సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా 58 కంటోన్మెంట్ల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 11న జరుగనున్నాయి.
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం వెలువడింది. దేశవ్యాప్తంగా 58 కంటోన్మెంట్ల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి 11న జరుగనున్నాయి. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ) తరఫున ఎస్ఆర్వో 09 (ఈ) ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.