స్కూలు బస్సు ఢీకొని బాలుడు మృతి | school bus hits toddler in adilabad district | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు ఢీకొని బాలుడు మృతి

Published Wed, Sep 9 2015 6:23 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

school bus hits toddler in adilabad district

ఆదిలాబాద్: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ బాలుడిని స్కూలు బస్సు చిదిమేసింది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జనకాంపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేశ్, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. చిన్న వాడైన అభిలాష్(4) ఇంటి వద్ద ఉంటున్నాడు.

బుధవారం సాయంత్రం ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చిన అతడిని భీమినికి చెందిన ఓ స్కూలు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement