రమ్య కేసు విచారణ వాయిదా | Ramya's trial postponed | Sakshi
Sakshi News home page

రమ్య కేసు విచారణ వాయిదా

Apr 12 2017 2:00 PM | Updated on Sep 5 2017 8:36 AM

రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు

హైదరాబాద్‌: రమ్య కేసు విచారణ వచ్చే నెల 2 కు వాయిదా పడింది. రమ్య తండ్రి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కేసులో మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ట్రైల్స్‌ ప్రారంభమైతే ఈ కేసు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. సెకండ్‌ ఛార్జ్‌షీట్‌ ఇంత వరకు కోర్ట్‌లో ఫైల్‌ చేయలేదు.
 
ఈ కేసు ఫాస్ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపడతాం అన్నారు. కానీ ఇప్పుడు సెషన్‌కోర్ట్‌ అంటున్నారు. సెషన్‌కోర్ట్‌కి ఈ కేసు వెళ్తే కాలయాపన తప్ప న్యాయం జరగుతుందని మేం భావించడం లేదు. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రమ్య చట్టం తీసుకురావాలని విన్నవించాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఈ కేసులో మైనర్లకు మద్యం అమ్మిన వారి పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నా, అయినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement