goat
-
మటన్ డబ్బులు అడిగారని..
తిరుపతి రూరల్ : మటన్ తీసుకెళ్లి మూడు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు వెళ్లిన దంపతులపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి మల్లంగుంటలో జరిగింది. సీఐ చిన్నగోవిందు కథనం మేరకు.. మల్లంగుంట పంచాయతీ వినాయకనగర్కు చెందిన కేశవులు, హేమలత దంపతులు మటన్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన వినాయక అనే వ్యక్తి మటన్ తీసుకెళ్లి రూ.1200 అప్పు పెట్టాడు. ఈ క్రమంలో కేశవులు, హేమలత దంపతులు సోమవారం రాత్రి వినాయక ఇంటికి వెళ్లి డబ్బులు అడగడంతో ఆగ్రహించిన వినాయక కుమారులు ప్రదీప్, సందీప్, మరో వ్యక్తి కలిసి ఇనుపరాడ్తో దాడి చేశారు. హేమలత మెడలోని 32 గ్రాముల బంగారు చైన్ లాక్కున్నారు. రక్తగాయాలతో పడి ఉన్న బాధితులు స్థానికులు చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. మంగళవారం బాధితుడు కేశవులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
రూ.51 కొట్టు.. మేకను పట్టు..!
చిట్యాల, మర్రిగూడ: దసరా పండగ సమీపిస్తుండటంతో గ్రామాల్లో సందండి నెలకొంటోంది. చిట్యాల, మర్రిగూడ తదితర మండలాల్లో దసరా పండుగ సందర్భంగా యువకులు సరికొత్త స్కీం ప్రారంభించారు. చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో కొందరు యువకులు “51 రూపాయలు కొట్టు.. మేకను పట్టు’ అని ప్రచారం చేస్తున్నారు. ఈ స్కీంలో 51 రూపాయలు చెల్లించి కూపన్ తీసుకుంటే.. కూపన్ల నుంచి డ్రా తీస్తారు. మొదటి బహుమతిగా పన్నెండు కిలోల మేక, రెండో బహుమతిగా రెండు లిక్కర్ బాటిళ్లు, మూడో బహుమతిగా మరో రెండు లిక్కర్ బాటిళ్లు, నాలుగో బహుమతిగా రెండు కడక్నా«థ్ నాటు కోళ్లు, ఐదో బహుమతిగా కాటన్ బీర్లు ఇచ్చేట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వంద రూపాయల స్కీంమర్రిగూడ మండలంలోని లెంకలపల్లి గ్రామంలో మరో తీరుగా ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు చెల్లించి కూపన్ తీసుకున్న వారిలో నుంచి డ్రా తీసి మొదటి బహుమతి 10కిలోల మేక, రెండవ బహుమతి రెండు మద్యం బాటిళ్లు(బ్లెండర్ స్ప్రైడ్), మూడవ బహుమతి కాటన్ బీర్లు, నాలుగవ బహుమతి రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతి ఒక మద్యం బాటిల్ అందించనున్నామని, వచ్చే నెల 10న గ్రామంలో డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. కాగా, ఈ ప్రచారాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. -
తోడేళ్ల హైజంప్ వేట!
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.బహ్రాయిచ్ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు. ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం -
పవన్ కళ్యాణ్ సినిమా OG లో తమిళ్ హీరో విజయ్ ?
-
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
విజయ్ 'ది గోట్' సరైన పాటలు లేవు..అయినా సూపర్ క్రేజ్
-
విజయ్ సినిమాలో ఎంఎస్ ధోని.. ఆ సీన్ చూశారా?
కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రోజో ది గోట్ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం 4 గంటలకే చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు మొదలయ్యాయి. మొదటి షో నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ వస్తోంది. దీంతో థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.అయితే ఈ మూవీలో ఓ సీన్లో భారత మాజీ కెప్టెన్ ధోని కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా కేరింతలు కొడుతూ.. తలా అంటూ నానా హంగామా చేశారు. ఆ సీన్లో ఎంఎంస్ ధోని ఐపీఎల్ బ్యాటింగ్కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. ఈ సీన్తో విజయ్, ధోని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఐపీఎల్లో చెన్నై టీమ్కు మహేంద్ర సింగ్ ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ధోనికి పెద్దఎత్తున వీరాభిమానులు ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో, విలన్ పాత్రల్లో ఆయన మెప్పించనున్నారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్.. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే చివరి చిత్రం కానుంది. #Dhoni cameo 🔥🔥#Kanguva FL 💪💪🔥🔥#Trisha cameo#ThalaAJITH cameo 💥💥#Sivakarthikeyan cameo 🥱#goat#GOATFDFS#TheGreatestOfAllTime#ThalapathyVijay pic.twitter.com/VmYr3UOhOX— pushparaj(🔥🔥 ) (@Pushparaaj_AA) September 5, 2024 -
ది గోట్ని ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు వెంకట్ ప్రభు
‘‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ సినిమా చిత్రీకరణ ఏడాదిలోపే పూర్తయింది. హాలీవుడ్లో అయితే ఈ తరహా సినిమా తీయడానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పట్టేది. ఇది పొలిటికల్ సినిమా కాదు... పొలిటికల్ డైలాగ్స్ లేవు. అలాంటి డైలాగ్స్ పెట్టమని విజయ్ అడగరు’’ అన్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించగా, స్నేహా, ప్రశాంత్, లైలా, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్ను మైత్రీ నిర్మాత రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిలకు అందించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా. అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఏజీఎస్ సంస్థలో నా తొలి సినిమా ఇది. సపోర్ట్ చేసిన నిర్మాత అర్చనగారికి, ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీవారికి ధన్యవాదాలు. ఈ మూవీని ఆడియన్ ్స ఫుల్గా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గోట్’ రిలీజ్ కోసం ఏజీఎస్తో అసోసియేట్ అయిన మైత్రీ మూవీస్వారికి థ్యాంక్స్. మా ‘గోట్’ విజయ్గారు’’ అని వెల్లడించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా కల్పాతి. ‘‘వెంకట్ ప్రభుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ‘ది గోట్’ రాబోతోంది’’ అని పేర్కొన్నారు ప్రశాంత్. మెత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ– ‘‘విజయ్గారి ఫ్యాన్ ్స కోసం ఎర్లీ మార్నింగ్ షోలను ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు వైభవ్, ప్రేమ్ జీ, నటి లైలా, నిర్మాత అర్చనా కల్పాతి, ఈ సినిమా అసోసియేట్ ప్రోడ్యూసర్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో కోసం ఐటెం సాంగ్ త్రిష
-
విజయ్ సినిమాకు 6 వేల థియేటర్లు.. విడుదలకు ముందే లాభాలు
విజయ్ రాజకీయాలకు ది గెటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్) చిత్రానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆ చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గోట్. నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, అజ్మల్, అమీర్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్ అఘోరం, కల్పాత్తి ఎస్ గణేష్, కల్పాత్తి ఎస్. సురేష్ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ కథాచిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సిద్ధార్థ నూని ఛాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 6000కు పైగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. నిర్మాత అర్చన మాట్లాడుతూ ఇది ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన 25వ చిత్రం అని తెలిపారు. అదేవిధంగా విజయ్ హీరోగా ఇంతకు ముందు బిగిల్ చిత్రాన్ని చేసామని, తాజాగా గోట్ ఆయనతో చేసిన రెండవ చిత్రమని చెప్పారు. లేకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందించిన తొలిచిత్రం. ఇది సాంకేతిక పరంగా చాలా బలమైన చిత్రమని పేర్కొన్నారు. గోట్ చిత్రం ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ నిచ్చిందని చెప్పారు. దర్శకుడు వెంకట ప్రభు మాట్లాడుతూ చిత్ర షూటింగ్ను ఇస్తాన్బుల్ లో నిర్వహించాలని వెళ్లామని అయితే అక్కడ షూటింగ్ సాధ్యం కాకపోవడంతో రష్యాలో కొంత భాగం చిత్రీకరించినట్లు చెప్పారు. అదేవిధంగా గోట్ చిత్ర షూటింగ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోనే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. చిత్రంలోని వీఎఫ్ ఎక్స్ సన్నివేశాల కోసం ప్రపంచంలోనే పేరుగాంచిన లోలా సంస్థతో ఒప్పందం చేసుకుని రూపొందించినట్లు చెప్పారు. ఇది అన్ని వర్గాలను అందించే కమర్షియల్ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిపారు. నటుడు విజయ్ రాజకీయాలకు గోట్ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్టాపిక్గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
తైమూర్-అముర్ విచిత్ర స్నేహం : ఈ మిరాకిల్ స్టోరీ వైరల్
పులికి ఆహారంగా మేకను వేస్తే ఏం చేస్తుంది. చంపి తినేస్తుంది కదా. ఇది మన అందరికి తెలిసిందే. కానీ దీనికి భిన్నంగా తనకు ఆహారంగా వచ్చిన మేకతో స్నేహం చేసిన ఘటన విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి ఎక్స్లో సందడి చేస్తోంది.రష్యాలోని ప్రిమోర్స్కీ సఫారీ పార్క్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ క్రూర జంతువులకు వారానికి రెండుసార్లు ప్రాణాలతో ఉన్న జంతువులను ఆహారాన్ని ఇస్తారు. ఇందులో భాగంగానే సైబీరియన్ పులి అమూర్కు, తైమూర్ అనే మేకను రాత్రి భోజనంగా అందించారు. కానీ విచిత్రంగా ఇవి రెండూ స్నేహితులుగా మారిపోయాయి.గతంలో ఇలా చాలాసార్లు పంపించిన మేకలను పులి చంపి తినేసింది ఈ సారి మాత్రం అలా చేయలేదు. తైమూర్, అముర్ విరోధులు కాస్త ఫాస్ట్ స్నేహితులుగా మారిపోవడం మాత్రమే కాదు. కలిసి దోబూచు లాడుకోవడం, కలిసి తినడం, ఆడుకోవడం, మంచులో ఒకర్నొకరు వెంబడించుకోవడం , సరదాగా తలలతో కొట్టుకోవడం లాంటివి చేస్తున్నాయని ఎన్క్లోజర్ కెమెరాల ఆధారంగా పార్క్ అధికారులు ప్రకటించారు.2015లో తైమూర్ , అముర్ విచిత్ర స్నేహం వెలుగు చూడగా ఇపుడు మళ్లీ ఎక్స్లో వైరల్ అవుతోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ట్విటర్ ఖాతా ఈ ఫోటోను షేర్ చేయడంతో 11 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది.Tiger refuses to eat goat who was given to him as live food, instead, they became friends. pic.twitter.com/u6PlxdaKXW— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 21, 2024 ఈ స్నేహం ఎలా జరిగింది?మేకను ఎన్క్లోజర్లోకి విడుదల చేసినప్పుడు అది ఎటువంటి భయాన్ని చూపలేదు. బెదిరిపోలేదు. అది మృత్యు వేటగా భావించలేదు. అలా వ్యవహరించ లేదు. అసలు పులులకు భయపడాలని మేకకు ఎవరూ నేర్పించలేదు అంటూ జూ చీఫ్ డిమిత్రి మెజెంట్సేవ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇవి స్నేహితులుగా మారాయని, ఇది మిరాకిల్ అని పేర్కొన్నారు. -
ఆ చిన్న సిరామిక్ మేక బొమ్మ అన్ని లక్షలా..!
