త్రిలింగేశ్వస్వామి ఆలయంలో చోరీ | robbery in temple | Sakshi
Sakshi News home page

త్రిలింగేశ్వస్వామి ఆలయంలో చోరీ

Published Sat, May 30 2015 11:05 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbery in temple

గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరి ఖని కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామంలో ప్రఖ్యాతి గాంచిన త్రిలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఆలయంలోకి చొరబడిన దొంగలు రెండు హుండీలను బద్దలు కొట్టి అందులోని నగదుతోపాటు గర్భాలయంలో ఉన్న సుమారు అర కిలో వెండి ఆభరాణాలను ఎత్తుకుపోయారు. శనివారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన పూజారి తాళాలు పగులగొట్టి ఉండడంతో స్థానికులకు విషయాన్ని తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement