సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్, వరంగ ల్ ప్రాంగణాల్లో 2015-16 విద్యా సంవత్సరానికి ప్రకటించిన వివిధ కోర్సులకు ఈ నెల 7 నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎంఏ, ఎంపీఏ, ఎంసీజే, పీజీడిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులకు ప్రవేశ పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య వెల్లడించారు.