తుర్కపల్లి: నీటి సంపులో పడి ఏడాది చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలంలో చోటుచేసుకుంది. తుర్కపల్లి మండలంలోని ముల్కపల్లి గ్రామం సంగ్యా తండాకు చెందిన లావణ్య, మంగత్యా దంపతులకు చివరి కుమార్తె శరణ్య(1). ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ఇంటి దగ్గరున్న సంపులో పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న శరణ్యను తుర్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచనమేరకు హుటాహుటిన భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శరణ్య మృతిచెందినట్టు భువనగిరి వైద్యులు తేల్చారు.
సంపులో పడి చిన్నారి మృతి
Published Sat, Feb 14 2015 9:03 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Advertisement