మేక మేతకోసం చెట్టెక్కిన అన్నదమ్ములు.. రైలు ఢీకొని ఇద్దరి మృతి | tragedy incident in yakutpura railway station | Sakshi
Sakshi News home page

మేక మేతకోసం చెట్టెక్కిన అన్నదమ్ములు.. చెట్టుకొమ్మ విరిగి ఆపై రైలు ఢీకొని ఇద్దరి మృతి

Jun 2 2025 3:46 PM | Updated on Jun 2 2025 6:58 PM

tragedy incident in yakutpura railway station

సాక్షి,హైదరాబాద్: యాకత్ పురాలో విషాదం చోటు చేసుకుంది. మేక మేత కోసం అన్నదమ్ములు షాబుద్దీన్, ఫైజాన్‌లు చెట్టెక్కారు. చెట్టు ఆకులు విరిచే ప్రయత్నం చేస్తుండగా ఊహించని దుర్ఘటన ఎదురైంది.

చెట్టుకొమ్మలు విరగడంతో అన్నదమ్ములు షాబుద్దీన్,ఫైజాన్‌లు రైలు పట్టాల మీద పడ్డారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రైన్‌ ఆ ఇద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములిద్దరూ దుర్మరణానికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement