ని అభివృద్ధిపనులు చేసుకోవచ్చని సర్పంచ్లు భావించారు. ఏడు లక్షల రూపాయలు వస్తే తమ పంచాయతీల్లో మంచినీరు, మురికికాలువల నిర్మాణంతోపాటు వీధిలైట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా ఎవరి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ప్రకటించిన నగదు బహుమతిని ప్రోత్సహించాలని సర్పంచ్లు కోరుతున్నారు. డివిజన్ సర్పంచ్లు ఏకగ్రీవం భువనగిరి 337 32 నల్లగొండ 203 05 సూర్యాపేట 253 16 మిర్యాలగూడ 225 09 దేవరకొండ 151 11 మొత్తం 1169 103 -
టార్గెట్ వంద శాతం
►పంచాయతీ పన్ను వసూళ్ల సవాల్ ►ఆర్థిక భారం తగ్గించుకునే పనిలో సర్కార్ ►కార్యదర్శులు.. పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు వసూలు చేయకుంటే వే టు భయం రూ.17 కోట్లకు వసూలైంది రూ.8 కోట్లే ముగింపు దశలో ఆర్థిక సంవత్సరం లక్ష్యం చేరాలంటున్న ప్రభుత్వం సాక్షి, మంచిర్యాల : గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్ను వసూళ్లు చేపట్టాలనేది ప్రభుత్వం లక్ష్యం. కానీ.. ఆ లక్ష్యం చేరుకోవాలంటే జిల్లాలోని పంచాయతీల్లో ఇంకా రూ.9కోట్లు వసూలు కావాల్సి ఉంది. అది కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ రెండు నెలల్లోనే. గడిచిన పదేళ్లలో కేవలం రూ.8 కోట్లు వసూలు చేసిన జిల్లా సిబ్బంది ఇప్పుడు సవాల్గా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు రూ. కోటి కూడా దాటని వసూళ్లు.. ఈ రెండు నెలల్లోనే ఇంత మొత్తంలో ఎలా వసూలు చేసేదని అయోమయంలో పడ్డారు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం కావడం.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నిధులు సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. అందుకే.. గ్రామ పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, నల్లా పన్నులు రాబట్టే విషయంలో సీరియస్గా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రామాల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్రయ, దుకాణాల పన్నుల లక్ష్యంలో 75 శాతం వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. పన్నుల వసూళ్లపై దృష్టిసారించి.. ప్రభుత్వ ఖాజానాను నింపాలని సంబంధిత పంచాయతీ అధికారులను ఆదేశించింది. వసూళ్లేలా సాధ్యం..? రోజుకు కనీసం 2 నుంచి 3 పంచాయతీల్లోనైనా తిరిగి పన్నులు వసూలు చేయాలని ఈవో పీఆర్డీలను జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆదేశించారు. ఇటు మండల పరిషత్ అధికారులు తమ పరిధిలో ఉన్న పంచాయతీల్లో కనీసం పదింటిలోనైనా వంద శాతం, మిగతా పంచాయతీల్లో 75 శాతానికి తగ్గకుండా పన్నులు వసూలు చేయాలని ఆదే శించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లాలో 27 మేజర్.. 839 మైనర్లతో కలుపుకుని మొత్తం 866 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిని 580 క్లస్టర్లుగా విభజించారు. 159 క్లస్టర్లకు పంచాయతీ కార్యదర్శులు లేరు. చాలా చోట్ల కార్యదర్శులు మూడుకు మించి పంచాయతీలకు ఇన్చార్జీలుగా కొనసాగుతున్నారు. ఇన్చార్జి స్థానాల్లో ప్రజలకు కనీస వసతులు లేక పన్నులు చెల్లించేందుకు మొండికేస్తున్నారు. గ్రామా ల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్ర య, దుకాణాల పన్నుల వసూలు చూసుకుంటున్న బిల్ కలెక్టర్లు, కారోబార్లు, ఎన్ఎంఆర్ పోస్టులూ రెం డొందలకు పైగా ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉ న్న ఖాళీల సమస్య గ్రామాల్లో పన్నుల వసూళ్లకు అడ్డంకిగా మారింది. మరోపక్క.. దాదాపు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడంతో పన్నుల వసూళ్లకు అధికారులెవరైనా ఒత్తిడి తెస్తే.. ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయా ప్రజాప్రతినిధులూ ప్రజలను ఒత్తిడి చేయొద్దని చెబుతుండడంతో ఆ ప్రభావం వసూళ్లపై చూపుతోంది. పన్నుల వసూలు చేయాల్సిందే.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఈ ఆర్థిక సంవత్సరం ముగించేలోగా.. జిల్లా వ్యాప్తం గా డిమాండ్ మేరకు పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కార్యదర్శు లు పంచాయతీల్లో కనీసం 75 శాతం పన్నులు వసూ లు చేయాలి. వసూలు చేయని వారిపై నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. -
‘పంచాయతీ’లో విప్లవాత్మక మార్పులు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. కేరళలో విజయవంతమైన పంచాయతీ వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్న పలు విధానాలను తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు. పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలపై అధ్యయనంలో భాగంగా బుధవారం ఆయన తిరువనంతపురం జిల్లాలోని మణికల్ గ్రామంలో పర్యటించారు. మంత్రి పర్యటన వివరాలను ఇక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మణికల్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కమిటీలు, ఇతర సిబ్బంది, ప్రజలతో సమావేశమై ఆయన పలు అంశాలపై చర్చించారు. కేరళలోని గ్రామ పంచాయతీలు తమ అధికారాలను వినియోగించుకుని సమర్థంగా పనిచేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. కేరళలో కేవలం 964 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయని, తెలంగాణలో మాత్రం వాటి సంఖ్య 8,400పైనే ఉంటుందన్నారు. సమీకృత గ్రామ పంచాయతీ భవన సముదాయంలోని వసతులను ఆయన పరిశీలించారు. ఒకే చోట పౌర సేవలు అందిస్తున్న తీరును కొనియాడారు. అనంతరం మంత్రి కేటీఆర్ .. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థ రూపకర్త, కేంద్ర ప్రత్యేక కార్యదర్శి విజయానంద్, సీనియర్ అధికారి జేఎం వర్గీస్తో భేటీ అయ్యారు. కేరళ నమూనా స్ఫూర్తితో తెలంగాణలో అమలు చేయదగిన కార్యక్రమాలపై అధికారుల నుంచి సలహాలు స్వీకరిం చారు. ‘కేరళ స్థానిక పాలన సేవల పథకం’ వివరాలను సేకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ని మంత్రి ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు. -
అంగట్లో అవినీతి!
షాబాద్: పశువుల సంతలో మేట వేసిన అవినీతి గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు. సంతలో క్రయ విక్రయాలకు సంబంధించి వసూలైన డబ్బుల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మండలంలోని సర్దార్నగర్ సంతలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. సంత బుక్కులను, నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ప్రతి మంగళవారం జరిగే సర్దార్నగర్ సంతలో పశువుల అమ్మకం, కొనుగోళ్లపై నూటికి 2 శాతం పన్ను వసూలు చేయాలి. ఆ డబ్బులను గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కంటితుడుపు చర్యగా రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేస్తున్నారు. మిగతా డబ్బును బినామీలు పంచుకుంటున్నారు. సర్దార్నగర్కు చెందిన రామ్మోహన్ అనే వ్యక్తి ఈ సంతను మధ్యవర్తిగా ఉండి నడిపిస్తున్నాడు. కమీషన్ రెండు శాతం వసూలు చేయాల్సింది పోయి 5 నుంచి 10 శాతం వరకు వరకు వసూలు చేస్తున్నారు. రైతులను, వ్యాపారులను నిలువునా ముంచుతున్నారు. ఈ సమాచారం ఏసీబీ అధికారులకు తెలిసింది. దీంతో మూడు వారాల క్రితం వారు సంతకు వచ్చి పరిశీలించారు. దీంతో మంగళవారం దాడులు జరిపారు. సర్పంచ్, రామ్మోహన్ ఇళ్లలో సోదాలు చేశారు. వారి ఇళ్లలో సంతకు సంబంధించి 50 బుక్కులు దొరికాయి. మొత్తం 220 రసీదులు, రూ.1.81 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఏస్పీ ప్రభాకర్తో పాటు సీఐలు వెంకట్రెడ్డి, లక్ష్మీ, సునీల్, గోవిందరెడ్డి బృందాలుగా ఏర్పడి పశువుల సంతలో జరుగుతున్న అవినీతిని పసిగట్టారు. అవకతవకలకు పాల్పడినవారిని అదుపులోకి తీసుకున్నారు. సర్దార్నగర్ పశువుల సంత 2007 నుంచి 2008 వరకు గ్రామ పంచాయతీయే వేలం వేసేది. వేలం పాడిన వ్యక్తి ఆ డబ్బులను వెంటనే గ్రామ పంచాయతీలో జమ చేసి ఏడాది పాటు సంత నడుపుకునేవారు. 2008లో హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని రోజులు ఈ సంతను మార్కెట్ కమిటీ నిర్వహించింది. గ్రామ పంచాయతీ మళ్లీ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో తిరిగి పంచాయతీకే సంతను అప్పగించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత అవినీతి జరిగిందో రెండు మూడు రోజులు సోదాలు నిర్విహ ంచి అవినీతి పరులను కటకటాలకు పంపుతామని ఏసీబీ అధికారులు చెప్పారు. 2008 నుంచి 2014 వరకు ప్రతి అంగడిలో ఎంత ఆదాయం వచ్చిందో, ఎన్ని డబ్బులు బ్యాంకులో జమ చేశారో.. ప్రైవేట్ వ్యక్తులు ఎంత దోచుకున్నారో బ్యాంకు స్టేట్మెంట్ తీసుకోని వివరాలు వెల్లడిస్తామన్నారు. -
పవర్ ‘పంచాయితీ’
సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వం, సర్పంచుల మధ్య అగాధాన్ని పెంచుతోంది. బకాయిపడ్డ కరెంట్ బిల్లుల చెల్లింపు బాధ్యత పం చాయతీలదేనని ఇది వరకే స్పష్టం చేసిన ప్రభుత్వం బిల్లు వసూళ్ల విషయంలోనూ కఠినంగా వ్యవహరిం చాలని పంచాయతీ, విద్యుత్ అధికారులను ఆదేశించింది. అవసరమైతే పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యుత్ శాఖాధికారులు ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్న 30కిపైగా గ్రామాల్లో కరెంట్ సరఫరా నిలిపేశారు. ప్రజల ఆందోళనలతో మళ్లీ పునరుద్ధరించారు. విద్యుత్ బకాయి వసూళ్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్న సర్పంచులు ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లించేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. మరోపక్క.. విద్యుత్ చార్జీల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించినా.. వసూళ్లలో పురోగతి లేకపోవడంతో పంచాయత్రాజ్ శాఖ రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ శనివారం హైదరాబాద్లో అన్ని జిల్లాల డీపీవోలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఒకవేళ సమావేశంలో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే.. బకాయి ఉన్న పంచాయతీలకు కరెంట్ సరఫరా నిలిపివేసే అవకాశాలూ లేకపోలేదని ఆ శాఖకు చెందిన సీనియర్ అసిస్టెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. కొనసాగుతున్న కరెంట్ సరఫరా నిలిపివేత.. జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 27 మేజర్ పంచాయతీలుండగా.. మిగిలినవి మైన ర్ జీపీలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. సంబంధిత శాఖాధికారులు బకాయిలు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొనడంతోపాటు తాగునీటి పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలు రక్షిత తాగునీటికి దూరమవుతున్నారు. పలు చోట్ల సర్పంచులు, ఎమ్మెల్యేల హామీతో విద్యుత్ అధికారులు కరెంటును పునరుద్ధరిస్తున్నారు. ఏదీ స్పష్టత...? విద్యుత్ చార్జీల చెల్లింపు విషయంలో ప్రభుత్వం, సర్పంచుల మధ్య అవగాహన లోపమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని పలువురు సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. గతంలో గత ప్రభుత్వాలే గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు చెల్లించేవని, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గ్రామాల్లో విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత ఆయా పంచాయతీలపై మోపడం అన్యాయమని సర్పంచులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం గతంలో కేంద్రం నుంచి వచ్చిన 13వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి కోత విధించి జిల్లాలకు పంపించామని, కోత పెట్టిన నిధులతో విద్యుత్ బకాయిలు చెల్లింపులు జరిగేవని, ప్రస్తుతం వచ్చిన నిధులు కోత లేకుండా మొత్తాన్ని పంచాయతీలకు విడుదల చేశామని చెబుతోంది. అయితే.. ఈ విషయాన్ని సర్పంచులకు వివరించడంలో ప్రభుత్వం, అధికారులు వైఫల్యం చెందడమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రామారావు రాథోడ్ అభిప్రాయపడ్డారు. సర్పంచులు సహకరించడం లేదు. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తోంది. మన జిల్లాకు మూడు విడతలుగా రూ.60 కోట్లు వస్తాయి. అందులో నుంచి 15 శాతం నిధులు మాత్రమే విద్యుత్ బకాయిల కింద చెల్లించాలని చెప్పాం. అయినా సర్పంచులెవరూ స్పందించడం లేదు. ఒక్కో పంచాయతీకి సగటున రూ.50 లక్షల నిధులొచ్చాయి. వాటిలో కొంత మేరకైనా బకాయి చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు రూ.55 లక్షలు మాత్రమే చెల్లించారు. విద్యుత్ శాఖకు రూ.83 కోట్ల వరకు బకాయి ఉన్నాం. -
ప్రజల ముంగిటికే న్యాయం
మొబైల్ లోక్ అదాలత్ల ఏర్పాటు: హైకోర్టు సీజే పేదరికంవల్ల న్యాయానికి దూరం కావొద్దు గ్రామ పంచాయతీ, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వొచ్చు పోస్టు ద్వారా కూడా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి పంపవచ్చు సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఉచితంగా, సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో, ప్రజల ముంగిటికే న్యాయాన్ని తీసుకెళ్లాలనే ధ్యేయంతో మొబైల్ లోక్అదాలత్ను ప్రవేశపెడుతున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెడుతున్నామని ఆయన చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ప్రధాన కార్యాల యంలో జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. పేదరికం కారణంగా అనేక మంది ప్రజలు జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ (లీగల్ సర్వీస్ అథారిటీ)లను ఆశ్రయించలేకపోతున్నారని... దాంతో వారికి న్యాయం అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రూ. రెండు వేలు వెచ్చించి కొన్న మొబైల్ ఫోన్ పనిచేయకపోయినా సంబంధిత సంస్థపై ఫిర్యాదు చేసేం దుకు జిల్లా కేంద్రంలోని వినియోగదారుల ఫోరానికి వెళ్లా ల్సి వస్తోందని... ఇది ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్రజలు ఫిర్యాదు చేయడం లేదని సీజే అన్నారు. సివిల్, క్రిమినల్, వినియోగదారుల వివాదం సహా ఏ ఫిర్యాదునైనా తెల్లకాగితం మీద రాసి గ్రామ పంచాయతీ లేదా స్థానిక పోలీస్స్టేషన్లో ఇవ్వవచ్చని చెప్పారు. అందులో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించగల ఫిర్యాదులను గ్రామ పంచాయతీ లేదా పోలీసులు లీగల్ సర్వీస్ అథారిటీకి పంపుతారని తెలిపారు. లేదా పోస్టు ద్వారా కూడా బాధితులు నేరుగా జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీకి ఫిర్యాదులు పంపవచ్చన్నారు. పేదరికం కారణంగా ప్రజలు న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో మొబైల్ లోక్ అదాలత్ను ఏర్పాటు చేస్తున్నామని జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా తెలిపారు. 100 ఫిర్యాదులు వచ్చిన వెంటనే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన మొబైల్ బృందం సంబంధిత ప్రాంతానికి చేరుకుంటుందని... ఇరువర్గాల వాదనలు విని అక్కడిక్కడే తీర్పులు ఇస్తారని వెల్లడించారు. ఈ తీర్పులకు అప్పీల్ కూడా ఉండదని, మొబైల్ కోర్టు ఇచ్చిన తీర్పే తుది తీర్పు అని స్పష్టం చేశారు. గ్రామస్థాయి వివాదాలు కోర్టుల దాకా వస్తే కక్షలు, కార్పణ్యాలు పెరిగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో ప్రజల దగ్గరకే న్యాయాన్ని తీసుకెళుతున్నామని లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను తెలిపారు. ఖర్చు లేకుండా ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే న్యాయం పొందవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమబెంగాల్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ తరహా లోక్అదాలత్లు విజయవంతమయ్యాయని అథారిటీ సభ్య కార్యదర్శి శ్యాంప్రసాద్ తెలిపారు. -
జాయింట్ జగడం
- కార్యదర్శికి చెక్ పవర్పై సర్పంచుల గుర్రు - నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడేనా? - కార్యదర్శుల కొరతతో తీవ్ర ఇబ్బందులు - 29 అంశాలు బదలాయింపు అయ్యేనా..? సుల్తానాబాద్: గ్రామపంచాయతీలకు 29 అంశాలను బదలాయించడంతో పాటు నిధులు, విధుల్లో సర్వాధికారాలు కట్టబెడుతామన్న సర్కారు దానికి విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు జాయింట్ చెక్పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై సర్పంచులు గుర్రుగా ఉన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పేరిట గ్రామ ప్రజాప్రతినిధులను అగౌరవ పరచడమేనని, తమ హక్కులను హరించే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈజీవోపై సర్కారు పునరాలోచన చేయాల్సిన అవసరముందని సర్పంచులు కోరుతున్నారు. నిధుల దుర్వినియోగమే కారణమా..? సర్పంచులకు నేరుగా చెక్ పవర్ ఉండడంతో పంచాయతీ పాలకవర్గం తీర్మానాలు లేకుం డానే డబ్బులు డ్రా చేసి వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల సర్పంచులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారుల కు ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం జాయింట్ చెక్ పవర్ను అమలు చేస్తే కొంతవరకు అవినీతికి చెక్ పెట్టవచ్చనే ఆలోచనతోనే ఈ జీవో జారీ చేసినట్టు భావిస్తున్నారు. సర్పంచులు బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మెజారిటీ గ్రామ పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వం ఏర్పడి ఆర్నెల్లు అవుతున్నప్పటికీ పలు రకాల పనులకు నిధులు విడుదల చేయలేదు. పని చేసిన వాటికి నిధులు నేటికీ ఇవ్వకపోవడంతో అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బీఆర్జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధులను గ్రామాభివృద్ధికి నిధులు వెచ్చించనున్నారు. గతంలోనూ జాయింట్ చెక్ పవర్ కల్పించిన సందర్భాల్లో సర్పంచుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. పలు చోట్ల కార్యదర్శులు, సర్పంచులు కుమ్మక్కై నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్ పవర్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనే విషయమై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కార్యదర్శులేరి..? జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, 528 మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. క్లస్టర్ల వారీగా చూసినా జిల్లాలో 621 క్లస్టర్లు ఉండగా.. 93 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పెద్ద పంచాయతీలను మినహాయిస్తే మిగిలిన వాటిలో నాలుగు నుంచి ఆరు గ్రామపంచాయతీలకు ఒక కార్యదర్శి మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. అదనపు భారంతో వీరు అన్ని పనులు నిర్వహించడం ఇబ్బందికరంగా ఉంది. అంతేగాకుండా నిధుల విషయమై సర్పంచులకు, కార్యదర్శులకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తేనే లక్ష్యం నెరవేరుతుంది. -
ముగుతాడు
గ్రామ పంచాయతీలకు వివిధ పద్దుల కింద విడుదలయ్యే నిధుల వినియోగంపై ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరిస్తోంది. గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం నిధుల విడుదలకు సర్పంచుతోపాటు పంచాయతీ కార్యదర్శుల సంతకం తప్పనిసరిగా భావిస్తోంది. నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఉమ్మడి సంతకాలు ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.రేమంట్ పీటర్ జీఓ ఆర్టీ నంబర్ 278 ద్వారా శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం పంచాయతీలపై దృష్టి సారించింది. పంచాయతీలకు విడుదల చేసే నిధులను క్షేత్రస్థాయిలో సద్వినియోగమయ్యేలా చూడాలని ఉన్నతాధికారులకు సూచించింది. గతంలోనూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ఉమ్మడి సంతకాల నిబంధన ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం జాయింట్ చెక్పవర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి ఇటు సర్పంచులు, అటు కార్యదర్శులలో కలకలం రేపాయి. జాయింట్ చెక్పవర్ ఇవ్వడమంటే రాజ్యా ంగబద్ధంగా సంక్రమించిన హక్కును కాలరాయడమేనని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇద్దరికీ బాధ్యత ఉంటే తప్పులు జరగడానికి అస్కారం ఉండదని కార్యదర్శులు అంటున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 718 మంది పంచాయతీ కార్యదర్శులు అవసరం కాగా, ప్రస్తుతం 210 మందే ఉన్నారు. ఒక్కొక్కరు నాలుగైదు గ్రామా లకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాయింట్ చెక్పవర్ కారణంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. సీపీడ బ్ల్యూఎస్, పారిశుధ్యం, అంతర్గత రోడ్లు, వీధిదీపాలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, నిర్వహణ పనులతోపాటు 13వ ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్, ఆర్జీపీఎస్ ఏ తదితర పథకాల నిధుల వినియోగంలో ఇద్దరి సంతకం తప్పనిసరని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఇది ఇబ్బందిగా మారుతుందేమోనని భావిస్తున్నారు. నిధుల దుర్వినియోగం నేపథ్యంలోనే గ్రామ పంచాయతీలకు గతంలో అనేక పద్దుల కింద నిధులు విడుదల కాగా, పారదర్శకత లేక చాలా వర కు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులున్నాయి. వెనుకబ డిన ప్రాంతాల అభివృద్ది నిధుల(బీఆర్జీఎఫ్)ను ఇష్టారాజ్యంగా వాడుకున్నట్లు విచారణ లో కూడా తేలింది. గత ఐదేళ్లలో జడ్పీ, ఎంపీ, జీపీ సెక్టార్ల కింద రూ.106. 50 కోట్లు విడుదల కాగా, గ్రామ పంచాయతీలకు సుమారుగా రూ. 53 కోట్ల వరకు కేటాయించారు. జిల్లాకు ఏడాదికి రూ.21.54 కోట్ల వరకు బీఆర్జీ నిధులు విడుదల కాగా జడ్పీకి 20 శాతం, మండలాలకు 30 శాతం, గ్రామ పంచాయతీలకు 50 శాతం కేటాయిస్తూ వచ్చారు. అభివృద్ధి పేరిట బీఆర్జీ నిధులను ముందుగానే డ్రా చేసిన ప్రజాప్రతినిధులు నిధుల వినియోగానికి సంబంధించిన మెజర్మెంట్ బుక్లు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించడంలో విపరీత జాప్యాన్ని ప్రదర్శించారు. ఇలా 2012 డిసెంబర్ నాటికి మొత్తంగా జిల్లాలో రూ.3,23,16,550లు బకాయిలు ఉండిపోయాయి. 2013 మే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, అనేక రకాల ప్ర యత్నాలతో రూ.1.97 కోట్లు రికవరీ చేశారు. జూన్ లో జరిగిన ఎన్నికలలో కొత్తవారు ఎన్నికయ్యారు. రూ 1,25,54,516 మాత్రం 165 మంది మాజీ సర్పంచుల వద్దే ఉండిపోయాయి. గతంలో నిధుల దుర్వినియోగం అయిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం జాయింట్ చెక్పవర్ ఉత్తర్వులిచ్చినట్టు సమాచారం. -
జాబితా.. జంఝాటం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పింఛన్ల ప్రహసనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లూ జాబితా తయారు కాలేదని.. జాబితాలు అధికారికంగా వచ్చే దాకా లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వ యంత్రాంగం చెబుతూ వచ్చింది. కానీ గురువారం జిల్లావ్యాప్తంగా విడుదలైన పింఛన్ల జాబితాలు ఆసరా లబ్ధిదారుల్లో మరింత గందరగోళాన్ని నింపాయి. ముఖ్యంగా ఈ జాబితాల ప్రకటనలో ఒక పద్ధతి లేకపోవడం, కొన్ని మండలాల్లో, మరికొన్ని గ్రామాల్లో జాబితాలు ప్రదర్శించకపోవడం, ప్రకటించిన జాబితాలను సాయంత్రానికి తీసేయడం లాంటి ఘటనలు లబ్ధిదారుల్లో అనేక ఆందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు అర్హులైన చాలామందికి పింఛన్లు కోత పెట్టారని, అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలామంది గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదు ట, మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించిన సంఘటనలూ తొలి రోజు జరిగాయి. వీటికి తోడు సమగ్ర సర్వే వివరాలు అందుబాటులో లేనివారి పేర్లు జాబితాల్లో లేకపోవడంతో తమ పేర్లు వస్తాయో రావోననే ఆందోళన వారిలో నెలకొంది. అయితే, పింఛన్ల జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నా.. ఈ ప్రక్రియలో తమకు న్యాయం జరిగే అవకాశం లేదనే అభిప్రాయం, తమ ఆశలు గందరగోళంలోనికి నెట్టివేయబడ్డాయనే ఆందోళన జిల్లాలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర వర్గాల్లో వ్యక్తమవుతోంది. తుది పరిశీలన అనంతరం జాబితాలు అన్నిచోట్ల ప్రదర్శిస్తే మరింత ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా పింఛన్ల జాబితా ప్రదర్శన వివరాలివి... ఆలేరు పరిధిలో జాబితాలో అర్హుల పేర్లు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో అనర్హులకు పెన్షన్ వచ్చిందని అర్హులు వాపోతున్నారు. సుమారు 38శాతం మందిని అనర్హులుగా చేశారు. జాబితాలో పేరు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, విచారించి మంజూరు చేయిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఆలేరు మండలంలో 8730 మంది దరఖాస్తు చేసుకోగా 4737 పరిశీలనకు రాగా 4525మందికి మంజూరు చేశారు. యాదగిరిగుట్టలో 7850మంది దరఖాస్తు చేసుకోగా 5450 పరిశీలనకు రాగా 4893 మందికి మంజూరయ్యాయి. భువనగిరి నియోజకవర్గంలో డేటా ఎంట్రీ, ఎస్కెఎస్ ఫారాల ఎంట్రీ లేకపోవడంతో పలు దరఖాస్తులను పరిశీలించలేదని సమాచారం. భువనగిరి పట్టణంలో రాత్రి వరకు ఆసరా పథకానికి సంబంధించి పింఛన్ల జాబితాను ఏ వార్డులోనూ ప్రదర్శించలేదు. లబ్ధిదారులను ఎంతమందిని ఎంపిక చేయాలనే విషయంలో మున్సిపాలిటీలో లెక్క తేలలేదు. భువనగిరి, వలిగొండ మండలాల్లోని అన్ని గ్రామాల్లో పింఛన్ల జాబితాను ప్రదర్శించారు. బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో గ్రామాల్లో సాయంత్రం జాబితాలను ప్రదర్శించలేదు. డేటాఎంట్రీలో జరిగిన పొరపాట్లతోపాటు, ప్రభుత్వం ఇచ్చిన కోత ప్రకా రం అధికారులు వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా అర్హులైన వారు తమ పేర్లు జాబితాలో లేవని సంబంధిత అధికారులకు ఫోన్లు చేశారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలంలో సగానికి పైగా గ్రామాలలో గురువారం రాత్రివరకు కూడా పింఛన్దారుల జాబితాలను గ్రామపంచాయతీల వద్ద పెట్టలేదు. ఎస్.లింగోటం గ్రామపంచాయతీ వద్దకు పలువురు లబ్ధిదారులు వచ్చి, జాబితాలో పేరులేకపోవడంతో ఊసూరుమన్నారు. మునుగోడు మం డలం సోలిపురంలో అర్హులకు పింఛన్లు రాలేదని ఆహార భద్రత కార్డుల సర్వేకు వెళ్లిన అధికారులను గ్రామస్తులను అడ్డుకున్నారు. నారాయణపురం మండలంలో ఎక్కడా రాత్రి వరకు జాబి తాలు పెట్టలేదు. చండూరులోను ఇదే పరిస్థితి. మర్రిగూడ మండలానికి సంబంధించిన జాబి తాకు జిల్లా కే ంద్రం నుంచి అనుమతి రాలేదు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ, దామరచర్ల మండలాల్లో మాత్రమే ఆసరా పింఛన్ల జాబితాలను ప్రకటించారు. కాగా దామరచర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి పింఛన్ల జాబితాలో పేర్లు రాలేదని అధికారులను అడుగుతుండగా 5, 6 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని చెబుతున్నారు. మిర్యాలగూడ మండలంలోనూ ఇదే పరిస్థితి. వేములపల్లి మండలంలో రాత్రి వరకు ప్రకటిస్తామని అధికారులు చెబుతున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డులలో పింఛన్ల జాబితాలను ప్రకటించలేదు. శుక్రవారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఆసరా పింఛన్ జాబితా ప్రదర్శించలేదు. తిరుమలగిరి, నూతనకల్ మండలాల్లో పింఛన్ జాబితాను ప్రదర్శించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. జాబితాలో తమ పేర్లు లేవని స్థానిక ప్రజప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, రామన్నపేట, చిట్యాల, నార్కట్పల్లి మండలాలలో జాబితా విడుదల చేశారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని కేతేపల్లి మండలం కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. నకిరేకల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాబితాలో తమ పేరు చూసుకునేందుకు పింఛన్దారులు పోటీ పడడంతో అధికారులు వారిని శాంతపరిచి పేర్లను చదివి వినిపించారు. సూర్యాపేట పట్టణంలో సాయంత్రం వరకు ఆసరా పథకానికి సంబంధించి పింఛన్ల జాబితాను ఏ వార్డులోనూ ప్రదర్శించలేదు. మండలంలోని దాసాయిగూడెం, కేసారం గ్రామాల్లో మధ్యాహ్నం తర్వాత జాబితా ప్రదర్శించారు. మిగతా గ్రామాల్లో ఉదయాన్నే గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితా ప్రదర్శించారు. చివ్వెంల గ్రామంలో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చందుపట్ల గ్రామంలో ఆసరా లిస్టు బయట పెట్టలేదంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్ల జాబితాను ప్రదర్శించారు. నల్లగొండ మున్సిపాలిటీలో వికలాంగుల కేటగిరీలో పెన్షన్ దారులకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేశారు. వికలత్వం 95 శాతం ఉన్న వారి పేర్లు జాబితాలో పొందుపర్చలేదు. వారంతా దరఖాస్తు చేసుకున్నారు. అర్హులకు కాకుండా అనర్హులకు పెన్షన్ మంజూరు చేశారని జాబితాను పరిశీలించిన లబ్ధిదారులు వాపోయారు. తిప్పర్తి మండలం సర్వారంలో అనర్హులకు పెన్షన్ మంజూరైనట్లు స్థానికలు పే ర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఒక్క దేవరకొండ పట్టణం మినహా ఎక్కడా జాబితాలు ప్రదర్శించలేదు. తమ పేర్లు జాబితాలో ఉంటాయో ఉండవేమోననే ఆందోళన ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే, నియోజకవర్గంలో అనర్హులకు కూడా పింఛన్ జాబితాలో చోటు కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. కోదాడ నియోజకవర్గంలో ఆసరా పథకం సంబంధించి సాయత్రం 3:30 గంటల వరకు లబ్ధిదారులు జాబితాలను ప్రకటించలేదు. అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో తుది పరిశీలన జరుపుతున్నారు. జాబితాలను శుక్రవారం గ్రామపంచాయితీలలో వెల్లడిస్తామని కొందరు కార్యదర్శులు చెబుతున్నారు. మొన్న పింఛన్ ఇచ్చారు.. నేడు పేరే లేకుండా చేశారు తిరుమలగిరి : గత నెల 8వ తేదీన ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ అందజేసిన విషయం తెలిసిందే. వారిలో తిరుమలగిరి మండలం ఫణిగిరికి చెందిన వికలాంగుడు రమేష్ కూడా ఉన్నాడు. ఆ రోజున స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేతుల మీదుగా రూ.1500 పింఛన్ కూడా అందుకున్నాడు. కానీ గురువారం ప్రకటించిన జాబితాలో రమేష్ పేరు మాయమైంది. దీంతో కంగుతినడం రమేష్ వంతయ్యింది. ఇదే గ్రామానికి చెందిన అందె చంద్రమ్మ కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంది. తీరా ఇప్పుడు ఆమె పేరు కూడా జాబితాలో లేదు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అధికారులకే తెలియాలి. -
యథేచ్ఛగా సాగిన అక్రమ నిర్మాణాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో బహుళ అంతస్తుల (అపార్టుమెంట్ల) సంస్కృతి రోజు రోజుకూ విస్తరిస్తోంది. అగ్నిమాపక, నగర ప్రణాళిక, గ్రామ పంచాయతీల అనుమతులు లేకున్నా నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి సాగుతున్నా, వాటిని నియంత్రించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ఇందుకు రాజకీయ జోక్యం, ఒత్తిళ్లు, మామూళ్లు ఇలా కారణాలు ఎన్నో! నిబంధనలను తుంగ లో తొక్కి యథేచ్ఛగా సాగించిన అపార్టుమెంట్ల నిర్మాణంపై ఫిర్యాదులు అందినా బుట్టదాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలపై కన్నెత్తయినా చూడలేదు. ఒకవేళ పరిశీలించినా తీసుకున్న చర్యలేమీ లేవు. తీరా అపార్టుమెంట్ల ని ర్మాణం పూర్తయి, వాటి ని కొనుగోలు చేసినవా రు గృహప్రవేశం చేశాక, చేసేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో అధికారులు చర్యలకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పుడెందుకో నోటీసులు గంగాస్థాన్ ఫేజ్-2లో ఒక అపార్టుమెంట్ను కూల్చివేయడం ద్వారా చర్యలకు దిగిన పంచాయతీ అధికారులు, ఒక్క నిజామాబాద్ డీఎల్పీఓ పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2, గూపన్పల్లి, మానిక్భండార్ల పరిధిలో 12 అపార్టుమెంట్లను అక్రమంగా నిర్మించారని తేల్చారు. ఏడు అపార్టుమెంట్లలో ఇప్పటికే నివాసం ఉంటున్న 313 కు టుంబాలకు నోటీసులు జారీ చేశారు. నగరంలోనూ నిబంధనలను విస్మరిం చి అపార్టుమెంట్లు, భవనాల నిర్మాణాలు సాగుతున్నా టౌన్ప్లానింగ్ అధికారులు పట్టించుకో వడం లేదు. తమ లెక్కల ప్రకారం 98 అపార్టుమెంట్లుంటే, అందులో నాలిగింటికి అనుమతులు లేకపోవడంతో నోటీసులు జారీ చేశామంటున్నారు. అడుగడుగునా నిబ ంధనలను ఉల్లంఘిస్తూ నిర్మిస్తున్న అపార్టుమెంట్లపై అధికారులు ఇంతకాలంగా చూసీచూడనట్లు వ్యవహరించారు. ఎట్టకేలకు కదిలిన అధికార యం త్రాంగం చర్యలకు దిగడం చర్చనీయాంశం అవుతోంది. గూపన్పల్లి పరిధిలోని గంగాస్థాన్ ఫేజ్-2లో మంగళవారం అనుమతులు లేకుండా నిర్మించారని ఓ అపార్టుమెంట్ను కూల్చివేయడం కలకలం రేపుతోంది. గూపన్ పల్లిలో కాకుండా నగరంతోపాటు పలుచోట్ల రియల్ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలను తుం గలో తొక్కి అపార్టుమెంట్లు నిర్మించారు. వినాయకనగర్, మానిక్భండార్ తదితర ప్రాంతాలలో నిర్మించిన కొన్ని అపార్టుమెంట్ల సమీపంలో రోడ్లు కనీసం 15 అడుగులు కూడా లేవు. ఆ వీధుల్లో ఎంచక్కా ఐదు అంతస్తుల భవనాలు పుట్టుకొ చ్చాయి. కనీసం సెట్ బ్యాక్ (ఖాళీ స్థలం). ఫైర్ ఫైటింగ్ సిస్టం (అగ్ని ప్రమాదాల నిరోధక వ్యవస్థ) ఏర్పాటు చేయలేదు. అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారు. కానీ, అధికారులు ఒక్క భవనం జోలికే వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్ల నిర్మాణంలో కొందరు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, ప్రజాప్రతి నిధులు సూత్రధారులుగా వ్యవహరిస్తుండట మే ఇందుకు కారణమంటున్నారు. ఎక్కడ పడి తే అక్కడ సాగుతున్న అక్రమ కట్టడాల కారణంగా నగర పాలక సంస్థ ఆదాయానికి భారీ గా గండి పడుతోంది. అనేక మంది భవన యజమానులు నేల, మొదటి అంతస్తులకు అనుమతులు తీసుకుంటూ ఆపై రెండు, మూ డు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారం లో రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు చూసీచూడనట్టు వదిలేయాలంటూ అధికారుల కు హుకుం జారీ చేయడం.. ఇదే అదనుగా పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మరిన్నికట్టడాలకు దారులు తెరుస్తున్నారు. అవినీతికి కేరాఫ్ నగర, పట్టణ శివార్లను ఆనుకుని ఉన్న ప్రాంతాలు అపార్టుమెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన ప్రాంతాలుగా మా రాయి. ఆయా గ్రామ పంచాయతీలలో పనిచేసే కొందరు అవినీతి అధికారులు ‘మామూళ్ల’కు మరిగారు. ఫలితంగా గూపన్పల్లి, మానిక్భండార్, గంగాస్థాన తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో జిల్లాలో ముగ్గురు అవినీతి వీఆర్ఓలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారంటే, ఆ శాఖలోని కిం దిస్థాయి ఉద్యోగులలో అవినీతి ఎంత పెరి గిందో అంచనా వేయవచ్చు. నగరాలు, పట్టణాలలో ఏ చిన్న నిర్మాణం చేపట్టాలన్నా పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తప్పనిసరి. ముందుగా తాము కట్టాలనుకుంటున్న నిర్మాణాల వివరాలను ప్రణాళిక విభాగానికి దరఖాస్తుతో పాటు అందజేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బృహత్ ప్ర ణాళిక (మాస్టర్ ప్లాన్) అనుగుణంగా ఉన్న స్థలంలో భవనాన్ని ఎంతమేర విస్తీర్ణంలో నిర్మించాలి? ఖాళీ స్థలం ఎంత వదలాలో నిర్ణయిస్తారు. అనంతరమే నిర్మాణాలు ప్రారంభించాలి. కానీ నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పురపాలక సంఘాల్లోనూ పట్టణ ప్రణాళికా విభాగం సూచించిన మేర 50 శాతం కూడ నిర్మాణాలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
పెన్షన్ రాలేదని గుండెపోటుతో వృద్ధుడి మృతి
పెన్షన్ల లిస్టులో తన పేరులేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఓ విషాద ఘటన యాదగిరిగుట్ట మండలం దాసరపల్లిలో శనివారం చోటుచేసుకుంది. బాలయ్య అనే 80ఏళ్ల వృద్ధుడు పెన్షన్ రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ పంచాయతీ వద్ద అంటించిన లిస్టులో తన పేరులేదని తెలిసి ఆవేదన చెందడంతో ఒక్కసారిగా గుండెనొప్పివచ్చింది. దాంతో ఆ వృద్ధుడు అక్కడే కుప్పకూలిపోయాడు. -
డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వర చర్యలు
చిత్తూరు (సెంట్రల్): గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్జైన్ ఎంపీడీవోలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన జిల్లాలోని ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి కార్యక్రమంలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డుల ఏర్పాటుకు పూనుకోవాలన్నారు. ఎస్ఆర్హెచ్ఎం కింద ప్రతి గ్రామపంచాయతీకి పారిశుద్ధ్య పనుల నిమిత్తం రూ.50 వేలు విడుదల చేశారని, ఈ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మండలాలకు వివిధ అభివృద్ధి పనులు మంజూరవుతు న్నా, అవి పూర్తికావడం లేదన్నారు. ఇకపై పనులు మంజూరైన 90 రోజుల్లో పూర్తికాకపోతే వాటికి సంబంధించిన నిధులను వేరే మండలాలకు ఇస్తారని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈవో వేణుగోపాల్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి, డీపీవో ప్రభాకర్, డ్వామా పీడీ గోపిచంద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. బాధితులకు విరాళం హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం రేణిగుంట మండలానికి చెందిన సర్పంచ్లు భాస్కరయాదవ్ (తూకివాకం), మునిశేఖర్రెడ్డి (ఆర్.మల్లవరం), శ్రీరాజ్ (గాజులమండ్యం), హరినాథ్యాదవ్ (అత్తూరు), ఎం.పురుషోత్తం (విప్పమానుపట్టెడ) కలిసి మొత్తం రూ.57,635 విరాళాన్ని కలెక్టర్కు అందజేశారు. అలాగే తిరుపతి మండల సర్పంచ్లు లక్ష రూపాయలు ఇచ్చారు. -
‘ఉపాధి’ ఇక కొందరికే !
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపురేఖలు మారనున్నాయి. ఈ పథకాన్ని కొత్త తరహాలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థకు ఉత్తర్వులు కూడా అందాయి. ఇకపై జిల్లా అంతటా కాకుండా కేవలం నిరుపేదలున్న గ్రామాల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాలకు ఈ పథకం వర్తించనుండగా.. జిల్లాలో 8 మండలాలకు చెందిన సుమారు 212 గ్రామాల్లో ‘ఉపాధి’ పనులు జరగనున్నాయి. ఈ ఎనిమిది మండలాల్లో ప్రత్యే క చర్యల ద్వారా గ్రామాలను, నిరుపేద కుటుంబాలను అభివృద్ధి చేయాలని, వారికి అండగా నిలవాలనేది కేంద్రం నిర్ణయం. గాంధారి, బిచ్కుంద, జుక్కల్, మద్నూరు, నిజాంసాగర్తో పాటు మరో మూడు మండలాల్లోని గ్రామాల్లో 2015-16 సంవత్సరానికి ఉపాధి హామీ పథ కం ద్వారా పనులు చూపాలని గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ‘ఉపాధి’.. జిల్లాలోని 36 మండలాలకు చెందిన 718 గ్రామ పంచాయతీలు, 1,297 హాబిటేషన్లలో ఉపాధి హామీ పథకం పనులను గుర్తించారు. 25,669 గ్రూపులకు చెందిన 4,48,077 మందికి జాబ్కార్డులు జారీ చేశారు. వీరందరికి పనులు కల్పించేందుకు మొత్తం 52,526 పనులను గుర్తించిన అధికారులు రూ.866.69 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు రూ.126.88 కోట్లు ఖర్చు చేసి 18,652 పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది సుమారు 1.08 కోట్ల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఆ మేరకు కృషి చేస్తుండగా ఇప్పటి వరకు 82 లక్షల పనిదినాలు పూర్తయినట్లు చెప్పారు. సీజన్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అన్ని పనుల్లో 80 వేల మంది నుంచి 1.12 లక్షల మంది వరకు కూలీలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10-15 వేల మందికి పడిపోయినట్లు చెప్తుండగా ఈ ఏడాది ఇప్పటి వరకు 9,243 కుటుంబాలకు 100 రోజుల ‘ఉపాధి’ లభించింది. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం అమలు తీరు ఇలా వుంటే... కేంద్ర ప్రభుత్వం కొత్తగా పూర్తిగా నిరుపేదలున్న గ్రామాలకే పరిమితం చేయాలని జీవో జారీ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్ ‘ఉపాధి’ కార్యాచరణ.. జిల్లాలో ఎంపిక చేసిన ఎనిమిది మండలాలకు చెందిన గ్రామాలకే ఉపాధి హామీ పథకం అమలవుతుంది. మురికి వాడల్లో పనులను గుర్తిస్తారు. గ్రామ ప్రజలతో చర్చించి అభివృద్ధి పనులు చేపడతారు. ఇందుకోసం ఉపాధి కూలీలకు, గ్రామ ప్రజలకు శిక్షణ తరగతులు ఇస్తారు. ఆ తర్వాత ఊరికి కావాల్సిన పనులను గుర్తించి ప్రజలతో చర్చించి సర్పంచి నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. తర్వాత మూడు రోజుల్లో గ్రామసభ ఏర్పాటు చేయాలి. నవంబర్ 29లోగా గుర్తించిన పనులను గ్రామసభ, జిల్లా పరిషత్తు ఆమోదం పొందేట్లు చేస్తారు. డిసెంబర్ 20 నాటికి కలెక్టర్ అనుమతి పొందిన పనులు మొదలు పెడతారు. ఈ పనులను మూడు దశలుగా విభజించనున్నారు. మొదటి దశ కింద ప్రకృతి వనరుల పనులకు ప్రాధాన్యం ఇస్తారు. వాటర్షెడ్ల నిర్మాణం, చెరువుల మరమ్మతులు, స్థానిక ట్యాంకు, కేసీ కెనాల్లో పూడికతీత పనులు, మొక్కల పెంపకం వంటివి చేపడతారు. రెండో దశలో నిరుపేద కుటుంబాల్లో ఎస్సీ, ఎస్టీల భూమి అభివృద్ధి పనులు, వారి పొలాల్లో పండ్లతోటల పెంపకం, నిరుపయోగమైన భూమిని సాగులోకి తేవడం, కోళ్ల, గొర్రెల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. మూడో దశ కింద స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవసాయ ఉత్పాదక పనులు, సేంద్రియ ఎరువులు, పండ్లు దాచిపెట్టడానికి గోదాములు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలల్లో మైదానం లాంటి పనులు చేపడతారు. ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు అందలేదు -శివలింగయ్య, పీడీ, డ్వామా 2015-16 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ కింద కొత్తగా చేపట్టే అంశాలకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవు. జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు బాగా జరుగుతున్నాయి. 1.08 కోట్ల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకుంటే 85 లక్షల పనిదినాలు కల్పించాము.. మరో అరు నెలల గడువుంది... మిగతా పనిదినాలు కూడ కల్పిస్తాం. అవసరమైన పనులు చేపట్టి ఉపాధి చూపిస్తాం. -
మెగా డిస్కౌంట్ వస్తువుల జప్తు
ఆందోళనలో బాధితులు ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ మండలంలోని మావల గ్రామ పంచాయతీ పరిధిలో గల ధస్నాపూర్లో ఇటీవల వెలసిన మాధా ఆర్డర్ సప్లయర్ మెగా డిస్కౌంట్ గృహోపకరణాల విక్రయ సంస్థలోని వస్తువులను సోమవారం ఆదిలాబాద్ వన్టౌన్ పోలీసులు జప్తు చేశారు. ఈ సంస్థ నిర్వాహకులు ముందస్తుగా వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకుని వస్తువులు ఇవ్వకపోవడంతో నాలుగు రోజుల క్రితం బాధితులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విచారణ పేరుతో పోలీసులు ఈ దుకాణాన్ని మూసివేశారు. కాగా డబ్బులు కట్టిన పక్షం రోజుల్లో వినియోగదారుడు కోరుకున్న వస్తువును 40 శాతం డిస్కౌంట్తో అందజేస్తామని సంస్థ నిర్వాహకులు మొదట ప్రచారం చేయడంతో వినియోగదారులు బారులు తీరారు. పక్షం రోజుల తర్వాత వస్తువులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. గొడవ ముదురుతుందనే ఉద్దేశంతో సదరు యజమాని పరారయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ వస్తువులను జప్తు చేసేందుకు సోమవారం దుకాణానికి రావడంతో బాధితులు అక్కడికి చేరుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ వస్తువులను తీసుకెళ్లనివ్వమని ఆందోళన చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న ఎస్సైలు శ్రీనివాస్, అబ్దుల్ నజీర్లు బాధితులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. తాము కట్టిన డబ్బులు వస్తాయో లేదోననే ఆందోళనలో బాధితులున్నారు. సుమారు రెండు వేల మంది వరకు ముందస్తుగా ఈ సంస్థలో డబ్బులు కట్టినట్లు తెలుస్తోంది. -
ఇక.. ఈ-పంచాయతీలే
తొలివిడతగా 320 గ్రామాల్లో అమలు - రెండో విడతలో 1011 పంచాయతీలు - గ్రామాల పూర్తి సమాచారం ఆన్లైన్లోనే... - ప్రభుత్వ నిధులు, మౌలిక సదుపాయాల వివరాలు కూడా అందులోనే జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఈ పంచాయతీ’ కార్యక్రమానికి జిల్లాలో 320 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. ఈ మేరకు తొలిదశలో మేజర్ గ్రామపంచాయతీలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. మలి, తుదిదశల్లో జిల్లాలోని మిగతా గ్రామాలను ఈ పంచాయతీలుగా చేయాలని యోచిస్తున్నారు. ఏదైనా ఆన్లైన్లోనే.. ఈ పంచాయతీ ప్రాజెక్టు ద్వారా క్షేత్రస్థాయిలో సమాచారాన్నంతటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయనున్నారు. గ్రామంలో పన్ను వసూలు ద్వారా ఎంత ఆదాయం వస్తుంది. ఆ గ్రామానికి వివిధ పన్నుల ద్వారా స్థానికంగా వస్తున్న ఆదాయం ఎంత? అందులో ఎంత ఖర్చు అవుతోంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృ ద్ధి కోసం గ్రామానికి ఎంత కేటాయిస్తున్నారు? రోడ్లు, నల్లాలు, బోర్లు, చే తిపంపులు...ఇలాప్రతి అంశాన్ని ఆన్లైన్ చేస్తారు. వీటితో పా టు గ్రామంలో జనన, మరణాలనమోదుకు సంబంధించిన బా ధ్యతను పంచాయతీ కార్యదర్శికి అప్పగించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రక్రియ మొదలు... జిల్లాలో తొలి విడతగా 320 గ్రామాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లను సమకూర్చారు. వీటిలో 114 గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనె క్షన్ ఇచ్చారు. మిగతా వాటికి బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఈ పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్ల ఎంపికను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. వీరిని ఎంపిక చేసి శిక్షణను కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే 176 మంది ఆపరేటర్లను తీసుకున్నారు. వీరు మూడు రోజులకు ఓ గ్రామంలో చొప్పున రెండు గ్రామపంచాయతీల్లో పని చేయాల్సి ఉంటుంది. రెండో విడతలో 1011 గ్రామ పంచాయతీలను ఆన్లైన్ చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రామ పంచాయతీలను గుర్తించే పనిని బీఎస్ఎన్ఎల్కు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. ఏఏ గ్రామాల్లో ఇంటర్నెట్ ఉందనే విషయాన్ని గుర్తించాలని ఆశాఖకు అప్పజెప్పినట్లు సమాచారం. -
పంచాయతీల్లో ఆదాయ మార్గాల కోసం అన్వేషణ
బద్వేలు: పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి పంచాయతీల వికేంద్రీకృత అభివృద్ధి పేరిట వివిధ ఆదాయ వనరులను గుర్తించి, వాటితో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా గ్రామాలకు వచ్చే ఆదాయంతో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇందులో భాగంగా కడప సమీపంలోని పబ్బాపురాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫలితాలను సమీక్షిస్తున్నారు. ఈ విధానాన్ని త్వరలో జిల్లాలోని 784 పంచాయతీల్లో అమలు చేయనున్నారు. ఆదాయమే పరమావధి గ్రామ పంచాయతీలకు ఆస్తి, కుళాయి పన్నులే ఇప్పటి వరకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. వీటితోనే అభివృద్ధి పనులు కూడా చేపట్టాలి. ఇకపై మరింత ఆదాయం సమకూరేలా ఆయా పంచాయతీల్లోని ఆదాయ వనరులను గుర్తించాలని పేర్కొంటూ ఇటివలే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పేరిట జీవో నెం.464ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వికేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికకు త్వరలో చర్యలు ప్రారంభించనున్నారు. ఈ దిశగా పంచాయతీలను కూడా సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఇదే విషయమై సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించనున్నారు. అభివృద్ధికి నాలుగు దశలు వికేంద్రీకృత ప్రణాళిక అమలుకు మొదట పంచాయతీల సమాచారం సేకరిస్తారు. తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, వీధిదీపాలు, అంతర్గత రోడ్లు, వ్యవసాయం, ఆరోగ్యం, పశుసంపద, ఇళ్లు, పారిశ్రామిక వనరులు, పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని రెండో దశలో సేకరిస్తారు. తర్వాత మూడో దశలో ఆర్థిక వనరుల సమీకరణ చేస్తారు. ఇంటి పన్ను, నీటి పన్నుతో పాటు వీధీ దీపాల పన్ను, డ్రైనేజీ పన్ను, గ్రంథాలయ పన్ను, ప్రకటనల పన్ను, మార్కెట్లు, సంతలు, లే-అవుట్ల రుసుం, సేవారుసుం, ఆక్రమణల పన్ను, ప్రభుత్వ నిధులు, కేటాయింపులు, ఇతర శాఖల నిధులను గుర్తిస్తారు.చివరి దశలో పై వాటన్నింటిని క్రోడీకరించి గ్రామస్థాయి అవసరాలను గుర్తించి ప్రణాళికను రూపొందిస్తారు. అనంతరం గ్రామసభల్లో చర్చించి మార్పులు, చేర్పులు చేసి వికేంద్రీకృత ప్రణాళికను తయారు చేసి మండల స్థాయి సమావేశంలో అనుమతులు పొంది అమలు చేస్తారు. -
319 ఈ-పంచాయతీలు
గ్రామాల్లో ఆన్లైన్ పాలన - పనులు వేగవంతం... పారదర్శకత - ఇప్పటికే 26 పంచాయతీల్లో అమలవుతున్న ఆన్లైన్ - 173 మంది డేటా ఆపరేటర్లకు శిక్షణ - పల్లెలకు చేరిన కంప్యూటర్లు కరీంనగర్ సిటీ : గ్రామపంచాయతీల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి గ్రామ స్వరూపాలను మార్చేందుకు నడుం కట్టింది. అవినీతి నిర్మూలన, వేగవంతమైన పాలన అందించేందుకు ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ ఈ-పంచాయతీలకు రూపకల్పన చేసిన ప్రభుత్వం ఈ-సేవలను మరింత విస్తరించనుంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఈ-పంచాయతీలను పూర్తిస్థాయి విస్తరించేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ-పంచాయతీ అంటే... ఆన్లైన్ విధానంలో పరిపాలనను కొనసాగించే పద్ధతినే ఈ-పంచాయతీ అంటారు. గ్రామానికి సంబంధించిన అన్ని విభాగాలను ఆన్లైన్లోకి తీసుకువచ్చి, పారదర్శకపాలనను అందించడం ప్రధాన లక్ష్యం. పన్నులు, వేలం తదితర మార్గాల ద్వారా గ్రామాలకు వచ్చే ఆదాయం, రోడ్లు, తాగునీటి సరఫరా, వీధిదీపాలు తదితర ప్రజల అవసరాల కోసం వెచ్చించిన ఖర్చు వివరాలు, వివిధ రకాల పింఛన్ల చెల్లింపు, ధ్రువీకరణ పత్రాలు ఇలా మొత్తం వివరాలను ఆన్లైన్లో సమగ్రంగా పొందుపరుస్తారు. ఒక్క క్లిక్తో గ్రామపంచాయతీ ఆదాయం, వ్యయం, పనుల వివరాలు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయి. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు మీసేవలో లభించే సేవలను కూడా త్వరలోనే ఈ-పంచాయతీల ద్వారా అందించనున్నారు. ఎంపిక చేసిన క్లస్టర్ గ్రామపంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కార్వీ’ డేటా మేనేజ్మెంట్కు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం, కార్వీ కంపెనీలు కలిపి ఈ-పంచాయతీల నిర్వహణను చేపట్టనున్నాయి. పంచాయతీలవారీగా ప్రత్యేక ‘ఐడీ’ ‘పాస్వర్డ్’ రూపొందిస్తారు. ప్రస్తుతానికి కంపెనీ 173 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించగా, ఎంపిక చేసిన గ్రామాల్లో వారు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికోసం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు తిమ్మాపూర్ మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ, ఏరియా చా ప్రొఫైలర్, నేషనల్ పంచాయతీ పోర్టల్ అప్లికేషన్స్, ప్రియా సాఫ్ట్, ప్లాన్ప్లస్, యాక్షన్ సాఫ్ట్, యూనిఫైడ్ బర్త్, డెత్ అప్లికేషన్స్తోపాటు ఇతర అప్లికేషన్స్పై ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే చేరిన కంప్యూటర్లు ఈ-పంచాయతీలను క్లస్టర్ల వారీగా ఏర్పాటుచేయనున్నారు. జనాభా ఆధారంగా ఒకటి, రెండు లేదా మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తారు. జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా, జిల్లా అధికారులు 621 క్లస్టర్ పంచాయతీలను గుర్తించారు. డివిజన్, మండలాలవారీగా క్లస్టర్ గ్రామపంచాయతీల వివరాలను అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వీటిలోంచి 319 క్లస్టర్ గ్రామాలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో ఈ-పంచాయతీ విధానం అమలులోకి తీసకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చందుర్తి, కాటారం, మహదేవపూర్, సారంగాపూర్ లలో ఒక్కోటిగా మండల కేంద్రాలనే ఎంపిక చేయగా, మానకొండూరు మండలంలో అత్యధికంగా 13 క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశారు. జిల్లాలో ఇప్పటికే 26 గ్రామపంచాయతీల్లో ఈ-పంచాయతీ సేవలు అందుతున్నాయి. ముల్కనూరు, చొప్పదండి, ధర్మపురి, గంభీరావుపేట, గంగాధర, హుస్నాబాద్, హుజూరాబాద్, ఇబ్రహీంపట్నం, బండలింగాపూర్, జమ్మికుంట, కమలాపూర్, ఉప్పల్, కొత్తపల్లి, కొడిమ్యాల, కోరుట్ల, మల్లాపూర్, మల్యాల, మంథని, మెట్పల్లి, ముస్తాబాద్, పెద్దపల్లి, రాయికల్, పాలకుర్తి, సుల్తానాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీల్లో ఇప్పటికే ఈ-పంచాయతీ విధానం అమలులో ఉంది. పాతవి 26, కొత్తవి 319 కలిపి మొత్తం 345 గ్రామపంచాయతీలు ప్రస్తుతానికి ఈ-పంచాయతీ పరిధిలోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన కంప్యూటర్లు ఇప్పటికే జిల్లాకు చేరాయి. 319 గ్రామాలకు 319 కంప్యూటర్లు రాగా, జిల్లా ప్రజాపరిషత్కు రెండు, 57 మండల పరిషత్ కార్యాలయాలకు, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ డీఎల్పీవోలకు ఒక్కోటి చొప్పున మూడు, జిల్లా పంచాయతీ కార్యాలయానికి రెండు కంప్యూటర్లను కార్వీ కంపెనీ అందజేసింది. వేగవంతం... పారదర్శకత రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కె.తారకరామారావు పదిరోజుల క్రితం జెడ్పీ హాల్లో నిర్వహించిన కరీంనగర్ మండల ప్రణాళికలో ఈ పంచాయతీలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఆయన ప్రకటించడంతో ఇప్పుడు విస్తరించిన సేవలతోపాటు మరికొన్ని రోజుల్లోనే జిల్లా మొత్తం ఈ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ఈ-పంచాయతీలతో ఆయా గ్రామాల్లో ప్రజలకు పరిపాలనాపరంగా మెరుగైన సేవలు అందనున్నాయి. ఆన్లైన్ తో పనులు వేగంగా సాగడంతోపాటు అవినీతికి తావులేని పారదర్శక పాలన అందనుంది. -
మీరే చెల్లించండి
- పంచాయతీలకు షాకిచ్చిన సర్కార్ - విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ససేమిరా - బకాయి మొత్తం రూ.4.84 కోట్లు కడప అగ్రికల్చర్ : గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ పంచాయతీలపై భారం పడకుండా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించింది. వైఎస్ మరణానంతరం గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు బిల్లుల విషయంలో దాటవేత ధోరణి అవలంబిస్తూ వచ్చారు. దీంతో ఆ బిల్లులు ఇప్పుడు తడిసి మోపెడయ్యాయి. బిల్లులు చెల్లించడానికి నిధులు లేక సర్పంచ్లు అల్లాడుతున్నారు. గ్రామ పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీధి దీపాలు, వాటర్ వర్క్స్కు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లించడం కష్టమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 9 మేజర్ పంచాయతీలు, 790 మైనర్ పంచాయతీలు ఉన్నాయి. వీధి దీపాలు, వాటర్ వర్క్స్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందనే నమ్మకంతో పాలక వర్గాలు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ. 4.84 కోట్లకు చేరుకున్నాయి. గతంలో పంచాయతీలకు పన్నుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని కేటాయించి విద్యుత్ బిల్లులను పాలకవర్గాలు విద్యుత్ సంస్థకు చెల్లించేవి. ఆదాయం అంతంత మాత్రమే ఉండటం, పెరిగిన విద్యుత్చార్జీలకు పంచాయతీ నిధులు సరిపోక పోవడంతో బిల్లుల భారం పంచాయతీలకు గుదిబండగా మారింది. దీన్ని గమనించిన అప్పటి వైఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సంబందించిన విద్యుత్ బిల్లులను చెల్లించే బాధ్యత తీసుకుని ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దీంతో గ్రామ పంచాయతీలలో వసూలయ్యే పన్నులు, ఇతరత్రా వచ్చే నిధులను అభివృద్ధి పనులకు వినియోగించుకునే వారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్ బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పన్నులు వసూలు కాకపోతే 13వ ఆర్ధిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవాలని సూచించింది. మేజర్ వాటర్ వర్క్స్ బకాయి రూ. 60,22,061 ఉండగా మైనర్ వాటర్ వర్క్స్ విద్యుత్ బకాయి రూ. 3,77, 93,705 ఉంది. అలాగే మైనర్ పంచాయితీలకు వీధి దీపాల విద్యుత్ బకాయి 46, 48,596 రూపాయలు ఉంది. మూడేళ్లుగా విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో బకాయిలన్నీ పేరుకుపోయాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవచ్చు : పన్నులు వసూలు కాకపోయినా, పంచాయతీలలో డబ్బులు లేకపోయినా ఆర్థిక సంఘం నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. దాదాపు నాలుగైదు నెలలు వరుస ఎన్నికలు, అంతకు మునుపు ఎన్నికల ముందర ఆరునెలలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడంతోగ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఆగిపోవడంతో కొంత వరకు ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమే. - అపూర్వసుందరి, డీపీఓ -
ఏజెన్సీలో ప్రమాద ఘంటికలు
భద్రాచలం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో పారిశుధ్యం లోపించటంతోనే ప్రధానంగా వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. మలేరియాతో పాటు డెంగీ జ్వరాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నా.. గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణంతో వీటికి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలకు పాలకమండళ్లు ఉన్నప్పటికీ, నిధుల లేమితో పారిశుధ్యంపై వారు దృష్టి సారించకపోతున్నారు. ఇది గిరిజనుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. గత ఏడాది కంటే కొద్దిగా వ్యాధి పీడితుల సంఖ్య తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నప్పటకీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. జిల్లాలో 60 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు ఉండగా, వీటిలో 50 పీహెచ్సీలు ఏజెన్సీలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 24 వరకూ ఆయా పీహెచ్సీలలో నమోదైన జ్వరపీడితుల సంఖ్యను పరిశీలిస్తే, ఏజెన్సీలో వ్యాధుల తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లాలోని మొత్తం 69 పీహెచ్సీల పరిధిలో 1,72,042 రక్తపూత లు సేకరించగా, ఇందులో 859 మందికి మలేరియా వ్యాధి సోకినట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఏజెన్సీ పీహెచ్సీలలో 852 మంది ఉండగా, మైదాన ప్రాంతంలోని 19 పీహెచ్సీలలో ఏడుగురికి మలేరియా సోకినట్లు తెలుస్తోంది. మలేరియా కేసుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ సమయానికి తక్కువేనని వైద్య శాఖాధికారులు అంటున్నారు. కానీ డెంగీ వ్యాధి విజృంభిస్తుండటం వారికి సైతం ఆందోళన కలిగిస్తోంది. డెంగీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన 36 మందికి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 13 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధార ణ కావటం గమనార్హం. గతేడాది జూలై నెలఖారు నాటికి ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది పరిస్థితి భయంకరంగా ఉంది. వైద్య సిబ్బంది దృష్టికి వచ్చిన కేసులు మాత్రమే ఇవి. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదైన డెంగీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే వందల సంఖ్యలోనే వ్యాధి పీడితులు ఉంటారని అంచనా. గిరిజన గ్రామాల్లోని ప్రజలు మలేరియాతో బాధపడుతుండగా, పట్టణాల్లో ఉన్న వారికి ప్రధానంగా డెంగీ జ్వరాలు సోకుతున్నాయి. డేంజర్ జోన్గా ముంపు మండలాలు... ఏజెన్సీలో నమోదవుతున్న జ్వర పీడితుల్లో ముంపు మండలాల్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. చింతూరు మండలం తులసిపాక పీహెచ్సీలో అత్యధికంగా 209 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇదే మండలంలోని ఏడుగురాళ్ల పల్లి పీహెచ్సీలో 68 కేసులతో రెండో స్థానంలో నిలిచింది. కూనవరం మండలం కూటూరు పీహెచ్సీలో 48, భద్రాచలం మండలం నెల్లిపాకలో 38, వీఆర్పురం మండలంలోని రేఖపల్లి పీహెచ్సీలో 35 మలేరియా కేసులు నమోదయ్యాయి. కుక్కునూరు మండలం అమరవరం పీహెచ్సీలో 23 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఈ పీహెచ్సీలన్నీ ఆంధ్రప్రదేశ్కు బదలాయించిన ముంపు మండలాల్లోనే ఉన్నాయి. ఏజెన్సీ పరిధిలో 45 పీహెచ్సీలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించగా, ముంపు మండలాల్లోని అన్ని పీహెచ్సీలు డేంజర్ జోన్లోనే ఉన్నాయి. వర్షాకాలంతో పాటు చలికాలం ముగిసేంత వరకూ ఈ మండలాల్లో మలేరియా వ్యాధి పీడిత కేసులు వందల సంఖ్యలోనే నమోదవుతాయి. ప్రస్తుతం ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించారు. ఇక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. మరికొన్ని రోజుల్లో ముంపు మండలాలు ఆంధ్ర పాలనలోకి వెళుతున్నందున ఇక్కడ పనిచేసే సిబ్బంది తాము ఎటువైపు వెళ్తామోననే ఆందోళనతో విధుల పట్ల తగిన శ్రద్ధ చూపటం లేదు. కొంతమంది అయితే ముంపు నుంచి బయటకు వచ్చేందుకు సెలవులు కూడా పెడుతున్నారు. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టేదెవరనేది ప్రశ్నార్థకంగా మారింది. భర్తీకి నోచుకోని ఖాళీలు... వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది ఖాళీలు భర్తీకి నోచుకోవటం లేదు. 12 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా, కీలకమైన స్టాఫ్ నర్సు పోస్టులు 21 భర్తీ చేయలేదు. ఎంపీహెచ్ఏ(మేల్)83, ఎంపీహెచ్ఏ(ఫీమేల్) 161 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్టె క్నీషియన్లు 19 ఖాళీగా ఉండగా, వ్యాధులపై అవగాహ న కల్పించే కీలకమైన హెల్త్ఎడ్యుకేటర్ పోస్టులు 7 భర్తీకి నోచుకోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే వ్యాధుల కాలం ముగిసేంత వరకైనా మైదాన ప్రాంతం నుంచి డిప్యూటేషన్పై సిబ్బందిని తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు. -
పంచాయతీలకు షాకిచ్చిన సర్కార్
మోర్తాడ్ : గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాటర్ వర్క్స్, వీధి దీపాల బిల్లులను తాము చెల్లించేది లేదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలపై భారం పడకుండా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించింది. ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ముఖ్యమంత్రులు ఈ విషయమై దాటవేత ధోరణిని అవలంబిం చగా.. తాజాగా తెలంగాణ సర్కారు విద్యుత్ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే మోపడంతో సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలకు పన్నుల ద్వారా లభించే ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంతో వీధి దీపాలు, వాటర్ వర్క్స్కు సంబంధించిన విద్యుత్ బిల్లులను తాము చెల్లించడం కష్టం అవుతుందని పేర్కొంటున్నారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలకు నోటిఫైడ్ పంచాయతీలు 72 ఉన్నాయి. నాన్ నోటిఫైడ్ పంచాయతీ లు 646 ఉన్నాయి. ప్రభుత్వమే వీధి దీపాలు, నీటి పనులకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ పాలకవర్గాలు బిల్లులను చెల్లించడంలేదు. దీంతో బకాయిలు రూ. 96.86 కోట్లకు చేరుకున్నాయి. గతంలో పంచాయతీలకు పన్నుల వసూలు ద్వారా లభించే ఆదాయం నుంచి విద్యుత్ బిల్లును పాలకవర్గాలు విద్యుత్ సంస్థకు చెల్లించేవి. అయితే ఆదాయం అంతంత మాత్రంగా ఉండటం, పెరిగిన విద్యుత్ బిల్లులకు పంచాయతీ నిధులు సరిపోకపోవడంతో బిల్లుల భారం పంచాయతీలకు గుదిబండగా మారాయి. దీనిని గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామ పంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను చెల్లిం చడానికి ప్రభుత్వం ద్వారా నిధులను వెచ్చించారు. దీంతో పంచాయతీలకు వసూలు అయ్యే పన్నులు, ఇతర నిధుల ను అభివృద్ధి పనులకు వినియోగించే వీలు ఏర్పడింది. ఇప్పుడు మాత్రం పంచాయతీలకు సంబంధించిన విద్యు త్ బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించాలని ప్రభుత్వం మౌఖికంగానే ఆదేశాలిచ్చింది. పంచాయతీల కు పన్నులు వసూలు కాకపోతే ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధుల నుంచి బిల్లులు చెల్లించుకోవాలని సూచిం చింది. గతంలో మాదిరిగా విద్యుత్ బిల్లులను తాము చెల్లించలేమని ప్రభుత్వం చెప్పకనే చెప్పడం పంచాయతీ పాలకవర్గాలకు మింగుడు పడటం లేదు. నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 41.80 కోట్లు ఉండగా నాన్నోటిఫైడ్ పంచాయతీల బకాయిలు రూ. 55.06 కోట్లు ఉన్నా యి. సుమారు ఆరేళ్లుగా బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పంచాయతీలకు మంజూరవుతున్న నిధులు అంతంత మాత్రంగా ఉండటం, పన్నుల వసూలు సరిగా జరుగకపోవడంతో విద్యుత్ బకాయిల చెల్లింపు ఎలా సాధ్యం అవుతుందని పలువురు సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని కోరుతున్నారు. -
విద్యుత్ బకాయిల చెల్లింపునకు గ్రీన్సిగ్నల్
ప్రత్యేక నిధుల నుంచి కేటాయింపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ జిల్లాలో రూ.64కోట్ల బకాయిలు కరీంనగర్ సిటీ : విద్యుత్ బకాయిలతో సతమతమవుతున్న గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎస్ఎఫ్సీ, 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అనుమతినిస్తూ జిల్లా పంచాయతీ అధికారి లేఖ నం.ఏ4/3148/2011, తేదీ : 12.06.2014 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 1207 గ్రామపంచాయతీలు ఉండగా... ఆయా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకం, వీధిదీపాలకు విద్యుత్ను వినియోగిస్తుంటారు. విద్యుత్చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో సుమారు రూ.10 కోట్ల వరకు గ్రామపంచాయతీలు ట్రాన్స్కోకు విద్యుత్ చార్జీలు బకాయి పడ్డాయి. ఇటీవల గ్రామపంచాయతీలు బకాయిలు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ నిలిపివేస్తామని ట్రాన్స్కో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో కదిలిన పంచాయతీ విభాగం ప్రత్యేక నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఎస్ఎఫ్సీ, 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 25శాతం ఆయా గ్రామపంచాయతీలు రెండు లేదా మూడు వాయిదాల్లో బకాయిలు చెల్లించాలని సూచించింది. విద్యుత్ బకాయిల చెల్లింపు కోసం జిల్లా పంచాయతీ అధికారి గ్రామపంచాయతీలకు పలు సూచనలు చేశారు. ఆయా గ్రామపంచాయతీల్లో వీధిదీపాలు, నీటి సరఫరా పథకానికి అయిన విద్యుత్చార్జీల వివరాలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు సంబంధిత ట్రాన్స్కో అధికారులతో సమీక్షించుకోవాలి. సదరు గ్రామపంచాయతీ ట్రాన్స్కోకు విద్యుత్చార్జీలు ఎంత బకాయి ఉందో నిర్ధారించుకుని, రెండు లేదా మూడు వాయిదాల్లో ఈ నిధుల నుంచి చెల్లించాలి. ఈవోపీఆర్డీ తమ పరిధిలోని గ్రామపంచాయతీల బకాయిలను కనెక్షన్లవారీగా నిర్ధారించడానికి ట్రాన్స్కో, పంచాయతీ కార్యద ర్శులను సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు సూచనలు జారీచేయాలి. గ్రామపంచాయతీల కనెక్షన్వారీగా వివరాలతో రికార్డును నిర్వహించాలి. నిధులకు అనుగుణంగా వాయిదాల్లో బకాయిలు చెల్లించేందుకు, బకాయిలు నిర్ధారించేందుకు ట్రాన్స్కో అధికారులు సహకరించాలని డీపీవో కుమారస్వామి కోరారు. విద్యుత్ నిలిస్తే స్థానిక అధికారులదే బాధ్యత గ్రామపంచాయతీలు విద్యుత్ బకాయిలు చె ల్లించేలా చూసే బాధ్యతను సంబంధిత పంచాయతీ కార్యదర్శి, పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఈవోపీఆర్డీ, డివిజనల్ పంచాయతీ అధికారులదేనని డీపీవో చెప్పారు. బకాయిల చెల్లింపు ఆదేశాలను అమలు పరచని పంచాయతీ కార్యదర్శుల వివరాలు తనకు తెలియచేయాలని సూచించారు. బకాయిలు చెల్లించక ఏ గ్రామపంచాయతీలోనైనా విద్యుత్ సరఫరా నిలిపివేస్తే సంబంధిత పంచాయతీ కార్యదర్శి, విస్తరణ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
ఇక.. గ్రామపాలన పారదర్శకం
నల్లగొండ : మారుమూల గ్రామాలలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీలను ప్రంపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో 2440 గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటుచేయడంలో భాగంగా జిల్లాలో 171 పంచాయతీలను ఎంపికచేశారు. అం దుకు సంబంధించిన ఏర్పాట్లు చకాచకా పూర్తవుతున్నాయి. పంచాయతీలకు కంప్యూటర్లు సరఫరా చేయడానికి, బీఎస్ఎన్ల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లన్నీ ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లోనే ఈ-పంచాయతీల పాల నను మొదటి దఫాలో అందుబాటులోకి తేనున్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 171 క్లస్టర్ పంచాయతీలలో నల్లగొండ డివిజన్లో 65, భువనగిరి డివిజన్లో 53, మిర్యాలగూడ డివిజన్లో 53 పంచాయతీలు ఉన్నాయి. 237 కంప్యూటర్ల పంపిణీ.. ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 237 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటినిు జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు ఒక్కొక్కటి చొప్పున 59, జిల్లా పరిషత్కు రెండు కంప్యూటర్లు, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో రెండు కంప్యూటర్లు, మూడు డివిజన్ పంచాయతీల కార్యాలయాలకు మూడు కంప్యూటర్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ గ్రామ పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున పంపిణీ చేయనున్నారు. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఇవ్వనున్నారు. గతంలో 18 పంచాయతీలలో ఈ-పాలన గతంలో కూడా గ్రామ పంచాయతీలలో ఈ-పాలన అందుబాటులోకి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా 24 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. కానీ ఈ-పంచాయతీలుగా ఉన్న హుజూర్నగర్, దేవరకొండ పట్టణాలు నగర పంచాయతీలు కావడంతోపాటు మరో నాలుగు పంచాయతీలలో అమలు చేయలేకపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 18 గ్రామ పంచాయతీలలో ఈ-పాలన కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ-పంచాయతీలుగా ఎంపికైన 171 క్లస్టర్ పంచాయతీలతో కలిపి జిల్లాలో ఈ-పంచాయతీల సంఖ్య 189కి చేరనుంది. ఇక.. అన్నీ పారదర్శకమే - ఈ - పంచాయతీలలో అన్ని సేవలు కూడా పారదర్శకంగా అందించనున్నారు. - పంచాయతీలకు వచ్చే ఆదాయం వివరాలతో పాటు ఖర్చుల వివరాలు కూడా ఆన్లైన్లో ఉంచుతారు. - అంతే కాకుండా గ్రామంలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్లైన్లో ఉంచనున్నారు. -
పంచాయతీ బకాయిలు రూ.72 కోట్లు
- వేధిస్తున్న సిబ్బంది కొరత - అదనపు బాధ్యతలతో సతమతం - గ్రామాల్లో కుంటుపడుతున్న అభివృద్ధి హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో వసూలు చేయాల్సిన పన్నుల బకాయిలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. పన్నులు, పన్నేతర బకాయిలు మే చివరినాటికి జిల్లా మొత్తం గా రూ.72కోట్లు ఉన్నాయి. దీంతో పన్నుల వసూలుకు అధికారులు అదను చూసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలనే యోచనలో ఉన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. ఇందులో ఇంటిపన్నులు, నల్లా పన్నులు. రెండవది పన్నేతర ఆదాయం. ఇందులో సంతలు, ఆంగళ్లు, రహదారి శిస్తు, వేలంపాటలు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం ఉంటుంది. జిల్లాలో కొద్ది సంవత్సరాలుగా పంచాయతీ సిబంది పన్నులు వసూలు చేయడం పూర్తిగా మర్చిపోయారు. దీంతో ఇంటి పన్నులు, నల్లా పన్నులు కలిపి రూ.45కోట్లకు పైగా, పన్నేతర బకాయిలు రూ.26కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించడంతో పంచాయతీ పాలనకు ప్రాధాన్యం పెరిగింది. దీనికి తోడు పంచాయతీల ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ముఖ్యం గా పన్నులు వసూళ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్వయంగా ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో చెప్పడంతో పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉంది. సిబ్బంది కొరతతో ఇబ్బందులు జిల్లాలో 962 పంచాయతీలు ఉండగా కార్యదర్శులు మాత్రం 342 మంది మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కో కార్యదర్శికి మూడు పంచాయతీల బాధ్యతలున్నాయి. దీనికి తోడు రెండేళ్లుగా సర్పంచ్లు లేక ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగాయి. అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేశారే తప్ప పన్నుల వసూళ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వెరసి బకాయిలు తడిసి మోపెడయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో 98 మంది కార్యదర్శులకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొంతవరకు అదనపు బాధ్యల నుంచి వారికి విముక్తి కలిగి పన్నుల వసూళ్లపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇబ్బందే... ప్రస్తుతం ‘మన గ్రామం-మన ప్రణాళిక’ క్యాక్రమంలో చేసే ప్రతి ప్రణాళిక గ్రామ ఆదాయాన్ని బట్టే చేయాలి. అయితే పేరుకు పోయిన బకాయిలు నూరుశాతం వసూలవుతాయని ఊహించి ప్రణాళికలు సిద్ధం చేయడంటే ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం పంచాయతీ సిబ్బందికి కత్తిమీద సాములాంటిదే. -
అనిత.. తొలి అడుగు
దేవరకొండ : చందంపేట మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో 50 కుటుంబాలు ఉంటాయి. సుమారు రెండు వందల మంది జనాభా ఉంటుంది. ఆ చెంచుకాలనీకి చెందిన దాసరి అంజయ్య, ఈదమ్మలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో అనిత పెద్దకూతురు. ఈ కాలనీలో 50 కుటుంబాలున్నప్పటికీ పిల్లల చదువులు మాత్రం సగంలో ఆగిపోతున్నాయి. ఐటీడీఏ వారు ఈ కాలనీలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించేవారు. కుటుంబం గడవని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బడి మానేసి కూలి పనికో.. వలసబాటనో పడుతున్నారు. దీంతో ఆ పాఠశాల కూడా ప్రస్తుతం మూతబడింది. అయితే అనితను పదవ తరగతి వరకు దేవరకొండలోని ఎంబీ హైస్కూల్లో చదివిం చారు. పదో తరగతిలో ఉత్తీర్ణురాలైంది. చెంచులకు రిజర్వేషన్ అమలవుతుండడంతో ఇంటర్ చదివించాలన్న ఆలోచనతో దామరచర్లలోని ఏపీటీడబ్ల్యూఆర్జీ జూనియర్ కళాశాలలో చేర్పించారు. అనిత ఇటీవల ఇంటర్లో ఉత్తీర్ణురాలు కావడంతో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టర్ ఆశయాన్ని నిజం చేసిన అనిత.. 24 ఏళ్ళ క్రితం ఓ కలెక్టర్ కన్న కల నేటికి సాకారమైంది. చెంచులు అడవిలో ఆకులు అలములు తింటూ గడ్డు జీవితాన్ని గడపడాన్ని జీర్ణించుకోలేని అప్పటి కలెక్టర్ తుకారాం (చెంచు) చెంచుల అభ్యున్నతి కోసం ఏదైన చేయాలని తలచారు. చందంపేట అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో చెంచుకాలనీలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, భూమి లేని వారికి భూమి పంపిణీ చేసి వారిలో మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం, నిధుల మంజూరులో అలసత్వం కారణంగా కలెక్టర్ తుకారాం ఆశయం నీరుగారింది. ఈ చెంచుకాలనీలను శ్రీశైలం ఐటీడీఏలో భాగస్వామ్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉపాధి అవకాశాలు లేకపోగా, చెంచులు జీవిత గమనం మళ్ళీ అడవికే చేరింది. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణా చట్టం, విద్యాహక్కు చట్టం వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యంగా మారిందనడానికి అనిత ఉదంతమే ఒక ఉదాహరణ. ఏదేమైనా కలెక్టర్ తుకారాం ఆశయాన్ని నిజం చేసే దిశగా అనిత అడుగులు వేస్తోంది. కాగా టీటీసీ చదవడానికి ఆమె దాతల నుంచి సాయం కోరుతోంది. ఓ వైపు కుటుంబానికి ఆసరాగా.. మరోవైపు లక్ష్యసాధన దిశగా.. ఇంటర్ వరకు చదివిన అనిత పై చదువుల కోసం తపిస్తోంది. ప్రభుత్వ టీచర్ కావాలన్న లక్ష్యంతో టీటీసీ పరీక్షకు హాజరైంది. కానీ తన ర్యాంకుకు ప్రభుత్వ కోటాలో సీటు రాదేమోనని బెంగపెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనిత తన కుటుంబానికి ఆసరాగా కూలి పనిచేస్తుంది. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు శివ కూడా మామిడి మొక్కలు నాటడానికి గోతులు తీసే పనికి వెళ్తున్నారు. ఉద్యోగం చేసి చెల్లెళ్లను చదివిస్తా మా అమ్మనాన్న రోజు కూలి పనిచేసి కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అందుకే నేను బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉన్నాను. ఉద్యోగం చేస్తూ నా ఇద్దరు చెల్లెళ్ళను చదివించాలన్నదే నా కోరిక. ఇప్పుడు చెల్లెలిద్దరిని మోడల్స్కూల్లో చదివిస్తున్నారు. తమ్ముడు చదువు మానేసి అమ్మానాన్నలతో కలిసి కూలి చేస్తుండు. నేను కూడా అప్పుడప్పుడు మా వాళ్ళతో కలిసి ఊళ్లో కూలికెళ్తుంటా. అందరం కష్టపడితేనే ఇళ్లు గడుస్తుంది. ఈ కష్టాలన్నీ తీరాలంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలి. మున్ముందు మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. ప్రభుత్వం చేయూతనిస్తే మా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుంది. - అనిత దరిచేరని పథకాలు.. కాగా, గత 24 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ చెంచుకాలనీలోని వారి అభ్యున్నతి కోసం మౌలిక సదుపాయాలు కల్పించి భూమి లేని వారికి భూమినిచ్చిఆదుకుంది. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులు మాత్రం వారి అభ్యున్నతిని గాలికొదిలేశారు. దీంతో ఆ చెంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది వలసబాట పట్టడంతో కొంతమంది మాత్రమే ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, అంజయ్యకు అప్పటికి వివాహం కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రెండు ఎకరాలకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అంజయ్య, ఈదమ్మలు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు. నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణ చట్టం, విద్యాహక్కుచట్టం వంటి ఎన్నో చట్టాలు అమలుచేసి విద్యను ప్రోత్సహిస్తున్నామని అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. చెంచులు కూడా విద్యాపరంగా అంత ఆసక్తి చూపకపోవడం.. .వారిని చైతన్యం చేయడంలో అధికారులు విఫలమవుతుండడంతో వారి బతుకులు మారడం లేదు.