'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం' | prof kodandaram speaks over chalo hyderabad for jobs to youth | Sakshi
Sakshi News home page

'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'

Published Mon, Feb 13 2017 4:44 PM | Last Updated on Tue, Sep 5 2017 3:37 AM

'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'

'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'

కరీంనగర్‌ : 'మా కొలువులు మాకు కావాలి' పేరుతో ఈ నెల 22న చలో హైదరాబాద్‌ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్‌ ప్రొ.కోదండరాం తెలిపారు. కరీంనగర్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

( చదవండి : సతాయిస్తే వెనక్కి తగ్గుతామా? )
ప్రభుత్వం నుంచి అనుమతి రాకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ ర్యాలీ చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement