
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. మెడిసిన్ పరీక్షను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు అన్నారు.