ప్రముఖులు, సెలబ్రెటీలు, ముఖ్యంగా రాజుల కాలం నాటి వస్తువులు వేలంలో అత్యంత ధర పలుకుతాయి. వాటికి చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతలా కళ్లు చెదిరే రేంజ్లో ధర పలుకుతాయి. కొన్ని అరుదైన వజ్రాలు, నగలు, లేదా హస్త కళా నైపుణ్యానికి సంబంధించిన వస్తువులు అత్యంత ఖరీదు అమ్ముడుపోతాయి. కానీ మట్టితో తయారు చేసిన సాధారణ సిరామిక్ మట్టి బొమ్మ వేలంలో ఎంత పలికిందో వింటే కంగుతింటారు. 55 ఏళ్ల రేమండ్ పాటెన్ అనే వ్యక్తి వద్ద ఏళ్లుగా ఉన్న రాజవంశీకులకు సంబంధించిన సిరామిక్ మట్టి మేక బొమ్మ వేలంలో కనివినీ ఎరుగని రీతీలో రూ. 9 లక్షలకు పలిగింది. జస్ట్ మట్టి బొమ్మే కదా..!అన్ని లక్షలా అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ బొమ్మను కింగ్ చార్లెస్ స్వహస్తాలతో తయారు చేసిన మట్టి మేక బొమ్మ అది. ఆ బొమ్మను 21వ పుట్టిన రోజున తన ఆంటీ ఇచ్చిందని చెప్పాడు రేమండ్.ఆమె ఈ బొమ్మను ప్రిన్స్ చార్లెస్ తయారు చేశారని చెప్పడంతో ఇప్పటి వరకు దాన్ని అత్యంత భద్రంగా కాపాడుకుంటూ వచ్చానని అన్నారు. 1960లలో ఆమె క్వీన్స్ కాలేజ్లో కుక్గా పనిచేస్తుండేదని, ఆ టైంలో ప్రిన్స్ తన కాలేజ్కి రావడం తన ఆంటీ ఎంతో గర్వంగా భావించేదని చెప్పకొచ్చాడు రేమాండ్. ఆమె ఆ కేంబ్రిడ్జ్లోని 37 నార్ఫోక్ టెర్రేస్లో నివశించేది. ఆమె తన తాతయ్య చెల్లెలని, జీవితాంతం పెళ్లే చేసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆమె తన జీవితమంతా రాజకుటుంబ సభ్యలుకు సేవ చేస్తూ గడిపిందని, ముఖ్యంగా రాణిగారి తల్లికి వంటచేసేదని రేమాండ్ చెప్పారు. ఈ చారిత్రక ప్రాముఖ్యత కలిగన మేక విలువైన ప్రదేశంలో ఉండటం మంచిదని ఇలా వేలంలో ఉంచినట్లు అతను చెప్పుకొచ్చారు. ఇలానే గతేడాది హాన్సన్స్ వేలం పాటలో చార్లెస్ ఐదేళ్ల వయసులో గీసిన తన తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్II, ది డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ల చిత్రాలు కూడా ఇలానే ఏకంగా రూ. 63 లక్షలు పలికడం విశేషం.(చదవండి: పోలాండ్లోని రహదారులకు, స్కూళ్లకు భారతీయ రాజు పేరు ఎందుకు పెట్టారో తెలుసా..!) -
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్తో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్లో సింగిల్ సాంగ్తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్స్టార్ అజిత్తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను
సౌదీలో రెండేళ్ల పాటు 700 గొర్రెలను ఒంటరిగా మేపాడు. మరో మనిషితో మాట్లాడలేదు. మరో మాట వినలేదు. ఇసుకతో స్నానం ఇసుకే దాహం ఇసుక తప్ప మరేం కనిపించని ఒంటరితనం. బానిస బతుకు. కాని బతికి దేశం తిరిగి వచ్చాడు. 1995లో అతని జీవితం నవలగా వెలువడి మలయాళంలో సెన్సేషన్ సృష్టించింది. ప్రస్తుతం 138వ ప్రచురణకు వచ్చింది. అతని జీవితం ఆధారంగానే ‘గోట్ లైఫ్’ సినిమా తాజాగా విడుదలైంది. కేరళకు చెందిన నజీబ్ సంఘర్షణ ఇది. కేరళలోని అలెప్పి దగ్గరి చిన్న ఊరికి చెందిన నజీబ్ కోరుకుంది ఒక్కటే. సౌదీకి వెళ్లి ఏదో ఒక పని చేసి కుటుంబానికి నాలుగు డబ్బులు పంపాలన్నదే. ఆ రోజుల్లో కేరళ నుంచే కాదు దక్షిణాది రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు చాలామంది పని కోసం వలస వెళ్లేవారు. నజీబ్ కూడా సౌదీకి వెళ్లాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి ఒక మాల్లో సేల్స్మ్యాన్గా పని ఉంటుందని పంపాడు. అలా నజీబ్ సౌదీలో అడుగు పెట్టాడు. అది 1993వ సంవత్సరం. రెండు రోజుల తర్వాత ఎయిర్పోర్ట్లో దిగాక నజీబ్ రెండు రోజుల పాటు ప్రయాణిస్తూనే ఉన్నాడు... అప్పుడు గాని అర్థం కాలేదు తాను మోసపోయానని. ఎడారి లోపల అతణ్ణి అరబ్ షేక్కు అప్పజె΄్పారు. ఆ షేక్ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్కు 700 గొర్రెలను కాచే పని అప్పజె΄్పాడు. వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు. బతకడానికి మాత్రం ముతక రొట్టెలు పడేసేవాడు. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడు నజీబ్. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్కు కనిపించేవారు. వారి అరబిక్ భాష తప్ప మరో భాష వినలేదు. మరో మనిషిని చూడలేదు. ‘నేను ఏడ్చినప్పుడల్లా వారు కొట్టేవారు’ అంటాడు నజీబ్. భ్రాంతులు నజీబ్కు ఎడారిలో ఉండి భ్రాంతులు మొదలయ్యాయి. అతడు గొర్రెల మధ్య ఉండి ఉండి తాను కూడా ఒక గొర్రెనేమో అనుకునేవాడు. రెండేళ్ల పాటు ఇలాగే జరిగింది. ఒకరోజు ఆ అన్నదమ్ములిద్దరూ పెళ్లి ఉందని వెళ్లారు. ఆ అదను కోసమే చూస్తున్న నజీబ్ ఎడారిలో పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారి లేదు.. గమ్యమూ తెలియదు. పరిగెట్టడమే. ఒకటిన్నర రోజు తర్వాత మరో మలయాళి కనిపించి దారి చె΄్పాడు. అతడు కూడా తనలాంటి పరిస్థితిలో ఉన్నవాడే. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్ చేరాడు. అక్కడి మలయాళీలు నజీబ్ను కాపాడారు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోతే తగిన పత్రాలు లేనందున 10 రోజులు జైల్లో పెట్టి ఇండియా పంపారు. నవల సినిమాగా నజీబ్ తిరిగి వచ్చాక కోలుకొని బెహ్రయిన్ వెళ్లాడు ఈసారి పనికి. అక్కడ పని చేస్తున్న రచయిత బెన్యమిన్కు నజీబ్తో పరిచయమైంది. నజీబ్ జీవితాన్ని బెన్యమిన్ నవలగా ‘ఆడు జీవితం’ (గొర్రె బతుకు) పేరుతో రాసి 2008లో వెలువరించాడు. అది సంచలనంగా మారింది. ఇప్పటికి వందకు పైగా ఎడిషన్స్ వచ్చాయి. 8 భాషల్లో అనువాదమైంది. ఆ నవల ్రపాశస్త్యం సినిమా రంగాన్ని ఆకర్షించింది. మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ పేరుతో నటించి మొన్న మార్చి 28న విడుదల చేశాడు. తెలుగులో గోట్లైఫ్ పేరుతో అనువాదమైంది. వాస్తవిక సినిమాగా ఇప్పటికే గోట్లైఫ్ ప్రశంసలు పొందుతోంది. -
ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే అదృష్టవంతులే: మీనాక్షి చౌదరి
టాలీవుడ్లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షిచౌదరి కోలీవుడ్లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలుగులో మహేష్బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుని మరింత పాపులర్ అయింది. పొంగల్ రేసులో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మధ్య మొదట మిశ్రమ స్పందన తెచ్చుకున్నా తర్వాత పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రూ. 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తమిళంలో ఈమె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విజయ్కు జంటగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైం. నటి స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, యోగిబాబు, అజ్మల్, అమీర్, వైభవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో విజయ్ సరసన నటించే అవకాశం రావడం గురించి మీనాక్షి చౌదరి తన ఆనందాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విజయ్ సరసన నటిస్తున్నట్లు తెలియగానే ఆనందంతో తనగుండె ఆగిపోయేలా అనిపించిందన్నారు. విజయ్ జంటగా నటించే అవకాశం ఎవరికీ అంత సులభంగా రాదన్నారు. అలాంటి అవకాశం లభిస్తే వారు అదృష్టవంతులేనని పేర్కొన్నారు. అలాంటి అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అయితే షూటింగ్ స్పాట్లో విజయ్ తనతో ప్రవర్తించిన విధానం మాటల్లో వర్ణించలేనన్నారు. తాను ఆయన వీరాభిమానిని అని మీనాక్షి చౌదరి పేర్కొన్నారు. ఈ బ్యూటీ తమిళంలో ఆర్జే బాలాజి సరసన నటించిన సింగపూర్ సెలూన్ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. -
ఈ మేక ధర.. కేకో కేక
అంబాజీపేట: ఒళ్లంతా విపరీతంగా పెరిగిపోయిన ఊలుతో కనిపిస్తున్న దీనిని పొట్టేలు అనుకునేరు! ఇదో మేక.. అలాగని ఇది ఆషామాషీ మేక కాదు.. దీని రేటు వింటే కళ్లు తేలవేయడం ఖాయం. మామూలుగా మన దేశవాళీ మేక ఖరీదు మహా అయితే ఓ ఇరవై వేల రూపాయలుంటుంది. కానీ ఈ మేక రేటు ఏకంగా ఒకటిన్నర లక్షలు. ‘చిగు’ జాతికి చెందిన ఈ మేకలు హిమాలయ పర్వత ప్రదేశాల్లో ఉత్తర ప్రదేశ్కు ఉత్తరంగా, హిమాచల్ ప్రదేశ్కు ఈశాన్యంగా లభిస్తూంటాయి. ఎక్కువగా తెలుపు రంగులో, వంపులు తిరిగిన పెద్ద పెద్ద కొమ్ములు కలిగి, సుమారు 50 కేజీల బరువు ఉంటాయి. హిమాలయాల్లో చలి ఎక్కువగా ఉండటంతో వీటి శరీరంపై ఊలు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనిని శాలువాల తయారీకి వినియోగిస్తారు. అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన అడబాల వెంకటేశ్వరరావుకు పశు పోషణ అంటే ఎంతో ఇష్టం. పుంగనూరు ఆవులు, గిత్తలు, విభిన్నంగా ఉండే మేకలు, చెవుల పిల్లుల వంటి వాటిని పెంచుతూ కొన్నాళ్ల తర్వాత లాభానికి విక్రయిస్తూంటారు. ఆయన ఈ మేకను నేపాల్లో రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. మాచవరంలో జరిగిన పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గాలి గోపురం, ఇతర ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెంకటేశ్వరరావు వద్ద ఉన్న పుంగనూరు ఆవు, దూడను తీసుకువచ్చారు. వీటితో పాటు ఆయన ఈ ‘చిగు’ జాతి మేకను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వింతగా ఉన్న ఈ మేకను పలువురు ఆసక్తిగా తిలకించారు. -
పాకిస్తాన్ జాతీయ జంతువు ఏది? ఏ విషప్రాణులను మింగుతుంది?
మార్ఖోర్ అనేది అడవి మేక. ఇది హిమాలయ ప్రాంతాలలో కనిపిస్తుంది. దీనికి సంబంధించి చాలా కథలు వినిపిస్తాయి. ఇది పాములకు తొలి శత్రువు అని చెబుతారు. పాములు ఎక్కడున్నాయో కనిపెట్టి, వాటిని చంపి, నమిలి మింగేస్తుందని చెబుతారు. పాకిస్తానీ గూఢచార సంస్థ ఐఎస్ఐ చిహ్నంలో మార్ఖోర్ కనిపిస్తుంది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు. మార్ఖోర్ అనేది పర్షియన్ పదం. దీని అర్థం పాములను తినేది లేదా పాములను చంపేది. ఈ జంతువు తన వాడి అయిన కొమ్ములతో పాములను చంపి, వాటిని తినగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని స్థానిక జానపద కథలు చెబుతున్నాయి. పాముకాటు నుండి విషాన్ని తొలగించడంలోనూ మార్ఖోర్ సహాయపడుతుందని కూడా చెబుతారు. అయితే మార్ఖోర్.. పాములను తిన్నట్లు లేదా వాటి కొమ్ములతో పాములను చంపినట్లు ఆధారాలు ఎక్కడా కనిపించవు. అయితే పాకిస్తాన్ ప్రజలు మార్ఖోర్లు ఉండే చోట పాములు కనిపించవని నమ్ముతారు. ప్రస్తుతం మనకు సాధారణంగా మేక.. మార్ఖోర్ నుండి ఉద్భవించి ఉండవచ్చని చార్లెస్ డార్విన్ ఊహించాడు. మార్ఖోర్ చాలా శక్తివంతమైనది. 6 అడుగుల పొడవు, 240 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. దీనికి దవడ నుండి కడుపు దిగువ వరకు విస్తరించిన దట్టమైన గడ్డం ఉంటుంది. మార్ఖోర్లు ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి టర్కిస్తాన్ వరకు 2,000 నుండి 11,800 అడుగుల ఎత్తయిన పర్వతాలలో నివాసం ఉంటాయి. ఇవి ప్రధానంగా శాఖాహారులు. ఇవి సాధారణంగా గుంపులుగా జీవిస్తాయి. ఒక మందలోని మార్ఖోర్ల సగటు సంఖ్య దాదాపు 9గా ఉంటుంది. కాగా వేట కారణంగా మార్ఖోర్ల జనాభా తగ్గుతోంది. వాటి ప్రత్యేకమైన కొమ్ముల కోసం వేటగాళ్లు మార్ఖోర్లను వేటాడుతారు. ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్ భవితవ్యం -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
మందమర్రిలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు
మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు చేసుకుంది. మేకను దొంగతనం చేశారనే నెపంతో ఎస్సీ యువకుడితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు. మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో పశువుల కాపరి తేజ, ఎస్సీ యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలక్రిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మాస్ గోట్గా సుడిగాలి సుధీర్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రం ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). దివ్య భారతి హీరోయిన్. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం గ్లింప్స్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో ఒక చేత్తో క్రికెట్ బ్యాట్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ లుక్లో కనిపించారు సుధీర్. ‘‘మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం మైల్స్టోన్గా నిలుస్తుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి’’ అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, కెమెరా: బాలాజీ సుబ్రహ్మణ్యం. -
మూడు కాళ్ళ మేక
-
కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!
ప్రస్తుతం చాలా మంది చేతులు, తుంటి, వెన్నెముక, మోకాళ్లు, కీళ్లలో నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు, వాపుల సమస్యల బారిన పడుతున్నారు. వ్యాయామాలు చేయడం కారణంగా ఈ నొప్పులు తీవ్ర తరమవుతున్నాయి. ఎలాంటి ఆహారాలు తీసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందో తెలుసుకుందాం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్నట్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఉ కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది. ఎక్కువగా వినియోగించడం వల్ల కీళ్లనొప్పుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. బెర్రీలు బ్లబెర్రీస్, బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ప్రతిరోజు తినడం కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెర్రీల వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కూరగాయలు సల్ఫోరాఫేన్ కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా సులభంగా యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బ్రోకలీ, కాలీఫ్లవర్లను ఆహారంలో తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కీళ్ల నొప్పులున్నవారు ఆలివ్ ఆయిల్ను వినియోగించి తయారు చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మార డంతోపాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. డార్క్ చాక్లెట్ ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారు రోజూ వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..!
మనిషికి చావు అనేది అత్యంత విచిత్ర పరిస్థితుల్లో సంభవిస్తుంటుంది. చావును ఎవరూ ముందుగా ఊహించలేరు. ఛత్తీస్గఢ్లోని సూరజ్పూర్ జిల్లాలోని ఖోపాధామ్లో ఒక వ్యక్తి మేకలను బలిచ్చాడు. తరువాత ఆ మేక మాంసంతో వంటకాలు చేయించి అందరికీ వడ్డించి, తానూ తిన్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ వ్యక్తి అనారోగ్యం పాలయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని మృతికి కారణం ఏమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఊహకందని విధంగా.. మేక కన్ను మనిషి ప్రాణాలను తీస్తుందని ఎవరైనా ఊహించగలరా? అయితే ఇది నిజంగానే జరిగింది. సూరజ్పూర్లో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది. మేక కన్ను తిన్న వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఆలయంలో మేకలను బలి ఇచ్చిన తరువాత వాటి మాంసంతో వంటలు చేయించాడు. అతను ఆ వంటకాలలోని మేక కన్నును తిన్నాడు. అయితే అది అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారి, ప్రాణాలు వదిలాడు. జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఈ ఘటన సూరజ్పూర్ జిల్లాలోని మదన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 50 ఏళ్ల బగార్ రాయ్ తన స్నేహితులతోపాటు ప్రముఖ ఖోపాథామ్కు వెళ్లాడు. తన కోరిక నెరవేరిన నేపధ్యంలో అతను అక్కడికి వెళ్లాడు. అక్కడ పూజలు నిర్వహించిన తరువాత మేకలను బలి ఇచ్చి, ఆ మాంసంతో వంటకాలు చేయించాడు. తరువాత వాటిని గ్రామస్తులకు వడ్డించాడు. ఈ నేపధ్యంలో అతను మేక మాసంలోని దాని కన్నును తిన్నాడు. అయితే ఆ కన్ను అతని గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడ్డాడు. గ్రామస్తులు అతన్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పరుగుపరుగున ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణం వారి రోదనలతో నిండిపోయింది. ఇది కూడా చదవండి: ప్రియురాలి కోసం భార్య ముక్కు తెగ్గోసి, జేబులో వేసుకుని.. -
బక్రీద్ వేళ మేకలను ఇంటికి తెచ్చాడని.. అపార్ట్మెంట్వాసుల ఆందోళన..
ముంబయి: బక్రీద్ పండగ వేళ మేకలను అపార్ట్మెంట్కు తీసుకురావడంపై నిర్వాసితులు నిరసన చేపట్టారు. ముంబయిలోని భయందర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మేకలను అపార్ట్మెంట్కు తీసుకురాకూడదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. బక్రీద్ పండగ వేళ ఎవరూ మేకలను అపార్ట్మెంట్కు తీసుకురాకూడదని రెసిడెన్షియల్ సొసైటీ నిర్ణయించింది. దీంతో బిల్డర్ కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అందరికీ విన్నవించారు. కానీ అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మేకను ఇంటికి తీసుకువచ్చాడు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన నిర్వహించారు. మేకలను ఇంట్లోకి తీసుకురావద్దు.. అపార్ట్మెంట్లో మేకలను వధించవద్దని నినాదాలు చేపట్టారు. Uproar over goats in Mumbai Housing Society. (@pankajcreates)#Mumbai #News #ITVideo #FirstUp pic.twitter.com/ScHHzMsRIz — IndiaToday (@IndiaToday) June 28, 2023 దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందు మేకలను ఇంట్లో ఉంచుకుంటారని.. అపార్ట్మెంట్లో వధించబోరని పోలీసులు తెలిపారు. చివరికి మేకలను అపార్ట్మెంట్లో నుంచి బయటకు పంపడంతో అంతా సద్దుమణిగింది. ఇదీ చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో.. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. బతకడానికి దొంగతనాలకు, దోపిడీలకు సైతం తెగపడుతున్నారు అక్కడి జనాలు. ఈ క్రమంలో బక్రీద్ వేళ మేకలు, గొర్రెల దొంగతనాలు పెరిగిపోవడం.. అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో తెలియజేస్తోంది. జూన్ 29న బక్రీద్ కాగా.. పాక్ లో మేకలు, గొర్రెల వంటి జీవాలకు రక్షణ లేకుండా పోయింది. బక్రీద్ సమయంలో జంతువులను బలి ఇవ్వడం సంప్రదాయం. అయితే మేకలు, గొర్రెల ధరలు అక్కడ ఆకాశాన్నంటుతుండడంతో.. చాలామంది దొంగతనాలకు మొగ్గుచూపుతున్నారు. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనూ ఈ కేసులు అడ్డగోలుగా నమోదు అయ్యాయట. గత ఐదు నెలలుగా అక్కడ మూడు నెల కేసులు నమోదు అయ్యాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధ్ సిటిజన్స్ పోలీస్ కమిటీ ఈ మేరకు ఓ నివేదికను రూపొందించింది కూడా. క్వెట్టాలోనూ ఈ తరహా కేసులు చాలానే నమోదు అయ్యాయి. మేతకు వెళ్లిన మంద నుంచి.. రిస్క్ చేసి వాహనాలపై తీసుకెళ్తున్నవాటిని.. ఆఖరికి దుకాణాలు పగలకొట్టి మరీ మూగజీవాలను ఎత్తుకెళ్తున్నారు. అంతేకాదు మందతో అమ్మడానికి వెళ్తున్న వాళ్లను సైతం బెదిరించి దొపిడీలకు పాల్పడుతున్నారట. కొన్నిరోజుల కిందట లారీలో మేకలు తీసుకువెళుతుండగా, ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి లారీడ్రైవర్ ను తుపాకీతో బెదిరించి మేకలను ఎత్తుకెళ్లారు. అలాగే.. ట్రాలీలోకి ఎక్కేసి మరీ చోరీలకు పాల్పడుతున్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేశారు. Goat🐐 kidnapp!ng in "film style" in Pakistan😂😂 pic.twitter.com/5ZytmCi9sp — Bharat Ojha🗨 (@Bharatojha03) June 25, 2023 ఇదీ చదవండి: కొత్త చట్టంతో పాక్లో అడుగుపెట్టబోతున్నాడు! -
ఎన్టీఆర్ ఫ్యాన్స్పై కేసు నమోదు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు. (ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్) ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్సన్పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్లుక్, టైటిల్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) -
మందు తాగే మేక.. రోజూ మద్యం కోసం యాజమాని వద్ద నిలబడి
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది. దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
అట్లుంటది మరి.. రూ.6 లక్షల మేకపోతు!
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మేకపోతు బరువు 110 కిలోలు, వయసు 3 ఏళ్లు. నల్లమచ్చ లేని ఈ జమునాపారి మేకపోతు రాజస్తాన్కు చెందినది. శంకర్ కిచర్ అనే రైతు పెంచుతున్న దీని విలువ అక్షరాలా రూ. 6 లక్షలు! ఉత్తరప్రదేశ్లోని మథుర సమీపంలో ఉన్న నేషనల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ గోట్స్ (ఎన్ఎస్ఐఎఫ్ఆర్జీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషనల్ గోట్ ఫెయిర్ అండ్ ఎగ్జిబిషన్’లో బరువు విభాగంలో ఈ మేకపోతు ప్రథమ బహుమతి పొందింది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి గొర్రె, మేకపోతులు ఈ ప్రదర్శనకు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా ‘ఇండస్ట్రీ సైంటిస్ట్ ఫార్మర్స్ ఇంటర్ఫేస్’ పేరిట నిర్వహించిన ఒకరోజు సదస్సుకు రాష్ట్రం నుంచి పలువురు గోట్ఫామ్స్ యజమానులు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలో జీవాల సంపద పెరిగినందున వాటిపై పరిశోధనల కోసం జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పేర్కొన్నారు. -
Viral Video: గొర్రెపై పాము సవారీ.. పరుపు అనుకొని సేదతీరుతుందేమో!
-
నన్ను GOAT అని పిలవకండి.. ఆ ఇద్దరే అందుకు అర్హులు: విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. క్రీడాభిమానులు తనను GOAT (Greatest Of All Time) అని సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పేరు ముందు అంత పెద్ద ట్యాగ్ను తగిలించవద్దని విజ్ఞప్తి చేశాడు. తాను ఆ బిరుదుకు అర్హున్ని కాదని ఖరాఖండిగా చెప్పాడు. నా అభిమానులైనా సరే నన్ను GOAT అని పిలిస్తే అంగీకరించనని, అలా పిలుపించుకునే అర్హత ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని తెలిపాడు. ఆ ఇద్దరు తాను అమితంగా ఆరాధించే దిగ్గజ ప్లేయర్లు వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ అని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్-2022లో పాక్పై ఆడిన చారిత్రక ఇన్నింగ్స్ అనంతరం సోషల్మీడియాలో విరాట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విరాట్ ఈ మేరకు స్పందించాడు. కాగా, గత ఆదివారం (అక్టోబర్ 23) పాక్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి పొట్టి క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్కప్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ బాది కెరీర్ బెస్ట్ ఫామ్లో కొనసాగున్నాడు. పాక్పై 82 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లి.. ఇవాళ (అక్టోబర్ 27) నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లోనూ 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దాదాపు 1000 రోజుల తర్వాత పూర్వవైభవాన్ని సాధించిన కింగ్ కోహ్లి.. ఆతర్వాత వెనుదిరిగి చూడట్లేదు. రన్మెషీన్, కింగ్ కోహ్లి, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ బిరుదులకు వంద శాతం అర్హుడినని రుజువు చేసుకుంటున్నాడు. -
శివుడి ఎదుట మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్న మేక.. ఏం కోరుకుందో ఏమో?
జంతువులు దేవుళ్లను ప్రార్థించడం ఇప్పటికే కొన్ని సందర్భాల్లో చూసే ఉంటాము. కాగా, తాజాగా ఓ మేక అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శివుడి గర్భగుడి ముందు ఓ మేక మొకాళ్ల మీద నిలబడి ప్రార్ధనలు చేసింది. దీంతో, మేకకు చూసిన భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియోలు తీశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్న ఆనందేశ్వర్ మందిరంలో ఉన్న శివుడు గర్భగుడి ముందు ఓ మేక తన మొకాళ్ళ మీద మోకరిల్లి దేవుడికి ప్రార్థనలు చేసింది. గుడిలో ఉన్న భక్తులతో కలిసి ప్రార్థనలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. कानपुर के आनंदेश्वर मंदिर में बकरे का अनोखा अंदाज, बाबा को झुक-झुककर किया प्रणाम, श्रद्धालुओं की तरह टेका माथा#kanpur #Kanpurnews #Anandeshwarmandir #Hinduism #kanpurtemple #Uniquevideo pic.twitter.com/AjPTuqfMxF — Journalist Prabhat Kashyap (@Prabhat_1090) October 9, 2022 -
మేకపోతు తెచ్చిన ఉపద్రవం!.. వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ..
చౌడేపల్లె: బలి ఇవ్వడానికి తెచ్చిన మేకపోతు లిప్తపాటులో ఉడాయించించి ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. దానిని పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పిన ఆ యువకుడు ఏకంగా వంద మీటర్ల లోయలోకి జారి పడ్డాడు. దీంతో మేకపోతు సంగతి పక్కనబెట్టి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నాల్లో పడ్డారు. ఐదు గంటలకు పైగా శ్రమించి తాళ్ల సాయంతో అతడిని పోలీసులు, ఫైర్ సిబ్బంది వెలికితీశారు. బోయకొండలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ రవికుమార్ కథనం.. తిరుపతిలోని సప్తగిరినగర్కు చెందిన ఎన్.కుమార్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో మంగళవారం బోయకొండ గంగమ్మకు మొక్కులు చెల్లించడానికి వచ్చారు. అమ్మవారికి పూజలు చేసి జంతుబలి సమర్పించడానికి ఉదయం 11 గంటల ప్రాంతంలో మేకపోతును తీసుకొని ఆలయం వద్దకు వచ్చారు. బలి ఇవ్వబోతున్న క్షణంలో అది ఒక్కసారిగా విదిల్చుకుని ఉడాయించింది. అటవీ ప్రాంతం వైపు పరుగులు తీసింది. దానిని కుమార్ కుమారుడు గణేష్(19)తోపాటు బోయకొండలో మటన్ కత్తిరించే కూలీ మంజు(28) వెంబడించారు. అది పరుగులు తీస్తూ సరాసరి చిత్తారికోట సమీపంలోని లోయ వద్ద ఏటవాలుగా ఉన్న బండపై ఆగింది. దానినే అనుసరిస్తూ వెళ్లిన గణేష్ మేకపోతును పట్టుకునే ప్రయత్నంలో అదుపు తప్పాడు. అక్కడి నుంచి వంద మీటర్ల లోయలోకి పల్టీలు కొడుతూ పడిపోయాడు. ఇది గమనించి మంజు ఎస్ఐకు సమాచారం ఇచ్చారు. ఆలయం వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ తాళ్ల సహాయంతో చాకచక్యంగా లోయలోకి దిగి గణేష్ వద్దకు చేరాడు. గాయాల పాలై షాక్లో ఉన్న అతడిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నీళ్లు తాగించారు. ఇంతలో పుంగనూరు నుంచి ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తాళ్ల సాయంతో లోయలోకి దిగారు. గణేష్ను లోయలోంచి వెలికి తీశారు. అప్పటికే సాయంత్రమైంది. ప్రభుత్వ వైద్య కేంద్రంలో గణేష్కు ప్రథమ చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితుడిని ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ పరామర్శించారు. అమ్మవారి మహిమ వలనే తమ బిడ్డ ప్రాణాలతో బయటపడ్డాడని బాధితుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అప్పటికే మిగతా వాళ్లు ఆ మేకపోతును పట్టుకున్నారు. ఇక తప్పించుకునే అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. ఆలయం వద్ద మేకపోతు కథ ముగించి తిరుపతికి బయల్దేరారు. -
పంది పిల్లకు పాలిచ్చిన మేక
ద్వారకాతిరుమల: వరాహం పిల్లకు పాలిచ్చి ఓ మేక దాని ఆకలిని తీర్చింది. ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచల కొండపైన పవర్స్టేషన్ ప్రాంతంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది. దొరసానిపాడుకు చెందిన ఒక కాపరి తన మేకలను కొండపైన మేపుతోంది. అందులో ఓ మేక చుట్టూ కొద్ది రోజులుగా వరాహం పిల్ల తిరుగుతోంది. ఆకలిగా ఉందో ఏమో.. ఆ వరాహం పిల్ల మేక పాలను తాగింది. మేక సైతం కదలకుండా వరాహం పిల్లకు పాలివ్వడాన్ని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
Viral Video: చచ్చాన్రా బాబోయ్! విందు మాట దేవుడెరుగు.. బతికుంటే చాలు
పక్షి జాతుల్లో డేగలది ప్రత్యేక స్థానం. పక్షులన్నీ క్రిమి, కీటకాలను భోంచేస్తే.. అవి మాత్రం ఏకంగా జంతువులపై వేట సాగిస్తాయి. ఒక్కసారి వాటి బలమైన కాళ్లకు దొరికాయా ఇక అంతే! అంతెత్తున గాల్లో తిరుగుతూ నేలపై ఉన్నవాటిని గురిచూసికొట్టే వాటి వేగానికి వేట ఖాయమవాల్సిందే. తాజాగా ఓ డేగ వేటకు సంబంధించిన 57 సెకండ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే, ఈసారి డేగ ఆటలు సాగలేదు. దాని బలమైన పంజా నుంచి కొండ మేక తప్పించుకున్న తీరు భలేగా ఉంది. వీడియో ప్రకారం.. మాంచి ఆకలిమీదున్న ఓ భారీ డేగ కొండ మేకపై కన్నేసింది. అంతెత్తు నుంచి అమాంతం దానిపైబడి తన పదునైన కాళ్లతో ఒడిసి పట్టింది. ఇంకొంచెమైతే అది మేకను నోట కరిచి ఉడాయించేదే! అయితే, అక్కడే మేకకు ఓ మెరుపులాంటి ఆలోచన తట్టింది. ప్రాణాలు దక్కిచుకునేందుకు శక్తినంతా కూడదీసుకుని పరుగు లంకించుకుంది. అయినప్పటికీ డేగ తన పట్టు విడువలేదు. మేక మరింత తెలివిగా దారిలో దొర్లుకుంటూ పోయింది. రెండు జీవాలు అలా బండరాళ్లపై రాసుకుంటూ కొంత దూరం వెళ్లాయి. అయినా లాభం లేకపోవడంతో ఈసారి మేక బండరాళ్లకు బలంగా రాసుకుంటూ పోయింది. అలా కొద్దిదూరం వెళ్లగానే రాళ్ల దెబ్బలకు డేగ వెనక్కి తగ్గకతప్పలేదు. తిండి మాట దేవుడెరుగు ఒళ్లు హూనమైందిరో బాబోయ్ అంటూ అది తన ఉడుం పట్టు విడిచింది. ఇక ఈ భీకర పోరు జరుగుతున్న సమయంలో ఆ కొండ మేక తోడుగా మరో మేక కూడా ఉండటం విశేషం. తన మిత్రుడికి ఎప్పుడేం సాయం అవసరమవుతుందో అని అది వాటి చుట్టే పరుగులు పెట్టింది. (చదవండి: ముంబైలో ఒక్కసారిగా కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం) సింహం కన్నా బలమైన పట్టు ఎంతో బరువైన జంతువులపై దాడిచేసి అలవోకగా లేవదీసుకుపోయే డేగ పట్టు సింహం కన్నా బలమైనదట. ఒక చదరపు అంగుళానికి సుమారు 340 కిలోల పట్టు బలం దీని సొంతం. సాధారణంగా ఇవి మూడున్నర ఫీట్ల వెడల్పుంటాయి. వీటి రెక్కలు 9 ఫీట్ల పొడవు ఉంటాయి. అంతటి బలమైన పక్షిబారి నుంచి తప్పిచుకోవడంమంటే మామూలు విషయం కాదు. (చదవండి: ముంబో జంబో.. అంటే అర్థం తెలుసా? ఈ ఆర్ట్ను చూస్తే..) -
చచ్చాన్రా బాబోయ్! విందు మాట దేవుడెరుగు.. బతికుంటే చాలు
-
పాలు ఇస్తున్న మేకపోతు
యశవంతపుర: మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రం హావేరి జిల్లా హనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో జరిగింది. చమన్ షావలి అనే గ్రామస్తుడు ఒక మేక పోతును సాకుతున్నారు. ఏడాదిన్నర వయస్సు ఉన్న ఈ మేకపోతు కొద్దిరోజులుగా పాలు ఇస్తోందని చెప్పాడు. చుట్టుపక్కలవారు మొదట నమ్మలేదు. దీంతో వారి ముందే పాలు పితకడంతో చూసినవారు ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. (చదవండి: కొడుకు పుట్టాడన్న సంతోషం.. అదే రోజు రాత్రి స్వీట్లు తీసుకొని..) -
జాతక దోషం.. మేకతో వివాహం
నూజివీడు(కృష్ణా జిల్లా): జాతక దోష నివారణ కోసమంటూ నూజివీడుకు చెందిన ఒక యువకుడు మేకను వివాహం చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆ యువకుడికి జన్మజాతక రీత్యా రెండు వివాహాలు జరుగుతాయని ఉంది. దీంతో దోష నివారణ నిమిత్తం పట్టణ పరిధిలోని విస్సన్నపేట రోడ్డులో ఉన్న నవగ్రహ ఆలయ ఆవరణలో అర్చకులు ఆ యువకుడితో మేకకు తాళి కట్టించి వివాహం జరిపించారు. ఈ తంతులో యువకుడు, అతని తల్లిదండ్రులు, అర్చకుడు మాత్రమే పాల్గొన్నారు. -
కవాసాకి రోబో మేక.. బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట!
ఈ చిత్రం చూశారా? చిన్న పిల్లలు ఎక్కి ఆడుకునే కొయ్యగుర్రంలా కనిపిస్తోంది కదూ..! కానీ ఇదో రోబో మేక. జపనీస్ టెక్ దిగ్గజం కవాసాకి తయారు చేసిన ఈ మేక మీద మీరూ ప్రయాణించొచ్చు. దాని విశేషాలేంటో తెలుసుకుందామా! కృత్రిమ మేథ నానాటికీ పురోగతి చెందుతోంది. మొదట మానవ రూపంలో రోబోలు, యంత్రాలను తయారు చేశారు. ఆ తరువాత జంతువులను పోలిన రోబోలు కూడా వచ్చాయి. ఇటీవల టోక్యోలో జరిగిన అంతర్జాతీయ రోబో ఎగ్జిబిషన్లో అద్భుతమైన ఆవిష్కరణలున్నాయి. కానీ అందరి దృష్టినీ ఆకర్షించింది మాత్రం ఈ రోబోమేక బెక్స్. దీని తయారీ కోసం కవాసాకి. యూరప్, ఆసియా, అఫ్రికా ప్రాంతాల్లోని అడవిమేక ఐబెక్స్ను స్ఫూర్తిగా తీసుకున్నది. పర్వత ప్రాంతాల్లో సులభంగా తిరిగే ఈ మేక బరువులనూ సునాయాసంగా మోయగలదు. ఎత్తులను ఎక్కడంలో, వాలు ప్రాంతాలను చాకచక్యంగా దిగడంలో దిట్ట. ఐబెక్స్ మేకకున్న అన్ని విశేషాలను ఈ రోబోమేకకు యాడ్ చేశారు తయారీ దారులు. ఐబెక్స్ అతి చురుకైనది. మన బెక్స్ మాత్రం అంత చురుకుగా కదలలేదు. కానీ సాధారణ మేక కంటే బలమైనది. మైదాన ప్రాంతంలో మోకాళ్లపై వేగంగా వెళ్లగలుగుతుంది. మోకాళ్లలో ఏర్పాటు చేసిన చక్రాలు అందుకు ఉపయోగపడతాయి. ఎత్తుపల్లాల్లో తన పొడవైన కాళ్లతో ఈజీగా ఎక్కగలుగుతుంది. ఇది కదులుతున్నప్పుడు పొడవైన మెడ, కొమ్ములు వెలుగుతూ ఉంటాయి. బెక్స్ 100 కిలోల బరువును మోయగలదు. మనుషులతోపాటు వివిధ రకాల వస్తువులను రవాణా చేయగలదు. ఈ రోబోలో ఇంకా ఎన్నో సాంకేతిక మార్పులు చేయాల్సి ఉందని కవాసాకి చెబుతోంది. ఏదేమైనా బెక్స్.. మొట్టమొదటి రోబో మేకగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. -
అమ్మతనమంటే ఇదే.. మేక పిల్లలకు పాలిస్తున్న కుక్క !
భువనేశ్వర్: సృష్టిలో తీయనిది తల్లి ప్రేమ. పేగు తెంచుకుని కన్న బిడ్డలకు ఆదరించి లాలించడం పరిపాటే. తల్లి లేని లోటు ఏ జీవికైన భర్తీ చేయలేనిది. కూనలు కన్ను తెరిచేలోగా ప్రసవించిన తల్లి మేక కన్ను మూసింది. పోషణకు ఆధారమైన తల్లి పాలు లేక అల్లాడుతున్న మేక పిల్లల్ని వీధి కుక్క అక్కున చేర్చుకుంది. నిత్యం క్రమం తప్పకుండా తన పాలుని పంచిపెడుతోంది. మయూర్భంజ్ జిల్లా జమదా మండలం మధుపూర్ గ్రామంలో ఈ విభిన్న మాతృత్వం శుక్రవారం తారసపడింది. రాగా అంకుర్ బాగే పోషించిన మేక 2 పిల్లల్ని ఈనింది. మరుక్షణమే తల్లి మేక కన్ను మూసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో గంజితో జీవుల ఆకలి తీర్చేందుకు యజమాని చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. వీధుల్లో తిరుగాడుతున్న కుక్కకి తల్లిని కోల్పోయిన మేక పిల్లలు చేరువయ్యాయి. కడుపునిండా పాలు పంచి మేక పిల్లల్ని కుక్క అక్కున తీసుకుని ఆదరించడం స్థానికులను ఆలోచింపజేసింది. -
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
ఇదేం మేకపోతురా నాయనా.. ఏకంగా రూ. 15లక్షలు పలికింది
సిడ్నీ: సాధారణంగా మేకలు, గొర్లను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు పడుతుంది. వయసు, బరువు ఆధారంగా వాటి ధర ఉంటుంది. ఎంత ఉత్తమ జాతికి చెందిన మేక, గొర్రె అయినా సరే.. మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే వార్త విని మీరు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడబోయేది చాలా ప్రత్యేకమైన మేకపోతు. అందుకే అది ఏకంగా 21 వేల డాలర్లు అనగా.. 15,64,983 రూపాయల ధర పలికింది. ఏంటి ఓ మేకపోతు ధర 15 లక్షల రూపాయలా.. ఏంటి దాని ప్రత్యేకత.. అది ఏమన్నా బంగారు ఉన్ని కలిగి ఉందా ఏంటి అనే ప్రశ్నలు తలెత్తక మానవు. ఇక ఇంత ఖరీదు కలిగిన మేకపోతు ఎక్కడ ఉంది.. ఎవరు దానికి అంత ధర చెల్లించారు వంటి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. (చదవండి: ఈ ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్) ఆస్ట్రేలియాకు చెందిన మర్రకేశ్ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్లో బుధవారం ఈ మేక పోతు అమ్మకానికి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఖరీదైన మేక పోతును ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. (చదవండి: మేకలతో జూమ్ మీటింగ్... ఆదిరిపోయే ఆదాయం) ‘‘ఈ మేక పోతు చాలా అందంగా, ధ్రుడంగా ఉంది. మరీ పెద్దగా కాకుండా.. మరీ చిన్నదిగా కాకుండా.. మధ్యస్థంగా ఉంది. ఈ మేక పోతు చాలా త్వరగా ఎదుగుతుంది. మందతో చాలా త్వరగా కలసిపోతుంది’’ అని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. చదవండి: నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా! -
మేకల దొంగల వీరంగం.. స్పెషల్ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్గ్రేషియా
సాక్షి, చెన్నై : తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్ ఎస్ఐను హతమార్చారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండుగల కోసం జల్లెడ పడుతున్నారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్గ్రేషియో ప్రకటించారు. తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్స్టేషన్లో ఎస్ఎస్ఐగా భూమినాథన్(51) పనిచేస్తున్నారు. భార్య కవిత(46), కుమారుడు గుహనాథన్ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలకు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ చిత్రై వేల్తో కలిసి గస్తీలో ఉన్నారు. చదవండి: సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం మేకల దొంగల కోసం ఛేజింగ్ చిన్న సూర్యర్ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలను దొంగలించి తీసుకెళుతుండడాన్ని గుర్తించారు. వారి కోసం చేజింగ్ చేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ దొంగలను చిత్రై వేల్ చేజింగ్ చేయలేకపోయారు. భూమినాథన్ వెనుకడుగు వేయకుండా తిరుచ్చి జిల్లా నుంచి పుదుకోటై జిల్లాలోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ ఎస్ఐ కీరనూర్శేఖర్కు కాల్ చేసి పుదుకోటై పల్లత్తు పట్టి గ్రామ శివారుకు రావాలని కోరారు. అయితే తమ వాళ్లు భూమినాథన్కు చిక్కడంతో మిగిలిన ఇద్దరు రెచ్చిపోయారు. కత్తులతో భూమినాథన్పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. కీరనూరు నుంచి శేఖర్తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు దుండగుల కోసం గాలింపు అప్పటికే ఆయన మృతిచెందడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఐజీ శరవణ సుందర్, తిరుచ్చి ఎస్పీ సుజిత్కుమార్, పుదుకోటై ఎస్పీ నిషా పార్థీబన్ నేతృత్వంలోని బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దుండగులు పుదుకోటై జిల్లాకు చెందిన వారై ఉంటారని తేల్చారు. మార్గమధ్యలో ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ చేజింగ్ దృశ్యాలు వెలుగుచూశాయి. దాని ఆధారంగా ఎనిమిది ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. రూ. కోటి ఎక్స్గ్రేషియో ఎస్ఎస్ఐ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రూ.కోటి ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ప్రకటన చేశారు. -
యజమానికి కాసులు కురిపిస్తున్న గొర్రె.. మేళతాళాలతో ఊరేగింపుగా..
సాక్షి, మండ్య (కర్ణాటక): మామూలుగా ఒక గొర్రె రూ. 25–30 వేలు పలికితే గొప్ప. మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి చిత్రంలోని ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితమే రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడు. ఇప్పటివరకు అనేక పిల్లలు కూడా పుట్టి మంచి ఆదాయం పొందాడు. ఇప్పుడీ గొర్రెకు నాలుగేళ్లు. బీదరకోటె గ్రామవాసి కృష్ణగౌడ గొర్రె కథ విని దేవీపురకు వచ్చి రూ.1.91 లక్షలు చెల్లించి దీన్ని కొనుగోలు చేశాడు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
తల లేని మేక.. చూసేందుకు ఎగబడుతన్న జనం.. ఎక్కడంటే !
క్రిష్ణగిరి( బెంగళూరు ): సూళగిరి సమీపంలోని గంగసంద్రం గ్రామానికి చెందిన నరసింహన్ మేకలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను పెంచుతున్న ఓ మేక తలలేని మేకపిల్లకు జన్మనిచ్చింది. రెండు చెవులు మాత్రమే బయటకు ఉన్నాయి. తల లేని మేక పుట్టిందని ప్రచారం కావడంతో జనం గుంపులు గుంపులుగా వచ్చి చూశారు. ఆ వింత మేకపిల్ల కొంతసేపు మాత్రమే బతికి ఉంది. మరో ఘటన.. విద్యుత్ కోతల బెడద యశవంతపుర: బొగ్గు కొరత విద్యుత్ కోతలకు దారితీస్తోంది. బెంగళూరు నగరంలో ఉదయం, సాయంత్రం రెండు గంటల చొప్పున లోడ్ షెడ్డింగ్ (కోత)ను విధిస్తున్నారు. రాత్రిపూట కూడా అప్పుడప్పుడు కరెంట్ను తీసేస్తున్నారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు ప్రమాదాలు జరగకుండా కరెంట్ కట్చేస్తారు. అయితే అనేక ప్రాంతాల్లో వానలు లేకపోయినా కరెంటు పోతోంది. కొన్నిచోట్ల రెండు గంటలకు పైగా కోత పడుతోంది. గురువారం ఆయుధ పూజ పండుగ రోజున విద్యుత్లో పదేపదే అంతరాయం కలగటంపై ప్రజలు అసమాధానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంధన మంత్రి సునీల్ కుమార్ ఆకస్మికంగా బెంగళూరులోని బెస్కాం సహాయవాణి ఆఫీసును తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఎలా పరిష్కరిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చదవండి: చాట్ అమ్ముతూ కేజ్రీవాల్ !.. తీరా చూస్తే అసలు కథ వేరే.. -
ఈ ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్
ఒక కుటుంబానికి చెందిన వారు.. ఒకే తల్లికి జన్మించిన వారి మధ్య ప్రేమాభిమానాలు ఉండటం సహజం. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా.. జీవితాంతం మన వెంట నిలిచేదే మైత్రి బంధం. స్నేహితుడు.. పేరులోనే ఉంది మన హితం కోరేవారని. జీవితంలో బంధువులు, తోబుట్టువులు మనల్ని విడిచిపెట్టి పోవచ్చు. కానీ ఫ్రెండ్ మాత్రం మనల్ని ఎన్నటికి విడిచిపెట్టడు. అయితే ఈ స్నేహ గుణం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది అనుకుంటే పొరపాటే. నోరులేని మూగజీవుల మధ్య కూడా మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో బెర్రి పళ్లు పట్టుకుని.. అడవిలాంటి ప్రదేశంలో నిల్చుని తన పెంపుడు మేక పిల్లను పిలుస్తాడు. యజమాని పిలుపు విన్న వెంటనే మేక అల్లంత దూరం నుంచి పరిగెత్తుకువస్తుంది. దగ్గరకు వచ్చాకే కనిపిస్తుంది అసలు చిత్రం. ఆ మేకపిల్ల ఒంటరిగా రాదు.. దానితో పాటు తన ఫ్రెండ్ అయిన చిన్న కోతి పిల్లను కూడా తీసుకువస్తుంది. ఆ బుజ్జి కోతి పిల్ల.. ఎంచక్కా మేకపిల్ల మెడను కర్చుకుని పట్టుకుంటుంది. (చదవండి: తిమింగలంతో దోస్తి) యజమాని దగ్గరకు వచ్చాక మేకపిల్లతో పాటు కోతి పిల్ల కూడా బెర్రి పళ్లను నోట కర్చుకుని మేక వీపు మీద కూర్చుని తింటుంది. ఈ సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. వీటి ఫ్రెండ్షిప్కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. ఈ మూగ జీవుల మైత్రి బంధానికి ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 13 మిలియన్ల మందికి పైగా చూశారు. నా జీవితంలో ఇంత అద్భుత దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. Am I high right now what is happening pic.twitter.com/itBaV1XUNK — Kristi Yamaguccimane (@wapplehouse) September 26, 2021 చదవండి: Friendship Day 2021: ముఖేశ్ మనసులో ఆనంద్ది చెరిగిపోని స్థానం -
నాతో సెల్ఫీ అంటే మామూలు విషయం కాదు.. దిమ్మతిరిగిందా!
ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు దిగడం అనేది సాధారణమైపోయింది. ఆ జ్ఙాపకం గుర్తుండిపోవడం కోసం ఇలా సెల్ఫీ తీసుకుంటాం. చాలా సందర్భాల్లో సెల్ఫీలు గుర్తులా మిగిలిపోతే.. కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎత్తైన కొండలు, సముద్రాలు, జలపాతాలు. పాములు.. ఇలా ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ఇబ్బందులు పడ్డ వారున్నారు. సెల్ఫీ కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లు, ప్రాణాలు కోల్పోయిన వారిని చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ మేకతో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించిన యువతికి ఊహించిన షాక్ తగిలింది. చదవండి: Viral: కుక్కపిల్లతో సీతాకోకచిలుకల చిలిపి ఆట! అయితే ఈ వీడియో ఇప్పడిది కాదు. రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనకు చెందిన పాత వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో మళ్లీ ట్రెండవుతోంది. ఈ వీడియోలో తాడుతో కట్టేసి ఉన్న ఓ మేక ముందు యువతి సెల్ఫీకి ట్రై చేస్తోంది. ఇంతలో మేక తాడు విదిలించుకోని రావడానికి ప్రయత్నించింది. మేక దగ్గరకు వస్తున్నా.. ఆ యువతి మాత్రం వీడియోలు, సెల్ఫీలు దిగుతూనే ఉంది. ఇంతలో మేకకు ఏమనిపించిందో ఏమో ఒక్కసారిగా వెనక్కి వెళ్లి ముందుకొచ్చి గట్టిగా ఆ యువతి తలను బలంగా కుమ్ముకుమ్మింది. లక్కీగా మేకకు కొమ్ములు లేవు. ఉంటే.. తీవ్రమైన గాయలు అయ్యేవే. చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ మేక గుద్దిన గుద్దుకు ఆమె చేతిలో సెల్ఫోన్ ఎగిరి కింద పడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి మేకను గమనించాల్సిందని, మేక బలంగా పొడిచింది పాపం అంటూ కామెంట్ చేస్తున్నారు.. ఇంకొందరు ఈ సెల్ఫీ పిచ్చి ఏంటి, మేకతో సెల్ఫీ అంటే అంత ఈజీ కాదు. ఏది ఏమైనప్పటికీ యువతి ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకుంటే బాగుండేది. ఇకనైనా సెల్ఫీలు తీసుకునేటప్పుడు ముందు, వెనక చూసుకొని తీసుకోవాలని కోరుతున్నారు. కావాలంటే ఈ వీడియో మీరూ చూడండి. pic.twitter.com/isNhcFuLU9 — The Darwin Awards (@AwardsDarwin_) September 1, 2021 -
మేకపై ఐదుగురు అత్యాచారం.. ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు
రోజులు గడుస్తున్న కొద్దీ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే నీచ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు జంతువులను కూడా వదలడం లేదు. ఇప్పటి వరకు ఆడవారికే భద్రత కరువుతుందనుకుంటున్న నేటీ కాలంలో జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. తాజాగా ఓ మేకపై, కామంతో కళ్లు ముసుకుపోయిన కొందరు దుర్మార్గులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అవమానవీయ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఒకారా జిల్లాలోని ఓ కార్మికుడు ఇంటి ముందు ఉన్న కాంపౌండ్లోని మేకను అపహరించిన అయిదుగురు వ్యక్తులు దానిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత మేకను చంపేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోవడం స్థానికుల కంటపడింది. ప్రస్తుతం ఈ ఘటన పాకిస్తాన్లో చర్చనీయాంశంగా మారింది. అఘాయిత్యాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ట్యాగ్ చేస్తూ.. ఇప్పుడు చెప్పండి ప్రధాని గారూ. మేకలు కూడా వాటి వస్త్రాధరణ కారణంగానే అత్యాచారానికి గురవుతున్నాయి కదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్తానీ నటి మథిర.. మేకపై అఘాయిత్యానికి సంబంధించిన న్యూస్ను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తూ.. జంతువులకు కూడా దుస్తులు ధరించడం అవసరం అంటూ సెటైర్లు పేల్చారు. మరొకరు...‘నగ్న జంతువులు కూడా పురుషులపై ప్రభావం చూపుతాయా? ఇప్పుడు మన అందమైన ప్రధాని... మేకలను కూడా పూర్తి దుస్తులు ధరించాలని అడుగుతాడు. ఎందుకంటే చుట్టుపక్కల వారిని చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు.. అమాయకులైన పురుషులు రోబోలు కాదు కదా’. అంటూ చురకలంటించారు. కాగా గత నెలలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మహిళల దుస్తులపై తీవ్రంగా కామెంట్ చేశారు. ఆడవారు పూర్తిగా వస్త్రాలు ధరించాలని, వారి వేషధారణ ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉండకూడదని వ్యాఖ్యానించారు. మహిళల పొట్టి బట్టలు చూసి రెచ్చిపోకుండా ఉండేందుకు మగవారేం రోబోలు కాదు అంటూ పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దూమారమే రేగింది. -
హరితహారం: ఎమ్మెల్యే నాటిన మొక్కలు తినేసిందని..
సాక్షి, కొల్లాపూర్: హరితహారంలో భాగంగా గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 7వ వార్డులో మొక్కలు నాటారు. కాసేపటికే కొన్ని మొక్కలను ఓ మేక తినేసింది. దీంతో మున్సిపల్ సిబ్బంది దాన్ని పట్టుకొని కొత్త గ్రంథాలయ భవనం వద్ద ఇనుప జాలీలో బంధించారు. జరిమానా చెల్లించి తీసుకెళ్లాలని యజమాని రంగస్వామికి కబురంపారు. శుక్రవారంమేకను విడిపించుకునేందుకు రంగస్వామి రాగా అధికారులు లేరు. ఈలోగా విషయం సోషల్మీడియాకు ఎక్కడంతో శుక్రవారం సాయంత్రం అధికారులు మేకను విడిచిపెట్టారు. -
మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు
అహ్మదాబాద్: మామిడి తోట కాడ కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది. ఆ సింహ మేకను తినేద్దామని ప్రయత్నించగా ఆ మేకను కాపు కాస్తున్న వ్యక్తి తప్పించాడు. అయితే సింహం మేకను కాదని ఆ వ్యక్తిని తన ఆహారంగా చేసుకుని తినేసింది. సింహం చేతిలో మనిషి బలైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది జూనాగఢ్ జిల్లా గిర్ అటవీ డివిజన్లోని తలాలా రేంజ్ పరిధిలో ఉన్న మధుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మధుపూర్ గ్రామంలో మామిడి తోటకు బహదూర్భాయ్ జీవాభాయ్ (35) కావలి ఉంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని మామిడి తోటకు కాపలా ఉంటూ నిద్రించాడు. అయితే శనివారం తెల్లవారుజామున అడవిలో నుంచి సింహం బయటకు వచ్చింది. తోట సమీపంలోకి రాగా మేక కనిపించింది. మంచానికి కట్టేసిన మేకను తినేయాలని చూడగా మేక అరుపులకు బహదూర్భాయ్ జీవాభాయ్ మేల్కొన్నాడు. సింహం నుంచి మేకను తప్పించాడు. మేక తప్పించుకోగా జీవాభాయ్ సింహానికి చిక్కాడు. సింహం పంజా విసిరి జీవాభాయ్పైకి దాడి చేసి తినేసింది. అతడి అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే తోట కాడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సింహాన్ని బంధించారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: వ్యాక్సిన్ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి -
Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!
పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో రైన్డీర్ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం.. ఒంటె (సోమాలియా, కెన్యా) ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి. గేదె (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్లో గుజరాత్లోని సూరత్ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్’ అనే మృదువైన జున్ను (చీజ్)కు విశేషమైన గుర్తింపుఉంది. సాహివాల్ (ఇండియా, పాకిస్తాన్) ఇండియా, పాకిస్తాన్లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం సాహివాల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. గుర్రం (మంగోలియా) గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు. మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్ (లేదా ఐరాగ్) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్ ఉండటం విశేషం. యాక్ (జడల బర్రె) / (టిబెట్) యాక్ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్లను తయారు చేస్తారు. మేక (ఫ్రాన్స్) ఫ్రాన్స్లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. రైన్డీర్ (పలవల దుప్పి)/ (ఫిన్ల్యాండ్) రైన్డీర్ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్ల్యాండ్లో రైన్డీర్ పాలను ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు. గొర్రె (గ్రీస్) గొర్రె పాలకు గ్రీస్ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మూస్ (రష్యా, స్వీడన్) ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్ పాలను రష్యా, స్వీడన్ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్ పాలతో తయారయ్యే చీజ్ (మూస్ చీజ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్ చీజ్ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్ హౌస్) స్వీడన్లోని బ్జుర్హోమ్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్ చీజ్లను తయారు చేస్తున్నారు. గాడిద పాలు గాడిద పాలు మంచి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్ వ్యాల్యూస్ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్ అడ్రస్గా ఆమెనే చెబుతారు. -
వింత: కోడి ఆకారంలో మేక..
పీసీపల్లి: కోడిని పోలిన ఓ మేక జన్మనిచ్చిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పీసీపల్లి మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన ఎస్కే దస్తగిరికి చెందిన మేక గురువారం ఒకే ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చింది. 3 కిలోలు, 1.5 కిలోల బరువు ఉన్న అవి ఆరోగ్యంగా తల్లిని పోలినట్టు ఉన్నా యి. శనివారం ఉదయం అదే మేక మరో పిల్లకు జన్మనిచ్చింది. అయితే అది గురువారం నాటి పిల్లల మాదిరిగా కాకుండా కోడి ఆకారంలో ముక్కు కలిగి ఉంది. శరీరంపై వెంట్రుకలు కూడా లేవు. కేవలం పావు కిలో బరువు మాత్రమే ఉన్న ఆ పిల్ల పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. వింతగా ఉన్న దీనిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. (చదవండి: కిడ్నాప్ డ్రామా: నివ్వెరపోయే విషయాలు) -
మేకలతో జూమ్ మీటింగ్... ఆదిరిపోయే ఆదాయం
లండన్: కరోనా మహమ్మారి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో కొత్త అనుభవాన్ని మిగిల్చింది. ఉపాధి కోల్పోయిన వారు కొందరైతే, ఆరోగ్యాన్నీ, ప్రాణాల్ని సైతం కోల్పోయిన వారు కోకొల్లలు. లక్షలాది మంది వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనా నేర్పిన అనుభవాల్లో జూమ్ మీటింగ్ ఒకటి. అయితే మనుషులు సమావేశమయ్యే జూమ్ మీటింగే కాదు, మేకలు హాజరయ్యే జూమ్ మీటింగ్ గురించి మీరు విని ఉండరు. కానీ, యూకేలోని రాసెండేల్కు చెందిన డాట్ మెక్ కార్టీ మేకలను జూమ్ మీటింగ్లోకి తెచ్చి అక్షరాలా 50 లక్షలు సంపాదించారు. లాక్డౌన్తో తగ్గిన ఆదాయం మేకలేంటీ? జూమ్ మీటింగేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నిజమే కానీ జూమ్ మీటింగ్ పెట్టుకునేది మేకలు కాదు. మనుషుల జూమ్ మీటింగ్కి మేకలు అటెండ్ అవుతాయి అంతే. అది కూడా ప్రత్యక్షంగా కాదు ఆన్లైన్లో. ! డాక్ మెక్ కార్టీకి కొంత పొలం ఉంది. అందులో ఆమె మేకలను పెంచుతున్నారు. వ్యవసాయంతో పాటు, మేకల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గాను విద్యార్థుల మేకల సందర్శనను కూడా ఒక ఆదాయ వనరుగా మలుచుకున్నారు మెక్ కార్టీ. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. వివాహాలకూ ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని అద్దెకిచ్చేవారు. అయితే, పెళ్లిళ్లకూ అవకాశం లేకపోవడంతో ఇటు మేకలూ, అటు మెక్ కార్టీకి ఖాళీ సమయం దొరికింది. ఆదాయమూ తగ్గింది. జోక్ అనుకున్నా.. నిజమయ్యింది..! అంతా జూమ్ మీటింగుల్లో మునిగిపోయిన సమయంలో మెక్ కార్ట్ మేకలూ జూమ్ మీటింగ్ కి అటెండ్ అవ్వొచ్చుగా అనిపించి, ఈ సరదా ఆలోచనని ఓ జోక్లా వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన వెబ్ సైట్లో ప్రకటించారు. తన మేకలను జూమ్ మీటింగుల్లో కనిపించడానికి అద్దెకిస్తానంటూ చేసిన ఈ ప్రకటనకు నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీంతో సరదాగా వచ్చిన ఈ ఆలోచన మెక్ కార్టీకి యిప్పుడు కాసులు కురిపిస్తోంది.‘‘నెటిజన్లు సరదాగా నవ్వుకునేందుకు 2020 ఏప్రిల్ లో తొలి లాక్డౌన్ అప్పుడు జోక్గా దీన్ని వెబ్సైట్లో పెట్టి, నిద్రపోయాను. మేల్కొనే సరికి ఈ ఆలోచనని ఆహ్వానిస్తూ 200 మెయిల్స్. అందరూ తమ తమ జూమ్ మీటింగ్స్లో మేకలను హాజరు పర్చాలంటూ రిక్వెస్టులు’’అని ఆనందాన్ని వ్యక్తం చేశారు మెక్. ఆనందం కోసమే.. అయిదేళ్ల క్రితం తన తల్లి నుంచి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని తీసుకున్న 32 ఏళ్ల మెక్ కార్టీ జూమ్ మీటింగుల్లో తన మేకలు పాల్గొనేలా చేసి, వారికి ఆనందాన్నిస్తున్నారు. జూమ్ మీటింగ్లను ఆహ్లాదపరిచేందుకు తన మేకలను వీడియో కాల్స్లో చమక్కున మెరిపిస్తున్నారు. అనేక సంస్థలూ, వ్యక్తులు, కుటుంబ సభ్యులు, తమ స్నేహితులను ఆశ్చర్యపరచడం కోసం మేకలను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో మీటింగ్కి మేకకు ఐదు పౌండ్లు మీటింగ్ వీడియో లింక్ వివరాలు పంపిస్తే చాలు మెక్ కార్టీ ఉద్యోగులు మేకలను వీడియో సమావేశంలో కనిపించేలా చేస్తారు. అయితే, ఒక్కో మీటింగ్కి మేక హాజరు ఖరీదు 5 పౌండ్లు. ఇలా ఇప్పటి వరకు మెక్ కార్టీ 50 వేల పౌండ్లు అంటే దాదాపు రూ.50 లక్షలు సంపాదించారు. యిప్పుడు తన మేకలు అంతర్జాతీయ మీటింగుల్లో పాల్గొంటున్నాయంటారు మెక్. రష్యా, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు నిర్వహించే వర్చువల్ మీటింగ్స్లో తన మేకలను హాజరు పరుస్తున్నానని చెప్పారు. కొందరు దాని ఖరీదుకన్నా ఎక్కువగా డబ్బులు విరాళంగా ఇస్తున్నారట. తన వ్యవసాయ క్షేత్రాన్ని మెరుగుపర్చుకోవడానికీ, లాక్డౌన్ కాలంలో తన సిబ్బంది వేతనాలకూ ఈ మేకల జూమ్ మీటింగ్లు అవకాశం కల్పించాయంటారు మెక్ కార్టీ. ఆదాయం కోసం ఎరువుని విక్రయించడం కన్నా ఇది చాలా సులభతరంగా, ఆనందంగా ఉందంటారు మెక్. చదవండి: పోలీస్ అయితే పెళ్లి సంబంధాలు రావన్నారు.. జూమ్ క్లాస్లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా? -
టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్చల్
ఇస్తాంబుల్ : టర్కీలో నెవ్షేహిర్ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ప్రజలంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఒక గ్యాంగ్ హల్చల్ చేసింది. రోడ్డుపై ఉన్నవారిని భయపెట్టే విధంగా చర్యలకు పూనుకుంది. మనుషుల మీదకు పరిగెత్తడం.. తమకు అడ్డు వచ్చినవారిపై బౌతికదాడికి దిగడం చేశారు. దాదాపు అరగంట పాటు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇదంతా ఎవరైనా గుర్తు తెలియని అగంతకులు చేశారనుకుంటే మాత్రం పొరబడ్డట్టే. మరీ రోడ్డుపై హల్చల్ చేసిన ఆ గ్యాంగ్ ఎవరో తెలుసా.. ఒక గొర్రె, మేక, మరో మూడు గొర్రె పిల్లలు. అవును మీరు విన్నది నిజం.. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గానీ.. ఆ గుంపుకు గొర్రె నాయకత్వం వహించగా.. మేక, గొర్రె పిల్లలు దానిని అనుసరించాయి. వీటి ప్రవర్తనతో రోడ్డుపై వెళ్తున్న పాదాచారులను పరుగులు పెట్టించాయి. వాటిని ఆపుదామని భావించినకొందరిని తమ తలలో గుద్దడానికి ప్రయత్నించి నానా హంగామా చేశాయి. అయితే ఈ ఘటన జరిగి మూడు రోజులవుతుంది. దీనిని వీడియో తీసిన నెవ్షెహిర్ మున్సిపాలిటీ అధికారులు ట్విటర్లో షేర్ చేసింది. షేర్ చేసిన కాసేపటికే 2.7 మిలియన్ వ్యూస్ రాగా.. వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. (చదవండి : సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్లో..) 1 koyun,1 keçi, 3 kuzu tarafından esir alınmış bulunmaktayız.... pic.twitter.com/hZWmMMj9U8 — Nevşehir Belediyesi (@nevsehir_bel) December 14, 2020 -
వాగులో కొట్టుకుపోయిన మేకలు, గొర్రెలు
సాక్షి, నిర్మల్ : భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భైంసా మండలం కామోల్ శివారులోని వాగులో 100 మేకలు, గొర్రెలు, సహా కాపరి రాము చిక్కుకుపోయారు. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతొ ఒక్కసారిగా వాగు పొంగిపొర్లింది. అయితే వాగు మధ్యలో బండరాయిపై నిల్చుని కాపరి రాము ప్రాణాలు దక్కించుకున్నాడు. కానీ గొర్రెలు, మేకలు మాత్రం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో వెంటనే గ్రామస్తుల సహకారంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు గేట్లను మూసివేయించారు. నీటి ప్రవాహం తగ్గాక సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉందని వెల్లడించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జైనూర్ మండలం కిషన్ నాయక్ తండా గ్రామస్తులు వాగు దాటలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ గర్భిణీని వాగు దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. -
పోలీసు అధికారిణి కారులో మేక!
-
నా అరెస్ట్ వారెంట్ని తినాలి!
జార్జియా: సాధారణంగా మేకలకు ఆకలేస్తే చెట్లు, మొక్కల ఆకులు తింటాయి. కానీ ఈ మేక ఏంటో అమెరికాలోని జార్జియాలో ఓ పోలీసు అధికారిణి కారులోకి దూరి ఆమెకు సంబంధించిన ఆఫీసు పేపర్లను తిన్నది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను డగ్లస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్బుక్లో ఫోస్ట్ చేసింది. ‘మేం నవ్వుకున్నాం. మీరు కూడా నవ్వుకుంటారని ఆశిస్తున్నాం’ అని కాప్షన్ జత చేసింది. డిప్యూటీ పోలీసు అధికారిణి జార్జియాలోని ఓ ఇంటికి వెళ్లి సివిల్ పేపర్లను ఇచ్చి కారు వద్దకు వచ్చేసరికి ఒక మేక తన కారులోకి దూరి ఆఫీసు పేపర్లను తింటూ కనిపిస్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతారు. ఆమె ఆఫీసు పనుల మీద పలు నివాసాలకు వెళ్లినప్పుడు కారు డోర్ వేయకుండానే వెళ్తారు. దీంతో కొన్ని సార్లు ఆమె కారులోకి వీధి కుక్కలు దూరడానికి ప్రయత్నించేవి. కానీ ఈసారి ఒక మేక తన కారులోకి దూరింది. ఈ వీడియోలో ఆమె మేకను కారు నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నించడం, అది కాగితాలను నములుతూ ఎంతకూ వెళ్లకపోవడం చూడవచ్చు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రెండు రోజుల్లో మూడు లక్షల మంది వీక్షించగా, నాలుగు వేల లైక్స్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘పోలీసు అధికారిణి తిరిగి రాకముందే నా అరెస్ట్ వారెంట్ను తినాలి’ అని ఆ మేక అనుకుంటుదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. -
పాలు తాగించబోతే తిరిగి పాలిస్తున్న మగ మేక
జైపూర్: అవు పాలలోనే కాదు, మేక పాలలోనూ పోషకాలు ఉంటాయి. కానీ అవి అదో రకమైన వాసన రావడం వల్ల ఎవరూ పెద్దగా తాగడానికి ఇష్టపడరు. మరి మగ మేక పాలు కూడా ఇలాగే ఉంటాయా? ఇదేం దిక్కుమాలిన ప్రశ్న అని విసుక్కోకండి. ఓ చోట నిజంగానే మగ మేక పాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విడ్డూరం రాజస్థాన్లో బయటపడింది. ఢోల్పూర్లోని గుర్జా గ్రామానికి చెందిన రాజీవ్ కుశ్వాహ ఓ మగ మేకను పెంచుకుంటున్నాడు. (వీటిలో జాగ్వారేదో.. చిరుతేదో చెప్పగలరా?) అది పాలివ్వడం గురించి ఆయన మాట్లాడుతూ.. "దాన్ని రెండున్నర నెలల వయసు ఉన్నప్పుడు తీసుకొచ్చి పెంచుకుంటున్నాం. ఆరు నెలల వయసొచ్చేసరికి దానికి పొదుగులు వచ్చాయి. మేకకు పాలు తాగించేందుకు ప్రయత్నిస్తే అదే తిరిగి పాలిచ్చింది. రోజుకు 200- 250 గ్రాముల పాలను ఉత్పత్తి చేస్తుంది" అని తెలిపారు. హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే ఇలా జరుగుతుందని వెటర్నటీ సర్జన్ జ్ఞాన్ ప్రకాశ్ సక్సేనా వివరించారు. ఇలాంటి కేసులు లక్షల్లో ఒకటి వెలుగు చూస్తాయని ఆయన పేర్కొన్నారు. (ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య) -
'బలి' మేక మాయం.. ఆగ్రహించిన ‘అమ్మ’ భక్తులు
ఒడిశా,బరంపురం: గంజాం జిల్లాలోని బెల్లిగుంటా సమితి పరిధిలో ఉన్న గుంటరిబడి గ్రామదేవత అమ్మవారికి బలి ఇచ్చేందుకు గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఓ మేకను కొనుగోలు చేశారు. దానిని గ్రామంలోని ఓ పశువుల శాలలో కట్టి ఉంచారు. అయితే ఇదే గ్రామానికి చెందిన సంతు తరణి, సిమ్మ బిశాయి అనే ఇద్దరు యువకులు మేకను ఎత్తుకుపోయి, ఓ మాంసం దుకాణానికి అమ్మేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఆ ఇద్దరు యువకులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గ్రామంలోని ఓ స్తంభానికి కట్టి, చీవాట్లు పెట్టారు. ప్రస్తుతం ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల దొంగతనంపై దర్యాప్తు చేపడుతున్నారు. -
ట్రోలింగ్: యూపీ పోలీసుల బిత్తిరి చర్య
కాన్పూర్ : మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు ఓ మేకను అరెస్ట్ చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని బెకన్గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై మేకను తీసుకెళ్తున్న దాని యజమానిని పోలీసులు అడ్డగించి.. మేకకు మాస్కు పెట్టలేదేంటని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు బిత్తరపోయిన మేక యజమాని భయంతో మేకను అక్కడే వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు దానిని స్టేషన్కు తరలించారు. కాసేపయ్యాక యజమాని వచ్చి మేక కనపించలేదు. దాంతో అతను పోలీస్స్టేషన్ వెళ్లక తప్పలేదు. మాస్కు లేకపోవడంతో మేకన అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో అతను షాక్ తిన్నాడు. ఎలాగోలా పోలీసులు బతిమాలుకుని మేకను విడిపించుకున్నాడు. అయితే, మాస్క్ ధరించకపోతే మేకను అరెస్ట్ చేయడమేంటని పోలీసులన అడగ్గా.. వారు తమ చర్యను సమర్థించుకున్నారు. కుక్కలకు కూడా మాస్కులు పెడుతున్నప్పుడు మరి మేకలకు కూడా మాస్కులు ఎందుకు ఉండకూడదంటూ ఎదురు ప్రశ్నించారు. ఇంకెప్పుడూ మేకను రోడ్డుపైకి తీసుకురానని యజమాని పోలీసులకు తెలిపాడు. రోడ్డుపైకి రావాల్సి వచ్చినా మాస్కు పెడతానని చెప్పాడు. పోలీసుల బిత్తిరి చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. (గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం) -
తన మేకను కుక్క కరిచిందని, 40 కుక్కలను..
భువనేశ్వర్ : ఓ వీధి కుక్క తన మేకను కరిచిందని కుక్కలన్నింటిపైనా కక్ష కట్టాడో వ్యక్తి. ఊర్లో ఉన్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి వాటిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని చౌదార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ జిల్లాలోని మహంగలో బ్రహ్మానంద మాలిక్ అనే వ్యక్తి పెంచుకుంటున్న మేకను ఓ రోజు వీధి కుక్క కరిచింది. దానికి గాయమవడంతో అతడు కుక్క జాతిపైనే పగ పట్టాడు. ఊరిలోని కుక్కలన్నింటి ప్రాణాలు తీసేందుకు కుట్ర పన్నాడు. దీనికి భరత్ మాలిక్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. అతనితో కలిసి కుక్కలకు ఎంతో ఇష్టమైన మాంసం తీసుకొచ్చి వాటిలో విషపు గుళికలు కలిపాడు. (మంచాన పడ్డ తల్లిని బ్యాంకుకు లాక్కెళ్తూ..) అనంతరం ఆ విషపు ఆహారాన్ని శునకాలకు ఎరగా వేశాడు. దీంతో దాన్ని తిన్న 40 కుక్కలు రోడ్డుపై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాయి. ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. "కళ్లముందే కుక్కలు బాధతో గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోవడం చూడలేకపోయాం. ఇది మా హృదయాలను కలిచి వేసింది" అని ఓ గ్రామస్థుడు తెలిపాడు. ఈ విషయం గురించి ఆ ఊరి సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు సమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక ఈ ఘటన సరిగ్గా ఏ రోజు జరిగిందనేది తెలియరాలేదు. (పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు) -
మేకను ఎత్తుకెళ్లాడని కొట్టి చంపారు
రాంచీ: మేకను ఎత్తుకెళ్లాడన్న కోపంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని కిరాతకంగా కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సోమవారం జార్ఖండ్లో జరిగింది. డుమ్కా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మేక కనిపించకుండా పోవడంతో ముప్పై ఏళ్ల సుభాన్ మియాన్ అనే వ్యక్తి దాన్ని దొంగిలించాడని భావించాడు. దీంతో కొంతమంది వ్యక్తులను పోగేసుకుని అతనిపై దాడికి దిగబడ్డాడు. అతనితోపాటు ఉన్న దులాల్ మీర్దా అనే మరో వ్యక్తిని కూడా చితకబాదారు. ఈ దాడిలో సుభాన్ అక్కడికక్కడే మరణించాడు. (మహాలక్ష్మి అత్యాచార ఘటన : ఉరి తీయాలి) సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా సుభాన్ రక్తపు మడుగులో పడి ఉండగా, తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న దులాల్ను డుమ్కాలోని సర్దార్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డవారిలో మేక యజమాని సహా మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఈ నేరంలో ఎవరెవరు పాల్గొన్నారన్నదానిపై దర్యాప్తు చేపట్టారు. కాగా మేక పోయిందని అటు గ్రామస్తులు, ఇటు బాధితులపై దాడి రెండింటిపైనా కేసు నమోదు చేశామని ఎస్పీ అంబర్ లర్కా తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఆయన స్పష్టం చేశారు. (బాలిక గొంతుకోసిన యువకుడు) -
మేక, బొప్పాయి పండుకు కరోనా పాజిటివ్!
దొడోమ: కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషులకు, పులులు, పిల్లులు వంటి కొన్ని జంతువులకూ వచ్చింది. అయితే విచిత్రంగా ఓ మేకకు, మరీ విచిత్రంగా ఓ బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఈ వింత సంఘటన టాంజానియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే టాంజానియా దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ చేసే పరీక్షా కిట్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని మనుషులతోపాటు బొప్పాయి, మేక, గొర్రెల పైనా పరీక్షించింది. ఈ క్రమంలో గొర్రె మినహా మిగతా రెండింటికి వైరస్ సోకినట్లు తప్పుడు ఫలితాలివ్వడంతో కిట్లలో డొల్లతనం బయటపడింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లలో సాంకేతిక లోపాలున్నాయని వెల్లడించారు. వీటి వాడకాన్ని నిలిపివేస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. (ఇళ్ల ముందు కరెన్సీ నోట్ల కలకలం) కాగా ఇప్పటికే వైరస్ వ్యాప్తి విషయాన్ని దాస్తోందని ప్రభుత్వంపై విమర్శలు వచ్చినవేళ నాసిరకం కిట్లతో ప్రజల ఆరోగ్యంపై చెలగాటమాడుతున్నారని విపక్షాలు మరోసారి భగ్గుమంటున్నాయి. మరోవైపు అధ్యక్షుడు జాన్ మగుఫులి మాత్రం ఈ కిట్ల ద్వారా.. కొంతమంది కరోనా బాధితులకు వైరస్ సోకలేదన్న విషయం నిరూపితమవుతోందన్నారు. ఆదివారం నాటికి టాంజానియాలో 480 కరోనా కేసులు నమోదవగా 17 మంది మరణించారు. అక్కడ పది లక్షల మందికి గానూ కేవలం 500 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) -
22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ
సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255 22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్(సేవ్) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్నగర్లోని చల్లా ఫంక్షన్ హాల్ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039 మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది. 20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163 -
ఠాణాలో మేక బందీ!
అశ్వారావుపేట రూరల్: ఈ ఫొటోలో కనిపిస్తున్న మేక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయిగూడేనికి చెందిన ఓ రైతు చేనులో మేతకు వెళ్లింది. ఆ సమయంలో పంట దెబ్బతినడంతో బాధిత రైతు మేకను పట్టుకొని నేరుగా స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు మేకను స్టేషన్ ఆవరణలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు. రెండు రోజులుగా ఈ మేక పోలీస్స్టేషన్లో బందీగా మారిపోయింది. ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ కెమెరాలో క్లిక్మనిపించింది. దీనిపై ఏఎస్ఐ ఎంవీ.సత్యనారాయణను వివరణ కోరగా.. తాను విధుల్లో లేని సమయంలో ఓ రైతు స్టేషన్కు తీసుకొచ్చి, తన చేనును ధ్వంసం చేస్తోందని చెప్పి వెళ్లిపోయాడన్నారు. -
మేకలయితే ఏంటి.. ఫైన్ కట్టాల్సిందే
పటాన్చెరు టౌన్/మక్తల్: గ్రామాభివృద్ధికి 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా పనులు నిర్వహిస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో ఆసక్తికరమైన రీతిలో జరిమానాలు విధించిన సంఘటనలు వెలుగు చూశాయి. ముత్తంగిలో జాతీయ రహదారి పక్కన మంగళవారం రాత్రి స్థానిక గుల్షన్ హోటల్ నిర్వాహకులు చెత్త పారబోస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ బిల్ కలెక్టర్ శ్రీశైలం, కోఆప్షన్ సభ్యుడు శ్రీధర్గౌడ్లు పట్టుకున్నారు. రహదారి పక్కన చెత్త వేసినందుకు ఆ హోటల్ యాజమాన్యానికి బుధవారం ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్ రూ. 10 వేల జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆ హోటల్ నిర్వాహకులు చెల్లించారు. అలాగే హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు మేయడంతో వాటి యజమానికి రూ. 3 వేల జరిమానా విధించినట్లు గ్రామ కార్యదర్శి కిషోర్ తెలిపారు. మరోవైపు నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలో కూడా మేకలు హరితహారంలో నాటిన మొక్కలు మేసినందుకు అధికారులు వాటి యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు. ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మేకలను పట్టుకుని కట్టేశారు. యజమాని వచ్చి రూ.10 వేలు చెల్లిస్తేనే మేకలను వదులుతామని చెబుతున్నారు. -
మేకపిల్లను మింగిన కొండచిలువ
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ సింగరాలపాడు అడవిలో శనివారం కొండచిలువ మేకపిల్లను మింగింది. సింగరాలపాడుకు చెందిన మేకల కాపర్లు మేతకోసం మేకలను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు ఆరు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక మేక పిల్లని మింగింది. కాపర్లు వెంటనే కర్రలు, కత్తులతో కొండచిలువపై దాడి చేసి దాన్ని చంపారు. కొండచిలువ నోటిని చీల్చి మేకపిల్లని క్షేమంగా బయటకు తీశారు. -
మేకలకు ఫైన్
జవహర్నగర్: జవహర్నగర్ కార్పోరేషన్ అధికారులు రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన మేకలకు ఫైన్ విధించారు. బుధవారం బాలాజీనగర్లోని శ్మశానవాటిక సమీపంతో పాటు గబ్బిలాలపేటలో నాటిన మొక్కలను కొన్ని మేకలు మేశాయి. దీంతో కార్పొరేషన్ సిబ్బంది వాటిని కార్పొరేషన్కు తీసుకువచ్చి రెండు వేల రూపాయల ఫైన్ వేసి మేకల యజమానులను హెచ్చరించి వదిలిపెట్టారు. -
తెలియక మేశా.. విడిపించండి మహాప్రభో!
సాక్షి, గోపాల్పేట (వనపర్తి) : రోడ్డు పక్కన నాటిన మొక్కలను మేసిన ఓ మేకను పంచాయతీ కార్యదర్శి చెట్టుకు కట్టేశాడు. మండలంలోని ఏదుట్లలో ఎన్ఆర్ఈజీఎస్ కింద రోడ్డు వెంబడి నాటిన మొక్కలను మంగళవారం ఓ మేక తినేసింది. దీంతో ఇంత కష్టపడి మొక్కలు నాటుతుంటే మేకలు తింటున్నాయని మేకల యజమానిని హెచ్చరించేందుకు మేకను కట్టివేశానని కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. మేక మెడలో తెలియక మేశాను.. దయచేసి నన్ను విడిపించండి అని అట్టపై రాసి మేక మెడకు తగిలించాడు. -
లక్షలు పలికే పొట్టేళ్లు
సాక్షి బెంగళూరు: ముస్లింల పండుగ అయిన బక్రీద్ సమీపిస్తుండటంతో నగరంలో చామరాజపేటెలోని ఈద్గా మైదానంలో గొర్రెలు, మేకల వ్యాపారం పుంజుకుంది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పొట్టేళ్లు విక్రయానికి వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియా నుంచి రూ.85 వేలు విలువ చేసే టెగరు జాతి పొట్టేలు అబ్బురపరుస్తోంది. సుమారు 17 నెలల వయసు ఉన్న పొట్టేలు 100 కిలోలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోలార్కు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడు. అయితే వారం రోజులుగా అక్కడే ప్రదర్శనకు ఉంచారు. మరో వ్యక్తి రూ.55 వేలు వెచ్చించి నలుపు రంగులో ఉన్న పొట్టేలును కొన్నాడు. దీని బరువు సుమారు 75 కేజీలుగా అంచనా వేశారు. ఇంకొకటి 90 కిలోలు ఉండగా రూ.60 వేలు ధరగా నిర్ణయించారు. కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. లక్ష రకు విలువ చేసే గొర్రెలు, పొట్టేళ్లను విక్రయానికి ఉంచారు. బన్నూరు గొర్రెలకు గిరాకీ బెంగళూరుతో పాటు కోలారు, రామనగర, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపుర తదితర జిల్లాల్లో గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు అక్కడక్కడా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాంసం వ్యాపారులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. బన్నూరు జాతికి చెందిన గొర్రెలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం తక్కువగా ఉన్నట్లు జీవాల వ్యాపారులు తెలిపారు. పండుగకు మరో వారం రోజులు గడువు ఉండటంతో వ్యాపారం పెరగవచ్చని ఆశాభావంతో ఉన్నారు. -
ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి
అదొక జంతు ప్రదర్శనశాల. అక్కడ ఒకే బోనులో ఓ పులి, మేక కలిసి ఉంటున్నాయి. ఈ విచిత్రాన్ని చూడడానికి రోజూ ప్రజలు అక్కడికి వచ్చేవారు. పులి నిద్రపోతున్నప్పుడు దాని పొట్టకు ఆనుకుని ఓ మేక విశ్రాంతి తీసుకుంటూ ఉన్న దృశ్యం చూసిన వారికి ఆశ్చర్యంగా ఉండేది. ఓ మహిళ ఇది చూసి ఆశ్చర్యంతో ఆ ప్రదర్శనశాల నిర్వాహకులలోని ఓ ప్రతినిధితో ‘‘ఇదెలా సాధ్యమైంది?’’ అని ఎంతో ఆసక్తితో అడిగింది. ఆరోజే ఆ ప్రతినిధి విధుల నుంచి రిటైర్ అవుతున్న రోజు. ఆయన ఆ మహిళతో నెమ్మదిగా చెప్పాడిలా... ‘‘ఇందులో రహస్యమేమీ లేదు. రోజూ ఓ మేకను మారుస్తుంటాం. ఈ నిజాన్ని ఎవరితోనూ చెప్పకండి’’ అన్నాడతను. పులి ఇతర జంతువులను చంపి తినే క్రూరమృగమే. కాదనను. కానీ అది ఆకలి వేసినప్పుడు మాత్రమే తనకు అవసరమైన మేరకు మరొక జంతువును చంపుతుంది. ఆకలి తీరిపోతే అది మహాసాధువవుతుంది. ఇంకేదీ పట్టించుకోదు. ఎవరి మీదా దాడికి పూనుకోదు. కానీ మనిషే కారణం లేకున్నా సరే ఇతరులను నాశనం చేసే గుణం కలిగి ఉంటాడు. ఓ అణుబాంబుతో వేలాది మందిని హతమార్చగలడు. హిట్లర్ వంటి మనుషులే లక్షల మంది మరణానికి కారకులయ్యారు. అలాటి వారు ఎంతటి దుర్మార్గానికైనా వెనుకాడరు. – యామిజాల జగదీశ్ -
మేక కడుపులో పందిని పోలిన పిల్ల
కంగ్టి(నారాయణఖేడ్): మేక కడుపులో పంది జన్మించిందంటే అందరూ వేళాకోలం అని కొట్టి పారేస్తారు. కానీ కంగ్టి మండలం ముర్కుంజాల్ గ్రామంలో ఓ మేక పందిని పోలిన పిల్లకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన రఘునాథ్రావు పాటిల్కు చెందిన మేక ఈనిన ప్రతీసారి నాల్గు పిల్లలకు జన్మనిచ్చేది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా నిండు చూలుతో ఉన్న మేక అస్వస్థతకు గురి కావడంతో సమీపంలోని తడ్కల్కు చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎంఏ రహీం పరిశీలించి మందులు ఇచ్చారు. కాగా గురువారం రాత్రి మేక మూడు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం మృతిచెందింది. మూడు మేక పిల్లలు జన్మించిన అనంతరం మేక కడుపు ఉబ్బెత్తుగా ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు మేక కడుపు కోసి చూడగా ఆశ్ఛర్యకరంగా వింత జంతువు బయట పడింది. వింత జంతువు పిల్ల దాదాపు ఐదు కిలోగ్రాముల బరువుతో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్తులే కాకుండా పొరుగు గ్రామాల నుంచి జనాలు తండోపతండాలుగా వచ్చి వింతను తిలకించారు. ఈ విషయంలో వీఏఎస్ డాక్టర్ ఎంఏ రహీంను విచారించగా చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలని తెలిపారు. -
మేయర్గా మూడేళ్ల మేక ఎన్నిక
వాషింగ్టన్ : ఓ మేక ఏడాది కాలం పాటూ ఓ పట్టణానికి గౌరవ మేయర్గా ఎన్నికైంది. ప్రభుత్వ సహకారంతో జరిగిన ఎన్నికల్లో శునకాలు, పిల్లులు సహా 15 ఇతర జంతువులు పాల్గొనగా, చివరగా మేక గౌరవ మేయర్గా గెలుపొందింది. మీరు విన్నది నిజమేనండి. వెర్మోంట్లోని ఫెయిర్ హావెన్ అనే పట్టణంలో ప్రత్యేకంగా ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లో మూడేళ్ల నుబియన్ జాతికి చెందిన లింకన్ అనే మేక 3000 మంది జనాభా కలిగిన ఫెయిర్ హావెన్ పట్టణ గౌరవ మేయర్గా ఎంపికైంది. ఫెయిర్హావెన్ నగర పాలనా వ్యవహారాలు చూసే మేనేజర్ జోసెఫ్ గుంటెర్ నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా ఈ ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని ఎలిమెంటరీ పాఠశాలపక్కనున్న మైదానం బాగుచేయడానికి నిధులు సేకరించేందుకు ఈ ఎన్నికలు నిర్వహించామని గుంటెర్ తెలిపారు. నిధుల సమీకరణ కోసం ఓ పట్టణంలో ఇదే తరహాలో ఎన్నికలు జరిగాయని తెలుసుకున్న తర్వాత ఈ ఆలోచన తట్టిందన్నారు. ప్రభుత్వ ప్రమేయంతో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం సరదాగా ఉందని తెలిపారు. మేయర్గా లింకన్, సమ్మీ అనే శునకంపై 13 ఓట్ల తేడాతో విజయం సాధించి, హానరరీ మేయర్గా ఎంపికైంది. మేక లింకన్ యజమాని క్రిస్టోఫర్ గణిత ఉపాధ్యులుగా అదే పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మైదానం నిర్మాణానికి మొత్తంనిధులు సమకూరకపోయినా.. మేక లింకన్తోపాటూ ఫెయిర్ హావెన్ పట్టణం పేరు మాత్రం ఈ ఎన్నికలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. -
మహిళా రైతు ‘శ్వేతా’నందం!
ప్రొఫెషనల్ డిగ్రీ చేసినా మేకల పెంపకం చేపట్టారు శ్వేత. ఎన్.ఐ.ఎఫ్.టి.లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. పెళ్లయ్యాక బెంగళూరులో నివాసం. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి వద్ద ఖాళీగా గడుపుతూ ఉండేది. భర్తతో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఒక మేకల పెంపక క్షేత్రాన్ని చూసి ముచ్చటపడింది. అంతే.. చిన్న జీవాలు పెంచే మహిళా రైతుగా మారిపోయింది. విశేషమేమిటంటే.. భర్తకు నచ్చజెప్పి డెహ్రాడూన్ దగ్గర్లోని రాణిపోక్రి గ్రామానికి మకాం మార్చి మరీ.. మేకల పెంపకం చేపట్టింది. ఆన్లైన్ అమ్మకాలతో ఏటా రూ. 25 లక్షల టర్నోవర్ చేస్తోంది! హేట్సాఫ్ శ్వేతా!! -
కుక్కను మేక అని నమ్మించి...
కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): ఓ వ్యక్తి దగ్గర ఉన్న మేకను దొంగిలించాలని భావించిన కొందరు దొంగలు.. అది మేక కాదు కుక్క అని చెప్పి ఆ వ్యక్తిని నమ్మిస్తారు. దొంగల మాటలు నమ్మిన ఆ వ్యక్తి మేకను కుక్కగా భావించి దాన్ని వదిలేసి వెళ్తాడు. ఈ కథ మనందరికీ తెలిసిందే. సరిగ్గా ఇలాంటి మోసపూరిత సంఘటనే ఒకటి కాన్పూర్లో జరిగింది. కుక్కను మేక అని నమ్మించి దుండగుడు ఓ అమాయకుడిని బురడీ కొట్టించాడు. పది వేల రూపాయలు విలువ చేసే మేకను ఎత్తుకుపోయాడు. వివరాల ప్రకారం.. కాన్పూర్కు చెందిన అశ్రఫ్ బక్రీద్ పర్వదినం సందర్భంగా తన దగ్గర ఉన్న మూడు నల్ల మేకలను అమ్మడానికి స్థానిక సంతకు తీసుకెళ్లాడు. రెండు మేకలను అమ్మాడు. మూడో మేకను ఒక దగ్గర కట్టేసి.. దాన్ని అమ్మడం కోసం సంతంతా తిరుగుతున్నాడు. అయితే ఇంతలో ఒక వ్యక్తి అశ్రఫ్ దగ్గరకు వచ్చి నీ మేక తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను ఓ చోట కట్టేశాను, వెళ్లి ఆ మేకను తెచ్చుకోమని చెప్పాడు. ఆ విషయం విన్న అశ్రఫ్, ఆ వ్యక్తి చెప్పిన మాటలను నిర్ధారించుకోకుండా, సరాసరి ఆ వ్యక్తి చెప్పిన చోటకే వెళ్లాడు. అక్కడ మొహం కనపడకుండా పూలతో అలంకరించిన ఒక నల్ల జంతువును చూశాడు. అయితే అశ్రఫ్ ఏ తాడుతో తన మేకను కట్టేసాడో అచ్చం అలాంటి తాడుతోనే ఆ నల్ల జంతువును కూడా కట్టి వేసి ఉంచాడు దుండగుడు. దాంతో అశ్రఫ్ దాన్ని తన మేకగానే భావించి వెళ్లి తాడు విప్పడానికి ప్రయత్నించాడు. అంతే ఆ మేక కాస్తా మొరగడం ప్రారంభించింది. మేక మొరగడమేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే అది మేక కాదు.. కుక్క కాబట్టి మొరిగింది. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న అశ్రఫ్ ప్రారంభంలో తన మేకను కట్టివేసిన ప్రదేశానికి వెళ్లాడు. కానీ అక్కడ అశ్రఫ్ మేక లేదు. మేక తప్పించుకు పోయిందని చెప్పిన వ్యక్తి తనని బురిడి కొట్టించి మేకను దొంగలించాడని అశ్రఫ్కు అర్ధమయ్యింది. దాంతో ఈ విషయం గురించి అక్కడ మార్కెట్ అధికారులకు చెప్పి సాయం చేయమని కోరారు. కానీ వారు అశ్రఫ్ అమాయకత్వానికి నవ్వడంతో అవమానం భరించలేని అశ్రఫ్ అక్కడ నుంచి వెళ్లి పోయాడు. -
5 లక్షలకు అమ్ముడుపోయిన ‘సల్మాన్ ఖాన్’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు ఉన్న క్రేజ్, స్టార్డమ్ ఎలాంటిదో అందరికి తెలిసిన సంగతే. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు ఆయన ఆరాధిస్తుంటారు. చిన్న యాడ్లో నటింపజేయడం కోసం కంపెనీలు ఆయనకు కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేస్తాయి. అలాంటిది ఈ స్టార్ హీరో కేవలం 5 లక్షల రూపాయలు పలకడం ఏంటి అనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే ఇంత ధర పలికింది బాలీవుడ్ హీరో సల్లు భాయ్ కాదు.. ఆయన పేరు పెట్టిన ఒక మేక. బక్రీద్ సందర్భంగా ముస్లింలు గొర్రె/మేకలను బలి ఇస్తారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, గోరఖ్పూర్కు చెందిన ఓ వ్యక్తి తాను పెంచుకుంటున్న మేకకు ‘సల్మాన్ ఖాన్’ పేరు పెట్టి అమ్మకానికి తీసుకొచ్చాడు. ఇంకేముంది తమ అభిమాన నటుడి పేరుతో ఉన్న ఆ మేకను కొనడానికి జనాలు ఎగబడ్డారు. చివరకు ఓ వీరాభిమాని అక్షరాల ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఆ ‘సల్మాన్ ఖాన్’ను అదే మేకను సొంతం చేసుకున్నాడు. ఇబ్రహీం ప్రవక్త త్యాగానికి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నేడు బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఇదే రోజున ఇబ్రహీం ప్రవక్త దేవుని అనుగ్రహం కోసం తన కుమారున్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో దేవుడు ఇబ్రహీం కుమారుని స్థానంలో ఒక గొర్రెను ఉంచుతాడు. ఫలితంగా నాటి నుంచి నేటి వరకూ బక్రీద్ పర్వదినాన ముస్లింలు గొర్రెను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. -
భయానకం.. మూగజీవినీ వదల్లేదు
ఛండీగఢ్: దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూగ జీవి.. పైగా గర్భంతో ఉందని కూడా చూడకుండా కొందరు యువకులు మృగ చేష్టలకు పాల్పడ్డారు. సామూహిక లైంగిక దాడికి పాల్పడి, హింసించి దాని ఉసురు తీశారు. ఘోరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మేవాత్లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మొత్తం 8 మంది యువకులు మేకపై దాష్టీకానికి పాల్పడ్డారు. ఆ సమయంలో దాని అరుపులకు నిద్ర లేచిన యాజమాని అస్లూ జరుగుతున్న ఘోరం చూసి నిశ్చేష్టులయ్యారు. కేకలు వేయటంతో భయపడ్డ నిందితులు పరారయ్యారు. వెంటనే పశువుల ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరోజు తర్వాత అది కన్నుమూసింది. ఈ ఘటనపై నగిన పోలీస్ స్టేషన్లో అస్లూ ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై జంతు పరిరక్షక సంఘాలు, పెటా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పెటా ప్రతినిధులు పోలీసులకు కోరుతున్నారు. -
మేకను చంపిన కొండచిలువ
ధారూరు వికారాబాద్ : ఏకంగా 12 అడుగుల కొండచిలువ... దానిని మనం చూస్తేనే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అది అడవిలో ఓ మేకను పట్టేసింది. కాపరి దానిని గమనించి స్థానికుల సాయం కోరాడు. సగంవరకు మింగేసిన మేకను వెనక్కి లేగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు చేసేది లేక రైతులు గొడ్డళ్లతో కొండచిలువను మధ్యలో నరికివేశారు. కొండచిలువ పొట్టలో ఉన్న మేకను బయటకు లాగారు. అయితే, అప్పటికే మేక చనిపోయింది. ఈ సంఘటన మంగళవారం ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు కట్ట కింద కట్ట మైసమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది.