
సాక్షి,హైదరాబాద్: యాకత్ పురాలో విషాదం చోటు చేసుకుంది. మేక మేత కోసం అన్నదమ్ములు షాబుద్దీన్, ఫైజాన్లు చెట్టెక్కారు. చెట్టు ఆకులు విరిచే ప్రయత్నం చేస్తుండగా ఊహించని దుర్ఘటన ఎదురైంది.
చెట్టుకొమ్మలు విరగడంతో అన్నదమ్ములు షాబుద్దీన్,ఫైజాన్లు రైలు పట్టాల మీద పడ్డారు. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రైన్ ఆ ఇద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములిద్దరూ దుర్మరణానికి గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.