
అశ్వారావుపేట రూరల్: ఈ ఫొటోలో కనిపిస్తున్న మేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన ఓ రైతు చేనులో మేతకు వెళ్లింది. ఆ సమయంలో పంట దెబ్బతినడంతో బాధిత రైతు మేకను పట్టుకొని నేరుగా స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు మేకను స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు. రెండు రోజులుగా ఈ మేక పోలీస్స్టేషన్లో బందీగా మారిపోయింది. ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ కెమెరాలో క్లిక్మనిపించింది. దీనిపై ఏఎస్ఐ ఎంవీ.సత్యనారాయణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేని సమయంలో ఓ రైతు స్టేషన్కు తీసుకొచ్చి, తన చేనును ధ్వంసం చేస్తోందని చెప్పి వెళ్లిపోయాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment