kid
-
బుడ్డోడికి కేఏ పాల్ బంపర్ ఆఫర్
-
‘క్షమించు తల్లి’.. చిన్నారికి స్కూల్ ప్రిన్సిపల్ క్షమాపణలు
ముంబై : ఐదు నిమిషాలు ఆలస్యంగా క్లాస్ వచ్చిన చిన్నారిపై ఓ స్కూల్ యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. చిన్నారితో బలవంతంగా 50 గుంజీలు చేయించింది. దీంతో చిన్నారి అస్వస్థతకు గురైంది. మహరాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్కూల్కు చెందిన 13ఏళ్ల చిన్నారి స్కూల్కు ఆలస్యంగా వచ్చింది. దీంతో స్కూల్కు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ప్రశ్నించిన స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారితో 50 గుంజీలు తీయించారు. ఫలితంగా చిన్నారి నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.స్కూల్ యాజమాన్యం తీరుపై సమాచారం అందుకున్న తల్లిదడడ్రులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపల్పై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రిన్సిపల్పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పిల్లలు కోరారని, పిల్లల విజ్ఞప్తితో తల్లిదండ్రులు కేసును ఉపసంహరించుకున్నట్లు పాల్ఘర్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనంత్ పరాడ్ తెలిపారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినట్లు చెప్పారు.పాఠశాల యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామని, భవిష్యత్తులో అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని వారికి సూచించామన్నారు. ఇక స్కూల్ ప్రిన్సిపాల్ సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. అనంతరం క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
700 అడుగుల లోతు బోరు బావిలో చిన్నారి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
జైపూర్: రెండు వారాల వ్యవధిలో రాజస్థాన్లో మూడేళ్ల చిన్నారి చేతన బోరు బావిలో పడింది. చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది 20 గంటలుగా నిర్విరామంగా శ్రమిస్తున్నారు. 700 అడుగుల లోతులో ఉన్న పాప ఆచూకీ కోసం బోరు బావి లోపలకు రెస్క్యూ బృందాలు కెమెరాను లోపలికి పంపాయి. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం రాజస్థాన్ రాష్ట్రం కోట్పుత్లీ-బెహ్రోర్ జిల్లాలో మూడేళ్ల చేతన తన తండ్రితో కలిసి పోలానికి వెళ్లింది. తండ్రి పొలం పనులు చేస్తుండగా.. చేతన పొలంలో ఆడుకుంటుంది. ఆ సమయంలో ప్రమాదవ శాత్తూ పొలంలో ఏర్పాటు చేసిన 700 అడుగుల బోరుబావిలో పడింది. దీంతో భయాందోళన గురైన బాలిక తండ్రి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు చేతనను రక్షించేందుకు రంగంలోకి దిగాయి. చేతన 150 అడుగుల లోతులోకి జారినట్లు గుర్తించారు. బోరుబావి లోపల పాప ఆచూకీ కోసం కెమెరాలను పంపించారు. 20 గంటలకు బోరుబావిలో ఉన్న చేతనను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. బోరుబావి లోపల ఉన్న చేతనను సురక్షితంగా రక్షించేందుకు శాయశక్తులా రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. 700 फीट गहरे बोरवेल में फंसी बच्ची, गांव में चूल्हा नहीं जला। कैमरे में हाथ हिलाते हुए दिखी"दुआ करें, जिंदगी की ये जंग जीत जाए। 💕" pic.twitter.com/XJg5BDBDeR— Dinesh Bohra (@dineshbohrabmr) December 23, 2024 విఫలమైన ప్రయత్నం.. చివరిగా 150 అడుగుల లోతులో ఉన్న చేతనకు ఆక్సిజన్ పైపును లోపలికి పంపారు. బోరుబావికి ఓ వైపు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ వ్యవసాయం క్షేత్రం కావడంతో మట్టి తేమగా ఉంది. దీంతో తవ్వకాలను నిలిపివేశారు. అనంతరం, పొడవైన రాడ్కు బిగించిన హుక్ సాయంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతన సురక్షితంగా బోరుబావి నుంచి బయట పడుతుందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఆర్యన్ కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ దౌస జిల్లాలోని కలిఖడ్ గ్రామాంలో విషాదం చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఐదేళ్ల ఆర్యన్ ప్రాణాలు కోల్పోయాడు. ఆర్యన్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పొలంలోని 150 అడుగుల బోరు బావిలో పడ్డాడు. బాలుడి కోసం రెస్క్యూ బృందాలు సుమారు 57 గంటల పాటు శ్రమించాయి. చివరికి 150 అడుగుల వరకు గొయ్యిని తవ్వి క్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశారు. అపస్మారకస్థితిలో ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు.STORY | Race against time to save 5-year-old Aryan stuck in Rajasthan borewellREAD: https://t.co/LlJCz15soaVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/KqVqlNJmo7— Press Trust of India (@PTI_News) December 11, 2024 -
పిన్నీసు మింగిన మూడునెలల పసికందు..ప్రాణం కాపాడిన ఆంకురా ఆస్పత్రి వైద్యులు
అంకురా ఆస్పత్రి వైద్యులు ప్రాణ ప్రదాతలుగా నిలిచారు. అరుదైన ఆపరేషన్ చేసి మూడు నెలల పసికందుకు ప్రాణం పోశారు. ఇటీవల మూడు నెలల పసికందును.. పక్కనే ఆడుకొంటున్న తోబుట్టువుల వద్ద కుటుంబ సభ్యులు పడుకోబెట్టారు. ఆ సమయంలో పసికందు ఓ పన్నీసును మింగేసింది. ఊపిరి పీల్చుకోవడంతో పాటు ఇతర సమస్యలు తలెత్తడంతో అత్యవసర చికిత్స కోసం తల్లిదండ్రులు అంకురా ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రికి వచ్చిన వెంటనే అంకురా ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్టోఎంటరాలజిస్ట్, హెపాటాలజిస్ట్ డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి పరీక్షలు నిర్వహించారు. రేడియోగ్రాఫిక్ పరీక్షల్లో పిన్నీసు కడుపులో గుచ్చుకున్నట్లు నిర్ధారించారు. ఇది ప్రాణాంతకంగా మారి పసికందుకు ప్రమాదమని భావించారు.వెంటనే డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠిల వైద్యుల బృందం పసికందు పొట్ట భాగంలో క్లిష్టమైన ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేశారు. మినిమల్ ఇన్వాసివ్ టెక్నిక్ ను ఉపయోగించి రెండు సెంటీమీటర్ల పిన్నీసును తొలగించారు. పసికందు ప్రాణాన్ని కాపాడారు. ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్ ఫర్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం మాట్లాడుతూ.. గృహోపకరణాలతో చిన్న పిల్లలకు ప్రమాదం పొంచిఉందని ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ప్రాణాంతక పరిస్థితులను నివారించడంలో తల్లిదండ్రుల అవగాహన, వేగంగా స్పందించడం చాలా అవసరమని తెలిపారు. అంకురా హాస్పిటల్ సంరక్షణను అందించడమే కాకుండా రోగుల భద్రతకు కట్టుబడి ఉందని అన్నారు.మూడు నెలల పసికందుకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ పారిజాత్ రామ్ త్రిపాఠి మాట్లాడుతూ.. మేము ఎండోస్కోపీ ద్వారా పిన్నీసును విజయవంతంగా తొలగించాం. తీవ్రమైన సమస్యలను నివారించడానికి సకాలంలో చర్య అవసరం. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఈ విధానం ద్వారా బాధితులకు ఓపెన్ సర్జరీ అవసరాన్ని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. వెంటనే కోలుకోవచ్చని తెలిపారు. -
చిన్నారి ప్రాణం తీసిన సెల్ఫోన్ ఛార్జర్
నిర్మల్ జిల్లా, కడెం మండలం కొత్త మద్దిపడగలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ ఛార్జర్ చిన్నారి ప్రాణం తీసింది. చిన్నారి సెల్ఫోన్ ఛార్జర్ కేబుల్తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్కు గురై చిన్నారి ప్రాణాలు కొల్పోయింది. ఈ విషాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసులతో దాగుడుమూతలు..
-
నాలుగు నెలల చిన్నారి టాలెంట్..పుట్టుకతోనే పుట్టెడు బుద్దులు
-
కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
విదేశాల్లో బిడ్డ దగ్గరకు వెళ్లి ఆనందంగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన దంపతులు, వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఆ కారులో ఉన్న చిన్నారి తల్లిదండ్రులు కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టొరంటోకు తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై విచారాన్ని వ్యక్తం చేసిన ఒట్టావాలోని భారత హైకమిషన్ మృతులకు సంతాపాన్ని తెలియజేసింది.ఏం జరిగిందంటే ఇండియాకు చెందిన మణివణ్ణన్(60) మహాలక్ష్మి(55) దంపతులు ఎజాక్స్లో ఉంటున్న మనవడిని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అందరూ కలిసి బయటికి వెళ్లగా మృత్యువు వారిని కబళించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం . బోమన్విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలిసులు వెంబడించారు. పోలీసులను నుంచి తప్పించు కునే క్రమంలో హైవేపై వ్యాన్లో రాంగ్రూట్లో వెళుతూ వారు పలు కార్లను ఢీకొట్టారు. ఇందులో బాధితుల కారు కూడా ఉంది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ,తల్లి ఐసీయూలో ఉందని ఒంటారియో స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ యూనిట్ (SIU) తెలిపింది.‘‘ఎప్పటిలాగే ఆ హైవేపై కారులో వెళుతున్నాను ఇంతలో నిందితులు రాంగ్రూట్లో ఎదురుగా వచ్చారు. ఆరు కార్లను ఢీకొట్టారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఆ క్షణం నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ ఈ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఓ ప్రత్యక్ష సాక్షి మరోవైపు ఘటనపై కెనడా పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో వివిధ కోణాలలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో టచ్లో ఉన్నామని బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. -
వండర్ బుడ్డోడు..చిన్న వయసులోనే పెద్ద రికార్డు
-
ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్
నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్షిప్ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు. కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు. I’m speechless. Just tears in my eyes. Thank you @drsangitareddy Thank you Apollo Hospitals for an initiative with such humanity & for making us a part of it. और कार्तिक, मैं आपका सबसे बड़ा Fan हूं ! pic.twitter.com/d0Z1LETB9a — anand mahindra (@anandmahindra) September 23, 2023 -
అత్యంత అరుదైన వ్యాధి..మెడిసిన్ ఖర్చే ఏకంగా రూ. 17 కోట్లు!
అత్యంత అరుదైన వ్యాధులు చాలానే ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్నింటికి చికిత్స లేకపోగ, మరికొన్నిటికి చికిత్సకు అయ్యే ఖర్చు చూస్తే అసలు సామాన్యుడు కాదు కదా ధనవంతుడైన ఖర్చుపెట్టలేనంతగా ఖరీదుగా ఉంటుంది. ఇక మరొకొన్నిటికి అసలు చికిత్స అనేది ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన వైద్యంతో కూడిన అరుదైన వ్యాధి బారిన పడ్డాడు ఓ చిన్నారి. అతడికోసం ముఖ్యమంత్రి కదిలివచ్చి పరామర్శించడమే గాక అత్యంత ఖరీదైన మెడిసిన్ను అందజేశారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిన్నర చిన్నారి. అతడి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ చిన్నారిని పరామర్శించి చికిత్సలేని ఆ వ్యాధికి ఇచ్చే అత్యంత ఖరీదైన మందును ఆయనే స్వయంగా అందజేశారు. ఆ డ్రగ్ ఖరీదు ఏకంగా రూ. 17.5 కోట్లు. అని చెప్పారు. ఇంతకీ అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుందంటే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే వెన్నెముక కండరాల క్షీణత(ఎస్ఎంఏ). దీని వల్ల వెన్నుపాములోని మోటారు న్యూరాన్లను కోల్పోతుంది. దీంతో కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీన్ని జన్యు నాడీ కండరాల రుగ్మత అని కూడా పిలుస్తారు. ఈ మేరకు ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ నంద్వానీ మాట్లాడుతూ..భారతదేశంలో ఎస్ఎంఏ అనేది చాలా అరుదు. ఇది వస్తే మాత్రం గణనీయమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఏడు వేల మంది జననాలలో మూడు వేలమంది శిశువులు దీని భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా పక్షవాతం వచ్చి క్రమంగా ఆరోగ్యం క్షీణిచడం తోపాటు మిగతా అవయవాలపై దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు. చికిత్స: దీనికి పూర్తి నివారణ లేదు. వెన్నుముక కండరాల క్షీణత కారణమైన జన్యవులను ప్రభావితం చేసేలా చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడం వంటివి మాత్రమే చేయగలం అని తెలిపారు. దీని కోసం జోల్జెన్స్మా అనే జన్యు పునఃస్థాపన చికిత్స తోపాటు న్యూసినెర్సెన్ (స్పిన్రాజా), రిస్డిప్లామ్ (ఎవిర్స్డ్) అనే రెండు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాధిత కుటుంబాల జన్యు క్రమాన్ని అధ్యయనం చేసి తత్ఫలితంగా చికిత్స అందించేలా వైద్య విధానాలు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. (చదవండి: మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!) -
బొమ్మ కాదురా నాయనా.. పామును చేతిలో పట్టుకుని..
-
ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..
పిల్లలకు మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాల్సిన తండ్రే ప్రతికార వాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చిన్నారులు ఆకతాయితనంతో.. తెలిసో తెలియక చేసే అల్లరి పనులను గుర్తించి సరిచేయడమో లేక మంచిగా చెప్పి వినేలా చేయడమో చేయకపోగా అతడే చిన్న పిల్లాడి మాదిరి ప్రవర్తించాడు. హుందాగా ఆ చిన్నారికి తాను చేసిని పని గురించి వివరించి చెప్పడం మాని అమానుషంగా ప్రవర్తించి కెమెరాకు చిక్కాడు. ఈ అనూహ్య ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చైనాలో గుయ్గాంగ్లోనో ఓ ప్లే గ్రౌండ్లో పిల్లలు పేరెంట్స్ సమక్షంలో ఆడుకుంటూ ఉన్నారు. ఐతే ఓ చిన్నారి ఓ తండ్రి కూతుళ్లు నుంచొన్న వైపుకి వచ్చి అనుకోకుండా అతడి కూతుర్ని ఢీ కొట్టాడు. దీంతో ఆ తండ్రి కోపంతో ఆ చిన్నారి వంక చూసి అడ్డుకోవడమే గాక దాడి చేశాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా అమానుషంగా కొట్టడం వంటివి చేశాడు. ఆఖరికి ఏదో వస్తువుని గాల్లోకి లేపినట్లుగా ఆ చిన్నారిని లేపి నేలపైకి విసిరేశాడు. సరిగ్గా ఆ సమయానికి ఆ చిన్నారి తల్లి వచ్చి అతడితో వాగ్వాదానికి దిగింది. ఎందుకు ఇలా చేశావంటూ అతన్ని నిలదీసింది. ఆ తర్వాత తన పిల్లాడిని అక్కడ నుంచి తీసుకెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని న్యూయార్క్ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Dad violently knocks around a stranger’s kid at a playground 😳 pic.twitter.com/wBhBwJkMWj — Daily Loud (@DailyLoud) May 20, 2023 (చదవండి: నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది) -
‘పిల్లలు కావాలి సార్.. నా భర్తకి పెరోల్ ఇవ్వండి’
భోపాల్: సెంట్రల్జైలు అధికారులకు ఓ మహిళ చేసిన అరుదైన అభ్యర్థన ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. తనకు సంతానం కావాలని, అందుకు జైలులో ఉన్న తన భర్తను పెరోల్పై విడుదల చేయాలని ఆమె జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివపురికి చెందిన ఓ మహిళ దారా సింగ్ జాదవ్ అనే వ్యక్తిని కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్ది రోజులకే జాదవ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల దారా సింగ్ జాదవ్ తండ్రి కరీం సింగ్ జాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. చనిపోయేలోపు మనవడిని, మనవరాలిని చూడాలనుకున్నాడు. దీంతో ఆ మహిళ తన భర్తను పెరోల్పై విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. ఈ విషయంపై గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరివియా మాట్లాడుతూ.. జీవిత ఖైదు శిక్ష పడ్డ ఖైదీలు వారి రెండేళ్లు శిక్షాకాలంలో మంచిగా ప్రవర్తిస్తే పెరోల్ పొందే అవకాశముందని చెప్పారు. అయితే ఈ పెరోల్ మంజూరు నిర్ణయం జిల్లా కలెక్టర్ చేతుల్లోనే ఉందని అధికారలు చెబుతున్నారు. గతంలోనూ రాజస్థాన్లోని జోధ్పుర్ న్యాయస్థానం.. ఇటువంటి కేసులో ఓ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఎంతకు తెగించారు.. అద్దెకు ఇల్లు తీసుకుని ఇంటినే డ్రగ్స్ ఫ్యాక్టరీగా మార్చారు! -
ఏం టైమింగ్ రా?.. 60 మందిని కాపాడాడు
Viral Video: పిల్లలను నేర్పాల్సింది విద్యాబుద్ధులు మాత్రమే కాదు.. సంఘంలో ఎలా మెలగాలన్నది కూడా!. సోషల్ మీడియాలో ఎరాలో పిల్లల్ని తప్పుదోవ పట్టించే రీతిలోనే ఉంటోంది చాలామంది తల్లిదండ్రుల పెంపకం. టెక్నాలజీ అవసరమే.. కానీ అది ఏ తరహాలో ఉండాలన్నది పిల్లలకు అలవాటు చేయాల్సింది పేరెంట్స్. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఏడో గ్రేడ్ చదివే ఓ చిన్నారి చేసిన పని.. ఏకంగా 60 మందికి పైగా ప్రాణాల్ని నిలబెట్టింది కాబట్టి. మిచిగాన్లో బుధవారం ఈ ఘటన జరిగింది. డ్రైవర్ కళ్లు తిరిగి పడితే.. ఓ విద్యార్థి సకాలంలో స్పందించాడు. డ్రైవర్ సీటులోకి దూకి.. ఎమర్జెన్సీ స్టాపర్ సాయంతో బస్సును ఆపేశాడు. ఆ ఘటన బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. సాహసంగా ముందుకు దూకిన స్టూడెంట్ను దిల్లాన్ రీవ్స్గా గుర్తించిన అధికారులు అభినందించారు. బస్సును ఆపడమే కాదు.. ఎమర్జెన్సీ నెంబర్కు డయల్ చేయాలంటూ కేకలు వేశాడు ఆ స్టూడెంట్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. -
పేదింటి చిన్నోడికి.. పెద్ద కష్టం
నిర్మల్రూరల్: ఆడుతూ పాడుతూ తిరిగే చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన వైశాలి, రవి దంపతుల కుమారుడు రాహుల్ (9 నెలలు) రక్తప్రసరణ వ్యవస్థలో ఇబ్బంది తలెత్తింది. వైద్యానికి రూ.లక్షలు కావడంతో ఆ పేద కుటుంబం ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకునేందుకు అల్లాడుతోంది. వైశాలి, రవి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల తర్వాత రాహుల్ జన్మించాడు. ఏడు నెలల వయసులో జ్వరం రావడంతో జిల్లా కేంద్రంతో పాటు నిజామాబాద్లో వైద్యులకు చూపించారు. ఎంతకీ నయం కాకపోవడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రిని సంప్రదించారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం రాహుల్కు రక్తప్రసరణ వ్యవస్థలో లోపం ఉందని, తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ ఖర్చు సుమారుగా రూ.3.50 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆపరేషన్కు డబ్బులు లేక తల్లడిల్లుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో తమను ఆదుకోవాలని, దాతల తమ కుమారుడిని కాపాడాలని వేడుకుంటున్నారు. సంప్రదించాల్సిన నం. 9676034110 -
ఈ బుడ్డోడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
-
5 ఏళ్ల పాప... ఆడుకుంటుంది అనుకున్న తల్లికి ఊహించని షాకిచ్చింది!
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో చిన్నారులు ఆట బొమ్మలకంటే స్మార్ట్ఫోన్లతోనే కాలంక్షేపం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్లే ఫోన్లతో ఆడుకుంటున్నారని లైట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను చూసి కంగుతింటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారి తన తల్లికి ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. మసాచుసెట్స్కి చెందిన జెస్సికా నూన్స్ అనే మహిళ కారులో వెళ్తుండగా తన ఐదేళ్ల కూతురు లీల గోల చేస్తూ ఉంది. దీంతో పాపకి తన ఫోన్ ఇవ్వడంతో సైలెంట్ అయ్యింది. అయితే ఫోన్లో గేమ్స్, లేదా వీడియోలు చూస్తూ ఉందేమో అని జెసికా అనుకుంది. అయితే లీలా మాత్రం అమెజాన్ యాప్ ఓపెన్ అందులో 3,180 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.2.46 లక్షల) బొమ్మలను ఆర్డర్ చేసింది. లీలా ఆర్డర్ చేసిన బొమ్మలలో.. 10 మోటార్సైకిళ్ల బొమ్మలు, ఒక జీప్ బొమ్మ, 10 జతల ఉమెన్స్ కౌగర్ల్ బూట్లు ఉన్నాయి. బైక్లు, జీప్ ఆర్డర్లు కలిపి 3,180 డాలర్లు ఉండగా... అందులో బూట్లే సుమారు 600 డాలర్లు ఉన్నాయి. మోటార్సైకిళ్లు, బూట్ల ఆర్డర్లలో సగం క్యాన్సిల్ చేసినప్పటికీ, అప్పటికే డెలివరీ చేసిన ఐదు మోటార్సైకిళ్లు, ఒక పిల్లల జీప్ను ఆమె ఆపలేకపోయింది. వీడియో గేమ్లు లేదా షాపింగ్ యాప్ల కోసం పిల్లల తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ఇదే మొదటిసారి కాదు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
అడవిలో తప్పిపోయిన బాలుడ్ని కాపాడిన ఫారెస్ట్ అధికారులు
-
చిట్టడివి..చీకటి.. ఓ చిన్నారి కథ
పోరుమామిళ్ల: ఏడేళ్ల బాలుడు ఇంటికి బయలుదేరాడు. ఊరు దారి విడిచి అడవి దారి పట్టాడు. చిట్టడవిలో చిక్కుకుపోయాడు. చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లార్లు గడిపాడు. బిడ్డ కోసం తల్లిదండ్రులు, గ్రామస్తులు రాత్రంతా అడవిలో వెతుకులాడినా ఫలితం లేదు. తెల్లవారిన తర్వాత తప్పిపోయిన పశువుల కోసం వెతుకుతున్న వారి కంట పడ్డాడు. సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. 14 గంటల గ్రామస్తుల ఉత్కంఠకు తెరదించాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలంలో కవలకుంట్ల పంచాయతీలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం... కవలకుంట్ల పంచాయతీ బుచ్చంపల్లెకు చెందిన మతకాల వెంకటసుబ్బయ్య, సీతామహాలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు సుమంత్(7) ఒకటవ తరగతి చదువుతున్నాడు. వెంకటసుబ్బయ్య గేదెలు మేపుకుంటూ, సీతామహాలక్ష్మి కూలిపనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన సుమంత్ తల్లి కట్టెపుల్లలకు వెళుతుంటే తనూ వెళ్లాడు. సమీపంలో అడవికి దగ్గరలో తండ్రి గేదెలు మేపుతుండగా అమ్మతో చెప్పి నాన్న దగ్గరకు వెళ్లాడు. చీకటి పడుతుందని, నీవు ఈ దారిలో ఇంటికి వెళ్లు అని వెంకటసుబ్బయ్య కొడుక్కు చెప్పి..తాను చెట్లు, పొదల్లో మేస్తున్న గొడ్లను తోలుకొస్తానని దారి చూపించి వెళ్లాడు. బుడ్డోడు సరేనని నాన్న చూపించిన దారిలో బయలుదేరాడు. పొరపాటున కొండదారి పట్టాడు. అలా నాలుగైదు కిలోమీటర్లు వెళ్లేసరికి బాగా చీకటిపడింది. కనుచూపు మేరలో ఊరు కనిపించలేదు. కేకలు వేసినా పలికే దిక్కు లేదు. బిక్కు బిక్కు మంటూ అలాగే ఓ పొద దగ్గర కూలబడిపోయాడు. చీకటి పడ్డా బిడ్డ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. కనపడిన వారందరినీ అడిగారు. ఆచూకీ లభించలేదు. విషయం ఊరంతా పాకిపోయింది. ఓ యాభై మంది పిల్లాడిని వెతికేందుకు అడవికి బయలుదేరారు. పోలీసులు, ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందడంతో వారూ వెతకడానికి వెళ్లారు. తెల్లారేంతవరకు పిల్లాడి ఆచూకీ దొరకలేదు. పశువుల కోసం వెతుకుతుండగా... ఈ నేపథ్యంలో బుధవారం పొద్దుపొడవక ముందే కవలకుంట్లకు చెందిన ఏసయ్య, శాంతయ్యలు తప్పిపోయిన తమ గొడ్లను వెతికేందుకు అడవి దారి పట్టారు. అలా వారు వెళుతుండగా ఆరు గంటల ప్రాంతంలో పొద దగ్గర బాలుడి ఏడుపు విని అటు వెళ్లడంతో సుమంత్ కనిపించాడు. విచారిస్తే విషయం అర్థమయింది. బాలుడిని ఎత్తుకొని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఊరి దారి పట్టారు. దారిలో ఉండగానే ఫారెస్టు సిబ్బంది, గ్రామస్తులు ఎదురయ్యారు. సుమంత్ను చూసి ఫారెస్టు సిబ్బంది వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. 14 గంటలు ఎంతో టెన్షన్ పెట్టినా చివరాఖరుకు కథ సుఖాంతమయింది. -
మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు
భోపాల్: మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బర్హాన్పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6 — Hindustan (@Live_Hindustan) October 17, 2022 చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే!
బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి. పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్ స్టూడెంట్స్కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్ ఒకటి ‘హాస్టల్ తిప్పలు’ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్ మొదలు.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్కు కన్ఫర్మ్ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్ ఉద్దేశం ఏదైనా.. వైరల్ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్ బాక్స్లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!. Video Credits: pranks telugu -
పుట్టినరోజునాడే విషాదం.. స్కూల్ బస్సులో చిన్నారి నిద్ర.. సిబ్బంది నిర్లక్ష్యంతో..
ఓ చిన్నారి పుట్టిన రోజునే మరణించిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. బాలిక మరణానికి కారణమైన స్కూల్ను మూసి వేయాలంటూ దేశ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..కేరళకు చెందిన మిన్సా మరియమ్ జాకబ్ (4) ఖతార్లోని అల్ వక్రా ప్రాంతంలోని స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్ స్కూల్లో నర్సరీ చదువుతుంది. ఈక్రమంలో మిన్సా పుట్టిన రోజు కావడంతో... స్కూల్లో తోటి చిన్నారుల సమక్షంలోనే జరుపుకోవాలని అనుకుంది. ఎప్పటిలాగానే ఆ రోజుకూడా స్కూల్ బస్లో బయలు దేరింది. అయితే, మార్గం మధ్యలో మిన్సా బస్సులో నిద్ర పోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బస్సు సిబ్బంది..చిన్నారి లోపల ఉన్నది గమనించలేదు. ఆమె దిగి వెళ్లిపోయిందని అనుకున్నారు. బస్సును పార్కింగ్ చేసి వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం డ్రైవర్ బస్సు డోర్లు ఓపెన్ చేసి చూడగా చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది. దీంతో అత్యవసర చికిత్స కోసం ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, మిన్సా ప్రాణాల్ని కాపాడలేకపోయారు. తీవ్రమైన ఎండలకు ఊపిరాడక చిన్నారి బస్సులో మృతి చెందినట్లు పోలీసుల జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. పుట్టినరోజునాడే తమ బిడ్డకు నూరేళ్లు నిండాయంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. The Ministry of Education and Higher Education decided to close the private kindergarten which witnessed the tragic accident that shook the community with the death of one of the female students, — وزارة التربية والتعليم والتعليم العالي (@Qatar_Edu) September 13, 2022 ఈ సంఘటన తర్వాత, అల్ వక్రాలోని స్ప్రింగ్ఫీల్డ్ కిండర్ గార్టెన్ను మూసివేయాలని ఖతార్ దేశ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక చిన్నారి మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
చెర్రీ స్వరూప్ ..ఈ బుడతడి సౌండే వేరు!
ప్లేస్ ఏదైనా ఆ బుడ్డోడు స్టిక్ పట్టాడంటే బీట్ అదిరిపోవాల్సిందే.. బేస్ కాస్త పెంచి బాదాడంటే బాక్సులు బద్దలైపోవాల్సిందే.. ఆ సౌండ్కి ఎవరైనా ముగ్దులైపోవాల్సిందే. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ రేంజ్ అది మరి. మూడేళ్లకే స్టేజ్ షోలు ప్రారంభించి, వీక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు. మేటి సంగీత కళాకారులతో మన్ననలు అందుకుని అనేక అవార్డులు, సత్కారాలు పొందుకున్నాడు. విజయవాడ కల్చరల్: సంగీతం ఒక మహా సముద్రం.. సాధనే అందులో ప్రావీణ్యత వచ్చేలా చేస్తుంది.. సరైన శిక్షణ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ఇక తండ్రే మంచి శిక్షకుడైతే ఇక తిరుగుండదు. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ ఇదో కోవలోకి వస్తాడు. తండ్రి ప్రోద్బలంతో మూడేళ్లప్పుడే స్టిక్స్ చేతబట్టిన ఈ బుడతడు.. డ్రమ్స్ వాయించడంలో విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. వెస్ట్రన్ ఐనా, జానపదమైనా, శాస్త్రీయమైనా బీట్ ఏదైనా తనకు కొట్టిన పిండి అని నిరూపిస్తున్నాడు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే వందకుపైగా ప్రదర్శనలతో అదరగొట్టేశాడు. ప్రస్థానం సాగిందిలా.. చెర్రీ చిన్నతనంలో తండ్రి ముత్యాల పరమేష్తో పాటు డ్రమ్స్ వాయించే కార్యక్రమంలో పాల్గొనేవాడు. తండ్రి వాయించే శబ్దాలకు అనుగుణంగా కాళ్లు చేతులు, లయబద్ధంగా కదిలించేవాడు. కుమారుడిలోని తాళ జ్ఞానాన్ని గుర్తించిన పరమేష్ శిక్షణ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే తండ్రిని మించిన శిష్యుడయ్యాడు. పట్టణం, నగరం అన్న తేడా లేకుండా దేశంలోని అనేక చోట్ల స్టేజ్ షోలు ఇచ్చాడు. అతిరథ మహారథుల మధ్య అనేక సార్లు తన ప్రతిభను ప్రదర్శించాడు. అభినందనల మందార మాల.. చెర్రీలోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ డ్రమ్స్ ప్లేయర్ శివమణి, వందేమాతరం శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు కోటి, దేవిశ్రీ ప్రసాద్లు పలు సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. సినీ గేయ రచయత, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు చిరంజీవి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శైవపీఠాధిపతి శివస్వామి తోపాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అవార్డులు ఇవి.. చెర్రీలోని ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు బాలరత్న, బాల ప్రతిభ, వండర్ కిడ్ పురస్కారాలతో సత్కరించాయి. -
ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఎవరో తెలుసా?
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పిల్లాడు ఆషామాషీ బుడ్డోడేమీ కాదు, ఇతగాడు బాలకుబేరుడు. పట్టుమని పదేళ్ల వయసైనా లేదు గాని, వయసుకు మించినన్ని లగ్జరీ కార్లు, రాజప్రాసాదాన్ని తలపించే భవంతి, ఒక ప్రైవేటు విమానం ఇతడి సొంతం. ఈ నైజరీయన్ బాలకుబేరుడి పేరు మహమ్మద్ అవల్ ముస్తఫా. నైజీరియాలో ఇతడు ‘మోంఫా జూనియర్’గా ఫేమస్. ఈ బాలకుబేరుడి కథా కమామిషూ ఏమిటంటే, ఇతడి తండ్రి ఇస్మాయిలా ముస్తఫా నైజీరియాలో ఇంటర్నెట్ సెలిబ్రిటీ. ‘మోంఫా’ పేరుతో బాగా ఫేమస్. ఇన్స్ట్రాగ్రామ్లో ఇతగాడి ఫాలోవర్ల సంఖ్య 12 లక్షల మందికి పైమాటే! ‘మోంఫా’ ప్రధాన ఆదాయ వనరు ఇంటర్నెట్ అయితే, దీనితో వచ్చిన ఆదాయంతో వేర్వేరు వ్యాపారాలూ సాగిస్తూ ఇబ్బడిముబ్బడిగా డబ్బు గడిస్తున్నాడు. తన కొడుకు ‘మోంఫా జూనియర్’కు మూడేళ్ల కిందట– 2019లో అతడి ఆరో పుట్టినరోజు సందర్భంగా లాగోస్ నగరంలో రాజప్రాసాదాన్ని తలపించే ప్యాలెస్ను కానుకగా ఇచ్చాడు. ‘మోంఫా జూనియర్’ కూడా ఇప్పుడు ఇన్స్ట్రాగ్రామ్లో బాగా ఫేమస్ అయ్యాడు. బ్రాండెడ్ దుస్తులతో, లగ్జరీ కార్లతో పోజులిస్తూ ఫొటోలు పెడుతుండటంతో ఈ బాలకుబేరుడికి ఫాలోవర్లు బాగానే పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే, బాలకుబేరుడి తండ్రి సీనియర్ ‘మోంఫా’ మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటుండటం గమనార్హం. -
Viral Video: ఈ పిల్లాడి ‘హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్’ మామూలుగా లేదుగా..!
న్యూఢిల్లీ: స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని భావిస్తారు పిల్లలు. కానీ, ఇంటికి రాగానే హోమ్వర్క్ చేయమంటే నిరాశకు లోనవుతారు. అయిష్టంగానే పుస్తకాలు తెరుస్తారు. కొందరైతే.. కోపంతో నేను చేయను పో అని తెగేసి చెప్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ పిల్లాడు. హోమ్ వర్క్ చేయమన్న తన తల్లిపైనే అసహనం వ్యక్తం చేశాడు. ఆ బుజ్జాయి మాటలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. హిందీ నోట్బుక్ను తెరిచిన పిల్లాడు తన తల్లికి ఎదురు సమాధానమిస్తున్నాడు. హోమ్వర్క్ చేయలేక తాను ఈ లోకం నుంచి వెళ్లాలనుకుంటున్నాని షాక్ ఇచ్చాడు. ‘మమ్మీ నేను పరేషాన్ అవుతున్న. అసుల ఈ దినియాలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను, వెళ్లిపోతాను.’ అంటూ తన పెన్సిల్ను పదే పదే పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని అతడి తల్లి అడగగా.. నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్ అందంగా లేవు అని సమాధానమిచ్చాడు. దానికి ఆమె పడిపడి నవ్వసాగింది. ఆ వీడియోను ఎమోబోయిస్ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. హోమ్ వర్క్ చేయమంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Emo Bois of India (@emoboisofindia) ఇదీ చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది! -
టీచర్ దండన.. విలవిలలాడిన చిన్నారి
దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో మాత్రం చాలాదూరం వెళ్లాడు ఇక్కడో టీచర్. అతను పెట్టిన హింసతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ విద్యార్థి. ఐదేళ్ల పిలగాడిని ఓ టీచర్ దారుణాతిదారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఓ కర్రతో పిల్లాడిని బాదిన టీచర్.. అది విరిగిపోయినా ఊరుకోకుండా రెచ్చిపోయాడు. చెంపదెబ్బలు కొడుతూ.. జుట్టు లాగేస్తూ పిడిగుద్దులతో స్టూడెంట్పై విరుచుకుపడ్డాడు. తనని వదలమని ఆ పిలగాడు రోదిస్తూ ఎంత బతిమాలినా వినిపించుకోలేదు. కిందపడిపోయిన ఆ స్టూడెంట్ను.. కనికరం లేకుండా హింసించాడు ఆ టీచర్. ఇదంతా మిగతా పిల్లలు భయంభయంగానే చూస్తూ ఉండిపోయారు. స్పృహ తప్పిపోయిన ఆ పిల్లాడిని.. ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన స్థానికులు కోచింగ్ సెంటర్పై పడి టీచర్ చోటూను చితకబాదేశారు. చిన్నతప్పిదానికే అలా హింసించాడని తోటి స్టూడెంట్స్ చెప్తుండగా.. బీపీ వల్లే ఆ టీచర్ అలా దాడి చేశాడంటూ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సమర్థించడం కొసమెరుపు. బీహార్ రాజధాని పాట్నాలోని Dhanarua బ్లాక్లో.. జయ కోటించ్ క్లాసెస్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సహనంగా పాఠాలు చెప్పాల్సిన వృత్తిలో అతనికి అర్హత లేదంటూ మండిపడుతున్నారు. ఘటనపై ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. టీచర్పై చర్యలు తీసుకునేంత వరకు పిల్లల్ని కోచింగ్ సెంటర్కు పంపమని తల్లిదండ్రులు చెప్తున్నారు. 'शिक्षक' नहीं… ये 'हानिकारक' है! वीडियो देखकर सहम उठेंगे. ये पिटाई नहीं...ऐसा लग रहा है कि ये जान लेने के लिए उतारू है.शख्स धनरूआ में एक कोचिंग चलाता है. आरोप है कि बच्चे ने एक लड़की के साथ गलत हरकत की थी.पुलिस कोचिंग संचालक की तलाश कर रही है. वीडियो- जहानाबाद से रंजीत राजन. pic.twitter.com/KPBLMYxEau — Prakash Kumar (@kumarprakash4u) July 3, 2022 -
చిన్నారిని చిదిమేసిన నిర్లక్ష్యం
సనత్నగర్: ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాది వయస్సున్న బాలికను కారు ఢీ కొనటంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జింకలవాడలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ తెలిపిన మేరకు.. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే అఖిల్ జింకలవాడ బస్తీలో గత కొన్నేళ్లుగా నివాసముంటున్నాడు. అతని కుమార్తె మోక్షిత (14 నెలలు) ఆదివారం మధ్యాహ్నం ఇంటిముందు ఆడుకుంటోంది. ఇదే సమయంలో అటుగా వచ్చిన కారు అఖిల్ ఇంటి ముందు ఆగింది. డ్రైవింగ్ సీటులో ఉన్న యువకుడితో పాటు కొంతమంది యువకులు అక్కడ దిగిన తరువాత మహ్మద్ రసూల్ అనే వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కారు ముందున్న పాపను గమనించకుండా నిర్లక్ష్యంగా కారును నడిపి చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డి చిన్నారిని తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి మృతికి కారణమైన రసూల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గాయపడ్డ చిన్నారికి తల్లిదండ్రులు సపర్యలు చేస్తుంటే కారుతో ఢీకొట్టిన మహ్మద్రసూల్ నిలబడి చూస్తుండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. (చదవండి: అరెస్ట్ భయంతో ఆత్మహత్యాయత్నం) -
కూతురు హోం వర్క్ చేయలేదని కాళ్లుచేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో విలవిలలాడిన బిడ్డ
-
ఎండలో విలవిలలాడిన బిడ్డ.. తల్లి పనే!!
కాళ్లు చేతులు కట్టేసి.. ఎర్రటి ఎండలో చిన్నారిని పడుకోబెట్టారు. భరించలేక ఆ బిడ్డ విలవిలలాడిపోయింది. చివరికి బాధతో రోదించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఈమధ్య ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియో ఎక్కడ? ఎందుకు? జరిగిందనే విషయాన్ని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఢిల్లీ ఖాజూరీ ఖాస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూతురు హోం వర్క్ చేయకపోవడంతోనే అలాంటి శిక్ష విధించానని ఆ చిన్నారి కన్నతల్లి చెబుతోంది. అయితే ఐదు పదినిమిషాలు మాత్రమే అలా ఉంచి.. తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చానని ఆమె ఘటనపై వివరణ ఇచ్చింది. జూన్ 2వ తేదీన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కరావాల్ నగర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. ఆపై స్థానికంగా ఆ ఘటన ఎక్కడా జరగలేదని పోలీసులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ట్విటర్లో పోస్ట్ చేసిన ఓ వ్యక్తి.. ఘటన సమయంలో పక్కనే ఉన్న బిల్డింగ్లో నుంచి వీడియో తీసినట్లు తేలింది. అతని ద్వారా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియోను చేధించారు. After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares — Delhi Police (@DelhiPolice) June 8, 2022 ఇక ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు. ఆ తల్లికి కూడా అలాంటి శిక్షే విధించాలని కొందరు.. కఠినంగా శిక్షించాలని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు ఈ ఘటనలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. -
వీడేం తండ్రి.. మూడేళ్లకు విషాదంగా ముగిసిన చిన్నారి కథ!
తన వ్యసనం కోసం కొడుకు ప్రాణాలనే అడ్డు పెట్టిన ఓ మూర్ఖుడి కథ ఇది. తనకేమైనా హాని జరుగుతుందన్న ఉద్దేశంతో.. దూసుకొచ్చిన ప్రమాదం ముందర చంటి బిడ్డను ఉంచాడు. ఫలితం.. ఆ పసికందు శరీరంలోకి తూటాలు దూసుకెళ్లాయి!. ఫిలడెల్ఫియాలో సుమారు రెండేళ్ల కిందట సంచలనం సృష్టించిన కేసు.. ఇప్పుడు విషాదంగా ముగిసింది. ఫిలడెల్ఫియా హంటింగ్ పార్క్ సెక్షన్కు చెందిన నఫెస్ మోన్రోయ్.. తన దగ్గరున్న నకిలీ కరెన్సీతో డ్రగ్స్ కొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ వ్యవహారం బెడిసికొడితే తనకేమైనా హాని కలుగుతుందన్న ఉద్దేశంతో.. కూడా తన 11 నెలల బాబు యసీమ్ జెన్కిన్స్ను రక్షణ కవచంగా వెంటపెట్టుకెళ్లాడు. నఫెస్ ఊహించినట్లుగానే.. డ్రగ్ డీలర్ ఫ్రాన్సిస్కో ఒర్టిజ్, నఫెస్పై కాల్పులకు దిగాడు. ఆ టైంలో యసీమ్ను అడ్డు పెట్టడంతో ఆ పసికందు శరీరంలోకి బుల్లెట్లు దిగాయి. తల, మెడ, వెనుక భాగంలోకి మూడు బుల్లెట్లు దిగగా.. వైద్యులు తీవ్రంగా శ్రమించి ప్రాణాపాయ స్థితి నుంచి ఆ చిన్నారిని బయటపడేశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది అప్పట్లో. ఇక మూర్ఖంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు నఫెస్ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసు విచారణ సమయంలో.. యసీమ్ జెన్కిన్స్ను ‘మానవ కవచం’గా అభివర్ణించారు జడ్జిలు. అప్పటి నుంచి ఆ చిన్నారి తల్లి సంరక్షణలో ఉంటూ వస్తున్నాడు. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత ఆ గాయాల తాలుకా ప్రభావంతో ఆ చిన్నారి మరణించినట్లు తెలుస్తోంది. శుక్రవారం మూడేళ్ల యసీమ్ జెన్కిన్స్ కన్నుమూసినట్లు ఫిలడెల్ఫియా అధికారులు ప్రకటించారు. ఇది అప్పటి గాయాల ప్రభావంతోనేనా? అన్నది అధికారికంగా తేలాల్సి ఉంది. ఇక కాల్పులు జరిపిన ఫ్రాన్సిస్కోను ఉద్దేశపూర్వకంగా గాయపర్చినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్యానేరం కింద జైలులోనే శాశ్వతంగా ఉంచే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కొడుకు ప్రాణాలను పణంగా పెట్టిన ఆ మూర్ఖుడు.. కాలక్రమంలో పశ్చాత్తాపం చెందగా, ఇప్పుడు కొడుకు మృతి చెందాడనే వార్త విని గుండెలు పలిగేలా రోదిస్తున్నాడు. -
కూకట్పల్లిలో దారుణం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా..
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శాతవాహననగర్లో నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంక్ గోడకూలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆ దారిలో నిర్మాణం జరుగుతున్న నీటి ట్యాంక్ గోడ శిథిలాలు కూలి చిన్నారి మీద పడ్డాయి. ఈ ఘటనలో శరోన్ దీత్య(4)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన కళ్లఎదుటే పాప మృతి చెందడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నారు. -
కన్నీరు పెట్టిస్తున్న ఉక్రెయిన్ వీరుడి వీడియో.. కొడుకును హత్తుకుని..
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులకు కొంత విరామం దొరికింది. ప్రపంచ దేశాల ఒత్తిడి మేరకు రష్యా యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ఈ క్రమంలో పౌరుల తరలింపునకు రష్యా అవకాశం కల్పించింది. కాగా, పది రోజులుగా రెండు దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. రెండు దేశాల బలగాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. వేల సంఖ్యలో సైనికులు, వందల సంఖ్యలో పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్కు చెందిన ఓ సైనికుడు తన ఇంటికి వెళ్లి కుమారుడిని కౌగిలించుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కన్నీరు పెట్టిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ సైనికుడు తన ఇంటి వెళ్లగా.. సోల్జర్ను చూసిన అతడి కొడుకు పరుగు తీస్తూ అతడిని హత్తుకుంటాడు. ఈ సమయంలో అతడు కన్నీరు పెట్టడం అందరినీ ఆవేదనకు గురి చేసింది. కాగా, ఈ వీడియో ఉక్రెయిన్లో యుద్ద సమయంలో సైనికుల వేదనకు అద్ధం పడుతున్నాయి. మరోవైపు.. రష్యా సైనికులు సైతం తమకు యుద్దం చేయడం ఇష్టం లేదన్న ఉద్దేశ్యంతో వారి ట్యాంకర్లకు వారే మంటలు అంటించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ.. కన్నీరు పెట్టిన వీడియోలు అందరినీ కలచి వేశాయి. -
ముఖం మీద పిడిగుద్దులు పడుతున్నా.. చిరునవ్వుతో!
ముహమ్మద్ ఆలీ.. బాక్సింగ్ దిగ్గజం. 20వ శతాబ్దంలో ‘ది గ్రేటెస్ట్’ గుర్తింపు ఉన్న ఆటగాడు. ఇవన్నీ కాదు.. ఛాంపియన్కి పర్యాయ పదం ఈ లెజెండ్. రింగ్లో ప్రత్యర్థిని పిడిగుద్దులతో అగ్రెస్సివ్గా మట్టికరిపించే ఆలీ.. ప్చ్.. తన వీక్నెస్కు లొంగిపోయి అతని చేతిలో ఓటమి పాలయ్యాడు. పిల్లలు దేవుళ్లు.. ఒక్కటే అంటారు. అందుకే బోసి నవ్వుల దేవుళ్లంటూ పిల్లల్ని అభివర్ణిస్తుంటారు. అప్పుడప్పుడు వాళ్లు చేసే పనులు చూడముచ్చటగా ఉంటాయి కూడా. అందుకే పిల్లలంటే ఆలీకి బాగా ఇష్టం. వాళ్ల అల్లరిని భరించడంలో ఆయన దిట్ట. అలా ఓ చిన్నారి చేష్టలకు మురిసిపోయే.. ఆలీ పిడిగుద్దులు తిన్నాడు. బాక్సింగ్ గ్లౌజ్లు వేసుకున్న ఆ బుడ్డోడు.. ఆలీ యాక్టింగ్ను ఎంజాయ్ చేశాడు. ఆలీ నాలిక బయటపెట్టి రెచ్చగొడుతుంటే.. ఎగబడి మరీ గుద్దేశాడు. చివరికి ఆలీ ఓడిపోయినట్లు రెఫరీ ఆ బుడ్డోడి చేతిని పైకి ఎత్తి అభినందించడంతో.. చేతుల్ని ప్రొఫెషనల్ బాక్సర్లాగా కొట్టుకుంటూ బిల్డప్ ప్రదర్శించాడు. అది చూసి.. ఓ ముద్దు పెట్టమంటూ ఆలీ కోరగా.. ‘ఎలాగూ ఓడిపోయాడు కదా! ఓ ముద్దిస్తే ఏమవుతుంది పోనీలే.. అనుకుంటూ ఆలీ ముచ్చటను తీర్చేశాడు ఆ బుడ్డోడు. The best boxing match I have witnessed #MuhammadAli pic.twitter.com/etQXR7qVJ1 — Harsh Goenka (@hvgoenka) February 24, 2022 పారిశ్రామికవేత్త హార్ష్ గోయెంకా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘నేను చూసిన బెస్ట్ బాక్సింగ్ మ్యాచ్ ఇదే’ అంటూ క్యాప్షన్ ఉంచారు. గోయెంకా పోస్ట్కి విపరీతంగా లైకులు, కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అయితే తరచూ ఇది సోషల్ మీడియాలో కనిపించే వీడియోనే అనుకోండి. -
Nikola: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్
మనిషిలా ప్రాణం లేకున్నా.. భావోద్వేగాలు పండించడం ఎలాగబ్బా అనుకుంటున్నారా? రజినీకాంత్ రోబో సినిమా తెలుసు కదా! అచ్చం అలానే. నికోలా మనిషి కాదు.. ఆండ్రాయిడ్ కిడ్. ఆండ్రాయిడ్స్(రోబోలను) మనుషులతో ఎమోషనల్గా కనెక్ట్ చేయాలన్న ప్రయత్నాలు కొత్తేం కాదు. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్లో ప్రత్యేకించి.. వయసు మళ్లిన వాళ్లను చూస్కోవడానికి, ఒంటరి జీవుల బాగోగుల కోసం పనికి వస్తాయని అనుకుంటున్నారు. అదే సమయంలో కోపం, అసహనం లాంటివి విపరీతాలకు దారి తీసే అవకాశమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కూడా. ఇదిలా ఉంటే నికోలా అనే ఆండ్రాయిడ్ కిడ్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. నికోలా.. మనిషి కాదు. ఆండ్రాయిడ్ కిడ్. జపాన్ రీసెర్చర్లు రైకెన్ గార్డియన్ రోబో ప్రాజెక్టులో భాగంగా ఈ బచ్చా రోబోను రూపొందించారు. ఈ ఎక్స్ప్రెసివ్ హ్యూమనాయిడ్ రోబో ఆరు రకాల ఎమోషన్స్ను ప్రదర్శిస్తుంది. సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, అసహ్యం. Nikola ఈ ఎమోషన్స్ను అర్టిఫిషియల్ కండరాల కదలిక వల్ల.. భావోద్వేగాల్ని పండించగలుగుతుంది. సోషల్ సైకాలజీ, సోషల్ న్యూరోసైన్స్ పరిశోధనలకు నికోలా లాంటి రోబోలు అంశాలుగా పనికొస్తాయని రీసెర్చర్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నికోలాకు ఇంకా బాడీ సిద్ధం కాలేదు. త్వరలో సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే.. ఎక్స్ప్రెషన్స్ రోబో కిడ్గా నికోలా తొలి ఘనత సాధించినట్లవుతుంది. -
‘అమ్మా కాపాడు..’ అని అరుస్తూ ఆ పసిగుండె ఆగింది
ఐదేళ్ల పసిబాలుడు.. ఐదు రోజుల పాటు చీకటి ఊబిలాంటి బావిలో అల్లాడిపోయాడు. ఆకలి, ఆక్సిజన్ అందిస్తూ అభయం అందించినా.. భయంతో ‘అమ్మా.. పైకి లాగమ్మా’ అంటూ వేసిన కేకలు కోట్ల మందిని చలింపజేశాయి. నిర్విరామంగా కృషి చేసిన సహాయక సిబ్బంది.. ఆ చిన్నారిని చేరుకునేలోపే నష్టం జరిగిపోయింది. ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయింది. బోరుబావి విషాద ఘటన.. మొరాకోలో మాత్రమే కాదు ఆ మాటకొస్తే ఇంటర్నెట్ ప్రపంచం మొత్తానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. రయాన్ అవ్రామ్ వయసు ఐదేళ్లు. షెఫ్షావూలోని తన ఇంటి దగ్గర పోయిన మంగళవారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 32 మీటర్ల లోతైన బోరుబావిలో పడిపోయాడు. పిల్లాడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తప్పిపోయాడేమోనని అంతా వెతికారు. అయితే, సమీపంలోని బోరు బావి నుంచి కేకలు వినిపిస్తుండడంతో అప్రమత్తమైన స్థానికులు.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లైట్లు వేసి చూశారు. తనను పైకి లాగాలంటూ ఆ చిన్నారి ఆర్తనాదాలు చేశాడు. వెంటనే అధికారులకు సమాచారమివ్వగా వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఐదు రోజుల పాటు ఆపరేషన్ సాగింది. పిల్లాడికి గొట్టం ద్వారా తిండి, నీళ్లు, ఆక్సిజన్ పంపించారు. ఊపిరి ఆడక ఆ చిన్నారి ఆక్సిజన్ పైపు దగ్గరికి ముఖం పోనిచ్చిన వీడియోలు, ఫొటోలు వైరల్ కావడం.. పలువురిని కంటతడి పెట్టించింది. నాన్స్టాప్ ఆపరేషన్ పిల్లాడిని బతికించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు సొరంగం తవ్వడానికి తీవ్రంగా శ్రమించారు. భారీ ఎత్తున జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్కు స్థానికులు సైతం సహకరించారు. వాళ్ల కోసం వంటవార్పు సిద్ధం చేసి.. సహాయక కార్యక్రమాలు ఆగిపోకుండా చూసుకున్నారు. మరోవైపు దేశం మొత్తం, ఇంటర్నెట్ నిండా ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థనల పోస్టులు కనిపించాయి. ఐదురోజుల శ్రమ అనంతరం బాలుడు ఇరుకున్న చోటుకు చేరుకున్నారు. కానీ, అప్పటికే ఆ పిల్లాడి ఊపిరి ఆగిపోయింది. విగత జీవిగా మారిన తమ బిడ్డను చేతుల్లోకి తీసుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మొరాకో వ్యాప్తంగా పాఠశాలల్లో నివాళిగా పిల్లలు ర్యాలీలు తీశారు. ఘటనపై గురించి తెలిసి మొరాకో రాజు మహ్మద్ సంతాపం తెలిపారు. Morocco moves a mountain to save a child 🇲🇦#SaveRayan 🇲🇦 humanity first ✊🏿✊🏿 pic.twitter.com/fp2jaSW8fL — Distinguished Senator (@Senatorisiaq) February 5, 2022 Minutes after the announcement of the death of the child #Rayan in Morocco, a young man from Palestine, Hamza Mansour, has a child and calls him #Rayan, in solidarity with the cause of the Moroccan child Rayan and in honor of his memory 💔🇲🇦🇵🇸 #Ryan pic.twitter.com/9m28efE78x — Simø Elyouzghi (@Mohamed365076) February 6, 2022 బా అంకుల్ కంటతడి పెట్టిన వేళ.. రయాన్ మరణవార్త తెలిసిన తర్వాత.. మొరాకో మొత్తం విషాదంలోకి కూరుకుపోయింది. చాలా చోట్ల ఆ చిన్నారికి నివాళులు అర్పించారు. పాలస్తీనాకు చెందిన ఓ తండ్రి.. అప్పుడే పుట్టిన తన బిడ్డను రయాన్ అని పేరు పెట్టడం విశేషం. బా అలీ.. మొరాకో మొత్తం బా అంకుల్ అని ముద్దుగా పిల్చుకుంటుంది. బోరు బావులను తవ్వడంలో నేర్పరి అయిన బా అలీ.. గతంలోనూ ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించారు కూడా. వంద గంటలపాటు నాన్స్టాప్గా పని చేసిన బా అంకుల్.. చివరికి చిన్నారి రయాన్ ప్రాణాలతో లేడనే విషయం తెలిసి కన్నీళ్ల ప్రాయం అయ్యాడు. Rest In Peace to Rayan 👼🏻 So sad. Was praying he would make it out of the well safe, but God had other plans for this little boy 💔Praying for his family 🙏🏼 #Rayan pic.twitter.com/6ESpSoehFT — ENISA (@IAmENISA) February 5, 2022 All the love & respect to Ba (uncle) Ali who dug with his hand for more than 100 straight hours to help in Rayan's rescue operation. Ba Ali, a well-drilling expert who never cared about the looming risk & insisted on contributing his long experience to save the little #Rayan. 😞 pic.twitter.com/escoatEs8Z — Zouhir • ⵣⵓⵁⵉⵔ (@oskai_z) February 6, 2022 #Rayan may have not survived but they are still heroes. Along with parents of Ryan No one can estimate the immense pain of the rescue workers who worked 24x7 to save him May Allah grant them paradise also 🤲🏽 #Ryan#PrayforRayan #ريان_المغرب #الطفل_ريان pic.twitter.com/C4948V9mbN — Mubeen ❄️ (@MubeenFatma) February 5, 2022 -
Gadwal Bidda: ఇంటర్నెట్ సెన్సేషన్ గద్వాల్ బిడ్డ కన్నుమూత!
Gadwal Bidda Death News Viral In Social Media: ‘నువ్వెనివో నాకు తెల్వదు..’ అంటూనే కోట్లాది మందికి పరిచయమైన చిన్నారి ‘గద్వాల్బిడ్డ’ ఇక లేడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ చిన్నారి.. నిత్యం వీడియోలు, మీమ్స్, స్టిక్కర్లతో ఏదో ఒక దగ్గర కనిపిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి చిన్నారి హఠాన్మరణం విషయం తెలియగానే.. ఇంటర్నెట్లో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అది మీమ్స్ పేజీ ఆరంభంలో ఉన్నరోజులు. ‘ఐతే ఏంటి?, సీవోసీ’ లాంటి కొద్దిపాటి పేజీలు మాత్రమే పాపులర్ అయిన సమయం. ఆ టైంలో దర్శకుడు ఆర్జీవీ ప్రకటించిన ఓ టైటిల్పై దుమారం రేగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఓ చిన్నారి చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. గద్వాల్బిడ్డగా తననుతానూ పరిచయం చేసుకుంటూ.. ఆర్జీవీని దూషిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసి వైరల్ అయ్యాడు ఆ పిలగాడు. ఆపై దళితులను కించపరిచేలా వ్యవహరించాడంటూ దళిత సంఘాలు ఆ చిన్నారిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మైనర్ కావడంతో పోలీసుల సమక్షంలోనే అతనితో క్షమాపణలు చెప్పించగా.. ఆ సమయంలో సంభాషణలు, అతని ఏడుపు సైతం వైరల్ అయ్యింది. ఆపై చాలాకాలం ఇంటర్నెట్కు దూరంగా ఉన్నప్పటికీ ఈ చిన్నారి మీమ్స్ స్టఫ్గా మారాడు. ట్రోల్ వీడియోస్, మీమ్స్ టెంప్లేట్, స్టిక్కర్స్ రూపంలో వైరల్ అయ్యాడు. కొద్దిగ్యాప్ తర్వాత కారులో కునుకు తీసిన వీడియో ఒకటి, ఆపై దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉన్న వీడియో సైతం వైరల్ అయ్యింది. ఈ క్రమంలో అతని హఠాన్మరణం వార్త.. ఇంటర్నెట్ను కుదిపేస్తోంది. ఆ చిన్నారి అసలు పేరు మల్లికార్జున్రెడ్డి అని సమాచారం. ప్రస్తుతం ఓ సినిమాలోనూ అతని నటిస్తున్నాడని, ఆస్తమాతో అతను మృతిచెందినట్లు, ఈ విషయం అతని కుటుంబ సభ్యులే స్వయంగా వెల్లడించినట్లు సౌత్ ఇండియన్ థగ్స్ అనే పేజీ నుంచి మెసేజ్ వైరల్ అయ్యింది. స్వగ్రామం జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నెలో గద్వాల్ బిడ్డ ‘మల్లికార్జున్’ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. ‘నువ్వు ఎవనివో నాకు తెల్వదు, బండెక్కినంటే.. భయపడాలె, చూస్కోండి, ఖబడ్దార్బిడ్డా..’ డైలాగ్లతో గద్వాల్బిడ్డ పేరుతో మీమ్స్, వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఈ తరుణంలో.. చిన్నవయసులోనే ఆ చిన్నారి లేడనే వార్త ఇంటర్నెట్లో విషాదం నింపుతోంది. మీమ్స్, వీడియోల రూపంలో బతికే ఉంటాడంటూ పలువురు కామెంట్ల చేస్తున్నారు. -
కేటీఆర్ సర్.. మా సమస్య చూడండి
బౌద్ధనగర్: ‘సార్ కేటీఆర్.. మా ఇంటి ముందు ఫుట్పాత్ సరిగా లేకపోవడంతో నడవలేక ఇబ్బందులు పడుతున్నాము..’అంటూ కార్తికేయ అనే రెండో తరగతి చదువుతున్న బాలుడు చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందించారు. దాన్ని సికింద్రాబాద్ జోనల్ కమిషనర్కు రీట్వీట్ చేయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. నడవలేకపోతున్నాం.. బౌద్ధనగర్ రామాలయం వెనుకవీధిలో ఫుట్పాత్ సరిగా లేకపోవడంతో పిల్లలు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని కార్తికేయ అనే బాలుడు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్కు సమస్యను వివరించాడు. స్పందించిన కేటీఆర్ అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరించి.. ట్వీట్ చేసిన బాలుడితో కలిసి దిగిన ఫొటోను తనకు ట్విట్టర్లో పోస్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి సంబంధిత ఏఈ జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి సమస్య నెలకొన్న ప్రాంతాన్ని చేరుకొని బాలుడ్ని కలిశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాలుడికి హామీ ఇచ్చారు. అనంతరం, బాలుడితో కలిసి దిగిన ఫొటోను మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో పంపించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్కు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు బాలుడి కుటుంబసభ్యులతో పాటు బస్తీవాసులు ధన్యవాదాలు తెలియజేశారు. -
‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి అదృష్టం, మరోసారి దురదృష్టం వెంటాడడం సహజమే!. పదేళ్ల వయసున్న సహదేవ్ దిర్డో విషయంలో ఇలాంటిదే జరుగుతోంది. ఒక వైరల్ వీడియోతో సెన్సేషన్ అయిన ఈ గిరిజన కుర్రాడికి.. బాలీవుడ్లో పాప్ సాంగ్స్ చేసే అదృష్టం దక్కింది. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం చావు అంచుల దాకా తీసుకెళ్లింది. మరి ఇప్పుడో..? ‘జానే మేరీ జానేమన్ బచ్పన్ కా ప్యార్ మేరా భూల్ నహీ జానా రే’ అంటూ స్కూల్ యూనిఫామ్లో తరగతి గదిలో హుషారుగా పాట పాడిన సహదేవ్ దిర్డో.. ఏడాది తర్వాత(2021లో) కరోనా టైంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఆ రాష్ట్ర సీఎం, సెలబ్రిటీలంతా ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. లగ్జరీ కారుతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా అందింది ఆ కుర్రాడికి. సుక్మాలో అతని చిన్న ఇంటికి నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి ఏకంగా తన వైరల్ సాంగ్కు ర్యాప్ కట్టాడు సహదేవ్. ఆ దెబ్బతో అతని జీవితం మారిపోయిందని అంతా భావించారు. కానీ.. కిందటి నెలలో తన తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న క్రమంలో జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో బతకడం కష్టమని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు భావించారు. కానీ, ఆ పిలగాడి నసీబ్ మంచిగుంది. బతికి బట్టకట్టాడు. సహదేవ్కు బాద్షా వెన్నంటే ఉన్నాడు. ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆపై కోలుకున్న అతన్ని రాయ్పూర్లోని మంచి న్యూరోసర్జన్ దగ్గరికి తీసుకెళ్లి కోలుకునేలా చేశాడు ఈ బాలీవుడ్ ర్యాపర్. View this post on Instagram A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev) ఆ రూపంలో లక్ తన ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వయంగా ఓ వీడియో సందేశం పోస్ట్ చేశాడు సహదేవ్. అంతేకాదు తన క్షేమసమాచారాల కోసం ఆరా తీసిన వాళ్లకు, తాను కోలుకోవాలని ఆకాంక్షినవాళ్లకు కృతజ్ఞతలు సైతం తెలియజేశాడు. అంతేకాదు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీల ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అయిన ఎన్వోఎఫ్టీఈఎన్(nOFTEN) వెంచర్లో భాగం కానున్నట్లు ప్రకటించాడు. ఇది మన దేశంలో సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన మెటావర్స్ మార్కెట్ప్లేస్. ఈ ఎన్ఎఫ్టీలో ఒరిజనల్ సాంగ్కు చెందినదంతా ఉంటుంది. తద్వారా సహదేవ్కు కాసుల వర్షం కురవడంతో పాటు అమితాబ్లాంటి ప్రముఖుల సరసన నిలిచే అదృష్టం కలిగింది(ఎన్ఎఫ్టీ ద్వారా). ర్యాప్ సాంగ్ ఒరిజినల్ సాంగ్తోపాటు బిహైండ్ సీన్స్, షార్ట్ మూవీస్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి.. ఎన్వోఎఫ్టీఈఎన్లో మంచి ధర ఆఫర్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. మొదటి మార్గంగా ప్రాధాన్యత ప్రకారం వారి కళాకృతులను చేర్చుకోవడం, వారి డిజిటల్ భాగాన్ని వేలం వేయడానికి సులభమైన బిడ్డింగ్ విధానం ద్వారా వారి భాగానికి సరైన ధరను పొందడం. రెండో మార్గం క్రియేటర్లు ఈ ప్లాట్ఫారమ్లో స్థిరమైన ధర పాయింట్ను జోడించడం ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసి డబ్బు సంపాదించవచ్చు, View this post on Instagram A post shared by nOFTEN NFT Marketplace (@noften_nft) ఇదిలా ఉంటే హెల్మెట్ ధరించనందువల్లే తాను గాయపడ్డానని, దయచేసి అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ స్థానిక మీడియా హౌజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వ్యాఖ్యానించాడు సహదేవ్. मेरी जिंदगी बदल दी 🙏🙏 नमस्कार दोस्तों अपने मुझे बहुत सारा प्यार दिया मैं इसके लिए आपका सदैव आभारी हूं। @Its_Badshah @Bollyhungama@bollywood_life@BollywoodBoyz@arrahman@bhupeshbaghel@Devendra_1925 धन्यवाद pic.twitter.com/3hIADmh18N — Sahdev Dirdo (@Sahdev_Dirdo) August 2, 2021 -
అంతరాలు దాటిన కల్లాకపటంలేని ప్రేమ
కొన్ని విషయాలు పిల్లల చూసి నేర్చుకునేలా ఉంటాయి. వాళ్ల పసిమనసు, నిష్కల్మషమైన హృదయం, అమాయకత్వంతో చేసే పనులు చాలా గొప్పగా అనిపిస్తాయి. మనకే అనిపిస్తుంది వాళ్లలా మనమెందుకు అంత స్వచ్ఛంగా లేం అని. బహుశా అందువల్లనే ఏమో చిన్నపిల్లలను దేవుడుతో సమానం అంటారు. పైగా వారి అల్లరిని చూస్తే చాలు అప్పటి వరకు ఉన్న టెన్షన్లు చికాకులు అన్ని ఎగిరిపోతాయి. ఒక్కసారిగా చాలా రిలీఫ్గా ఫీలవుతాం కూడా. ఇక్కడొక సన్నివేశం కూడా అచ్చం అలానే చాలా సంతోషాన్ని ఇవ్వడమే కాక మనసును కదిలించేలా చేస్తోంది. (చదవండి: కారులోనే ఆల్కహాల్ టెస్టింగ్ టెక్నాలజీ... మోతాదుకు మించి తాగితే కారు స్టార్ట్ అవ్వదు!!) అసలు విషయంలోకెళ్లితే...కియాన్ష్ దేటే అనే బాలుడు బొమ్మలు అమ్ముకునే మహిళ కొడుకు ముందు నిలబడి ఉత్సహంగా డ్యాన్స్ చేస్తాడు. పైగా ఆ బాలుడిని కూడా డ్యాన్స్ చేయమంటూ కియాన్ష్ ప్రోత్సహిస్తాడు. అయితే ఆ మహిళ కొడుకు కియాన్ష్ దగ్గరకు వచ్చి ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా కియాన్ష్ డ్యాన్స్ చేయడం ఆపి అలా చూస్తాడు. కాసేపటికీ కియాన్ష్ కూడా ఆ మహిళ కొడుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని కియాన్ష్ తల్లి అశ్విని నికమ్ దేటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా ఈ వీడియోకి మిలియన్లకు పైగా వ్యూస్, లైక్లు వచ్చాయి. (చదవండి: 48 గదులతో కూడిన తొలి పాడ్ వెయిటింగ్ రూమ్!) View this post on Instagram A post shared by Kiansh Dete & Ayansh Dete (@kiansh_ayansh) -
పాపం చిట్టితల్లి.. రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వస్తేనే వైద్యం
సాక్షి,దుమ్ముగూడెం(ఖమ్మం): బోసినవ్వులతో ఇంట్లో ఆడుకోవాల్సిన పసిపాప అరుదైన వ్యాధి బారిన పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వేలల్లో ఒకరికి వచ్చే జన్యుసంబంధిత వ్యాధితో 14 నెలల ఎల్లెన్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడం హృదయాలను కలిచివేస్తోంది. చికిత్సకు రూ.16కోట్లు అవసరమని వైద్యులు చెప్పగా.. అంత స్థోమత లేని పాప తల్లిదండ్రులు బరువెక్కిన హృదయాలతో బోరున విలపిస్తున్నారు. సహృదయం కలిగిన దాతలు ముందుకొస్తే తప్ప తమ పాపను దక్కదని వేడుకుంటున్నారు. సత్వర వైద్యం అందకపోతే.. దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లి గ్రామానికి చెందిన రాయపూడి ప్రవీణ్ – స్టెల్లా దంపతులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ ప్రైవేట్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి 2018లో వివాహం కాగా 14నెలల ఎల్లెన్ పాప ఉంది. పాప నాలుగో నెల నుంచి మెడ భాగం పటిష్టంగా లేకపోవడం, కిందకు వాలిపోతుండడాన్ని తల్లిదండ్రులు గమనించారు. నెలలు గడుస్తున్నా శరీర భాగాల్లో కదలికలు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన వారు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయినా ఏమీ తెలియకపోవడంతో జన్యుసంబంధిత సమస్యగా అనుమానిస్తూ మరో రెండు పరీక్షలు నిర్వహించారు. అయినా చిన్నారి సమస్య బహిర్గతం కాలేదు. రోజురోజుకూ చిన్నారి కదల్లేని పరిస్థితికి చేరుతుండడంతో తల్లిదండ్రులు చెన్నైలోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. తమ స్థోమతకు మించి అప్పులు చేసి గత ఏడాది డిసెంబర్ 7న జెనెటిక్ పరీక్షలు చేయిస్తే ఈ నెల 10న రిపోర్టులు వచ్చాయి. ఈ నివేదిక ఆధారంగా ఎల్లెన్ జన్యుసంబందిత వ్యాధితో బాధపడుతోందని.. నరాలు, కండరాలు బలహీనంగా అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్వర వైద్యం అందకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమేనని చెప్పడం... రానురాను చిన్నారి శరీర భాగాల్లో కదలికలు తగ్గుతుండడంతో తల్లిదండ్రులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం రోజుకు చిన్నారి మందులు, చికిత్స కోసం రూ.25వేల వరకు ఖర్చు అవుతుండగా ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. రూ.కోట్లల్లో ఖర్చు... చిన్నారి ఎల్లెన్కు నిర్వహించిన పరీక్షలలో జన్యుసంబంధిత వ్యాధిగా నిర్ధారించారు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చేయించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ (జోల్జెన్స్మా)ను అమెరికా నుంచి తెప్పించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబ పరిస్థితిల్లో ఇంత ఖర్చు అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం చేస్తున్న వైద్యం అంతా తాత్కాలికమేనని వైద్యులు సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి చిన్నారి ఎల్లెన్కు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె తల్లిదండ్రులు ప్రవీణ్ – స్టెల్లా కోరుతున్నారు. కాగా, ఎల్లెన్కు ప్రస్తుతం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆమె చికిత్స కోసం సాయం చేయాలనుకునే దాతలు 99085 89604 నంబర్లో సంప్రదించాలని ప్రవీణ్ కోరారు. చదవండి: అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్ -
బాబోయ్ ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. తల్లి మెడకు సైకిల్ లాక్ వేసి..
బీజింగ్: ఓ అల్లరి పిల్లాడు ఆడుకుంటూ తన తల్లి మెడకు సైకిల్ లాక్ వేశాడు. అయితే ఆ లాక్ను తెరిచే కోడ్ను మరిచిపోయాడు. దీంతో భయాందోళన చెందిన ఆ తల్లి అధికారుల సహాయం కోరింది. చివరకు కట్టర్తో కట్ చేసి దానిని తొలగించారు. ఈ వింత ఘటన చైనా జియాంగ్సు ప్రావిన్స్లోని హువాన్లో చోటు చేసుకుంది. ఓ చిచ్చర పిడుగు సైకిల్ లాక్తో ఆడుకుంటూ దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాడు. ఇంకేముంది పిల్లల సంగతి తెలిసిందే కదా. పిల్లలు చిచ్చర పిడుగులు అనేలా ఆ లాక్ని తన తల్లి మెడకి వేశాడు. పాపం జరగబోయేది తెలియక ఆ మహిళ కూడా మొదట్లో ఇదంతా ఫన్నీగానే తీసుకుంది. అయితే, అయితే ఆట సమయంలో అన్ లాక్ కోడ్ను అతడు పలు మార్లు మార్చేయడంతో సరైన లాక్కోడ్ మర్చిపోయాడు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన ఆ తల్లి, లాక్ తెరిచే కాంబినేషన్ తెలియక కంగారు పడింది. చేసేదేమి లేక ఆ తల్లి సహాయం కోసం పోలీస్ స్టేషన్ను వెళ్లింది, కానీ వారు ఆమెకు ఏమీ చేయలేకపోయారు. చివరకు ఆ లాక్ ఓపన్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది బృందాన్ని పిలిచారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాలుడి అల్లరి పనిపై కొందరు నెటిజన్లు ఫన్నీగా తీసుకోగా కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. చదవండి: Viral: కరెంట్ వైర్ల మధ్య పావురం.. డ్రోన్తో పోలీసుల రెస్క్యూ -
ఒక్కగానొక్క కొడుకు.. సరదాగా స్నేహితులతో బయటకు.. మృతదేహమై ఇంటికి
సాక్షి,లావేరు( శ్రీకాకుళం): స్నేహితులతో చెరువుకు వెళ్లిన కుర్రాడు మృతదేహమై ఒడ్డుకు చేరాడు. గార, లావేరు మండలాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలోని కేశవరాయునిపురం గ్రామంలో చెరువులో మునిగి అదే గ్రామానికి చెందిన ఇనపకుర్తి సూర్య(12) సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర్య లావేరు హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ద సరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉన్న విద్యార్థి అదే గ్రామానికి చెందిన మరో నలుగురు విద్యార్థులతో సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామంలోని ఎర్ర చెరువులో స్నానానికి వెళ్లాడు. ఇటీవలే ఆ చెరువులో జేసీబీతో మట్టి తీశారు. స్నానానికి దిగిన సూర్య లోపలకు వెళ్లి ఆ గోతుల్లో చిక్కుకుని మునిగిపోయాడు. మిగిలిన విద్యార్థులు భయపడి ఇళ్లకు వచ్చేశారు. రాత్రి 7 గంటలు దాటినా సూర్య ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా.. విద్యార్థి చెరువుకు వెళ్లాడని తెలిసింది. అంతా కలిసి చెరువుకు వెళ్లి గాలించగా సూర్య మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా పన్నెండేళ్లకే చనిపోవడంతో తల్లిదండ్రులు రమేష్, రాణి దంపతులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. -
స్నానానికి వెళ్లి.. శవమై తేలాడు
సాక్షి, విజయనగరం: ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ ఓ గిరిజన బాలుడిని బలి తీసుకుంది. సీతంపేట పరిధిలోని బర్నగూడ గ్రామానికి చెందిన ఆరిక సుధీర్ కుమార్ (8) బుధవారం ఉదయం గ్రామానికి సమీపంలో ఉన్న గెడ్డలోకి స్నానానికి వెళ్లి అందులో మునిగి చనిపోయాడు. ఇటీవల కురిసిన వర్షాలకు మన్యంలోని గెడ్డలన్నీ పొంగిపొర్లుతున్నాయి. బర్నగూడకు సమీపంలో ఉన్న గెడ్డ కూడా పోటు మీద ఉంది. గ్రామంలోని చిన్నారులు స్నానం కోసం బుధవారం గెడ్డలోకి దిగారు. వారిలో సుధీర్ కాస్త లోపలకు వెళ్లడంతో ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకునిపోయాడు. దీంతో చిన్నారులంతా భయపడి ఊరిలోకి వచ్చి విషయం చెప్పారు. గిరిజనులు వెళ్లి వెతకగా అరకిలోమీటరు దూరంలో బాలుడు దొరికాడు. వెంటనే ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. బాలుడి తండ్రి శీతంనాయుడు హైదరాబాద్ వలస వెళ్లి అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి ఆరిక సంతోషమ్మ కూలి పనులు చేస్తుంటారు. సుధీర్ స్థానికంగా ఉన్న గిరిజన ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చలాకీ ఉండే కుర్రాడు ఇలా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చదవండి: ఆరేళ్ల సహజీవనం చేసి.. ఆందోళనకు గురై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య -
‘మై హీరో..’ చిన్నారి హార్ట్ టచింగ్ లేఖ
స్ఫూర్తిదాయక వ్యక్తులు ఎక్కడో ఉండరు. మన మధ్యనే ఉంటారు. వాళ్ల గెలుపు వాళ్లకు కూడా తెలియకుండా.. మరికొందరిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అలాంటి విషయమే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తొమ్మిదేళ్ల పిల్లాడు ఒకడు.. భావోద్వేగంగా రాసిన లేఖ ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. టెస్లా, స్పేస్ఎక్స్లతో పాటు క్రిప్టోకరెన్సీ వ్యవహారాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్ మస్క్(51). పైకి ఊహాతీత చేష్టలు ప్రదర్శించే మస్క్.. మేధావి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోస్ట్ అడ్వాన్స్డ్ ఆలోచనలున్న ఈయన.. యువతలో స్ఫూర్తి నింపుతుంటాడు కూడా. అలా ఇక్కడో చిన్నారి దృష్టిలో కూడా మస్క్ హీరో అయ్యాడు. ఎలన్ మస్క్కు వీరాభిమాని అయిన కెంప్ ప్రెస్లే అనే తొమ్మిదేళ్ల చిన్నారి చేత్తో పేపర్ మీద క్రియేటివిటీగా రాసిన లేఖ ఇది. మస్క్కు అమాయకంగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూనే.. ఎన్నో గొప్ప విషయాల గురించి ఆరాతీశాడు ఆ కుర్రాడు. నీ(మస్క్) కెరీర్ ఎలా మొదలైంది? నీ మీద ప్రభావం చూపిన అంశాలేవీ? టెస్లాలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నావ్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అంతేకాదు పనిలో పనిగా చివర్లో సోలార్ పవర్ కారు తయారు చేయమని మస్క్కే సలహా ఇచ్చాడు ఈ బుడతడు. Dear @elonmusk, my nine-year-old son wanted me to share this letter with you. pic.twitter.com/HmN68UaO9q — Kempton Presley (@Kempton_Presley) September 28, 2021 Elon inspires the young and old! Love it. Follow your dreams youngster! — GiddyUpTesla (@Insurmountabl1) September 28, 2021 Hi Kemp, I like your name. Elon retained his child-like heart despite his successes. He continued to put others first before himself. He is loyal to the mission of making life multi-planetary 😉 — Not_Elm0 (@Not_Elm0) September 28, 2021 మస్క్ స్ఫూర్తితో తానూ జీవితంలో ఎదగాలని అనుకుంటున్నానని చెబుతూ.. చివర్లో ‘ఇట్లు ఫ్యూచర్ మస్క్’ అంటూ తన గోల్ ఏంటో చెప్పకనే చెబుతూ లేఖను ముగించాడు కెంప్ ప్రెస్లే . కొడుకు కోరిక మేరకు ఆ చిన్నారి తండ్రి కెంప్టన్ ప్రెస్లే ఆ లేఖ ఫొటోను ట్విటర్ పోస్ట్ చేశాడు. అంతేకాదు ఎలన్ మస్క్ను సైతం ఆ పోస్ట్కి ట్యాగ్ చేశాడు. చాలామందిని ఈ లేఖ ఇప్పుడు కదిలిస్తోంది. మరి సోషల్ మీడియాలో నిత్యం పోస్టులతో యాక్టివ్గా ఉండే ఎలన్ మస్క్.. ఈ చిన్నారి వీరాభిమానానికి స్పందిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: ఎలన్ మస్క్.. సంపాదన విలువెంతో తెలుసా? -
తాగిన మైకంలో పసికందును బలిచేసిన భార్యాభర్తలు
-
కూతురు ఇష్టం లేని పెళ్లి.. మనవడిని కిరాతకంగా చంపిన బామ్మ
చెన్నై: కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఓ మహిళ తన మనవడిని కిరాతకంగా హత్య చేసింది. పసివాడు అనే కనికరం కూడా లేకుండా ఆ బామ్మ ఈ ఘోరానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల ప్రకారం, కోయంబత్తూరులోని అన్బాగం వీధిలో నాగలక్షి అద్దె ఇంట్లో నివసిస్తూ ఓ హోటల్లో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం, ఆమె కుమార్తె నందినికి (24) వృత్తిరీత్యా కాల్ టాక్సీ యజమాని కమ్ డ్రైవర్ నిత్యానందంతో వివాహం జరిగింది. అయితే ఆమె కోరికకు విరుద్ధంగా తన కుమార్తె వివాహం చేసుకున్నందుకు నాగలక్షి నిత్యానందంపై పగ పెంచుకుంది. ఎనిమిది నెలల క్రితం, నందిని తన భర్తతో అభిప్రాయభేదాల కారణంగా ఆమె తన చిన్న కుమారుడిని తీసుకుని నాగలక్ష్మి ఇంటికి వెళ్లింది. గత కొన్ని రోజులుగా, నాగలక్షికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నందిని హోటల్లో పనిచేయడం ప్రారంభించింది. మంగళవారం రాత్రి పని నుంచి తిరిగి వచ్చిన నందిని తన బిడ్డ శ్వాస తీసుకోకపోవడం గమనించి, అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలుడు చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణంపై అనుమానంతో నందిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయగా అందులో పిల్లాడి పుర్రె పగిలిపోయిందని, అతని గొంతులో బిస్కెట్ రేపర్ దొరికిందని నివేదిక పేర్కొంది. పోలీసుల విచారణలో, నాగలక్షి చిన్నారిని చంపినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేశారు. చదవండి: SR Nagar: వందల కోట్ల రూపాయల ఆస్తి.. వృద్ధుల కిడ్నాప్ -
కీచక తండ్రి: కన్న కూతురిపై అఘాయిత్యం.. ఆపై..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కులాంతర వివాహం చేసుకున్నాడు. రెండు విద్యాసంస్థల్లో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్నాడు. ఎంతో ఉదాత్తంగా ఉండాల్సిన ఆ వ్యక్తి తన ఐదేళ్ల కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టి కటకటాల పాలయ్యాడు. ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విజయవాడ నగరంలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ ఇనిస్టిట్యూట్తో పాటు మరో ఇంజినీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్న నిందితుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. కాగా, ఈ ఏడాది జూన్ 26న అతడు తన ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని తల్లి బయటకు చెప్పుకోలేకపోయింది. కాగా, ఈ నెల 4న ఇంటికి వచ్చి తండ్రి ఆ పాపను అపహరించే ప్రయత్నం చేయగా.. ఆమె నాయనమ్మ అడ్డుకుని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసింది. ఈ ఘటనపై దిశ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆ బాలికకు పాత ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘటనపై నిరసన తెలియజేశారు. -
ఈ బుడతడు.. అడవిని జయించాడు..
కాన్బెర్రా: ఇంటి నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు మూడు రోజుల తర్వాత పోలీసులకు దొరికిన ఘటన ఆస్ట్రేలియాలోని ఉత్తర సిడ్నీలో చోటు చేసుకుంది. బాలుడికి బుద్ధిమాంద్యం సమస్య ఉన్నప్పటికీ మూడు రోజుల పాటు అడవిలో జీవించడం పోలీసులను సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆశ్చర్యపరచింది. బుద్ధిమాంద్యం సమస్యతో బాధపడుతున్న మూడేళ్ల బాలుడు ఆంతోనీ ఏజే ఎల్ఫలక్ మూడు రోజుల క్రితం తప్పిపోయాడు. తల్లిదండ్రులతో పాటు నివసిస్తున్న పుట్టీ అనే గ్రామం కారడవికి చాలా దగ్గర్లో ఉంటుంది. గ్రామంలోని ఇంటి నుంచి బాలుడు తప్పిపోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సహా వందలాది మంది అడవిలో అన్వేషణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్న పోలీసులకు బాలుడి జాడ కనిపించింది. చెట్ల మధ్యలో నీటి మడుగు వద్ద కూర్చొని నీరు తాగుతున్న బాలున్ని కెమెరాల ద్వారా గుర్తించారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాలుడిని చీమలు కుట్టాయని, శరీరంపై గీక్కుపోయిన గాయాలున్నాయని వెల్లడించారు. తమ కుమారుడి ఆచూకీ తెలియడంతో బాలుడి తల్లిదండ్రుల భావోద్వేగం (ఫొటో కర్టెసీ: ఏపీ) ఇంటికి 470 మీటర్ల దూరంలో బాలుడు దొరికాడన్నారు. తల్లి గొంతు వినగానే బాలుడు కళ్లు తెరచి చూశాడని అనంతరం ప్రశాంతంగా నిద్రపోయాడని పేర్కొన్నారు. కేవలం ఓ టీ–షర్ట్, డైపర్తో తప్పిపోయిన బాలుడు మూడు రోజుల పాటు అడవిలో జీవించి ఉండటం ఆశ్చర్యం కలిగించిందని పోలీసులు అన్నారు. నీటిని గుర్తించగలిగే సామర్థ్యం కారణంగా డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండగలిగాడని చెప్పారు. రక్షించేందుకు వెళ్లిన తనను చూసి బాలుడు చిరునవ్వు చిందించడం ఎన్నటికీ మరువలేనని పోలీస్ చీఫ్ సీమోన్ మెరిక్ అన్నారు. బాలుడు దొరకడం గొప్ప అద్భుతమని బాలుడి తండ్రి వ్యాఖ్యానించారు. -
ఇది బుడ్డోడి బాహుబలి ‘సొర’
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ప్రకృతిపై ప్రేమ.. పర్యావరణంపై మక్కువ.. ఈ రెండూ కలిపి ఎనిమిదేళ్ల పూండ్ల అధ్విక్రెడ్డిని పెరటి తోటలో కూరగాయల పెంపకంపై ఆసక్తిని పెంచింది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ పీవీఆర్ ప్రాజెక్టస్ సీఎండి పూండ్ల వెంకురెడ్డి మనవడు అధ్విక్రెడ్డి ఓక్రిడ్జ్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. తండ్రి పి.సతీష్కుమార్రెడ్డి అదే సంస్థలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్. కాగా తల్లి పి.దీప్తిరెడ్డి యంగ్ ఫిక్కి లేడీస్ అసోసియేషన్ చైర్పర్సన్. తాతకు కూరగాయలు, పండ్ల పెంపకంపై ఉన్న ఆసక్తి మనవడిపై ప్రభావం చూపింది. కరోనా సమయంలో ఇంట్లోనే ఉండాల్సి రావడంతో ఈ బాలుడు పెరటి తోటలో కూరగాయల పెంపకంపై దృష్టిసారించాడు. ఇంట్లో పెట్టిన సోరకాయ ఏకంగా వంద సెంటీమీటర్ల ఎత్తుతో ఆకర్షణగా ఉంది. దీని బరువు 10 కిలోలు. ఈ నాటు సోరకాయను పెంచడానికి అధ్విక్ ప్రతిరోజూ వేపపొడితో పాటు సేంద్రీయ ఎరువులను వేస్తుండేవాడు. ఇంటి వెనుక కిచెన్ గార్డెన్లో కూడా రకరకాల కూరగాయలు పెంచుతున్నాడు. మన కూరగాయలు మనమే పండించుకోవాలన్న ఉద్దేశంతో దీనిపై ఆసక్తి పెరిగిందని ఇందుకోసం పార, గంప తదితర పెరటి తోట సామగ్రిని కూడా కొనుగోలు చేసుకున్నారు. మొక్కలు నాటడం, పెంచడం అది కూడా సేంద్రీయ పద్ధతిలో పండించడం ఈ బాలుడు చేస్తున్న విశేషం. మా తాత వెంట చేవెళ్లలోని తోటకు వెళ్తుంట.. అక్కడ చాలా కూరగాయల మొక్కలున్నాయి. అలాంటివి ఇంటిదగ్గర పెంచితే రోజూ నీళ్లు పోయొచ్చుకదా అని పెరట్లో నాటాను. రోజూ నాకు మొక్కలతో టైమ్పాస్ బాగుంది. నేను నాటిన మొక్కకు ఇంత పెద్ద కాయ కాసిందని చాలా హ్యపీగా ఉంది. సోరకాయ తీగ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లింది. దాంతో స్విమ్మింగ్ పూల్లో నీటిని తీసేయించా. -అద్విక్రెడ్డి చదవండి: పబ్లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
పబ్లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్
సాక్షి, హైదరాబాద్: పబ్లో ఓ చిన్నారి డ్యాన్స్ చేయడం వైరల్గా మారింది. చిన్నారిని లోనికి అనుమతించినందుకు పబ్ నిర్వాహకులపై గచి్చ»ౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గచి్చ»ౌలిలోని ఎస్ఎల్ఎన్ టెర్మినస్లోని రెండవ అంతస్తులో ‘ది లాల్ స్ట్రీట్’ పబ్ ఉంది. ఆదివారం రాత్రి ఓ మహిళ ఇద్దరు కూతుళ్లతో పబ్కు వచ్చింది. ఆరేళ్ల కూతురు తండ్రి, అతడి స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసింది. చిన్నారి డ్యాన్స్ను వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ గోనె సురేష్ పబ్లోని సీసీ ఫుటేజీని స్వా«దీనం చేసుకున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మద్యం తాగిన 11మందితో పాటు మరో నలుగురు మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి వచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం తాగిన చోట చిన్నారిని డ్యాన్స్ వేయించడం నిబంధనలకు విరుద్దమన్నారు. పబ్ యజమాని మహవీర్ అగర్వాల్, చీఫ్ మేనేజర్ దీపక్లపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశామని అన్నారు. తల్లిదండ్రులను పిలిపించి ప్రశి్నస్తామన్నారు. ఎలాంటి అనుమతి లేదు.. ద లాల్ స్ట్రీట్ పబ్కు బార్ అండ్ రెస్టారెంట్గా మాత్రమే అనుమతి ఉన్నట్లు శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ గాంధీ తెలిపారు. డ్యాన్స్ ఫ్లోర్తో తమకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. బార్ అండ్రెస్టారెంట్లో నిబంధనలకు వి రుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నారు. మ్యూజిక్ కోసం ఎలాంటి అనుమతి లేదని గచి్చ»ౌలి పోలీసులు తెలిపారు. చదవండి: Mahesh Babu: సూపర్ స్టార్కు పెరిగిన ఫాలోయింగ్ -
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ రికార్డ్
-
విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది
కాబూల్: తాలిబన్ల ఆధీనంలోని అఫ్గాన్లో పరిస్థితులు రోజుకు రోజుకూ మరింత దుర్భరంగా మారుతున్నాయి. తాజాగా అకలితో అలమటిస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన వైనం హృదయవిదారకంగా నిలిచింది. ఆహారం లేక ఆకలితో అలమటించి కన్న తల్లితండ్రుల చేతుల్లోనే కన్నుమూసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారిని ఎత్తుకుని తండ్రి బోరును విలపిస్తున్న తీరు పలువురిన్ని కంట తడిపెట్టించింది. కాబూల్ విమానాశ్రయం బయట ఈ విషాదం నెలకొంది. తాలిబన్ల చేత చిక్కిన మాతృదేశం నుంచి ఎలాగైనా బయటపడాలని అఫ్లాన్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విమానమెక్కి మరేదేశమైనా వెళ్దామని కాబూల్ ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని నిద్రాహారాలు మాని రేయింబవళ్లు వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే తినేందుకు తిండి, తాకేందుకు నీరు కరువైన వేళ చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. -
ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా..
భువనేశ్వర్: పాతికేళ్లు వచ్చినా.. రిపబ్లిక్ డే ఎప్పుడో కూడా తెలియని వారు సమాజంలో చాలామంది తారస పడుతుంటారు. ఇంటర్వ్యూల్లో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎంతటి వారైనా నీళ్లు నమలాల్సిందే. అయితే ఐదున్నరేళ్ల చిన్నారి చిచ్చర పిడుగులా 48 దేశాలు, వాటి రాజధానులు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 40 సెకన్ల లోనే వీటిని చెప్పడంతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది.. జయపురం నకు చెందిన చిన్నారి అన్విత మిశ్ర. స్థానిక రాజు వీధిలోని వ్యాపారి శంకర మిశ్ర, మధుస్మిత ప్రాణిగ్రాహిల కుమార్తె అన్విత ప్రస్తుతం జయపురం ప్రకాశ్ విద్యాలయంలో యూకేజీ చదువుతోంది. చిన్నతనంలోనే తన మేధస్సుతో ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. గతంలో 34 సెకెన్లలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పేర్లను అనర్ఘళంగా చెప్పింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆసియా ఖండంలోని 48 దేశాల పేర్లు, వాటి రాజధానులను 48 సెకెన్లలో చెప్పడం పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను జూలైలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారికి పంపించారు. దీనిని బలపరుస్తూ సంస్థ నుంచి రెండు రోజుల క్రితం ధ్రువపత్రం అందిందని తల్లిదండ్రులు వెల్లడించారు. ప్రశంసాపత్రం తోపాటు మెడల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పుస్తకం, మరికొన్ని బహుమతలు పంపించారని తెలిపారు. కాగా... చిన్నారి అన్విత ప్రతిభ, అవార్డు పొందడం పట్ల జయపురం పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆడుకుంటానని వెళ్లిన బాలుడు.. అంతలోనే
సాక్షి, రుద్రంగి(కరీంనగర్): ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు ట్రాక్టర్ ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన గురువారం చందుర్తి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన రాచర్ల కవిత, నర్సయ్యల కుమారుడు రిషి(5). చందుర్తిలోని అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చారు. ఆడుకుంటానని చెప్పి వెళ్లి ఇంటిముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బాలుని మృతికి కారణమైన ట్రాక్టర్ను, డ్రైవర్ గామా మహేష్ను అదుపులోకి తీసుకొని, బాలుని తండ్రి రాచర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ గామా మహేష్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై సునీల్ తెలిపారు. మృతదేహంతో ధర్నా.. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్ యజమాని షేక్ సల్మాన్ ఇంటి ముందు బాలుడి మృతదేహాన్ని ఉంచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాచేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
హృదయ విదారక ఘటన.. నాలుగేళ్ల బాలికను..
జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. కొంత మంది గుర్తు తెలియని దుండగులు.. నాలుగేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత అత్యాచారం చేసి హతమార్చారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జైపూర్లోని నరైనా గ్రామపరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాలుగేళ్ల బాలిక గత బుధవారం ఇంట్లో ఆడుకుంటున్న తరుణంలో కనపడకుండా పోయింది. ఈక్రమంలో.. బాలిక తల్లిదండ్రులు స్థానిక నరైనా గ్రామ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. బాలిక కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు వెతకసాగారు. ఈ క్రమంలో.. ఈ రోజు(శుక్రవారం) బాలిక మృతదేహం.. ఆమె ఇంటికి దగ్గరలోని ఒక చెరువులో లభించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, బాలిక మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. కాగా, బాలికను పరీక్షించిన వైద్యులు అత్యాచారం చేసి చంపినట్లు తెలిపారు. దీంతో.. కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. బాలిక విగత జీవిగా ఉండటం చూసి కన్నీటి పర్యంత మయ్యారు. తమ కుమార్తైన హత్యచేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై స్పందించిన జైపూర్ పోలీసు అధికారి ఉమేష్ కుమార్.. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అయ్యో రాజేష్.. ఎంత ఘోరం జరిగిపోయింది
సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అది ఆటోమేటిక్ షట్టర్. ఏం జరుగుతుందో చూద్దామనే ఆసక్తితో ఓ బాలుడు బటన్ వేసి వంగి చూశాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు అదే షట్టర్లో ఇరుక్కుని మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీఐ రాజ్గోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుత్తుల అర్జున్ రావు, దేవి దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఏడాది క్రితం నగరానికి వలస వచ్చారు. మొదటి అంతస్తులో షట్టర్ పైభాగంలో.. అంజయ్యనగర్లోని కేఎన్ఆర్ స్క్వేర్లో అర్జున్రావు వాచ్మన్గా పనికి కుదిరి అక్కడే పెంట్హౌస్లో కుటుంబంతో ఉంటున్నారు. వీరి రెండో కుమారుడు రాజేష్ (11) అయిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం అర్జున్ రావు సర్వెంట్గా చేసే భార్య దేవిని వైట్ఫీల్డ్లో వదిలి వచ్చారు. ఉదయం 7.30 గంటలకు ఇంటికి వచ్చి చూడగా రాజేష్ కనిపించ లేదు. పెద్ద కుమారుడు భాను ప్రకాశ్ను అడగగా ఆడుకునేందుకు కిందికి వెళ్లాడని చెప్పాడు. ఇప్పుడే కింది నుంచి వచ్చానని.. ఎక్కడా కనిపించలేదని అర్జున్రావు వెతకసాగారు. మొదటి అంతస్తులో షట్టర్ పైభాగంలో రాజేష్ శరీరం చుట్టుకొని ఉండటం గమనించాడు. కాళ్లు మాత్రమే బయటకు కనిపించడంతో కేకలు వేయగా ఇరుగు పొరుగువారు వచ్చి షట్టర్ నుంచి బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. మొదటి అంతస్తులో ఉన్న బటన్ నొక్కి ఏమవుంతుదోనని వంగి చూడటంతో షట్టర్లోకి చుట్టుకుపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని బటన్ను బయట పెట్టడంతోనే ప్రమాదం జరిగిందని అర్జున్ రావు బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక బాల్యం నేలపాలు.. మూడు బాల్యాలు కటకటాలపాలు...
భార్యాభర్తల స్థితి నుంచి తల్లిదండ్రులవ్వటం అనేది ప్రకృతి సహజంగా జరుగుతున్న మార్పు. అంతవరకు ఆడుతూపాడుతూ ఉన్న జంట, ఒక్కసారిగా బాధ్యతగల తల్లిదండ్రులుగా మారిపోతారు. చంటిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. నిద్రాహారాలకు దూరమౌతారు. ఇది సృష్టి ధర్మం. ఇటీవల లండన్లో జరిగిన సంఘటన తల్లులు ముక్కున వేలేసుకునేలా చేసింది. సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. లండన్కి చెందిన 19 సంవత్సరాల వెర్ఫీ కుడీకి 20 నెలల పసి పాప ఉంది. చిన్న వయసులోనే బిడ్డకు జన్మనివ్వటం వల్లనేమో, ఆమె తన సరదాలకు దూరంగా ఉండలేకపోయింది. కుడీ తన పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకోవటం కోసం ఇంటి నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎలిఫెంట్ అండ్ క్యాజిల్కి వెళ్లారు. అక్కడే ఆరు రోజుల పాటు ఉండిపోయారు. ఆరు రోజుల పాటు ఆకలితో అలమటించి మరణించింది ఆ పసిపాప. తిరిగి వచ్చిన తనకు కుమార్తె చనిపోయి కనిపించింది. అందుకు తాను బాధపడట్లేదని, ఇది అతి సహజంగా జరిగిందంటున్నారు వెర్ఫీ కుడీ. ఇది ఇలా ఉంటే... ఖమ్మంలో గిరిజన జాతికి చెందిన కవిత, కావ్య, రాణి అనే ముగ్గురు మహిళల మీద హత్యానేరం మోపబడింది. అక్కడి రైతులు పత్తి పంట పండిస్తున్నారనే కోపంతో వీరు ఆ రైతుల మీద హత్యా యత్నం తలపెట్టడంతో అక్కడి ఆదివాసీలకు జైలు శిక్ష వేశారు. అందులో ఈ ముగ్గురూ పసిపిల్లల తల్లులు. ఆ పిల్లలు కూడా ఇప్పుడు తల్లులతో పాటు జైలు జీవితం అనివార్యంగా గడపాలి. అక్కడ ఆ తల్లి తన వేడుక కోసం పసిబిడ్డను విడిచిపెట్టి, ఆమె మరణానికి కారణమయ్యారు. ఇక్కడ ఆవేశంలో చేసిన పనికి ఈ పసిపిల్లలు బలవుతున్నారు. నిండు నూరేళ్ల జీవితం మసకబారిపోతోంది. తల్లిదండ్రులతో గడపవలసిన బాల్యం ఒకచోట బాల్య దశలోనే ముగిసిపోయింది, మరోచోట బాల్యమంతా జైలులో గడవబోతోంది. ‘‘ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి టీనేజ్ తల్లుల సమస్యలపై దృష్టి సారించాలి. సరైన వయసు వచ్చేవరకు తల్లి కాకుండా చట్టాలు సవరించాలి. తల్లి కాబోయే ముందు రాబోయే సాధక బాధకాలు వివరంగా తెలియజేయాలి. సరైన పెంపకంలో పెరగని పిల్లలు ఏ మార్గంలో పయనిస్తారో చెప్పడం కష్టం. ఆ దుస్థితి ముందు తరాల వారికి రాకూడదంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కళ్ళు తెరవాలి’’ అంటున్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్ శ్రీమతి కె. శోభ. తల్లిదండ్రుల లాలనలో బాల్యం అందంగా గడవాలి. వృద్ధాప్యంలో సైతం బాల్యాన్ని తలచుకునేలా ఉండాలి. అటువంటి బాల్యం మొగ్గలోనే వాడిపోవటం, జైలులో గడవటం... పిల్లల ఎదుగుదలకు అవరోధాలు. ‘‘జైలుకి వెళ్లిన ఆదివాసీలు తమ పిల్లల్ని తమతో పాటు తీసుకువెళ్లాలి. అందువల్ల ఆ పిల్లలు జైలు వాతావరణంలో పెరుగుతారు. వాళ్లని లోపల ఉంచే హక్కు ఎవరికీ లేదు. ముగ్గురు పాపంపుణ్యం తెలియని పిల్లల్ని అక్కడ ఉంచటం వల్ల వాళ్లకి ప్రపంచం తెలియదు. తల్లులు చేసిన తప్పులకు పిల్లలు బలవుతున్నారు. పిల్లల్ని బతికించుకోవటానికి వారు ఈ పనులు చేశామంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వారు ‘అడవి మా హక్కు’ అన్నారు. తరతరాలుగా అది వారి హక్కు. ఒక ఆదివాసీ ఒక మాట అన్నారు, ‘చెరువులో నీళ్లు చేపలు తాగితే చెరువు ఎండిపోతుందా’ అని. ఆదివాసీలు చెట్లు కొట్టడం వల్ల అడవి తరిగిపోదు. ఆవేశంలో వారు చేసిన పనికి, ఆ తల్లుల కారణంగా పిల్లల్ని జైలులో పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. పిల్లలు స్వేచ్ఛను అనుభవించటం కోసం తల్లుల్ని వదిలేయాలి’’ అంటున్నారు సామాజిక వేత్త దేవి. ఇప్పుడు వెర్ఫీ కుడీకి తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఖమ్మం మహిళలకు కూడా జైలు శిక్ష పడింది. – వైజయంతి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి! అంతులేని స్వేచ్ఛ, సమానత్వం పొంగిపొర్లే దేశం ఒకటి. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొనే దేశం మరోటి. రెండుచోట్లా బాధితులు పసివారే. దేశాల అభివృద్ధితో సంబంధం లేదని ఈ రెండు సంఘటనలు నిరూపించాయి. తల్లి తన పిల్లల కోసం ఎంతకైనా తెగిస్తుందంటారు. కానీ తల్లే తన పసికందు మరణానికి కారణమవడం విచారకరం. పైగా విచారణలో కూడా ఆమెలో బాధ, పశ్చాత్తాపం కనపడలేదట. మానసిక పరిపక్వత, శారీరక సామర్థ్యం లేకుండా అమాయకంగా ప్రేమలో చిక్కుకునే అమ్మాయిలు ఇలాగే ఉంటారు. రైతు మహిళల అరెస్టు సైతం ఇదే కోవకు వస్తుంది. తల్లులు జైలులో ఉంటే పాల బుగ్గల పసివారి సంగతి ఏమిటి ? ఇటీవలి కాలంలో తల్లుల కోపానికి బలవుతున్న పిల్లల సంఘటనలు అనేకం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం సరైన చదువు లేకపోవడం, సమస్యలపై అవగాహన లేకపోవడం. - కె. శోభ , ఫ్యామిలీ కౌన్సెలర్ వారిని నిందించకూడదు.. పసిబిడ్డను నిర్లక్ష్యం చేయటాన్ని ఎవ్వరూ సమర్థించరు. అసలు 20 సంవత్సరాల లోపు వయసున్నవారు పిల్లల్ని కనకూడదు. అనివార్యంగా కన్నప్పటికీ వారికి బాధ్యతగా పెంచటం తెలియదు. వెర్ఫీ కుడీ చేసిన పనికి ఆమె మీద నింద మోపకూడదు. ఆడుకునే వయసులో తిరగాలనే కోరికను వదులుకోలేరు. వాళ్లకి బాధ్యత తెలీదు. బిడ్డను పెంచలేమనుకుంటే, బేబీ కేర్ సెంటర్లకు అప్పచెప్పాలి. అలా చేసి ఉంటే ఆ పసిపాప మొగ్గలోనే రాలిపోయేది కాదు కదా. ఇలా చేయటాన్ని సమర్థిస్తున్నామని కాదు. అదొక మార్గం మాత్రమే అని చెబుతున్నాం. – దేవి, సామాజికవేత్త -
కూలిన శబ్దం విని తల్లి పరుగున బయటకు.. తీరా అక్కడ చూస్తే..
సాక్షి, గచ్చిబౌలి( హైదరాబాద్): అప్పటిదాకా తమ కళ్ల ఎదుటే ఇంట్లో తిరిగిన చిన్నారి కాసేపటికే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆడుకుంటుండగా దిమ్మె కూలి గేటు మీద పడటంతో దుర్ఘటనలో ఆరేళ్ల బాలుడు అసువులు బాశాడు. ఈ విషాదకర ఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలు.. మహారాష్ట్రకు చెందిన దంపతులు రాహుల్ సూర్యవంశీ, మీనా సూర్యవంశీ గోపన్పల్లిలో జర్నలిస్ట్ కాలనీని ఆనుకొని ఉన్న వివేకానందనగర్ (60 గజాల సైట్)లో నివాసం ఉంటున్నారు. వీరికి నితేష్ (6), రూపేష్ కవల కుమారులతో పాటు కూతురు స్నేహ ఉన్నారు. రాహుల్ కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. గచ్చిబౌలి కేంద్రీయ విద్యాలయంలో రెండో తరగతి చదువుతున్న నితేష్ ఆన్లైన్ క్లాసులు ముగియడంతో గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్ నంబర్ 125 గేటుకు వేలాడుతూ ఆడుకుంటున్నాడు. దిమ్మె కూలడంతో ఒక్కసారిగా ఇనుప గేటు మీద పడింది. దీంతో బాలుడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కూలిన శబ్దం విని తల్లి మీనా పరుగున వెళ్లి ఇరుగుపొరుగువారి సహాయంతో బయటకు తీశారు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు నితేష్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేదరైతు కొడుకు పాట.. నసీబ్ను మార్చేసింది
Viral Kid Sahdev Dirdo: సోషల్ మీడియా ఎప్పుడు.. ఎవరిని.. ఎలా ఫేమస్ చేస్తుందో ఊహించడం కష్టం. అయితే సానుకూల ధోరణి, లేదంటే వ్యతిరేక విమర్శలతోనైనా సరే పాపులర్ అయిపోతుంటారు. ఇక దక్కిన పాపులారిటీని నిలబెట్టుకోలేక కనుమరుగు అయ్యేవాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇదిలా ఉంటే ‘ జానే మేరీ జానేమన్.. బస్పన్ క్యా ప్యార్ మేరా..’ అంటూ ఓ సాంగ్ రీమిక్స్ వెర్షన్ నార్త్ ఇండియాను తెగ ఊపేస్తోంది. కారణం ఈ పాటను యూనిఫాల్లో ఉన్న సహదేవ్ అనే పిలగాడు అమాయకంగా పాడడమే. రాయ్గఢ్: ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా చింద్ఘడ్కు చెందిన సహదేవ్ డిర్దో(14).. ఈ కుర్రాడు నార్త్ ఇండియాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్టార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ పిల్లాడి వీడియో మొత్తం దేశానికి చేరింది. ఆపై రీమిక్స్తోడై సోషల్ మీడియా ఊగిపోతోంది. టీవీ షోల దగ్గరి నుంచి ఫిల్మ్సెలబబ్రిటీల దాకా ఈ చిన్నారి గాత్రాన్ని ఎక్కించేసుకున్నారు. బుల్లితెర రియాలిటీ షోలు అయితే ప్రతీరోజూ ఈ పాటను వాడేసుకుంటున్నాయి. చివరికి ఆ చిన్నారి టాలెంట్-దక్కిన ఫేమ్కి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సైతం ఫిదా అయ్యారు. సహదేవ్ను పిలిపించుకుని ఘనంగా సన్మానించారు కూడా. ఇంతకీ రెండేళ్ల క్రితం ఆ పిలగాడు పాడిన పాట ఎలా వైరల్ అయ్యిందంటే.. बचपन का प्यार....वाह! pic.twitter.com/tWUuWFP71f — Bhupesh Baghel (@bhupeshbaghel) July 27, 2021 కమలేష్ బారోత్ అనే ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్ కమ్ ఆర్టిస్ట్ కంపోజ్ చేసిన ‘బచ్పన్ కా ప్యార్’ సాంగ్ 2019లో యూట్యూబ్లో రిలీజ్ అయ్యింది. నార్త్లో రూరల్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ పాట. ఆ టైంలో స్కూల్లో తన టీచర్ కోసం ‘బచ్(స్)పన్ క్యా ప్యార్’ అంటూ పాడేశాడు ఏడో తరగతి చదివే సహదేవ్. ఆ పాట ఆ టీచర్ను ఆకట్టుకోవడంతో ఫోన్లో రికార్డు చేశాడు. ఇంటర్నెట్లో అప్లోడ్ చేసినప్పటికీ.. అది వైరల్ అవ్వడానికి రెండేళ్లు పట్టింది. అటు ఇటు తిరిగి ఈ పాట ర్యాపర్ బాద్షా చేతికి చేరింది. ఇంకేం అతగాడు దాన్నీ రీమిక్స్ చేసి ఇన్స్టాగ్రామ్ వదిలాడు. దీంతో ఆ వాయిస్ ఎవరిదా? అనే ఆరాలు ఎక్కువయ్యాయి. చివరికి మీడియా హౌజ్ల చొరవతో ఎట్టకేలకు చిన్నారి సహదేవ్ వెలుగులోకి వచ్చాడు. View this post on Instagram A post shared by BADSHAH (@badboyshah) ఫ్రెండ్సే చూపించారు సహదేవ్ తండ్రి పేద రైతు. ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంటుంది. ఇక మనోడు గవర్నమెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇంతకీ ఈ పాట ఎలా బట్టీపట్టావ్ అని అడిగితే.. తన ఇంట్లో టీవీ లేదని, రోడ్డు మీద టీవీల్లో చూసి బట్టీపట్టానని అమాయకంగా చెప్తున్నాడు సహదేవ్. ఇక ఇప్పుడు ఇంటర్నెట్లో తన పాట వైరల్ అయ్యింది కూడా తన స్నేహితుడి తండ్రి మొబైల్లోనే చూశాడట. ఊరంతా తనని ‘సూపర్స్టార్’ అని పిలుస్తున్నారని మురిసిపోతున్నాడు సహదేవ్. ఈ చిన్నారి కుటుంబ ఆర్థికస్థితి తెలిసి చాలామంది దాతలు సాయానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు ఈ సాంగ్ రీమిక్స్ కారకుడైన ర్యాపర్ బాద్షా.. ఈ కుర్రాడికి తనతో కలిసి ఆల్బమ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా..
సాక్షి,సనత్నగర్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దత్తు కుమార్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఫతేనగర్ జింకలవాడలో ఉంటున్నారు. దత్తుకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దత్తుకుమార్ భార్య పూజ దుస్తులు ఉతుకుతుండగా, కుమారుడు ఏసురాజ్ (7) భవనం రెండో అంతస్తులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బాలుడు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సనత్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మమ్మీ ఎందుకు మాట్లాడుతలేదు.. ఎస్సైని ప్రశ్నించిన చిన్నారి..
సాక్షి, తంగళ్లపల్లి(కరీంనగర్): ‘పోలీస్ అంకుల్ మా మమ్మీని అప్పటి నుంచి పిలుస్తున్నా పలుకుతలేదు.. ఏమైంది అంకుల్’ అంటూ ఆ చిన్నారులు ప్రశ్నించడంతో అక్కడున్నవారు కన్నీ టిపర్యంతమయ్యారు. ఈ ఘటన తంగళ్లపల్లి మండలంలోని రామచంద్రపూర్లో శని వారం జరిగింది. గ్రామస్తులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డం దినకర్–వైష్ణవిలకు దీపాన్స్, హిమాన్స్ సంతానం. దినకర్ మెడికల్ షాపు నిర్వహిస్తుండగా, వైష్ణవి ఇంటి వద్దే ఉంటుంది. బంధువుల ఇంటిలో ఫంక్షన్కు వెళ్లి శనివారం వచ్చిన వైష్ణవి(28) బట్టలు ఉతికేందుకు స్నానం గదిలోకి వెళ్లింది. బట్టలను బకెట్లో నానబెట్టి పక్కనే ఆన్చేసి ఉన్న హీటర్ను ప్లగ్ నుంచి వేరుచేసేందుకు ప్రయత్నించగా.. విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఎస్సై లక్ష్మారెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తమ కూతురు మరణంపై అనుమానం ఉందంటూ వైష్ణవి తల్లిగారు జిల్లెల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఎస్సై వారితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు. -
రెండో తరగతి చిన్నారి.. ఆసనాలు వేయడంలో ఆరితేరింది
సాక్షి, శృంగవరపుకోట(భువనేశ్వర్): యెగాతో అందరికీ ఆరోగ్యం సాధ్యం. ఈ విషయం తెలిసినా అధికశాతం మంది కాదనుకుని వదిలేస్తున్నారు. ఏడేళ్ల చిన్నారి వత్రం మేనమామను అనుకరించి ఆసనాల్లో దిట్ట అనిపించుకుంటోంది. శృంగవరపుకోటకు చెందిన ఏడేళ్ల కర్రి హర్షిత యోగాలో విశేష ప్రతిభ చపుతోంది. హర్షిత మేనమామ భానుప్రకాష్రెడ్డి నిత్యం యోగా సాధన చేస్త నైపుణ్యం సాధించారు. మేనమామ యోగా సాధన చేస్తున్న సమయంలో అతడిని హర్షిత అనుకరించేది. ఆసనాలు వేయడం నేర్చుకుంది. మేనకోడలి ఆసక్తి గమనింన భానుప్రకాష్ ఏడాదిన్నర వయసు నుం హర్షితకు ఆసనాలు వేయడం నేర్పించారు. ఐదేళ్ల వయసు వచ్చేసరికి ఆసనాల్లో దిట్ట అయ్యింది. ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్న హర్షిత 200పైగా ఆసనాలు వేస్తోంది. సువరు 100 వరకూ ఆసనాలు పేర్లు చెప్పగానే వేస్తుంది. మరో 100 వరకూ సంక్లిష్ట ఆసనాల పేర్లు తెలియకపోయినా అనుకరిస్త క్షణాల్లో అలాగే ఆసనం వేస్తుంది. పిన్న వయసులో ప్రతిభ చపుతున్న చిన్నారి హర్షితను పలువురు అభినందిస్తున్నారు. -
ఘోరం: కన్నబిడ్డకు విషమిచ్చి చంపిన తల్లి..
సాక్షి, చెన్నై: కాంచీపురం వాలాజాబాద్ సమీపంలోని మురుగన్, ఉమా దంపతులు నివాసం ఉన్నారు. వీరికి దీపిక అనే ఆరేళ్ల కుమార్తె ఉంది. దంపతులు ఒకే ఇంట్లో ఉన్నా, అభిప్రాయ భేదాల కారణంగా వేర్వేరుగా వంట చేసుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భర్తమీద ఆగ్రహంతో ఉన్న ఉమా మంగళవారం రాత్రి తన కుమార్తెకు విషం ఇచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. బుధవారం ఈ ఇద్దరు గది నుంచి రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా మరణించి ఉండటంతో పోలీసులకు భర్త సమాచారం అందించాడు. మృతదేహాల్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆన్లైన్ పాఠాలు..సెల్ఫోన్లో వేధింపులు.. కీచక ఉపాధ్యాయుడు.. -
దారుణం: సాంబార్ పడి చిన్నారి మృతి
సాక్షి, దొడ్డబళ్లాపురం(కర్ణాటక): వేడి సాంబార్ మీదపడి ఏడాదిన్నర బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నపట్టణ తాలూకా దేవరహొసహళ్లి గ్రామంలో జరిగింది. చౌడేశ్, రాధ దంపతుల కుమారుడు ధన్విక్ మృతి చెందిన చిన్నారి. సోమవారం రాత్రి ఇంట్లో స్టౌ మీద మరుగుతున్న సాంబార్ పాత్రను ధన్విక్ లాగడంతో ఒంటిమీద సాంబార్ పడి తీవ్ర గాయాలయ్యాయి. మండ్యలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా బుధవారం ఉదయం మృతిచెందాడు. చదవండి: శాడిస్టు భర్త.. పీకలదాక మద్యం తాగి.. ఆపై -
పాపం.. 3 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు.. అంతలోనే..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): బొలెరో ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం తాలూకాలోని లింగన ఖాన్ దొడ్డిలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంటి వద్ద సిద్దార్థ(3)అనే చిన్నారి ఆడుకుంటుండగా అదే సమయంలో ఒక బొలెరో వాహనం రివర్స్ చేసుకునే క్రమంలో టైర్లు బాలుడిపైకి ఎక్కాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆడుకుంటున్న పిల్లవాడు అంతలోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ ఉడాయించాడు. ఇడపనూరు ఎస్ఐ కరెమ్మ ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Viral: బిడ్డ చదువుకు తండ్రి గొడుగు -
చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్ర..!
జగదేవ్పూర్ (గజ్వేల్): ప్రమాదంలో బాబాయ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలియని ఆ పసివాడు.. అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఏడు గంటలపాటు మృతదేహంపైనే నిద్రపోయాడు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. మర్కూక్ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28) శనివారం రాత్రి పది గంటల సమయంలో జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్లోని తన బావ వద్దకు అన్న కొడుకు మోక్షిత్ (4)ను బైక్పై ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రాంనగర్ సమీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశులుగా కవరు కప్పి ఉన్నాయి. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఢీకొట్టి ఎగిరి ఇద్దరూ రోడ్డు కింద పడిపోయారు. ఐలయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి సమయం కావడంతో అటువైపు ఎవరూ రాలేదు. గాయాలతో షాక్కు గురైన బాలుడు ఏడుస్తూ బాబాయ్ మృతదేహంపైనే తల ఆనించి పడుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సర్పంచ్ భానుప్రకాశ్రావు బాలుడిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. -
చిన్నారి తీరాకు రూ.16 కోట్ల ఇంజక్షన్ వేసిన వైద్యులు
ముంబై: అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తీరా కామత్ కు ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు బుధవారం రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ వేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరస్థితి బాగుందని డాక్టర్లు వెల్లడించారు.ముంబైలోని అంధేరీ ప్రాంతానికి చెందిన మిహర్ కామత్, ప్రియాంక కామత్ల కుమార్తె 'తీరా'కి 8 నుంచి 10వేల మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే వెన్నెముక కండరాల సమస్య ‘స్పైనల్ మస్య్కులర్ అట్రోఫీ’ అనే జన్యుపరమైన లోపం తలెత్తింది. అనారోగ్యం కారణంగా అత్యవసర చికిత్స కోసం ముంబై హిందుజా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు చిన్నారికి అత్యంత జన్యుపరమైన లోపం తలెత్తిందని, ట్రీట్మెంట్ కోసం రూ.16 కోట్ల విలువ చేసే ఒక్క ఇంజక్షన్ ‘జోల్జెన్స్మా’ ను వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఇంజక్షన్ అమెరికా నుంచి ఇండియాకు తీసుకొని రావాల్సి ఉంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలు పోక దేవుడిపై భారం వేశారు. ‘ఇంపాక్ట్ గురు’ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆన్ లైన్ లో విరాళాల్ని సేకరించారు. కేవలం 42 రోజుల్లో ప్రపంచ దేశాలకు చెందిన 2.6 లక్షల మంది విరాళంగా అందించడంతో ముంబై హిందుజా ఆస్పత్రి వైద్యులు అమెరికా నుంచి తెప్పించిన జోల్ జెస్ స్మా ఇంజక్షన్ వేశారు. ఈ సందర్భంగా హిందుజా ఆస్పత్రి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నీలూ దేశాయ్ మాట్లాడుతూ.."8 నుంచి 10వేలలో ఒక్కరికి మాత్రమే ఈ జన్యుపరమైన సమస్య వస్తుంది. తీరాకి కూడా ఇలాంటి సమస్యే తలెత్తింది. ఈ అనారోగ్యసమస్యను నయం చేయాలంటే భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. మిహర్, ప్రియాంకలు ఆన్ లైన్ ద్వారా సేకరించిన విరాళాలతో ఇంజక్షన్ తెప్పించి బుధవారమే ఆ ఇంజక్షన్ వేశాం. ఆ ఇంజక్షన్ పాపపై బాగా పనిచేస్తోంది "అని అన్నారు. మరోవైపు తమ పాప ఖర్చులకు ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు విరాళం అందిస్తారని ఊహించలేకపోయామని తీరా తల్లిదండ్రులు అన్నారు. కేవలం 42 రోజుల్లో తమ కుమార్తె కోసం భారీ ఎత్తున విరాళాలిచ్చిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి) -
Borewell: 16 గంటల ఆపరేషన్, బాలుడు సేఫ్
జైపూర్: దేశంలో పలు చోట్ల బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయా ఘటనల్లో కొందరు పిల్లలు ప్రాణాలు విడువగా.. మరికొందరు బతికి బయటపడ్డారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. బోరు బావుల యజమానులు కొందరు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. పిల్లాడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యమే బాలుడిని ప్రమాదంలో పడేసింది వివరాల్లోకి వెళితే.. జాలోర్ జిల్లాలోని లచ్హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగరమ్ దేవసీ తన వ్యవసాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ ప్రమాదవశాత్తు ఆ బావిలో జారి పడిపోయాడు. ఆ బావి సుమారు 95 అడుగులు లోతు ఉంది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. చుట్టుపక్కలవారికి విషయం చెప్పాడు. దీంతో వారు పోలీసులకు, ఎన్డీఆర్ఎఫ్ టీంకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 16 గంటల తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆక్సిజన్తో నిలిచిన ప్రాణం.. స్థానిక ఎస్హెచ్వో ఆచార్య మాట్లాడుతూ.. ‘బాలుడు బోరు బావిలో పడిపోయాడని సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. పిల్లాడి వద్దకు కెమెరా పంపించి అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాం. పిల్లాడికి పైపు ద్వారా ఆక్సిజన్ను, ఆహార పదార్థాలు కూడా బావిలోకి పంపించాము. అలాగే బాలుడు నిద్రపోకుండా ఉండటానికి మా జట్టు సభ్యులు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. సహాయక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీయగలిగాం’అని చెప్పారు. ( చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు ) #UPDATE | Rajasthan: The four-year-old boy who fell into a nearly 95-feet-deep open borewell in a village in Jalore has been rescued. pic.twitter.com/UEak9keBEN — ANI (@ANI) May 7, 2021 -
సూపర్హీరో మరో ఔదార్యం, నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: ప్రాణాలకు తెగించి మరీ పట్టాలపై పడి పోయిన బాలుడిన కాపడిన రైల్వే పాయింట్మ్యాన్ మయూర్ షెల్కే తన ఔదార్యంతో మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తనకు బహుమతిగా వచ్చిన డబ్బులో సగం భాగాన్ని తాను రక్షించిన బాలుడికి ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అతని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న తరువాత మయూర్ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని భావించారు. ఆ బాలుడి చదువు, సంక్షేమం నిమిత్తం కొంత సొమ్మును దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతని పెద్దమనసుకు నెటిజనులు హ్యాట్యాఫ్ అంటున్నారు. మా మనసులను ఎన్నిసార్లు గెల్చుకుంటావ్ భయ్యా అంటూ షెల్కేకు ఫిదా అవుతున్నారు. (సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్) I'll give half of the amount, given to me as token of appreciation, for that child's welfare & education. I came to know that his family isn't financially strong. So I decided this: Mayur Shelkhe, pointsman who saved a child who fell on tracks at Vangani railway station on 17.04 pic.twitter.com/IWdacY0DFf — ANI (@ANI) April 22, 2021 pic.twitter.com/C62xQVXnCy — thejadooguy (@JadooShah) April 22, 2021 In these dark days for humanity, ray of hope 🙏 — Bharateeya (@AntiCaste_Hindu) April 22, 2021 -
ఉరి తాడుగా మారిన ఉయ్యాల
సాక్షి, అశ్వరావుపేట: అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ, తమ్ముడిని నవ్విస్తూ ఉన్న ఆ చిన్నారి.. తల్లి కాసేపు ఇంట్లోకి వెళ్లొచ్చేసరికే ఉయ్యాల చీర మెడకు చుట్టుకుని ఊపిరాడక మృత్యువాతకు గురైన విషాదకర సంఘటన అశ్వారావుపేటలో మంగళవారం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన రవికుమార్ కొంతకాలంగా అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ వెనుక వీధిలో నివాసం ఉంటూ, స్థానిక యూనియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఇతడికి భార్య నందిని, ఇద్దరు మగ సంతానం ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం తల్లి నందిని చిన్నారులకు అన్నం తినిపిస్తుండగా, అదే సమయంలో పెద్ద కుమారుడు సాహెత్ (6) చీరతో కట్టిన ఉయ్యాలతో ఆడుకుంటున్నాడు. మంచినీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లిన సమయంలో ఆడుకుంటున్న సాహెత్ మెడకు చీర బిగుసుకుపోయి ఊపిరి ఆడలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చే సరికి కొన ఊపిరితో వేలాడుతున్న సాహెత్ను చూసి మెడకు బిగుసుకుపోయిన చీరను తొలగించి, స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అంతసేపు ఆడుకుంటున్న బిడ్డ అంతలోనే కన్నుమూశాడనే చేదు నిజాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ( చదవండి: ఉద్యోగం పోతుందనే భయంతో.. ) -
చిన్నారిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
ముంబై: తన ప్రాణాలను సైతం చేయకుండా చిన్నారిని కాపాడిన రియల్ హీరో మయూర్ షెల్కేను అతని తోటి సిబ్బంది, నెటిజన్లే గాక ప్రముఖుల కూడా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని సెంట్రల్ రైల్వే అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో షెల్కేకు ఇరు వైపుల అధికారులు, తోటి సిబ్బంది నిలబడి చప్పట్లతో అతనికి గ్రాండ్ వెల్కం పలికారు. అనంతరం షెల్కే ధైర్య సాహసాన్ని అభినందిస్తూ 50 వేల రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంబై డివిజనల్ మేనేజర్, ఇతర రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఇదంతా చిత్రీకరించిన వీడియోను రైల్వే శాఖ అధికారిక ట్విట్టర్ లో పంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, కోలీవుడ్ నటుడు మాధవన్తో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఆ ఉద్యోగి చేసిన సాహసాన్ని అభినందిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. మయూర్ షెల్కే ధైర్యం ఓ ప్రాణాన్ని కాపాడింది వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్ఫాం వద్ద తల్లితో కలిసి నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేసింది. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలాడు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి ఫ్లాట్ ఫారం మీదకు తరలించాడు అంతే వేగంగా తను కూడా పట్టాల పైనుంచి తప్పుకున్నాడు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. షెల్కే సాహసంతో క్షణాల్లో ఆ చిన్నారి ప్రాణాలు దక్కాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ సాహస వీడియోను రైల్వే శాఖ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ( చదవండి: పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో ) Shri Mayur Shelkhe the ‘real life hero’ appreciated by staff & DRM of Mumbai Division of Central Railway. 💐💐 pic.twitter.com/8fCSR6S4Vy — Ministry of Railways (@RailMinIndia) April 19, 2021 -
బాలుడిని కాపాడిన రియల్ హీరోకు బహుమతి
-
పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో
సాక్షి, ముంబై: ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. అయితే శరవేంగా అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో రెప్పపాటు కాలంలో ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన వైనం పలువురి ప్రశంసంలందుకుంటోంది. సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 -
పట్టాలపై చిన్నారి..సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి
-
కిలిమంజారోను అధిరోహించిన హైదరాబాద్ బుడతడు
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మీరు ఏం చేసి ఉంటారు.. మీకు గుర్తుందా..! , ఇది కాస్త కష్టమే. నిన్న చేసిన పనులే అసలు గుర్తుకు ఉండవు అలాంటింది ఏడేళ్ల అప్పుడు అడిగితే ఏం చేప్తామని అనుకుంటున్నారా...! ఎవడికి తెలుసురా ఎవడికి తెలుసు అంటూ కోపంగా తిట్టుకుంటున్నారా..., పోనీ ఒకవేళ గుర్తున్నా... ఏడేళ్ల వయసులో స్కూలు పోను అంటూ మారం చేస్తూ , అసలు ఆలసట అనేది దరి చేరకుండా ఆడుతూ పాడుతూ ఉంటారు. మనలో అందరూ దాదాపు ఇలాగే చేసి ఉంటారు.. కానీ హైదరాబాద్కు చెందిన ఏడేళ్ల విరాట్ చంద్ర తేలుకుంట అలా కాదు.. ఈ బుడతడు ఏకంగా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం కిలిమంజారో పర్వతాన్ని ఎక్కి అందరితో ఔరా అనిపించుకున్నాడు. ఫలితంగా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన పిన్న వయసుడిగా నిలిచాడు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా మార్చి ఆరో తేదీన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కాడు. ఈ అరుదైన ఘనతను సాధించడంతో తన తల్లిదండ్రులను గర్వించేలాగా చేశాడు. -
ట్రెండింగ్: పొరపాటున 42 ఆర్డర్లను బుక్ చేసిన చిన్నారి
ఫిలిప్పీన్స్లోని సిబూ సిటీలోని ఒక వీధిలో ఒక చిన్నారి చేసిన తప్పు కారణంగా ఒక్క సారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్తో ఆ కాలనీ నిండిపోయింది. అక్కడ ఉన్న 7 ఏళ్ల చిన్నారి 2ఆర్డర్లకు బదులుగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లో చేసిన చిన్న తప్పు కారణంగా 42 ఆర్డర్లను బుక్ చేసింది. దింతో అప్పటికే చాలా రద్దీగా ఉండే ఆ వీధి ఒక్కసారిగా ఫుడ్ డెలివరీ బాయ్స్తో నిడిపోయింది. దీనికి సంబదించిన ఒక వీడియోను ఫేస్బుక్ యూజర్ డాన్ కైన్ సువారెజ్ అనే వ్యక్తి షేర్ చేసాడు. (చదవండి: వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది అత్యంత సురక్షితం?) వివరాల్లోకి వెళ్ళితే.. 7 ఏళ్ల చిన్నారి తన బామ్మతో కలిసి భోజనం చేయడానికి 2 బాక్సుల చికెన్ ఫిల్లెట్ను ఫుడ్ డెలివేరి యాప్ లో ఆర్డర్ చేయడానికి ప్రయత్నించింది. ఆ పాప ఆర్డర్ చేసినప్పుడు ఇంటర్ నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో ఆ ఫుడ్ ఆర్డర్ పై 42 సార్లు ప్రెస్ చేసింది. ఇలా చేయడం వల్ల ఒక్క సారిగా 42 ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలా రద్దీగా ఉండే కాలనీలోకి వచ్చేసరికి అక్కడ వింత వాతావరణం చోటు చేసుకుంది. ఈ అమ్మాయి ఇలా చేయడం మొదటి సారి కాదు గతంలో కూడా ఇలా చాలా సార్లు చేసింది. అసలు ఒక్క ఆర్డర్ ధర వచ్చేసి 290 రూపాయలు. ఇప్పుడు 42 ఆర్డర్లకు కలిపి పూర్తి బిల్లు 12,186 రూపాయలు అయ్యింది. దాంతో ఆ పిల్ల బోరున ఏడుపు అందుకుంది. అక్కడ ఉన్నా ప్రజలకు ఈ విషయం తెలవడంతో ఆ ఆర్డర్ లను వారు అవసరం లేకున్నా కొన్నారు. అందుకే మీరు కూడా ఆర్డర్ చేసే ముందు జర జాగ్రత్త. అలాగే, మీ పిల్లకు కూడా ఇలాంటి అవకాశాన్ని వారికి ఇవ్వకండి. -
పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ..
ఆడ పిల్లలకు నాన్న అంటే ఎంత ఇష్టమో చెప్పలేం. అమ్మలా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకున్నా.. నాన్న అంటేనే వాళ్లకు ఎక్కువ ఇష్టం. ఎక్కువ సమయం నాన్నతో గడపడానికే ఆడ పిల్లలు ఇష్టపడతారు. ఒక్క రోజు కనిపించకపోతే ‘నాన్న కావాలి’ అని మారం చేస్తుంటారు. అలాంటిది కొన్ని నెలల పాటు నాన్న కనిపించకపోతే.. ఆ పసి హృదయం ఎలా తట్టుకుంటుంది. ‘నాన్న కావాలి’ అంటూ కనీసం రోజుకు ఒక్కసారైనా మారం చేస్తుంటారు. వాళ్లని సముదాయించడానికి తల్లి ఏదోఒకటి చెప్పి నచ్చజెప్పుతారు. అలా ప్రతి రోజు నాన్న కావాలి అని మారం చేస్తున్న ఓ పాప మనసుని అర్థం చేసుకొన్న ఓ తల్లి.. నాన్ననే బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఏదో స్పెషల్ బహుమతి అనుకొని ఓపెన్ చేసిన పాప... నాన్నను చూసి ఆనందంతో చిందులేస్తూ ముద్దులతో ప్రేమ వర్షాన్ని కురిపించింది. పాత వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. (చదవండి : అక్కడేందుకు కూర్చున్నావ్?’) అమెరికా వైమానిక దళానికి చెందిన స్టాఫ్ సార్జెంట్ తిమోతి వైట్ కొన్ని నెలల తర్వాత 2018లో తన ఇంటికి తిరిగి వస్తాడు. అయితే మాములుగా రాకుండా తన కూతురు హార్పర్ని సర్ప్రైజ్ చేయడానికి బహుమతి రూపంగా ఇంటి ముందుకు వచ్చాడు. క్రిస్మస్ పండగ సందర్భంగా నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ అని అమ్మ చెప్పడంతో.. ఆ చిన్నారి పరుగున వచ్చి గిప్ట్ ఓపెన్ చేస్తుంది. వెంటనే అందులో నుంచి తమోతి లేస్తాడు.. నాన్నను చూసిన హార్పర్.. ఆనందంతో అతని హగ్ చేసుకుంటుంది. ముద్దులు పెట్టి.. ఒళ్లో చేరి ఆడుకుంటుంది. ఇదంతా తల్లి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఇక వీడియోపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఆడ పిల్లలకు నాన్న అంటేనే ఎక్కువ ఇష్టం’, ‘నాన్న ఉద్యోగం కోసం వెళ్లాడని ఆ చిన్నారికి తెలియదు. నాన్న తనతోనే ఉండాలని ప్రతి చిన్నారి కోరుకుంటుంది. పసి పిల్లల ప్రేమ వెల కట్టలేనిది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
వయస్సు రెండున్నరేళ్లు.. ఐక్యూ అదుర్స్
రామచంద్రపురం రూరల్: ఆ చిన్నారి వయస్సు రెండున్నరేళ్లు. పేరు కట్టా హేమాన్స్ సాయి సత్య సూర్య. రామచంద్రపురం మండ లం తాళ్లపొలానికి చెందిన గౌడ, శెట్టిబలిజ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ మనవడు. రెండు న్నరేళ్ల వయస్సులోనే ప్రపంచ దేశాల జెండాలను గుర్తిస్తూ అవి ఏ దేశానికి చెందినవో చెబుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అంతే కాదు అక్షరాలు, అంకెలు, ఇంగ్లిష్ నెలలు, తెలుగు నెలలు, తెలుగు నక్షత్రాలు, రాశులు, తిథులు, జాతీయ చిహ్నాలు, ఖండాలు, దేశంలోని రాష్ట్రాలు–వాటి రాజధానులు, 115 రకాల పరమాణు మూలకాలు, ప్రఖ్యాత వ్యక్తులు తదితర అంశాలను అలవోకగా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. హేమాన్స్ తల్లిదండ్రులు నిరోష, శర్వాణి ఇద్దరూ విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా మార్చి నుంచి తాళ్లపొలంలోనే ఉంటున్నారు. చిన్నారి ప్రతిభకు పదును పెడుతున్న తల్లిదండ్రులను స్థానికులు అభినందిస్తున్నారు. -
ఈ బుడ్డోడికి ఎంత ధైర్యమో!
చిన్న పిల్లలు ఏవరైనా సాధారణంగా పెద్ద పెద్ద జంతువులను చూస్తే భయపడి ఏడుస్తాడు.కానీ సౌత్ ఆఫ్రికా అడవికి వెళ్లిన ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా ఒక అడవి ఏనుగు దగ్గరకు వెళ్లి మరీ దాని తొండాన్ని తాకుతూ ‘హాయ్ ఎలిఫెంట్’ అని చెప్పి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆఫ్రికా అడవులు అంటేనే అక్కడ సఫారీకి వెళ్లిన వారికి పెద్ద పెద్ద ఏనుగులు, రకరకాల అడవి జంతువులు కనబడటం సర్వసాధారాణం. అయితే సఫారీ గైడ్లు అడవి ఏనుగుల దగ్గరకు పర్యాటకులను వెళ్లనివ్వరు. ఎందుకంటే అడవి జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. చదవండి: వైరల్ వీడియో.. పాములతో కేక్ తినిపించారు Just speechless 💕 Wildlife photographer Lesanne was on a shoot getting pics of this massive bull elephant, when her son, a little Zimbabwean boy fearlessly went up to him to say hello. Gentle giants..... pic.twitter.com/SdHlXq2r2P — Susanta Nanda IFS (@susantananda3) July 16, 2020 వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ లెసాన్నే ఫోలెర్, తన కొడుకుతో కలిసి సఫారీకి వెళ్లింది. అక్కడ ఓ పెద్ద అడవి ఏనుగు గడ్డి తింటుంటే లెసాన్నే దాన్ని ఫొటోలు తీయసాగింది. ఇంతలో ఆమె కొడుకు ఏమాత్రం భయపడకుండా ఏనుగు దగ్గరకు వెళ్లాడు. దాని తొండాన్ని నిమురుతూ... హాయ్ ఎలిఫేంట్ అని పలకరించాడు. ఇదంతా ఆమె వీడియో తీసింది. ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనందా ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఆ ఏనుగు ఏదో ధ్యాసలో ఉండి ఆ చిన్నారిని పట్టించుకోలేదు. అదే ఏనుగు కోపంలో ఉండి ఉంటే ఆ పిల్లాడికి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ వీడియో పోస్ట్ చేసిన సుశాంతనందా ఆ చిన్నారి తొండాన్ని నిమరడం ఏనుగుకి నచ్చి ఉంటుంది అని చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అడవి జంతువుల దగ్గరకు చిన్నారులు వెళ్లడం మంచిది కాదని అంటున్నారు. చిన్నారి తల్లి అలా వెళ్లనివ్వకుండా ఆపాలని సూచిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఏం జరగలేదు కాబట్టి ఈ వీడియో చూసి ఎంజాయ్ చెయ్యగలుగుతున్నాం, అదే ఏమైనా అయి ఉంటే అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పక్కన ప్రొఫెషనల్స్ లేకుండా వన్యమృగాల దగ్గరకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.