మెదక్: జిల్లాలోని జహీరాబాద్ శనివారం ఓ ప్రైవేటు బస్సు ఢీకొని మహిళా విద్యార్థి తీవ్రంగా గాయపడింది. దీంతో తీవ్రంగా గాయాలు పాలైన ఆమెను హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా బస్సును నడపటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.