toddler
-
బిడ్డ కోసం తండ్రి పాట్లు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందును గైనిక్ వార్డుకు తరలించడానికి కేజీహెచ్ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లారు. గైనిక్ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్ చేయడంతో ఈ విషయం బయట పడింది. గైనిక్ వార్డు వద్ద బ్యాటరీ కారు ఈ ఘటన వైరల్ కావడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్ తెలిపారు. -
మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. పెషావర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (పెస్కో), వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ (వాప్డా) సంస్థల ఫిర్యాదు మేరకు ఈ చిన్నారిపై కేసు నమోదు చేశారు.తరువాత ఆ చిన్నారిని అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఉదంతానికి సంబంధించిన అఫిడవిట్ను పరిశీలించిన న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కాగా ఆ చిన్నారి ఏమి చేసిందనే దానిపై పెస్కో, వాప్డా అధికారులు స్పష్టత ఇవ్వలేదు. పాక్కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలలో విద్యుత్ చౌర్యం కారణంగా జాతీయ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక వసూళ్లపై పాక్లోని పంజాబ్ ఇంధన శాఖ ఏప్రిల్ 7న ఆందోళన చేపట్టింది.లాహోర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఫైసలాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ముల్తాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, గుజ్రాన్వాలా ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలు ప్రభుత్వ శాఖల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది. -
వాట్ యాన్ ఐడియా! ఆ తల్లి చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే!
చిన్న పిల్లలకు హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. ఎవరో ఒకళ్లు వాళ్లని కదలకుండా గట్టిగా పట్టుకుని కూర్చోవాల్సిందే. ఓ పక్క వాళ్ల ఏడుపులు, పెడబొబ్బలు..మరోవైపు ఎంతలా పట్టకున్నా కదలిపోతూనే ఉంటారు. దీంతో గాయాలు వారికి, హైరానా పడటం మన వంతు అవుతుంది. హెయిర్ కట్టింగ్ షాపులోనూ లేదా మన ఇంటి దగ్గరైన అంతే పరిస్థితి. అలాంటి సమయంలో ఈ అమ్మ తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసిన ట్రిక్ని ఫాలో అయ్యితే చాలు. ఆ తల్లి మాత్రం భలే మంచి టెక్నిక్ కనుక్కుంది. చూస్తే కచ్చితంగా వాట్ యాన్ ఐడియా! అని నోరెళ్లెబెట్టకుండా ఉండరు. వివరాల్లోకెళ్తే..ఆమె తన చిన్నారికి హెయిర్ కట్టింగ్ చేసేందుకు ఓ అట్ట ప్యాకింగ్ బాక్స్ని తీసుకుంది. ముందు ఆ బాక్స్లో తన చిన్నారి కదలకుండా కూర్చొనేలా వాటికి రెండు హోల్స్ పెట్టుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారిని ప్యాకింగ్ బాక్స్లో ఆ రెండు హోల్స్లోకి రెండు కాళ్లు వచ్చేలా ఉంచి కూర్చొబెట్టింది. ఆ తర్వాత తల మాత్రం బయటకు ఉండేలా..చిన్నారి బాడీ, చేతులు కదలకుండా బాక్స్ని టేప్తో ప్లాస్టర్ వేసేసింది. ఆ తర్వాత ట్రిమ్మింగ్ మిషన్తో చక్కగా పిల్లాడికి హెయిర్ కట్ చేసేసింది. ఆ తల్లి ఆలోచనకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా!. కాగా, అందుకు సంబంధించిన వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #HairCut ♥️🩷 🤣🤣🤣🤣🤣 pic.twitter.com/dMgfFIORRm — Rupin Sharma IPS (@rupin1992) June 29, 2023 (చదవండి: టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు..ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!) -
ఇదేం పోకడ! ఖర్చు ఎక్కువ అవుతోందని.. బిడ్డకు పురుగులు తినిపిస్తున్న తల్లి
ప్రజలకు ఆరోగ్య స్పృహ గతంలో కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా కోవిడ్ పరిస్థితుల అనంతరం ఇమ్యూనిటీ విషయంలో జాగ్రత్తలు అధికమయ్యాయి. ఇక కొందరేమో పర్యావరణ హితంగా జీవనం ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా వీగన్లుగా మారిపోతున్నారు. అయితే, కెనాడాకు చెందిన టిఫానీ అనే ఫుడ్ బ్లాగర్ షేర్ చేసుకున్న ఓ విషయం మాత్రం నెట్టింట వైరల్గా మారింది. తన 18 నెలల కూతురుకు ఏకంగా ఆమె మిడతలను తినిపిస్తోంది. అదేంటి? చిన్న పిల్లకు మిడతలు ఆహారంగా ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకున్నారా? నిజంగా ఇది నిజం! ఖర్చుల భారం.. అందుకే.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్నామని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. వారానికి 250 నుంచి 300 డాలర్లు (సుమారు రూ.25000) సరుకులకు ఖర్చవుతోందని, అందుకనే తన బిడ్డకు ప్రోటీన్ సప్లిమెంట్ కోసం వినూత్నంగా ఆలోచించానని వెల్లడించింది. మిడతల్లో (క్రికెట్స్) విలువైన ప్రోటీన్ ఉంటుందని, తన బేబీకి అవి తినిపించి వాటిని భర్తీ చేస్తున్నానని టిఫానీ వివరించింది. డబ్బులు ఆదా అవడంతో పాటు పాపకు అవసరమైన ప్రోటీన్ అందుతోందని ఆమె పేర్కొంది. కీటక శాస్త్రంపై తనకున్న అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తాను కూడా సాలెపురుగు నుంచి తేలు వరకు పలు కీటకాలను గతంలో రుచి చూశానని పేర్కొంది. థాయ్లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో పర్యటించినప్పుడు చీమలు, మిడతలను తిన్నానని చెప్పుకొచ్చింది టిఫానీ. అక్కడి ప్రజల జీవన విధానంలో కీటకాలను తినడం మామూలేనని వెల్లడించింది. (చదవండి: 69 క్యాన్ల సోడాలు హాంఫట్) ఇలాంటి ప్రయోగాలు అవసరమా? మిడతలతో తయారు చేసిన పఫ్లు, ప్రోటీన్ పౌడర్ను తన బిడ్డకు అందిస్తునన్నాని టిఫానీ చెప్పింది. బీఫ్, చికెన్, పంది మాంసంలో ఉండే ప్రోటీన్లకు బదులు మిడతలపై ఆధారపడటంతో వారానికి అయ్యే ఖర్చులో 100 డాలర్ల వరకు ఆదా అవుతోందని పేర్కొంది. అయితే, టిఫానీ చర్యను సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు తప్పుబడుతున్నారు. చిన్న పిల్లపై ఇలాంటి ప్రయోగాలు అవసరమా? అని హితవు పలుకుతున్నారు. మరికొందరేమో కొత్త ఐడియా బాగానే ఉందిగానీ, చిన్నారికి ఇదో రకమైన శిక్ష కదా! అంటూ కామెంట్ చేశారు. ఏదైనా పాపకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. అయితే, తన కూతురు కొత్త రకమైన ఆహారాన్ని స్వీకరించడంలో ఎలాంటి బెరుకు, భయం కనబర్చదని టిఫానీ పేర్కొనడం గమనార్హం. అందువల్లే తమ ఆహారం కానిదైనప్పటికీ ఆమె తింటోందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు.. పీడియాట్రిక్ డైటీషియన్ వీనస్ కలామి ప్రకారం.. 6 నెలల వయసు తర్వాత పిల్లలకు ఆహారంలో పురుగులు, కీటకాలు భాగం చేస్తే తినే తిండి పట్ల పాజిటివ్ దృక్పథం అలవడుతుందని పేర్కొంది. (చదవండి: వింత ఘటన: విడిపోవడాన్ని సెలబ్రేట్ చేసుకుంది..ఫోటోషూట్ చేసి మరీ..) -
వైరల్ వీడియో బేబీ స్టెప్స్ నుంచి ఏకంగా డ్యాన్స్
-
అమ్మలాంటి ఆవు..బుజ్జోడి నవ్వులు
-
మిషన్ ఇంపాజిబుల్.. బుడ్డోడి ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే!
-
Cute Video: బుడ్డిది మామూలుది కాదు.. ఆరునెలలకే స్టెప్పులు వేసేస్తోంది.
-
ఏనుగు ఘీంకారం! క్షణాల్లో ఆమె ప్రాణాలు పోయేవే... ఆ పసిపాప ఏడవడంతో..
తిరువనంతపురం: కేరళలోని అన్నైకట్టి ప్రాంతంలో అడవిజంతువులకు తాగునీరు కరువవడంతో జనావాసాల్లోకి చొరబడి దాడులు చేస్తున్నాయి. ఈ ఘటనలను కట్టడిచేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పెద్దగా చర్యలు తీసుకోకపోవడంతో వన్యమృగాల దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అన్నైకట్టిలో హృదయాన్ని కదిలించే ఘటన వెలుగుచూసింది. అడవి నుంచి జనారణ్యంలోకి వచ్చిన భారీ ఏనుగు మంగళవారం ఉదయం 4 గంటలకు ఓ ఇంటి సమీపంలో ఘీంకరించింది. ఆ చప్పుడు విన్న బాలామణి అనే మహిళ ఏం జరిగిందో తెలుసుకుందామని తన తమ్ముడి కూతురిని కూడా వెంటేసుకుని పరుగున బయటకు వచ్చింది. ఒక్కసారిగా ఏనుగు వారివైపు తిరిగి.. ఆమెను కింద పడేసింది. బాలామణికి కొద్దిదూరంలోనే ఆ పసిపాప కూడా ఉంది. అది గనుక దాడిచేస్తే క్షణాల్లో ఆమె ప్రాణాలు గాల్లో కలిసేవే! అయితే, అదృష్టవశాత్తూ బాలామణి ప్రమాదం నుంచి బయటపడింది. భయానక ఘటనతో వణికిపోయిన ఆ పసిపాప బిగ్గరగా ఏడ్చింది. అది చూసిన ఆ ఏనుగు బాలామణికి హాని తలపెట్టకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, అన్నైకట్టి కొండ ప్రాంతం. అయితే, అక్కడి వన్యప్రాణులకు తాగేందుకు సరిపడా నీరులేకపోవంతో అవి జనావాసాల్లోకి చొరబడి దాడులు చేయడం మామూలైపోయింది. ప్రభుత్వాలు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. షాక్ తిన్నా! తర్వాత ఏమైందో తెలియదు ‘భారీ శబ్దం వినిపిస్తే ఏమైందో చూద్దామని బయటికి వెళ్లాను. నాతోపాటు నా తమ్ముడి కూతురు కూడా ఉంది. ఏనుగును చూసి అక్కడ నుంచి పరుగెత్తుకెళ్దామనే లోపే అది తన తొండంతో నన్ను కిందకు తోసేసింది. ఒక్కసారిగా షాక్ తిన్నా! తర్వాత ఏమైందో స్పృహ లేదు. కాసేపటికి మా చిన్నదాని ఏడుపు విని మెలకువ వచ్చింది. ఆ దేవుడే మమ్మల్ని రక్షించాడు’ అని బాలామణి చెప్పుకొచ్చింది. -
బుడ్డోడి ధైర్యం సల్లగుండా.. భయం లేకుండా ఎలా కొండచిలువుతో ఆడుతున్నాడో చూడండి !
-
చిన్నారి చికిత్సకు రూ. 11 కోట్ల విరాళం.. కనీసం పేరు చెప్పకుండా!
కష్టాల్లో ఉంటే అయినవారే పట్టించుకోని రోజులివి.. నోరు తెరిచి సాయం కావాలని అడిగిన చూసి చూడనట్లు వదిలేసే కాలం ఇది. అలాంటిది ముక్కు ముఖం తెలియని చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా ఆదుకున్నాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి కోట్లు విరాళంగా ఇచ్చి గొప్ప మనసును చాటుకున్నాడు. ఎస్ఎంఏ అనే వ్యాధి సోకిన 15 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు ఖాతాలో జమ చేశారు.అమెరికాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నా ఆయన కోట్లు దానం చేసి కనీసం తన పేరు, వివరాలు చెప్పకుండా బాలుడికి కొత్త జన్మను అందించాడు. కేరళలోని ఎర్నాకుళానికి చెందిన సారంగ్ మీనన్, అదితి నాయర్ కుమారుడు నిర్వాణ్(15 నెలలు). నిర్వాణ్ స్పైనల్ మస్క్లర్ అట్రోఫీ(వెన్నుముక కండరాల క్షీణత) అనే అరుదైన వ్యాధితో బాధపడతున్నాడు. ఎస్ఎంఏ చికిత్సకు దాదాపు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే వన్ టైమ్ డ్రగ్ అయిన జోల్జెన్మ్సా ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. దీనిని మెడికల్ ప్రిస్క్రిప్షన్, పిల్లల తల్లిదండ్రుల లేఖతో అమెరికా నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. అంతేగాక ఎస్ఎమ్కే కేసులు, దీని డ్రగ్ డెవలప్మెంట్ పరిశోధనలు తక్కువగా ఉండటం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందులలో ఇది ఒకటి. దీంతో గత నెల జనవరిలో బాలుడి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోసం క్రౌడ్ఫండ్ అకౌంట్ తెరిచారు. ఫిబ్రవరి 19 వరకు వారికి రూ.5.42 కోట్లు విరాళంగా అందాయి. ఈ క్రమంలోనే క్రౌడ్ ఫండింగ్ ఖాతాలోకి ఎవరో వ్యక్తి తన పేరు చెప్పకుండా భారీ మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 1.4 మిలియన్ డాలర్లు తమకు అందినట్లు బాధిత కుటుంబం ఫేస్బుక్లో వెల్లడించింది. ఇది భారత కరెన్సీ ప్రకారం అక్షరాల 11.50 కోట్లు. ఇంత మొత్తం విరాళంగా ఇచ్చి బాలుడికి కొత్త జీవితాన్ని అందించాడు. అయితే ఈ డబ్బులు ఎవరూ విరాళంగా ఇచ్చారో తమకు తెలియదని కుటుంబ నిర్వాణ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. అతనెవరో, తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని తెలిపారు. తమ జీవితంలో ఇదొక అద్భుతమని వర్ణించారు. ఇప్పటి వరకు అజ్ఞాత దాతతో సహా 72,000 మంది వ్యక్తులు నిర్వాణ్కు విరాళాలు అందించారు. దీంతో సారంగ్ దంపతుల ఆర్థిక కష్టాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లైంది. చదవండి: కర్ణాటకలో అదృశ్యమైన బస్.. తెలంగాణలో లభ్యం, మధ్యలో ఏం జరిగింది! -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
షాకింగ్ ఘటన: చిన్నారిపై దాడి చేసి ఈడ్చుకెళ్లింది
సరదాగా ఆడుకుంటున్న ఆ చిన్నారి మీద.. ఓ కోతి దాడికి పాల్పడింది. నెమ్మదిగా వెనక నుంచి వచ్చి ఆమె మీదకు దూకి కింద పడేసింది. ఆపై ఆ చిన్నారిని లాక్కుంటూ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. చిన్నారి ఏడ్పులు విన్న ఓ స్థానికుడు అది గమనించి.. దానిని తరిమి ఆ చిన్నారిని రక్షించాడు. ఘటన సమయంలో ఆ చిన్నారి తల్లి లోపల పని చేసుకుంటుందట. సర్వేలెన్స్ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చూస్తేగానీ ఆ షాకింగ్ ఘటనను స్థానికులు నమ్మలేదు. గాయపడ్డ చిన్నారిని వ్యాక్సిన్ ఇప్పించి చికిత్స అందించారు. చైనా నైరుతి ప్రాంతం చోంగ్క్వింగ్లో ఈ ఘటన జరిగింది. ఇదిలా ఉండగా.. ఆ కోతి అంతకు ముందు కొందరు గ్రామస్తుల మీద కూడా దాడి చేసిందట. పక్కనే ఉన్న గుట్టల్లోంచి ఆ కోతి గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన కలకలంతో అప్రమత్తమైన అధికారులు.. దానిని పట్టుకుని వైల్డ్ లైఫ్ విభాగానికి అందజేస్తామని చెప్తున్నారు. -
‘పసిపిల్లలను పార్లమెంట్కు తీసుకురావద్దు’... బ్రిటన్లో దుమారం
లండన్: బ్రిటన్ పార్లమెంట్ లోకి పసిపిల్లలను తీసుకురావద్దని ఆంక్షలు విధించడం అక్కడ తీవ్రమైన నిరసనకు దారితీసింది. పార్లమెంట్ లోకి చిన్నారులను తీసుకురావద్దంటూ ఓమహిళా ఎంపీకి ఈ మెయిల్స్ పంపారు. ఈ క్రమంలో వివాదం రాజుకుంది. అయితే వీటిపై స్పందించిన ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంట్ నియమాళికి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిచేసే తల్లులకు పిల్లల సంరక్షణ చూసుకునేలా వేసులుబాటు కల్పించాలంటూ చర్చ చేపట్టారు. వివాదం రాజుకుంది ఇలా.. వెస్ట్మినిస్టర్ హాల్లో మంగళవారం తన మూడు నెలల కొడుకుతో కలిసి ఎంపీ స్టెల్లా క్రీసీ పార్లమెంట్ చర్చలో పాల్గొన్నారు. చర్చకు హాజరైన తర్వాత బిడ్డను పార్లమెంట్ కు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని ఎంపీకి పార్లమెంటు దిగువ సభ ప్రతినిధి చెప్పారు. మంగళవారం కాన్ఫరెన్స్లో బైనౌపే లేటర్ కన్స్యూమర్ క్రెడిట్ స్కీమ్ల గురించి చర్చ జరిగింది. ఇందులో పాల్గొన్నఆమె పసికందును స్లింగ్లో ఛాతీకి కట్టుకుని హాజరయ్యారు. క్రీసీ చర్యలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పార్లమెంట్కు ఇలా పిల్లలను తీసుకురావడం సమస్య కాలేదని నిలదీసిన క్రీసీ... దీనిపై కామన్స్ అధికారుల నుంచి ఆమె వివరణ కోరింది. ఇదివరకు తన పిల్లలిద్దరినీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే హౌస్ ఆఫ్ కామన్స్లోకి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో షేర్ చేయడంతో నిరసన తనకు ఎదురైన అనుభవం గురించి క్రీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేను ఛాంబర్లో మాట్లాడేటప్పుడు నా 3 నెలల... నిద్రపోతున్న బిడ్డను తీసుకుపోకూడదని (ఇప్పటికీ పార్లమెంట్ లో మాస్క్లు ధరించాలనే నియమం లేదని విమర్శించారు ) నాకు నోటిసులు పంపారు’’ అని ఆమె ట్విట్టర్లో తనకు పంపిన లెటర్ ను షేర్ చేశారు. తనకు పార్లమెంట్ ప్రసూతి కవరేజ్ లేదని... అది కలిగి ఉండటానికి ఉపాధి హక్కులు లేవని ఎంపీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వివరించారు. పెద్ద ఎత్తున నిరసనలు... క్రీసీ లెటర్ ఆన్లైన్లో పెద్ద ఎత్తున నిరసనకు దారితీసింది. ఈ విషయంపై అన్ని రంగాల్లోని మహిళలు నిరసనగళం వినిపించారు. తమ ఉద్యోగాలను సులభతరం చేయడానికి పార్లమెంట్ నిబంధనలను మార్చాలని పలువురు మహిళా చట్టసభ సభ్యులు కోరారు. ఎంపీలకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని నిలదీశారు. పనిచేసే ప్రాంతానికి శిశువును తీసుకెళ్లాడనికి చాలా చోట్ల అనుమతించడం లేదని పలువురు మహిళలు వాపోయారు. తమ బిడ్డను వేరే వాళ్లకి అప్పగించి చూసుకోమని చెప్పడానికి ఆర్థిక స్థోమత లేదని ఆవేదన వెలిబుచ్చారు. సోషల్ మీడియా ఆగ్రహం అనంతరం... ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీసింది. నెటిజన్ల ఆగ్రహం అనంతరం... తాము ఈ విషయాన్ని సమీక్షిస్తున్నట్లు హౌస్ ఆఫ్ కామన్స్ ప్రతినిధి చెప్పారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎంపీలందరూ పార్లమెంటులో తమ విధులను నిర్వహించగలగడం చాలా ముఖ్యం. సభ్యులు ఎప్పుడైనా ఛాంబర్లో లేదా వెస్ట్మిన్స్టర్ హాల్లో ఉన్నప్పుడు తమ అవసరాల గురించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు, క్లర్క్లు, డోర్కీపర్లతో సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి స్టెల్లా క్రీసీతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఇదేం కొత్త కాదు... శిశువులను పార్లమెంటుకు తీసుకురావడం ఇదేం కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధులు తమ పిల్లలను చట్టసభలకు తీసుకువెళ్లారు. అన్నెలీస్ డాడ్స్ తన బిడ్డను 2016లో యూరోపియన్ పార్లమెంట్కు తీసుకెళ్లడం నుంచి న్యూజిలాండ్ పీఎం జసిండా ఆర్డెర్న్ 2018లో మూడు నెలల కుమార్తెను యూఎన్ జీఏకి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించడం వరకు... చాలా మంది మహిళా చట్టసభ సభ్యులు గతంలో ఇలా చేశారు. -
మీ పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నాయా? ఇలా చేశారంటే..
పిల్లల్లో సాధారణంగా 10 నెలలు లేదా ఏడాది నాటికి ముద్దుమాటలు (బాబ్లింగ్) మొదలై దాదాపు రెండేళ్ల వయసు నాటికి చాలావరకు కమ్యూనికేట్ చేస్తుంటారు. మూడేళ్లకు అన్ని మాటలూ వచ్చేస్తాయి. అయితే కొందరు చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వినడానికి దోహదపడే వినికిడి వ్యవస్థ, అలాగే మాట్లాడటానికి అవసరమైన వోకల్ కార్డ్స్, మాట్లాడేందుకు దోహదపడే గొంతులోని కండర నిర్మాణం... ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, కొందరిలో సహజంగానే మాటలు రావడం ఆలస్యమవుతుంటుంది. ఆ పిల్లల్లో వారి భాష ఓ స్థాయి పరిణతికి రావడంలో జరిగే ఆలస్యం (లాంగ్వేజ్ మెచ్యురేషన్ డిలే) కావడం దీనికి కారణం. ఇది వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. ఈ సమస్య అబ్బాయిల్లోనే ఎక్కువ. ఇలా మాటలు రావడం ఆలస్యమైన సందర్భాల్లో సాధారణంగా స్కూల్లో చేర్చే ఈడు నాటికి పిల్లలు తమంతట తామే మాట్లాడతారు. ఇక కొందరిలో మాటలు రావడంలో ఆలస్యం జరగడం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలను (డిజార్డర్స్ను) సూచించే ఒక లక్షణం. ఉదాహరణకు వినికిడి లోపాలు, మానసికమైన సమస్యలూ, ఆటిజం వంటి కండిషన్, భాషను అర్థం చేసుకోవడం, అభివ్యక్తీకరించడంలో సమస్యలు (ఎక్స్ప్రెసివ్ రిసెప్టివ్ లాంగ్వేజ్ డిజార్డర్)... మొదలైనవాటిల్లో ఏదో ఒకదానివల్ల మాటలు రావడం ఆలస్యం కావచ్చు. కొన్నిసార్లు అది ఎదుగుదల సమయంలో వచ్చే ఇతర ఆరోగ్య లోపాల వల్ల కూడా అయి ఉండవచ్చు. ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిజార్డర్ ఉన్న పిల్లలు భాషను ఒక కమ్యూనికేటివ్ సాధనంగా వాడటంలో విఫలమవుతారు. అయితే వారిలోని తెలివితేటలు, వినికిడి, ఉద్వేగభరితమైన ఫీలింగ్స్... తదితర విషయాల్లోనూ మామూలుగానే ఉంటారు. తమ సంజ్ఞలు, సైగల (గెష్చర్స్) ద్వారా కమ్యూనికేషన్ అంతా సాధారణంగానే నిర్వహిస్తుంటారుగానీ, మాటలు లేదా పదాలు పలకడం (వర్బల్ ఎక్స్ప్రెషన్స్) ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడం మాత్రం చాలా పరిమితంగా ఉంటుంది. మరికొందరిలో భాషను నేర్చుకునే శక్తి కొంతమేరకు తక్కువగానే ఉంటుంది. వాళ్లలో మరికొన్ని కాంప్లికేషన్లూ వచ్చే అవకాశమూ ఉంటుంది. ఏం చేయాలి? ఇలాంటి పిల్లల విషయంలో... వారు మాటలు నేర్చుకోవడం / మాట్లాడటం అనే ప్రక్రియ ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయంలో పూర్తి ఇవాల్యుయేషన్ అవసరం. ఇందుకోసం... ‘ఎర్లీ లాంగ్వేజ్ మైల్స్టోన్ స్కేల్ టెస్ట్’, ‘స్టాన్ఫోర్డ్ ఇంటెలిజెన్స్ టెస్ట్’, ఆడియోమెట్రీ, బ్రెయిన్ స్టిమ్యులస్ రెస్పాన్స్ టెస్ట్ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల వల్ల మాటలు రాకపోవడానికి కారణాలేమిటి, ఆ కారణాల తీవ్రత ఎంత, వాటి ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయన్న పలు విషయాలు తెలుస్తాయి. ఇలాంటి పిల్లలున్నవారు ఒకసారి మీ కుటుంబ పిల్లల డాక్టర్కూ లేదా స్పీచ్ థెరపిస్ట్కూ చూపించాలి. ఒకసారి సమస్యనూ, తీవ్రతనూ తెలుసుకుంటే... ఆ తర్వాత ‘స్పీచ్ పాథాలజిస్ట్’లు పిల్లలకు మాటలు వచ్చే శిక్షణను మొదలుపెడతారు. తల్లిదండ్రుల భూమిక ఇలాంటి పిల్లలకు మాటలు నేర్పే విషయంలో తల్లిదండ్రులు చాలా ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. వాళ్లకూ కొంత శిక్షణ అవసరమవుతుంది. తల్లిదండ్రులు పూర్తి సహనంతో ఉంటూ, భాష విషయంలో తామూ పిల్లల స్థాయికి చేరుకుని, వాళ్లకు మాటలు నేర్పాలి. తల్లిదండ్రులు నిత్యం ఆ పిల్లలను ఉత్సాహపరుస్తూ... వారికి భాషతో పాటు ఇతర నైపుణ్యాలూ నేర్పడానికి సంసిద్ధంగా ఉండాలి. - డా. రమేశ్బాబు దాసరి సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ చదవండి: ఒకే కంపెనీలో 75 ఏళ్ల సర్వీస్... 90 ఏళ్ల వయసులో రిటైర్మెంట్..!! -
ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో
కోతి చేష్టలు కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అదరిని నవ్విస్తుంటాయి. ఇంటి ఆవరణలో, పైన ఏ వస్తువులు కనిపించిన వాటిని చెల్లాచెదురుగా పడవేస్తాయి. ఇక వాటికి ఏమైనా దొరికితే వాటిని పట్టుకొని నానా హంగామా సృష్టిస్తాయి. ఇక కోతులు డబ్బులు, ఫోన్లను పట్టుకొని పారిపోయిన సంఘటనలు చాలానే చూశాం. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్గా మారింది. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ ఈ వీడియోలో ఒక మంచంపై చిన్నారి మొబైల్తో ఆడుకుంటుంది. అక్కడికి వచ్చిన కోతి పాప పక్కనే కూర్చుంటుంది. వెంటనే చిన్నారి చేతిలోని ఫోన్కు లాక్కొని దాన్ని పరీక్షించి చూస్తుంది. కొద్దిసేపు కోతిని పరీక్షించిన చిన్నారి ఆ ఫోన్ను తిరిగి లాక్కుంటుంది. వెంటనే మళ్లీ పాప దగ్గరి నుంచి కోతి ఫోన్ లాక్కుంటుంది. ఇలా ఈ వీడియో చూస్తుంటే మొబైల్ నాదంటే నాది అని లాక్కుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరలవుతూ నెజిజన్లను నవ్విస్తోంది. చదవండి: అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్ View this post on Instagram A post shared by Jagadeesh Madineni (@jagadeeshmadinenimadineni) -
కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా
పిల్లలకు బాల్యం నుంచే సమయస్ఫూర్తి.. పరిస్థితులను ఎదుర్కొని నిలబడే తెగువ, ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను అలవాటు చేయాలి. ప్రతి చిన్న విషయానికి కుంగిపోవడం, బెంబేలెత్తడం చేస్తూంటే.. జీవితంలో ముందుకెళ్లడం కష్టమని బాల్యం నుంచే అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే పట్టుమని ఐదేళ్ల వయసు కూడా లేని ఓ చిన్నారి స్టేజీ మీద చూపిన అద్భుత సమసయస్ఫూర్తి, ఆత్మ విశ్వాసం.. నెటిజనలను ఫిదా చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుందనే వివరాలు తెలియదు. ఇక వీడియోలో ఓ బాబు, పాప ఇద్దరు ర్యాంప్ వాక్ చేస్తుంటారు. తెల్ల దుస్తుల్లో ఎంతో క్యూట్గా ఉంటారు చిన్నారులు. అలా వాక్ చేస్తుండగా ఉన్నట్టుండి పాప చెప్పు ఉడిపోతుంది. దాన్ని సరిచేసుకుంటుండగా.. తల మీద ఉన్న కిరీటం కూడా జారిపోతుంది. ఈ సంఘటన చూసి అక్కడున్న పెద్దలంతా ఒక్కసారిగా నవ్వుతారు. కూడా ఉన్న పిల్లాడు నవ్వుతాడు. (చదవండి: మత్తులోనూ మందుబాబుల దేశభక్తి.. వీడియో వైరల్) ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. ఇంత జరిగినా ఆ చిన్నారి ఏ మాత్రం బెదరదు.. సిగ్గుపడదు. వెంటనే తన కిరీటాన్ని సరిచేసుకోవడమే కాక చెప్పు తొడుక్కుని ర్యాంప్ వాక్ పూర్తి చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. (చదవండి: హైదరాబాద్ మెట్రో: ఇంత దారుణమా.. మనుషులమేనా?!) ఇది చూసిన నెటిజనులు.. ‘‘చిన్నారి స్థానంలో పెద్దవారు ఉన్నప్పటికి కూడా జరిగిన సంఘటనతో వారు చాలా సిగ్గుపడేవారు. భయపడుతూ.. అక్కడ నుంచి పరిగెత్తే వారు. కానీ ఈ చిన్నారి ఎంతో ఆత్మవిశ్వాసంతో.. ఏమాత్రం తడబడకుండా.. పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగింది. చాలా స్ట్రాంగ్గా నిలబడింది. భవిష్యత్తులో కూడా ఈ చిన్నారి ఇలానే పరిస్థితులకు తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే View this post on Instagram A post shared by Beautiful and Wholesome World (@_beautiful_._world) -
పది నెలల చిన్నారిపై ఆయా పైశాచికత్వం.. గుక్కపట్టి ఏడుస్తున్నా
కోల్కతా: ప్రస్తుతం భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తేనే.. జీవితం సాఫిగా సాగిపోతుంది. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులను దృష్టి పెట్టుకుని.. చాలా మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో చిన్నారుల ఆలనాపాలన విషయం ఉద్యోగం చేసే దంపతులను తీవ్రంగా కలిచి వేస్తుంది. ఇంట్లో పెద్దవారు ఉంటే పర్లేదు. కానీ బయట వ్యక్తుల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడే సమస్య ఎదురవుతుంది. ఈ ఆయాల్లో కొందరు చిన్నారులనే కనికరం కూడా లేకుండా పిల్లలను హింసిస్తారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్కు చెందిన దంపతులు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. వారికి పది నెలల పాప ఉంది. ఇద్దరు జాబ్ చేస్తుండటంతో చిన్నారి ఆలనపాలన చూడటానికి ఓ ఆయాను నియమించుకున్నారు. మొదట్లో బాగానే ఉంది. కానీ రాను రాను చిన్నారి ప్రవర్తనలో మార్పు రాసాగింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చాక చిన్నారి ఆయా దగ్గరకు వెళ్లడానికి నిరాకరించేది. ఆమెనే చూస్తేనే పాప బాగా ఏడ్చేది. (చదవండి: Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి..) తల్లిదండ్రులకు ఆయా ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఈ క్రమంలో వారు ఇంట్లో సీసీటీవీ పెట్టారు. ఆఫీస్కు వెళ్లాక.. అక్కడ నుంచి మానిటర్ చేసేవారు. ఇక సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు వారిని భయభ్రాంతులకు గురి చేశాయి. ప్రాణం పోయినట్లు విలవిల్లాడారు. కారణం ఏంటంటే సదరు ఆయా ఏమాత్రం కనికరం లేకుండా పది నెలల చిన్నారిని.. దారుణంగా చితకబాదింది. పాప గుక్కపట్టి ఏడుస్తున్న ఆ రాక్షసి కనికరించలేదు. (చదవండి: Fact Check: డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ ఇలా ఉన్నాడేంటీ?) ఈ దృశ్యం చూసిన వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వెంటనే ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో పోలీసులుకు ఫిర్యాదు చేసి.. వారిని వెంటపెట్టకుని ఇంటికి వచ్చారు. ఆయాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్నారిని మెడినిపూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: అర్పిత.. స్ఫూర్తి ప్రదాత -
‘ఒరేయ్ కన్నా.. ఏంట్రా ఈ పని!’
ఎంతటోడైనా సరే అమ్మ ముందుకు వచ్చేసరికి పసివాడే అవుతాడు. అలాంటిది అమ్మ ముందు వేషాలేస్తే ఊరుకుంటుందా?. సాధారణంగా అభిమానంతోనో లేదంటే నిరసన తోనో కొందరు ఆట జరిగేటప్పుడు మైదానాల్లోకి పరుగులు తీయడం చూస్తుంటాం. కానీ, ఇక్కడో బుడ్డోడు అల్లరిలో భాగంగా మైదానంలోకి పరుగులు తీశాడు. సీరియస్గా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. రెండున్నరేళ్ల పిలగాడు తల్లి ఒడి నుంచి తప్పించుకుని గ్రౌండ్లోకి దూరబోయాడు. ఆటలో పడి పరధ్యానంలోకి వెళ్లిన ఆ తల్లి.. కాసేపటికే కొడుకు ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది. We hope this mother and her young pitch invader are having a great day. 😂 pic.twitter.com/hKfwa6wyWI — Major League Soccer (@MLS) August 9, 2021 వెంటనే రియాక్ట్ అయ్యి ఒక దూకున బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్లోకి దౌడు తీసింది. ఆ వెంటనే కొడుకును ఒడిసి పట్టి, సిబ్బంది సహకారం లేకుండానే గ్రౌండ్ నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇంకేం గ్రౌండ్ మొత్తం ఒక్కసారి ఘొల్లుమని గోల చేసింది. A young pitch invader was quickly scooped up by their own personal security detail without incident. #FCCincy #mls pic.twitter.com/gK2bzgNdas — Sam Greene (@SGdoesit) August 8, 2021 కట్ చేస్తే.. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. సిన్సిన్నాటి, ఓర్లాండో మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. ఆ పిలగాడి పేరు జేడెక్ కార్పెంటర్, ఆ తల్లి పేరు మోర్గాన్ టక్కర్. ఓహియోలో ఉంటారు ఆ తల్లీకొడుకులు. -
చిన్నారికి లాటరీ తెచ్చిన అదృష్టం.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఫ్రీ
సాక్షి, ముంబై: వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో ఎస్ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ) తో బాధపడుతున్న చిన్నారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. రానున్న రెండో పుట్టిన రోజు సందర్భంగా ఆ పసిబిడ్డకు పునర్జన్మ లభించింది. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన 16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లభించడంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదీ అమెరికా సంస్థనుంచి ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఇండియాలో తొలి చిన్నారిగా నిలిచాడని పేర్కొన్నారు. వివరాలను పరిశీలిస్తే..మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన శివరాజ్ దావరే ఎస్ఎంఏ బారిన పడ్డాడు. ప్రాథమిక నిర్ధారణ అనంతరం శివరాజన్ ప్రాణాలను కాపాడటానికి ‘జోల్గెన్స్మా’ (జీన్ రీప్లేస్మెంట్ థెరపీ) ఇంజెక్షన్ అవసరమని ముంబైలోని హిందూజా ఆసుపత్రికి న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని తేల్చి చెప్పారు. ఈ అరుదైన వ్యాధి చికిత్సలో కీలకమైన, అతి ఖరీదైన ఇంజెక్షన్ ఎలా సాధించాలో తెలియక మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన శివరాజ్ తండ్రి విశాల్, తల్లి కిరణ్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం అమెరికాకు చెందిన సంస్థ లాటరీ ద్వారా ఈ ఇంజెక్షన్ను ఉచితంగా ఇస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ఉదాని సూచించారు. ఉదాని సలహా మేరకు విశాల్ ఉచిత ఇంజక్షన్కోసం ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ డిసెంబర్ 25, 2020 న శివరాజ్ ఇంజెక్షన్ పొందడానికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 19 న, శివరాజ్కు హిందూజా ఆసుపత్రిలో ఇంజక్షన్ ఇచ్చారు. వైద్యుల ప్రకారం ఎస్ఎంఏ అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో పడుతున్నారు. ఈ జన్యు లోపం పిల్లల కదలికలను నిరోధిస్తుంది. కండరాలు పని తీరును, మెదడు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లల మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రపంచంలోనే అతి ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ మాత్రమే. అదీ రెండేళ్లలోపు ఈ చికిత్స అందించాలి. భారత్లో దొరకని ఆ ఇంజెక్షన్ను అమెరికా నుంచి మాత్రమే తెప్పించాలి. ఇందుకు సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. -
పసికందు ఏం నేరం చేసిందని..?
నరసన్నపేట: ఆ లేలేత కళ్లతో తల్లిని చూసిందో లేదో..? ఆ చిట్టి చేతులతో తండ్రిని తాకిందో లేదో..? పుట్టాక చనుబాలైనా తాగిందో లేదో..? తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి తుప్పల్లోకి చేరిందో పసిపాప. అప్పుడే పుట్టింది కదా.. అమ్మను విసిగించి ఉండదు. తొమ్మిది నెలలు గర్భంలోనే ఉంది కదా.. నాన్న మనసు కష్టపెట్టే ప్రసక్తే లేదు. అసలు తాను ఆడపిల్లనని కూడా తనకు తెలిసి ఉండదు. మరేం నేరం చేసిందని.. పాపకు ఇంత శిక్ష విధించారు ఆ తల్లిదండ్రులు...? నరసన్నపేట–జలుమూరు మండలాల బోర్డర్ కంబకాయ సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు పక్కన బుధవారం ఓ పసిపాప తుప్పల్లో స్థానికులకు దొరికింది. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం స్థానికులు సూర్యనారాయణ, బసివాడకు చెందిన యూత్ స్టార్ సభ్యులు సాయిమణికంఠ, తేజ, కృష్ణలు రన్నింగ్ చేస్తుండగా రోడ్డు పక్క నుంచి ఓ పసి బిడ్డ ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలిస్తే అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్త కారుతూ కనిపించింది. వెంటనే వారు బిడ్డను బయటకు తీసి అదే రోడ్డుపై వెళ్తున్న మహిళల సాయంతో సపర్యలు చేశారు. వేకువజామున ఎవరో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు. శిశువుకు సపర్యలు చేశాక వెంటనే ఆటోలో నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. సకాలంలో స్పందించిన ఆస్పత్రి సిబ్బంది ఆ శిశువుకు సపర్యలు చేశారు. సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ వి.సత్యనారాయణ, చైల్డ్లైన్ ప్రతినిధులు వచ్చి బిడ్డను పరిశీలించారు. ఊపిరి పీల్చుకోవడంలో కొంత ఇబ్బంది పడుతుండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది బాలరాజు తెలిపారు. -
ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి
గాంధీనగర్: దానం చేయడం అంటేనే మనకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచడం. ఇక అన్ని దానాల్లోకెల్లా అన్నదానం, విద్యా దానం గొప్పదని చెప్తారు. ఒకటి ఆకలి తీర్చితే.. మరొకటి మనతో పాటు మరి కొందరి ఆకలి తీర్చే మార్గం చూపిస్తుంది. అయితే వీటన్నిటికంటే గొప్పదానం మరొకటి ఉంది. కానీ దాని గురించి జనాలకు పెద్దగా అవగాహన లేదు. అదే అవయవ దానం. అవును మనం చనిపోతూ మరి కొందరిని బతికించడం. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. కానీ ఎందుకో మన దగ్గర అవయవ దానం గురించి ఎక్కువగా అవగాహన లేదు.. ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవు. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి.. వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపుకోతను మర్చిపోతున్నారు. (చదవండి: 36 కిమీ..28 నిమిషాలు! ) వివరాలు.. గుజరాత్కు చెందిన జర్నలిస్ట్ సంజీవ్ ఓజా దంపతులకు యష్ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ.. సంతోషంగా ఎదుగుతున్న యష్ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్ డెడ్ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్ గురించి తెలుసుకున్న డోనేట్ లైఫ్ అనే ఎన్జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు. భౌతికంగా తమకు దూరమైన బిడ్డ.. మరి కొందరికి ప్రాణం పోసి.. వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. (చదవండి: రహస్యంగా రూ.58 వేల కోట్ల్ల దానం!) ఈ క్రమంలో యష్ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్నాగర్కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్ లివర్ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. ఇక బిడ్డను కోల్పోయిన యష్ తల్లిదండ్రులు వీరిలో తమ చిన్నారిని చూసుకుంటూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. -
ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు ఫిదా
అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింకతో ఓ చిన్నారి ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ క్యూట్ వీడియోకి నెటిజన్లు వేలకొద్ది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సమీప పరిసరాల్లోని అడవి నుంచి తప్పిపోయిన పిల్ల జింక జనావాసంలోకి వచ్చింది. బిక్కుబిక్కుమంటూ ఓ చెత్తడబ్బా వెనక దాకొన్న జింక అటుగా వెళ్తున్న చిన్నారిని చూసి బయటకు వచ్చింది. అయితే అకస్మాత్తుగా జింక కనిపించేసరికి మొదట భయపడ్డ ఆ చిన్నారి కాసేపటికి దాన్ని ప్రేమగా నిమురుతూ సరదాగా ఆడుకుంది. 15 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటికే 11,000మంది చూసి రీట్వీట్లు చేస్తున్నారు. Tiny human meets tiny deer 🤗❤️ pic.twitter.com/SnmtXVNZvR — The Feel Good Page ❤️ (@akkitwts) December 3, 2020 -
సైకిల్పై వచ్చి చిన్నారిని ఈడ్చుకెళ్లిన కోతి
ఇటీవల ఓ కోతి సైకిల్ తొక్కి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన మరొకటి చోటుచేసుకుంది. సైకిల్పై వచ్చిన ఓ కోతి రెండేళ్ల చిన్నారిని రోడ్డుపై లాక్కెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాళ్లోకి వెళితే.. కొంతమంది చిన్నారులు రోడ్డు పక్కన ఉన్న ఓ బెంచ్పై కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సైకిల్పై వేగంగా అక్కడికి వచ్చిన ఓ కోతి.. సైకిల్ కిందపడేసి చిన్న బాబును తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు. అయినా సరే కోతి వదిలిపెట్టలేదు.. మళ్లీ వెనక్కి వచ్చి మరీ చిన్నారి దుస్తులను పట్టుకొని కొంత దూరం రోడ్డుపై లాక్కెళ్లింది. ఇది గమనించిన స్థానిక వ్యక్తి వెంటనే అక్కడికి రావడంతో కోతి బాలుడిని వదిలేసి పారిపోయింది. (ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. ) కాగా దీనికి సంబంధించిన వీడియోను అమెరికన్ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ సోమవారం ట్విటర్లో పోస్ట్ చేశాడు. షేర్ చేసిన కొన్ని గంటల్లోనే నాలుగు మిలియన్ల వ్యూవ్స్ను సొంతం చేసుకుంది. 16వేల మంది దీనిపై స్పందించారు. ఇక వీడియోను చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు. కోతి బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసిందంటూ కామెంట్ చేస్తున్నారు. (అందుకోసం ఏడు గంటలు శ్రమించిన హృతిక్ ) -
దీపక్ కిడ్నాప్ మిస్టరీ వీడింది!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కిడ్నాపైన ఏడాదిన్నర బాలుడు దీపక్ ఆచూకి లభ్యమైంది. అర్ధరాత్రి బాలున్ని గుర్తి తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీపక్ను ముగ్గురు మహిళలు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొంతమంది మహిళలు ముఠాగా ఏర్పడి ఇద్దరు చిన్నారులతో కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మౌలాలికి చెందిన రాధిక, తులసీరామ్ దంపతులకు నలుగురు సంతానం.. వారు రాము(9), ధనిరాం(6), లక్ష్మణ్(4), దీపక్ (18 నెలలు). తులసీరామ్ ఓ కేసులో జైలులో ఉన్నాడు. డెలివరీ కోసం వచ్చిన బంధువును పరామర్శించేందుకు రాధిక ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్డులోనే ఆమె ఉంటోంది. గత నెల 5న ఉదయం నిద్రలేచి చూడగా దీపక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఓ ముఠా బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ముఠాలో ముగ్గురు మహిళలతోపాటు 12 ఏళ్ల బాలుడు, పదేళ్ల బాలిక ఉన్నట్లు సమాచారం. -
క్రిస్మస్కు చెత్త గిఫ్ట్, కానీ ఆ చిన్నారి రియాక్షన్..!
-
చెత్త గిఫ్ట్, కానీ ఆ చిన్నారి రియాక్షన్!
క్రిస్మస్ పండుగ వస్తుందంటే.. చిన్నారుల హడావుడి చెప్పనలవి కాదు. స్వీట్లు, కేకులు, సర్ప్రైజ్లు అబ్బో.. ఇది పిల్లలు మర్చిపోలేని పండగ అనుకోండి. చిన్న గిఫ్ట్ అందుకున్నా సరే ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ఇక్కడ చెప్పుకునే చిన్నారికి ఇచ్చిన గిఫ్ట్ చూస్తే షాకవకుండా ఉండలేరు. యూట్యూబర్ జస్టిస్ మొజికా తన రెండేళ్ల కూతురితో ప్రాంక్ వీడియో చేద్దామనుకుంది. క్రిస్మస్ పండగ సందర్భంగా కూతురికి గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. చిట్టిచిట్టి చేతులతో గిఫ్ట్ను తెరచి చూస్తే అందులో ఉన్నది అరటిపండు. కానీ ఆ చిన్నారి తల్లి ఇచ్చిన సర్ప్రైజ్కు ఆనందంతో ఉబ్బితబ్బిబైంది. వినడానికి ఒకింత ఆశ్చర్యం కలిగించినా నమ్మక తప్పదు. పాపం, పసిపిల్లకు అరటిపండు ఇచ్చి మోసం చేశారని మనకు కోపం రావచ్చు కానీ ఆ చిన్నారి రియాక్షన్ చూసి ముచ్చటపడని నెటిజన్ ఉండడంటే నమ్మండి. అరటిపండును అందుకున్న చిన్నారి అమితాశ్చర్యంతో కళ్లింత చేసుకుని ఆనందంతో గంతులు వేసింది. ‘బనానా.. బనానా..’ అంటూ కేరింతలు కొట్టింది. ఎంతగానో సంబరపడింది. ముద్దుముద్దు మాటలతో అరటి పండు తొక్కతీసి ఇవ్వమని తల్లిని అడిగింది. తొక్కతీయగానే వెంటనే పట్టలేని సంతోషంతో అరటింపడును అమృతంలా ఆరగించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 20 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. -
వైరల్: పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగేది..
కొలంబియా : ఎక్కువగా అందరూ పెంచుకునే పెంపుడు జంతువు శునకం. విశ్వాసానికి, దర్పానికి మారుపేరు అంటూ కుక్కను పెంచుకునేవారు బోలెడుమందే ఉంటారు. దీని తర్వాతి స్థానంలో ఉండేది పిల్లి. కుక్క అంత కాకపోయినా పిల్లిని ప్రాణంగా పెంచుకునేవారూ ఉన్నారు. అయితే చాలామందికి పిల్లి అంటే గిట్టదు. దాన్నో అపశకునంగా భావిస్తారు. పిల్లులు పైకి ఏమీ తెలీనట్టు కనిపించే మహా ముదుర్లు అనేవారూ లేకపోలేరు. ఇక రాత్రిళ్లు దాని కళ్లు చూసి భయపడేవారు లేకపోలేదు. ఇంతలా దాన్ని అగౌరవపరిచేవారు ఈ వార్త చదివితే తప్పకుండా పిల్లిని మెచ్చుకోకుండా ఉండలేరు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ ఇంట్లో ఎవరిపనుల్లో వారున్నారు. పసిబాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ గదంతా తిరుగుతున్నాడు. అక్కడే ఉన్న పిల్లి ఆ బుడ్డోడిని ఓ కంట కనిపెడుతూ ఉంది. ఇంతలో ఆ పిల్లవాడు మెట్లవైపుకు పాక్కుంటూ వెళ్లాడు. అది చూసిన పిల్లి మెరుపువేగంతో పిల్లోడి దగ్గరికి వెళ్లి మెట్లవైపుకు వెళ్లకుండా అడ్డుకుంది. పిల్లోడిని వెనక్కు తరిమి, ప్రమాదం నుంచి రక్షించింది. ఈ తతంగం అంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ పిల్లే కనుక లేకుంటే ఎంత ప్రమాదం జరిగుండేదని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లులను అసహ్యించుకునే వారికి ఈ వీడియో చూపించండంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. -
బోరుబావిలోనే బాలుడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు సుజిత్ను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 72 గంటలుగా బోరుబావిలోనే ఉన్న బాలుడు.. ప్రస్తుతం 100 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుబావికి సమాంతరంగా మరో గుంత తవ్వేందుకు ఆదివారం నుంచి ప్రయత్నిస్తుండగా.. తాజాగా ఇందుకోసం జర్మన్ నుంచి తెచ్చిన అత్యాధునిక హెవీ డ్రిల్లింగ్ మెషీన్ను ఉపయోగిస్తున్నట్లు రెవెన్యూ విభాగంకమిషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కెమెరాల ద్వారా పరిశీలించినప్పుడు బాలుడిపై కొంత మట్టి పడినట్లు ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నాడుకాట్టుపట్టికి చెందిన ప్రిట్లో ఆరోగ్యరాజ్ (40), కళామేరీ (35) దంపతుల కుమారుడు సుజిత్ శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ చిన్నారి బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. ‘సుజిత్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నాను. సహాయక చర్యలపై సీఎంతో మాట్లాడాను’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
భూమ్మీద నూకలుండటం అంటే ఇదే
-
భూమ్మీద నూకలుండటం అంటే ఇదే
ఇస్తాంబుల్ : రెండేళ్ల ఈ చిన్నారి ఆయుష్షు గట్టిది కాబట్టి.. రెండో అంతస్తు నుంచి కింద పడి కూడా క్షేమంగా బతికి బట్టకట్టగలిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. చిన్నారిని కాపాడిన యువకుడు ఓవర్నైట్లో హీరో అయ్యాడు. వివరాలు.. ఫ్యూజి జబాత్(17) అనే యువకుడు రోడ్డు వెంట నడుచుకుంటు వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల చిన్నారి రెండో అంతస్తు నుంచి కింద పడటం జబాత్ కంట పడింది. వెంటనే అప్రమత్తమైన జబాత్.. పాప కింద పడే చోటు ఊహించి అక్కడకు వెళ్లి నిల్చున్నాడు. ఫలితంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ చిన్నారిని కాపాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. నెటిజన్లు జబాత్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని తెగ మెచ్చుకుంటున్నారు. -
మృత్యుంజయుడు.. చర్మం లేకుండా పుట్టి..
నాటింగ్హమ్ : చర్మం లేకుండా పుట్టిన ఓ శిశువు ప్రాణాలతో బయటపడి డాక్టర్లను ఆశ్చర్యపరిచాడు. బ్రతకటమే కష్టం అనుకున్న ఆ చిన్నారి ఒంటిపై చర్మంపెరగటంతో డాక్టర్లు మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన ఇంగ్లాండ్లోని నాటింగ్హమ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వార్మిక్షేర్కు చెందిన జెస్సికా కిబ్లర్, జాక్ శాటక్ భార్యభర్తలు. గర్భవతిగా ఉన్న జెస్సికా పురిటి నొప్పులతో కొద్దిరోజులక్రితం దగ్గరలోని నాటింగ్హమ్ సిటీ హాస్పిటల్లో చేరింది. అయితే ఆమె చర్మంలేని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. పైగా 10వారాల ముందు పుట్టడంతో బిడ్డ బ్రతకటం కష్టమన్నారు డాక్టర్లు. ఐసీయూలో ఉన్న తమ బిడ్డను మొదటిసారి చూసుకున్న జాక్ దంపతులు షాకయ్యారు. కేవలం ముఖంపై మాత్రమే కొద్దిగా చర్మం ఉండి, మిగిలిన శరీరం మొత్తం.. చర్మంపై పొర లేకుండా మాంసపు ముద్దలా ఉన్న అతడిని చూడగానే వెక్కివెక్కి ఏడ్చారు. వీరిని చూసిన అక్కడి నర్సులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించకుండా ఐసీయూలో ఉంచి పర్యవేక్షించసాగారు డాక్టర్లు. అయితే ఆరు వారాల తర్వాత ఆశ్చర్యకరంగా బాబు ఒంటిపై చర్మం పెరగటం ప్రారంభమైంది. దీంతో డాక్టర్లు అతడిని తల్లిదండ్రులతో పాటు ఇంటికి తీసుకుపోవటానికి అనుమతించారు. ప్రస్తుతం డాక్టర్లు శస్త్రచికిత్సల ద్వారా అతడి ఒంటిపై చర్మాన్ని అవసరమైన చోటకు మార్పు చేస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలతో బయటపడినందుకు జాక్ దంపతులు ఎంతో సంతోషిస్తున్నారు. -
ఆటో డ్రైవర్ అతివేగం.. తల్లి ఒళ్లోనుంచి ఎగిరిపడ్డ చిన్నారి
కోల్కతా : ఆటో డ్రైవర్ అతివేగం, రోడ్డు కుదుపులు ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోల్కతాలోని బారానగర్కు చెందిన రింకీ సర్ధార్ తన ఒకటినర్ర సంవత్సరాల బాబును ఒళ్లో ఉంచుకొని ఆటోలో ప్రయాణిస్తోంది. ఆటో డ్రైవర్ మొదటి నుంచి వేగంగా ఆటోను నడుపుతున్నాడు. ఆటో ఏకే ముఖర్జీ రోడ్ దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న గుంతను తప్పించటానికి డ్రైవర్ ఆటోను వేగంగా ఒక పక్కకు తిప్పాడు. దీంతో రింకీ సర్ధార్ చేతుల్లోని పసిబిడ్డ రాజ్దీప్ ఎగిరి బయటపడ్డాడు. రింకీ కూడా బాలున్ని కాపాడటానికి వేగంగా వెళుతున్న ఆటోలోనుంచి కిందకు దూకింది. అయితే కింద పడ్డ తల్లీ కొడుకులను ఆస్పత్రికి చేర్చకుండా ఆ ఆటోడ్రైవర్ అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఇది గమనించిన కొంతమంది రోడ్డుపై పడి ఉన్న ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి చిన్నచిన్న గాయాలు అయినప్పటికి శరీరంలోపలి భాగాలు దెబ్బతినటంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
తమ్ముడికి అన్న ట్రైనింగ్: వైరల్ వీడియో
ఇద్దరు చిన్నారుల వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. డైలీ బంప్స్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్చల్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అన్న తన తమ్ముడికి జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో చెబుతుంది. ఆటలాడే సమయం అయిపోయిందంటూ ఇద్దరు పిల్లలు ఒలివర్, ఫిన్లను తల్లిదండ్రులు బెడ్ ఎక్కించేశారు. అయితే.. ఇంకా కలిసి ఆడుకోవాలని అనుకున్నారో ఏమో ఆ పిల్లలు అందుకోసం పెద్ద సాహసమే చేశారు. ఒలివర్ తన తమ్ముడికి బెడ్ నుంచి ఎలా బయటపడాలో పెద్ద డెమాన్స్ట్రేషన్తో చూపించి.. ఎట్టకేలకు తన తమ్ముడికి విముక్తి కల్పిస్తాడు. అంతేనా.. 'యూ కెన్ డూ ఇట్' అంటూ తమ్ముడిని ఒలివర్ ఎంకరేజ్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
ముత్తారం: పాఠశాల నుంచి తిరిగొచ్చిన చిన్నారిని ఆటో ఢీకొనడంతో మృతిచెందిన సంఘటన కరీంనగర్జిల్లా ముత్తారం మండలం ఓడేడులో శనివారం సాయంత్రం జరిగింది. కలికోట శ్రీనివాస్, సుస్మితల కుమార్తె సింధు(4) అక్షర పాఠశాలలో చదువుతోంది. తల్లి కూడా అదే పాఠశాలలో టీచర్గా పనిచేస్తోంది. సాయంత్రం పాఠశాల నుంచి వ్యాన్లో వచ్చిన సింధు ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ముత్తారం పీహెచ్సీకి, అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం మంథని తరలించగా అక్కడ మృతిచెందింది. స్థానికులు ఆటో డ్రైవర్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
నీళ్ల బకెట్లో పడి బాలుడు మృతి
నిజామాబాద్: జిల్లాలోని బోధన్ శక్కర్నగర్లో ఓ చిన్నారి నీళ్ల బకెట్లో పడి మృతిచెందాడు. తల్లి ప్రమీల స్నానం చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో బయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి చందు ప్రమాదవశాత్తు బకెట్లో పడిపోయాడు. తల్లి వచ్చి చూసేసరికి బిడ్డ శవమై తేలాడు. దీంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు!
-
నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు!
గత నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ ముహూర్తాన ప్రకటన చేశారోగానీ అప్పటి నుంచి నగదు కోసం సామాన్యులు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు లేనివాళ్ల పరిస్థితి కనాకష్టంగా ఉంది. చాలావరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎంతసేపు క్యూలో నిలుచున్నా.. డబ్బులు లేవని బ్యాంకులు తిప్పిపంపుతున్న సందర్భాలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్ర నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాలని ఉదార సలహాలు ఇస్తున్నది. త్వరలోనే కష్టాలు తగ్గుతాయని చెప్తున్నది. నోట్ల రద్దు విషయంలో మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్మీడియాలో, ఆన్లైన్లో పోస్టులు, వీడియోలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బుడ్డోడి వీడియో హల్చల్ చేస్తోంది. బుజ్జీబుజ్జీ మాటలతో సామాన్యుల పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ మోదీని ఈ బుడ్డోడు కడిగిపారేశాడు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మాటలు అందిస్తుండగా.. వాటిని పొల్లుపోకుండా స్వచ్ఛమైన హావభావాలతో ఈ బుడ్డోడి చెప్పిన తీరు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయిన ఈ బుడ్డోడి సూపర్ వీడియో మీకోసం..! Hahaha...cutest critique of demonetization. :) pic.twitter.com/lAPMoVtGBU — Scotchy (@scotchism) December 14, 2016 -
సింహంతో లైవ్ షో నిర్వహించిన వైనం
-
బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి
కావలి(నెల్లూరు): ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి బోరు బావిలో పడిన సంఘటన నెల్లూరు జిల్లా కావలి మండలం నందమ్మపురంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న మౌనిక(3) అనే చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడింది. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు గ్రామస్థుల సాయంతో ప్రొక్లెన్లతో తవ్వకాలు జరుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
షాకింగ్ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా!
-
షాకింగ్ వీడియో.. పిల్లాడి నోట బీరు సీసా!
పాలబుగ్గుల చిన్నారికి ఎవరైనా పాలు తాగిస్తారు.. కానీ ఓ వ్యక్తి మాత్రం పసిపిల్లాడి నోట్లో బీరు సీసా పెట్టాడు. ఆ చిన్నారికి బ్రాండి సీసా కూడా ఇచ్చాడు. ఏమీ తెలియని ఆ చిన్నారి ఆ సీసాలను నోట్లో పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారికి ఏకంగా బీరు తాగించాడు. ఇది పెద్ద ఘనకార్యం అయినట్టు కూడా వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. పారేడే చిన్నారికి మద్యం తాగించడమేమిటని పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా స్పందించింది. ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మీకు ఎవరికైనా తెలిసి వుంటే ఆ సమాచారాన్ని తమ ఈమెయిల్ ఐడీ (min-wcd@nic.in)కి పంపాలని కోరింది. సరదా కోసమైనా చిన్నారులతో ఇలాంటి వికృతమైన ఫీట్లు చేయించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. -
స్కూల్ విద్యార్థినులు కిడ్నాప్కు దిగితే..
న్యూయార్క్: అమెరికాలో ఇద్దరు విద్యార్థునిలు కిడ్నాప్కు పాల్పడ్డారు. ఓ స్టోర్ వద్ద నుంచి రెండేళ్ల పాపను ఎత్తుకెళ్లారు. కిడ్నాప్ కు పాల్పడిన ఇద్దరు కూడా 13, 14 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. న్యూక్యాజిల్ సిటీలోని ప్రిమార్క్ స్టోర్లో నుంచి పాపను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ పాపకు సంబంధించిన వాళ్లు షాపింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరు విద్యార్థినులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని నార్త్ షీల్డ్లోని కోర్టులో హాజరుపరిచారు. ఆ పాపను తన తల్లివద్దకు చేర్చారు. లైంగిక చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే ఆ రెండేళ్ల పాపను కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపించిన పోలీసులు వారిపై కిడ్నాప్ ఆరోపణలు నమోదు చేశారు. అయితే, వారు విద్యార్థినులు అయినందున కిడ్నాపేతర అభియోగాలకోసం పిటిషన్ దాఖలు చేయగా అందుకు ప్రాసిక్యూషన్ అనుమతించింది. పాపను కిడ్నాప్ చేయడంతోపాటు అదే షాపింగ్ మాల్ లో వారు షూలు, పాలడబ్బాలు ఎత్తుకెళ్లినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. ఇలా చేయడం వారికి ఇది మూడోసారి. -
షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా..
చైనాలోని ఓ మార్కెట్ పరిధిలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రెండేళ్లు కూడా నిండని పసిబాలుడు తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కు వచ్చాడు. బాలుని పేరెంట్స్ పక్కనే ఉన్న మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బాలుడు ఒంటరిగా ఆడుకుంటుండగా ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. పార్కింగ్లోంచి మినీ వ్యాన్ తీస్తుండగా బాలున్ని గమనించకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ముందు రెండు టైర్ల మధ్యలో, కుడివైపు టైరుకు దాదాపు ఆనుకొని బాలుని పక్క నుంచి వ్యాను వెళ్లింది. గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అప్పటికే వెనక టైరు వరకు వచ్చిన బాలుడు వెనక టైరు కిందకు వచ్చాడు. అదృష్టం కొద్ది అక్కడ నీరు ఉండటంతో బ్రేక్ వేయడంతో ఆగిన టైర్లు బాలున్ని ముందుకు తోశాయి. లేక పోతే టైర్లు బాలుని పైకి వచ్చేవి. ఈ సంఘటన తూర్పు చైనాలో జియాంగ్సు ప్రావిన్స్లోని క్సుజోహులో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన బాలుని తల్లిదండ్రులు వెంటనే అక్కడకు వచ్చి బాలున్ని బయటకు తీశారు. వ్యాన్ కింద పడి వెనక టైర్లు ముందుకు లాక్కు వచ్చినా బాలుడు స్పల్పగాయాలతో ప్రాణాపాయస్థితినుంచి తప్పించుకున్నాడు. -
తెలివైన పిల్లలు కావాలంటే పండ్లు తినాల్సిందే
టొరంటో: తల్లి కాబోయే వనితలారా వినండి! గర్భిణిగా ఉన్నప్పుడు పళ్లు ఎంత ఎక్కువగా తింటే, పిల్లలు అంత తెలివైన వాళ్లుగా పుడతారట. రోజుకు సగటును ఆరేడు పళ్లు తింటే జన్మించబోయే శిశువు ఐక్యూ (ఇంటెలిజెన్స్ కోషెన్సీ) స్థాయులు ఐదారు పాయింట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. కెనడాకు చెందిన 688 మంది చిన్నారుల సమాచారాన్ని విశ్లేషించి యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇలాంటి పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన పీయుష్ మదానే చెప్పారు. గర్భిణి పళ్లు తిన్నప్పుడు శిశువు మెదడులో ఐక్యూ స్థాయులను పెంచే జన్యువులు ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నట్టు గుర్తించామని మదానే వివరించారు. -
అచ్చం చిన్ని కృష్ణుడి లాగే!
మహాభారతంలో చిన్నికృష్ణుడు ఇంట్లోంచి బయటకు వెళ్లి అల్లరి చేస్తున్నాడని తల్లి యశోద నడుముకి తాడుకట్టి, దాని రెండో కొసను ఓ రోలుకు కడుతుంది. అహ్మదాబాద్లో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి కనిపించింది. 15 నెలల శివాని అనే అమ్మాయిని ఆమె తల్లి ఒక బండరాయికి ప్లాస్టిక్ టేపుతో కట్టేసింది. ఆమె తల్లి నగరంలోని ఒక భవన నిర్మాణ స్థలంలో కూలీగా పనిచేస్తోంది. తాను పని చేసుకుంటున్నప్పుడు చిన్నారిని చూసుకోడానికి ఇంట్లో ఎవరూ లేకపోవడం.. నిర్మాణ స్థలం వద్ద శివాని అటూ ఇటూ తిరిగితే ఏదైనా ప్రమాదానికి గురవుతుందేమోనన్న ఆందోళన ఆ తల్లితో తన కూతురిని అలా కట్టేయించాయి. విద్యుత్ కేబుళ్లు వేయడానికి గుంతలు తవ్వేపనిలో శివాని తల్లి దండ్రులు ఇద్దరూ అక్కడ పనిచేస్తారు. ఇద్దరికీ కలిపి రూ. 500 వస్తాయి. నిర్మాణ ప్రాంతం వద్ద జనం అటూ ఇటూ తిరుగుతుంటారు, భారీ యంత్రాలు కూడా పనిచేస్తాయి. రాళ్లు, రప్పలు పడుతుంటాయి. తన కొడుకు వయసు మూడున్నరేళ్లని.. అతడు తన చెల్లెలిని అటూ ఇటూ వెళ్లకుండా ఆపలేకపోతున్నాడని.. అందుకే కూతుర్ని కాపాడుకోడానికి తనకు అంతకంటే మార్గం కనిపించలేదని ఆమె తల్లి చెప్పింది. అక్కడ అలాంటి చాలామంది పిల్లలు దుమ్ములో, ఎండలో ఆడుకుంటూనే ఉన్నారు. కానీ వాళ్లకు కనీసం నిలువ నీడ కూడా కల్పించడం లేదు. పోనీ పిల్లలను ఎక్కడైనా క్రష్లలో పెడదామంటే, అందుకు చాలా ఖర్చవుతుంది. ప్రభుత్వం నుంచి గానీ, నిర్మాణ సంస్థల వైపు నంచి గానీ ఇలాంటి పిల్లలను సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేవరకు పిల్లలు తమవద్దే ఉంటారని, ఆ తర్వాత వాళ్లను తాత ఇంటికి పంపేసి తాము పనుల్లోకి వెళ్తామని అక్కడ పనిచేసుకునే కూలీలు చెప్పారు. అందుకే ఇలాంటి చిన్నికృష్ణులు ఎంతోమంది అక్కడ కనిపిస్తున్నారు. -
చైనా పోలీసులకు బుడతడు ఝలక్
బీజింగ్: సాధారణంగా చిన్న పిల్లలు కొత్త వ్యక్తులను చూస్తే భయపడుతుంటారు. ప్రేమగా పిలుస్తున్నా దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయరు. అలాంటిది కోపంతో గుడ్లురుమి చూస్తే.. ఇక వారు భయపడకుండా ఉంటారా.. కానీ చైనాలో మాత్రం అలా జరగలేదు. పట్టుమని రెండేళ్లు కూడా నిండుగా ఉండని చైనా బాలుడు అలా కన్నెర్ర చేసిన పోలీసులపైకి కర్ర విసిరే పనిచేశాడు. తన తల్లిదండ్రుల షాపును బలవంతంగా మూయిండచడానికి వచ్చిన పోలీసులపైకి వెళ్లాడు. అది కూడా ఒట్టి చేతులతో కాదు.. అక్కడే ఉన్న ఒక స్టీలు పైపులాంటి వస్తువుతో. దాన్ని చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులను అడుగెస్తే పడతాయ్ అని హెచ్చరిస్తున్నట్లు తన శక్తిమేరకు ఆ కర్రను విసురుతూ వారి ఆగిన తర్వాత దాన్ని కిందపడేశాడు. ఈ సంఘటనను దగ్గరుండి చూసిన కొందరు వ్యక్తులు ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చేస్తుండగా.. బుడ్డవాడు అంత పనిచేసే వాతావరణం కల్పించిన పోలీసు అధికారులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. -
లారీ ఢీకొని బాలుడు మృతి
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బొమ్మూరు ప్రాంతంలో శనివారం లారీ ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్పై ఇద్దరు బాలురు వెళుతుండగాశనివారం మధ్యాహ్నం లారీ ఢీకొంది. శాంతన్ (10) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
స్కూల్ ఆటో బోల్తా.. చిన్నారి మృతి
మునగాల(నల్లగొండ): స్కూలు పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నారులు ఆటోలో మునగాల పాఠశాలకు వెళ్లి వస్తూ ఉంటారు. ఈ క్రమంలో బుధవారం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు టైరు పేలిపోయింది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలోఅశ్విని అనే రెండో తరగతి విద్యార్థిని మృతిచెందగా, మరో ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఐదేళ్ల బాలికపై అత్యాచారం
బాపట్ల (గుంటూరు): ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం చెరువుజమ్ములపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికను డిసెంబర్ 31న అమ్మమ్మ చర్చికి తీసుకెళ్లింది. బాలికకు బాబాయి వరుసయ్యే గొల్లపల్లి దిలీప్ (24) చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలికకు రక్తస్రావం అవుతుంటే ఆదివారం బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్టు వైద్యులు వెల్లడించడంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చిన్నారికి ముక్కులో పెరిగిన మెదడు..!
జ్ఞానేంద్రియాల్లో ముక్కు, శ్వాస పీల్చుకోవడంతోపాటు, వాసనలను పసికట్టేందుకు ఉపయోగపడుతుంది. అలాగే మెదడులో భావాలను కలిగించే 'లిమ్బిక్' వ్యవస్థ వల్ల ముక్కు వాసనలను పసిగట్టగల్గుతుంది. ఇలా ముక్కునుంచి మెదడుకు సంబంధం ఉండటం మనకు తెలుసు.. కానీ ఆ బాలుడికి ఏకంగా మెదడే ముక్కులో పెరుగుతుండటం వైద్య రంగాన్నే విస్తుపోయేలా చేసింది. అయితే అనేక ఆపరేషన్ల తర్వాత బిర్మింగమ్ పిల్లల ఆస్పత్రి వైద్యులు చిన్నారి లోపాన్ని సరి చేయగలిగారు. పుట్టుకతో వచ్చిన లోపంతో ఇబ్బందిపడుతున్న వేల్స్ మీస్టెగ్ ప్రాంతానికి చెందిన ఇరవై ఒక్క నెల్ల ఒల్లీ ట్రీజీజ్ కు మెదడు భాగం చిట్లి దాని ద్వారా ముక్కులో ఓ తిత్తిలా మెదడు పెరగటం ప్రారంభించింది. వైద్య శాస్త్రంలో ఎన్సెఫలోసెల్ గా పిలిచే ఈ పరిస్థితిని గుర్తించేందుకు డాక్టర్లు కూడ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చిన్నారికి ఇరవై వారాల వయసులో స్కాన్ తీసిన వైద్యులు ముక్కులో కండ పెరుగుతున్నట్లుగా భావించారు. ఒల్లీ తల్లి ఇరవై రెండేళ్ళ యామీ... వైద్యులు చెప్పిన విషయంతో షాక్ కు గురైంది. భర్తకు దూరమైన యామీ ఒల్లీని తన వరంగా భావించింది. చిన్నారికి ఏమౌతుందోనని ఖంగారు పడిపోయింది. తొమ్మిది నెలలు గడిచే సరికి ఒల్లీ రూపం పినాచియో బొమ్మలా మారుతూ వచ్చింది. దీంతో వైద్యులు అతడి ముక్కుకు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని లేదంటే అతడు ఊపిరి పీల్చడం కూడ కష్టంగా మారుతుందని యామీకి చెప్పారు. ఆమెకు అవగాహన కూడ కల్పించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత బిడ్డ ముక్కులో పెరుగుతున్నది కండకాదు.. ఓ తిత్తిలా పెరుగుతున్న మెదడు అని తేల్చారు. పుట్టుకతో వచ్చిన లోపంగా కూడ గుర్తించారు. 2014 నవంబర్ లో ఒల్లీకి బిర్మింగమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో రెండుగంటల పాటు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. పుర్రె భాగాన్ని కత్తిరించి మెదడు నుంచి ముక్కులోకి అధికంగా ఉన్న తిత్తివంటి ఫ్లూయిడ్ భాగాన్ని తీసి తిరిగి కుట్లు వేశారు. ప్రస్తుతం ఒల్లీ పూర్తిగా కోలుకున్నాడు. నాలుగేళ్ళ తన అక్క అన్నతో హాయిగా ఆడుకుంటున్నాడు. అయితే చిన్నారికి భవిష్యత్తులో చికిత్సలు చేయాల్సి వస్తుందా లేదా అన్న విషయాన్నిప్రస్తుతానికి వైద్యులు నిర్థారించ లేదు. అతడి మెదడు పెరుగుదలను బట్టి భవిష్యత్ చికిత్స ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. -
డైపర్ కట్టుకునే వయస్సులో గంజాయి దమ్ము
న్యూయార్క్: గంజాయి దమ్ము బిగించి కొడితే గమ్మత్తుగా ఉంటున్నట్టున్నది ఈ బుడ్డోడికి. డైపర్ ధరించి కుర్చీలో బరివాతల కూర్చొని గంజాయి దమ్ము లాగిస్తున్నాడు. దాన్ని పర్యవసనాలు తెలియని వయస్సులో పెద్దల ప్రోత్సాహంతో మత్తులో కూరుకుపోతున్నాడు. బుడ్డోడి చేష్టకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఫేస్బుక్లో హల్చల్ చేస్తోంది. చికాగోకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఆండ్రి హోమ్స్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, దాని ప్రతిని పోలీసులకు పంపించారు. ‘ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మూర్ఖత్వమే కావచ్చు. ఈ పిల్లవాడిని ప్రోత్సహిస్తున్న పెద్ద వాళ్లెవరో కనుక్కొని అత్యవసరంగా వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. అసలు పిల్లవాడెవడో గుర్తించి మెడికల్ కేర్లో చేర్పించడం అంతకంటే అత్యవసరం. అందుకోసమే దీన్ని పోస్ట్ చేశాను’ అని హోమ్స్ తెలిపారు. గంజాయి దమ్ము లాగుతున్న బుడ్డోడిని ఎదురుగా నిలబడి పెద్దలు ప్రోత్సహిస్తున్నట్టు, వాడు దమ్ము కొడుతుంటే వారు పగలబడి నవ్వుతున్నట్టు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. వారు కనిపించకపోయినా వారి చేతులు మాత్రం వీడియోలో కనిపిస్తున్నాయి. ఆ పెద్ద వాళ్లెవరో దాదాపు గుర్తించామని, వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చికాగో స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ డిటెక్టివ్లు మీడియాకు తెలిపారు. -
చిన్నారి కడుపులో 'మెటల్' బాల్..!
కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ తో చాలాకాలం వైద్యం నిర్వహించారు. అయితే మందులకు ఏమాత్రం తగ్గకపోగా నొప్పి పెరుగుతుండటంతో చివరికి అనుమానం వచ్చి...ఎక్స్ రే తీయించారు. కడుపులో కనిపించిన బంతిలాంటి ఆకారం చూసి విస్తుపోయారు. ఎన్నో రకాల మెటల్ వస్తువులు, అయిస్కాంతాలు ఒక్కచోటికి చేరి పేరుకుపోవడమే చిన్నారి నొప్పికి కారణమని గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆయా వస్తువులను బయటకు తీశారు. చిన్నపిల్లలు మట్టి, సుద్దముక్కలు వంటివి తినడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన మూడేళ్ళ బాలుడు ఏది కనిపిస్తే అది కడుపులో వేసుకున్నట్టున్నాడు. అందుకే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు అతడి పేగుకు చుట్టుకుపోయిన 29 అయిస్కాంతం ముక్కలు, ఓ బ్యాటరీ, ఓ కాయిన్ తోపాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులను బయటకు తీశారు. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని నెల క్రితం తల్లిదండ్రులు ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో అతడికి మొదటిసారి ఎక్స్ రే తీశారు. స్కానింగ్ లో అతడి కడుపులో పేరుకుని ఉన్న పెద్ద మెటల్ బాల్ లాంటి ఆకారాన్ని చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు. ఫరీదాబాద్ మెట్రో హస్పిటల్ లోని లాప్రోస్కోపిక్ సర్జరీ హెడ్.. డాక్టర్ బ్రహ్మ దత్ పాఠక్... చిన్నారి కడపులోని వస్తువులను గుర్తించారు. సుమారు ఓ సంవత్సరం నుంచి బాలుడికి ఇటువంటి వస్తువులు తినే అలవాటు ఉన్నట్లుగా ఉందని... మాగ్నెట్లన్నీ ఓచోట చేరి బంతి ఆకారంలో మారి, చిన్నారి నొప్పికి కారణం కావడమే కాక, కడుపులోని ఇతర భాగాలను సైతం పాడుచేస్తుండటాన్ని డాక్టర్లు గమనించారు. 'ఇది చాలా సమస్యాత్మకమైన కేసు. అయస్కాంతాలన్నీ చుట్టుకుపోవడం వల్ల చిన్నారి పేగు పూర్తిగా పాడైపోయింది. శస్త్ర చికిత్స చేయడానికి సుమారు మూడు గంటలు పట్టింది. మా వైద్య బృందం అంతా కలిసి ఆ చిన్ని పొట్టనుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు తీస్తూనే ఉన్నాం.' అని డాక్టర్ పాఠక్ చెప్పారు. చిన్నారి కుటుంబ సభ్యులు జ్యువెలరీ బాక్స్ లు తయారు చేసే వ్యాపారం ఇంట్లోనే చేస్తుంటారని, దీంతో నేలపై పడిన ప్రతి వస్తువునూ చిన్నారి తినేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. మెటల్ వస్తువులు అతి చిన్నవిగా ఉంటే రోజువారీ కాలకృత్యాల్లో బయటకు వెళ్ళిపోయి ఉండేవని, పెద్దవిగా ఉండటంతో కడుపులోనే పేరుకు పోవడంతో.. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా పేగు చాలాశాతం తినేయడంవల్ల చిన్నారి ఎక్కువకాలం నొప్పితో బాధపడే అవకాశం ఉందని, తగ్గడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులు కూడ అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ అతడికి అందకుండా జాగ్రత్త పడుతున్నారు. -
ఈ బంగారు తల్లిని బడి మింగింది
* గోడకు, లిఫ్టుకు మధ్య తల ఇరుక్కుని 20 నిమిషాలు నరకయాతన * అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలిన నాలుగేళ్ల పాప * మూడు నెలలుగా లిఫ్టుకు మరమ్మతు చేయించని స్కూల్ యాజమాన్యం * విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం * పోలీసుల అదుపులో ప్రిన్సిపాల్, టీచర్.. స్కూల్ను సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు హైదరాబాద్: ఆడుతూ పాడుతూ స్కూలుకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారి.. కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి బలైపోయింది. సరిగా పనిచేయని లిఫ్టు ఆ చిన్నారి ప్రాణాలను నిలువునా మింగేసింది.. లిఫ్టుకు, గోడకు మధ్యన చిన్నారి తల ఇరుక్కుపోయి ఊపిరాడక గిలగిలలాడిపోయింది.. దాదాపు 20 నిమిషాల పాటు నరకయాతన అనుభవించి అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలింది. నగరంలో మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం రెవెన్యూబోర్డు కాలనీలో ఓ ప్రముఖ కార్పొరేట్ విద్యాసంస్థకు చెందిన 'స్టార్కిడ్స్ ప్రీమియం' ప్లేస్కూల్లో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇది.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన అజీజ్ హుస్సేన్, జైన్ ఫాతిమాల కుమార్తె సయిదా జైనబ్ ఫాతిమా జాఫ్రీ (4) స్టార్కిడ్స్ ప్లేస్కూల్లో నర్సరీ చదువుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు బాలికను స్కూల్లో వదిలిపెట్టి వెళ్లారు. టీచర్ సరోజిని 8 మంది పిల్లలతో కలసి లిఫ్ట్లో పై అంతస్తుకు వెళుతోంది. ఆ సమయంలో లిఫ్టు డోర్ (గ్రిల్ డోర్) తెరిచి ఉంది. లిఫ్ట్ కదులుతుండగానే డోర్ తెరిచి ఉన్న చోటి నుంచి ఫాతిమా జాఫ్రీ లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోయింది. ఆమె తల లిఫ్టు అడుగు భాగానికి, గోడకు మధ్య చిక్కుకుపోయింది. చిక్కుకున్న ఆమె తలను రాసుకుంటూ లిఫ్టు మొదటి అంతస్తు వరకు వచ్చి ఆగిపోయింది. అప్పటికే లోపల ఉన్న తోటి చిన్నారులు, టీచర్ కేకలు వేయడంతో.. కింద ఉన్న సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పైకి చేరుకున్నారు. లిఫ్టు డోర్ను తెరిచి లోపల ఉన్న మిగతా చిన్నారులను, టీచర్ను బయటకు తీశారు. కానీ ఫాతిమా జాఫ్రి తల ఇరుక్కుపోయి ఉండడంతో పైకి తీయలేకపోయారు. అదే స్థితిలో దాదాపు 20 నిమిషాలపాటు ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న చిన్నారి.. చివరికి ప్రాణాలు వదిలింది. లిఫ్టుకు, గోడకు మధ్య నలిగి పోవడంతో చిన్నారి ముఖం రక్తసిక్తమైంది. విద్యార్థుల తల్లిదండ్రులు 108, పోలీసులకు సమాచారం అందించారు. ఉద్రిక్త వాతావరణం.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లిఫ్టును పైకి జరిపించి చిన్నారి మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఉన్న టీచర్ సరోజినిని, ప్రిన్సిపాల్ శాలినిలను అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్ ఇన్చార్జి సతీష్ పరారీలో ఉన్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాల వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. అక్కడ పెద్దఎత్తున జనం గుమిగూడడం, పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తమకు అప్పగించాలని, అంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు చేపడతామని ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు. ఇక సైదాబాద్ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి సుశేంద్రరావు స్టార్కిడ్స్ పాఠశాలను సీజ్ చేశారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా.. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చిన్నారిప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఇక చిన్నారి మృతి ఘటనతో పాఠశాల ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కొంత సేపటి తర్వాత వదిలిపెట్టారు. కనీస వసతులూ లేవు వాస్తవంగా ప్రస్తుతం స్టార్కిడ్స్ స్కూల్ కొనసాగుతున్న ఈ భవనాన్ని గృహ నివాసానికి వీలుగా నిర్మించారు. జీప్లస్3 అంతస్తులతో ఉన్న ఈ ఇంటిని ఓ కార్పొరేట్ విద్యాసంస్థ లీజుకు తీసుకుని ప్లేస్కూల్ను నడుపుతోంది. పాఠశాలకు ఉండాల్సిన కనీస అర్హతలు, ప్రమాణాలు ఈ భవనంలో లేవు. గదులకు రెండు వైపులా తలుపులు లేవు. ఒకే ప్రవేశమార్గంతో ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన (ఫైర్ సేఫ్టీ) చర్యలు లేవు. ప్రాణం తీసిన నాసిరకం లిఫ్ట్ పాఠశాలలో నాణ్యతా ప్రమాణాలున్న లిఫ్ట్ను ఏర్పాటు చేయకపోవడమే దుర్ఘటనకు ప్రధాన కారణం. వాస్తవంగా ప్రమాదానికి కారణమైన ఈ లిఫ్ట్ ఇటీవలే మరమ్మతులకు వచ్చింది. టీచర్లు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి కొన్ని రోజుల క్రితమే తీసుకెళ్లారు. అయినా మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అసలు ప్లేస్కూల్లో ఉండే చిన్నారులంతా ఐదేళ్ల లోపువారే. వారికి లిప్ట్ ఎలా వాడాలో తెలియదు, వారిని పైకి, కిందికి తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఆపరేటర్ను కూడా నియమించలేదు. అసలు లిఫ్ట్కు ఉండే ఇనుప గేట్ (గ్రిల్ డోర్), బయటి వైపు ఉండే గేటు (ల్యాండింగ్ గేట్)లు మూసివేస్తేనే లిఫ్ట్ కదలాలి. కానీ ఇక్కడ వాటిని మూయకున్నా లిఫ్టు కదులుతుందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. అదే చిన్నారి జిహానా మరణానికి కారణమైంది. ఈ లిఫ్టు లోపలిగేటుకు లాకింగ్ సదుపాయం పూర్తిగా లేదని, బయటి గేటుకు లాకింగ్ వ్యవస్థ ఉన్నా.. అది పనిచేయడం లేదని ప్రముఖ లిఫ్ట్ కంపెనీకి చెందిన మెకానిక్ ‘సాక్షి’కి తెలిపారు. లిఫ్టుకు సంబంధించి మెకానికల్, ఎలక్ట్రికల్ వ్యవస్థల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పైగా లిఫ్టుపై ఎక్కడా తయారు చేసిన కంపెనీ పేరు లేదు. ఏ కంపెనీ అయినా పేరు, సామర్థ్యం తదితర వివరాలను ప్రముఖంగా కనిపించేలా రాస్తారు. కానీ ఈ లిఫ్ట్ బయటి వైపుగాని, లోపలి వైపుగాని ఆ వివరాలు లేవు. కాపాడలేకపోయాం.. 'మా పిల్లలు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. రోజూ వారిని పాఠశాలకు తీసుకొచ్చి, క్లాస్లోకి వెళ్లే వరకు స్కూల్ బయటే ఉంటాను. ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఒక్కసారిగా కేకలు, అరుపులు వినపడడంతో భయం వేసి పైకి వెళ్లాను. జాఫ్రీ లిఫ్ట్లో ఇరుక్కుని దాదాపు 20 నిమిషాలు గిలాగిలా కొట్టుకుంది. పోలీసులు, 108కు సమాచారం అందించాను. కాపాడటానికి ఎలాంటి అవకాశం కనిపించ లేదు. చూస్తుండగానే ప్రాణాలు వదిలింది. ఈ స్కూల్లో లిఫ్ట్ ఓపెన్ చేసే పిల్లలను తీసుకెళ్తుంటారు. చాల సార్లు ఈ విషయాన్ని అడిగాను కూడా..' - అల్లాఫ్ హుస్సేన్, ప్రత్యక్షసాక్షి సుమోటోగా విచారణ 'చిన్నారి దుర్మరణం ఘటనను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా తీసుకుంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యా శాఖాధికారికి నోటీసులు ఇచ్చాం. సమగ్ర దర్యాప్తు జరిపి ఈనెల 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని కోరాం. ప్లేస్కూల్లో లిఫ్ట్లను వినియోగించకూడదు. ఫైర్ సేప్టీ, భద్రతా ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించాం..' - అచ్యుత్రావు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
డెంగీతో 8 నెలల బాలుడి మృతి
రైల్వేకోడూరు(వైఎస్సార్ జిల్లా): డెంగీ జ్వరంతో 8 నెలల బాలుడు మృతిచెందిన సంఘటన తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరంపోడు పంచాయతీ హరిజనవాడకు చెందిన చౌడవరం రెడ్డయ్య(8 నెలలు)కు మూడు రోజుల క్రితం డెంగీ సోకడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
మిల్క్ వ్యాన్ బీభత్సం
హైదరాబాద్: మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫ్యాషన్ షోలో బుడతలు ఇరగదీశారు..
సియోల్(దక్షిణ కొరియా): బేబీ ఇన్స్టాగ్రామ్ స్టార్స్.. సియోల్ ఫ్యాషన్ వీక్లో అదరగొట్టారు. ఫ్యాషన్ షోల్లో మీకంటే మేమేం తక్కువ కాదంటూ చిన్నారులు ఇరగదీశారు. వివిధ రకాల టోపీలు..కళ్లద్దాలు పెట్టుకొని, చేతిలో కూల్ డ్రింక్స్, తినుబండారాలతో, మందం చొక్కాలు(జాకెట్లు), రకరకాల షూలు ధరించి అక్కడున్న వారందరిని ఆకర్షించారు. చిన్ని చిన్ని నడకతో చిట్టిపొట్టి మాటలతో హుషారుగా ఉండే బుడతలు స్టైలీ లుక్స్తో ఫోటోలకి ఫోజు ఇచ్చి వీక్షకుల మనసులు దోచేశారు. -
యాదమ్మను కొట్టి చంపేశారు
హైదరాబాద్: చిన్నారి లాస్య హత్యకేసులో నిందితురాలు యాదమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. లాస్య హత్య జరిగిన అనంతరం మృతదేహం యదమ్మ ఇంట్లో బయట పడటంతో ఆమెను స్థానికులు చావబాదిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాదమ్మ శనివారం మరణించింది. వివరాలు.. ఫతేనగర్ దీన్దయాళ్నగర్కు చెందిన నవీన్, మయూరి దంపతులకు లాస్య అలియాస్ పండు (4) సంతానం. నవీన్ ఇంటికి ఒక పక్క లక్ష్మయ్య, యాదమ్మ దంపతులు.. కుమార్తె పద్మ (35), కుమారుడు నర్సింహులుతో కలిసి ఉంటున్నారు. నవీన్ ఇంటికి మరోపక్క గిరి (40) ఇల్లు ఉంది. లక్ష్మయ్య కూతురు పద్మతో గిరికి వివాహేతర సంబంధం ఉంది. ఇదిలా ఉండగా.. ఇల్లు నిర్మిస్తున్న సమయంలో ప్రహరీ విషయంలో లక్ష్మయ్య కుటుంబానికి, నవీన్కు మధ్య వివాదం తలెత్తింది. నవీన్ ఇదే సమయంలో గిరి, పద్మల వివాహేతర సంబంధాన్ని లేవనెత్తి దెప్పేవాడు. నవీన్ ద్వారా స్థానికులందరికీ వివాహేతర సంబంధం విషయం తెలిసిందని, నవీన్ కుటుంబంపై లక్ష్మయ్య కుటుంబం కక్షగట్టి పగ తీర్చుకొనేందుకు వేచి చూస్తోంది. అతి క్రూరంగా... ఈనెల 14న రాత్రి 8 గంటలకు మున్సిపల్ సిబ్బంది వీరుండే వీధిలో దోమల మందు కొట్టారు. ఆ సమయంలో లాస్య రోడ్డుపై ఆడుకుంటోంది. ఫాగింగ్ మిషన్ ద్వారా విడుదలైన దట్టమైన పొగ రోడ్డుపై వ్యాపించిన సమయంలో లక్ష్మయ్య, యాదమ్మ, నర్సింహులు, గిరి, పద్మ కలిసి లాస్యను తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. అరవకుండా పాప ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి.. గొంతు నులిమి చంపేశారు. అంతటితో ఆగకుండా కత్తితో గొంతు కోశారు. మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టి సజ్జపై పడేశారు. పాపను ముక్క ముక్కలు చేసి అవయవాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకెళ్లి పడేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే తమ పాప కనిపించకుండాపోవడంతో నవీన్ దంపతులు లక్ష్మయ్య కుటుంబాన్ని ఓ కంట కనిపెడుతున్నారు. దీనికి తోడు రోడ్డుపై జనం తిరుగుతూ ఉండటంతో పాప మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడానికి వారికి వీలుకాలేదు. మూడు రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం ఉండటంతో కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోగానే విషయం ఆ నోటా ఈ నోటా పొక్కడంతో పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుని ఇంట్లో ఉన్న లక్ష్మయ్య, యాదమ్మలను చితకబాదారు. స్థానికుల దాడిలో గాయాలకు గురైన యాదమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. -
బస్సు కిందపడి చిన్నారి మృతి
కోయిలకుంట్ల(కర్నూలు): ఆర్టీసీబస్సు కిందపడి కీర్తన అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కోయిలకుంట్ల మండలం కంపమల్ల గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక్కసారిగా చిన్నారి రోడ్డుపైకి రావడం..అదే సమయంలో ఆర్టీసీ బస్సు వేగంగా రావడం..బస్సు కింద పడి నుజ్జునుజ్జవటం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఘటన అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని కోయిలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు
జైపూర్: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని గ్రామస్తులు సురక్షితంగా కాపాడిన వైనం ఆ గ్రామంలో ఆనందోత్సాహాల్ని నింపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సమీపంలో దౌసా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిహార్పుర గ్రామంలో జ్యోతి మీనా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఇంటివద్ద ఆడుకుంటూ సుమారు 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. దాదాపు12 గంటల కఠిన ప్రయత్నాల తర్వాత గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాపను బయటకు తీయగలిగారు. ప్రాథమిక చికిత్స అనంతరం దోసాలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు. ఈ సహాయ కార్యక్రమంలో ఎన్డీఆర్ఆఫ్ దళాలు, జిల్లా రక్షర దళాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్విన గ్రామస్తులు పాపను రక్షించారని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ పవార్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా స్థానికం తయారు చేసిన ఇనుప రాడ్లు, పగ్గాల ద్వారా పాపను రక్షించడంలో గ్రామస్తులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. -
ఆ దృశ్యాన్ని చూసి భయంతో ...
మాస్కో: అది రష్యాలోని మియాస్ నగరం. మిట్ట మధ్యాహ్నం. ఎర్రటి ఎండ కాస్తోంది. ఓ అపార్ట్మెంట్లో ఎనిమిదవ అంతస్తు కిటీకీ కొద్దిగా తెరుచుకొని ఉంది. ఇంతలో అందులో నుంచి రెండేళ్ల బాలుడు మెల్లగా బయటకొచ్చి నిటారుగా కిటికీలో నిలబడ్డాడు. కొద్దిగా వొంగి రోడ్డుపై వెళుతున్న వాహనాలను చూస్తున్నాడు. దానికి గ్రిల్ లేదు. బాలుడి కాళ్ల కింద ఆసరాగా ఉన్న చెక్క కూడా బలంగా లేదు. ఈ దృశ్యాన్ని గమనించిన బాటసారులకు జరగబోయే దారుణాన్ని ఊహించి ముచ్చెమటలు పోశాయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చేలోగానే ఇంట్లోనే మరో గదిలో ఉన్న తల్లి కూడా ఈ దృశ్యాన్ని చూసింది. ఒక్క క్షణంపాటు భయంతో నిశ్చేష్ఠురాలైంది. వెంటనే తేరుకొని, ఎలాంటి కంగారు లేకుండా ‘బాబు, బుజ్జీ, నాన్న! అన్నం తిందురా’ అంటూ లోపలికి పిలిచింది. ఆ రెండేళ్ల బాలుడు ఎలాగైతే బయటకొచ్చాడో, అలాగే లోపలికి పోయాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన బాటసారులు, ఇంతలో అక్కడికొచ్చిన పోలీసులు హమ్మయ్యా! అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. కిటికీలో నుంచి బయటకొచ్చి ప్రమాదం అంచున నిలబడినప్పుడు కూడా ఏ మాత్రం భయపడని ఆ బాలుడు లోపలికెళ్లాక తల్లి పెట్టిన చీవాట్లకు మాత్రం గుక్కపట్టి అరగంట ఏడ్చాడు. ఆ బాలుడి పేరేమిటో, తల్లి వివరాలేమిటో తెలియదుగానీ పిల్లవాడు కిటికీలో నుంచి బయటకు రావడాన్ని, మళ్లీ లోపలికి వెళ్లడాన్ని వీడియో తీసిన ఓ బాటసారి ఆన్లైన్లో దాన్ని పోస్ట్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. -
జ్వరంతో చిన్నారి మృతి
ఆదిలాబాద్(జైనూర్): జైనూర్ మండలం గూడమామడ గ్రామానికి చెందిన అశ్విని(1) అనే చిన్నారి జ్వరంతో ఆదివారం చనిపోయింది. నాలుగు రోజుల క్రితం తీవ్రజ్వరంతో ఇంద్రవెల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉట్నూరుకు వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి మృతిచెందింది. -
గొంతులో జామకాయ అడ్డుపడి చిన్నారి మృతి
పాల్వంచ రూరల్: జామకాయ తింటూ అది గొంతులో అడ్డుపడటంతో 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం నాగారం శివారు రేపల్లెవాడలో సోమవారం జరిగింది. రేపల్లెవాడకు చెందిన కె.రవి, సుజాత దంపతుల రెండో కూతురు అమ్ములు సోమవారం సాయంత్రం ఇంట్లో జామకాయతో ఆడుకుంటూ తినబోయింది. ఆ జామకాయ గొంతులో ఇరుక్కుపోవడంతో అస్వస్థతకు గురైంది. హుటాహుటిన స్థానిక ప్రైవేటు వైద్యునికి చూపించి అక్కడి నుంచి కొత్తగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా చిన్నారి మృతి చెందింది. -
స్కూలు బస్సు ఢీకొని బాలుడు మృతి
ఆదిలాబాద్: ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చిన ఓ బాలుడిని స్కూలు బస్సు చిదిమేసింది. బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా భీమిని మండలం జనకాంపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సంగ భూమేశ్, మౌనిక దంపతులు బతుకుదెరువు కోసం జనకాపూర్ గ్రామానికి వలస వచ్చారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. చిన్న వాడైన అభిలాష్(4) ఇంటి వద్ద ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం ఆడుకుంటూ రోడ్డు పైకి వచ్చిన అతడిని భీమినికి చెందిన ఓ స్కూలు బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో అభిలాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
మానవత్వం ఓడిన వేళ...
మానవత్వం ఓడిన తీరును కళ్లకు కట్టి ప్రపంచాన్ని కంటతడి పెట్టించిన చిన్నారి అయలాన్ కుర్దీ అంత్యక్రియలు శుక్రవారం సిరియాలోని కోబాన్ పట్టణంలో పూర్తయ్యాయి. టర్కీ నుంచి సిరియా సరిహద్దుల వరకు ప్రత్యేక విమానంలో రేహన్, ఇద్దరు పిల్లల మృతదేహాలను తరలించారు. జర్నలిస్టులు, టర్కీ ఎంపీలు వెంటరాగా... తండ్రి అబ్దుల్లా సొంతపట్టణానికి చేరుకొని బంధు, మిత్రుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇద్దామనే మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేశానని... ఇప్పుడు నాకంటూ ఏమీ మిగల్లేదు గనక ఇక ఎక్కడికీ పోనని అబ్దుల్లా రోదిస్తూ చెప్పారు. 'ప్రపంచ దేశాలన్నింటినీ తనకిచ్చినా (ఎక్కడైనా నివసించే అవకాశం కల్పించినా) నాకేమీ వద్దు. అత్యంత విలువైనదే కోల్పోయాను' అంటూ గద్గదస్వరంతో అన్నారు. టర్కీ తీరంలో అయలాన్ మృతదేహం యూరోప్ దేశాధినేతలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజానీకంలో సానుభూతి వెల్లువెత్తింది. ఏళ్లుగా నలుగుతున్న సిరియా శరణార్థుల సమస్యను ప్రపంచం దృష్టికి తెచ్చింది. 2 లక్షల మందికి నీడ ఇవ్వండి బ్రస్సెల్స్: యూరప్కు వస్తున్న వలసదారులు ప్రమాదాల్లో చనిపోతున్న నేపథ్యంలో 2 లక్షల మంది శరణార్థులకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలన్నీ కలసి ఆశ్రయమివ్వాలని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ అంటోనియో గటై పిలుపునిచ్చారు. అయలాన్ మృతదేహం దొరికిన తీరు ప్రపంచ ప్రజల్ని కలచి వేసిన తరుణంలో స్పందించకుండా ఉండకూడదన్నారు. కాగా, శరణార్థులకు ఆశ్రయమివ్వడానికి జర్మనీ, ఫ్రాన్స్ అంగీకరించాయి. గ్రీస్, ఇటలీ, హంగరీ దేశాలపై శరణార్థుల భారం తగ్గించేందుకు 1.2 లక్షల మందికి పునరావాసం కోసం ఒక ప్రణాళికను వచ్చేవారంలో ఈయూ విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయమిస్తామని బ్రిటన్ తెలిపింది. -
చాక్పీస్తో ఆడుకున్నాడని...
విద్యార్థిని చితకబాదిన టీచర్ లంగర్హౌస్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘటన హైదరాబాద్: తరగతి గదిలో చాక్పీస్తో ఆడుకున్నాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని చితకబాదాడు. ముందటి పళ్లు ఊడేలా కొట్టాడు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు వెన్ను విరగొట్డాడు. హైదరాబాద్లోని లంగర్హౌస్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్హౌస్ ప్రశాంత్నగర్లో నివాసముండే ప్రీతిబాల, మహేశ్ యాదవ్ల కుమారుడు తనిష్క్ యాదవ్ (11). బాపూఘాట్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఇతని తల్లి గతంలో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. తనిష్క్ గురువారం తరగతి గదిలో ఉండగా తోటి స్నేహితుడు అతనిపై చాక్పీస్ విసిరాడు. అదే చాక్పీస్ను తనిష్క తిరిగి ఆ విద్యార్థిపై పడేశాడు. ఇది గమనిం చిన టీచర్ సుధీర్ ఆగ్రహంతో ఊగి పో యి తనిష్క్ను ఇష్టమొచ్చినట్లుగా కొట్టా డు. విషయం తెలుసుకున్న స్థాని కులు, బాలుడి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరింత కోపం పెంచుకున్న సుధీర్ శుక్రవారం పాఠశాలకు వచ్చిన తనిష్క్పై అకారణంగా దాడికి దిగాడు. వెన్నుపూస భాగంలో తీవ్రంగా కొట్టడంతో బాలుడు కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు బాలుడిని లంగర్హౌస్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
పాపం... పసివాడు!
ఈ ఫోటో చూడగానే 'అయ్యో పాపం...' అంటూ చలించని హృదయం ఉండదు. సురక్షిత జీవితం, మంచి భవిష్యత్తు కోసం ప్రాణాలకు తెగించి సిరియాను వదిలి మధ్యదరా సముద్రం మీదుగా యూరోప్కు ప్రయాణమైంది వీరి కుటుంబం. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు, కుర్దు సాయుధుల మధ్య సిరియా నలిగిపోతోంది. నిత్యం బాంబుల మోతలు, తుపాకుల గర్జనలే. ఇక ఇక్కడ ఉండలేమనే భావనతో పుట్టినగడ్డను, ఆస్తిపాస్తులను వదిలేసి వేలాది మంది ప్రాణాలకు తెగించి చిన్నచిన్న బోట్లలో మధ్యదరా సముద్రాన్ని దాటే సాహసం చేస్తున్నారు. జనాన్ని అక్రమంగా తరలించే ముఠాల అత్యాశతో బోట్లు కిక్కిరిసిపోతున్నాయి. కల్లోల సముద్రంలో ఈ బోట్లు మునిగిపోతున్నాయి. వేల మంది చనిపోతున్నారు. సిరియాలోని కొబాని పట్టణానికి చెందిన అబ్దుల్లా, తన భార్య రేహన్, కుమారులు అయలాన్ కుర్దీ (3), గాలిప్ (5)లతో ఇలాగే దేశం వదిలాడు. టర్కీకి వచ్చి గ్రీస్లోని కోస్కు వెళ్లేందుకు బోటు ఎక్కాడు. వీరి పడవ మునిగిపోయి 12 మంది చనిపోయారు. అబ్దుల్లా ఎలాగో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ... కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలు నీట మునిగి చనిపోయారు. అయలాన్ కుర్దీ మృతదేహం టర్కీ తీరానికి కొట్టుకువచ్చింది. దీన్ని చూసిన ప్రపంచం నివ్వెరపోయింది. బాధతో విలవిల్లాడింది. పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. సోషల్ సైట్లలో ఎందరో అశ్రుతర్పణాలు అర్పించారు. యూరోప్ దేశాధినేతలంతా స్పందించారు.ప్రస్తుతానికి ఏడాదికి 32 వేల మందిని ఆశ్రయం కల్పిస్తున్న యూరోప్ దేశాలు ఈ సంఖ్యను మరింత పెంచడానికి సిద్ధమని ప్రకటించాయి. మొత్తం లక్షా అరవై వేల మంది యూరప్లోని శరణార్థుల శిబిరాల్లో తలదాచుకున్నారు. -
నీటితొట్టిలో పడి బాలుడు మృతి
డోర్నకల్: నీటి తొట్టిలోపడి బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన మౌలి-యాకూబీ దంపతుల కుమారుడు హబీబ్(18 నెలలు) గురువారం సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ నీటి తొట్టిలో పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బయటకు తీసేసరికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే హబీబ్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. -
టైఫాయిడ్తో బాలుడు మృతి
గుంటూరు: టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. వివరాలు.. గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలకేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన మణికంఠ(7) అనే బాలుడు స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాదపడుతుండటంతో.. అతన్ని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
బస్సులో శిశువు మృతదేహం
వరంగల్: వరంగల్ బస్టాండ్లో శిశివు మృతదేహం కలకలం సృష్టించింది. గోదావరిఖని డిపోకి చెందిన బస్సు ప్రయాణికులతో ఆదివారం వరంగల్ వచ్చింది. ఈ బస్సులో ఒక సంచిలో శిశివు మృతదేహాన్ని ప్రయాణికులు గుర్తించారు. ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆ సంచిని బస్సులో వదిలి వెళ్లాడని ప్రయాణికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. -
మురికి కాలువలో పసికందు
మహబూబ్నగర్: గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును సోమవారం మురికికాలువలో వదిలివెళ్లారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో గాంధీనగర్ కాలనీ సిల్వర్ జూబ్లీ క్లబ్ సమీపంలోని వీరేష్ ఇంటిముందు చోటుచేసుకుంది. పాప ఏడుపు గుర్తించిన వీరేష్ భార్య పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు 108 సాయంతో చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
బాలుణ్ని మింగిన బోరు బావి!
నల్లగొండ జిల్లాలో విషాదం పెద్దవూర: మరో బోరు బావి రాకాసి నోరు సాచింది! అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న ఓ బాలుణ్ని అమాంతం మింగేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకును దూరం చేసి తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. బాలుణ్ని కాపాడేందుకు మూడు గంటలపాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొలగోని నర్సింహగౌడ్, సరిత దంపతులకు శివ(4) ఏకైక సంతానం. ఆదివారం తమకున్న ఎకరం పత్తి చేనులో కలుపు తీయటానికి దంపతులిద్దరూ వెళ్లారు. స్కూలుకు సెలవు కావడంతో శివను తమ వెంట తీసుకెళ్లారు. సరిత అక్క కూతుళ్లు ఇద్దరు కూడా వారితో వెళ్లారు. నర్సింహ, సరితలు పొలంలో పనుల్లో మునిగిపోయారు. ఈ ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ వారి తాత వెంకటేశ్వర్లుకు చెందిన పక్క చేనులోకి వెళ్లారు. శివ బోరు గుంతపై ఉన్న ప్లాస్టిక్ సంచిపై ఎగురుతూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక్కసారిగా బావిపై ఉన్న బస్తాలతో సహా అందులోకి జారిపోయాడు. పక్కనే ఉన్న పిల్లలు విషయాన్ని చేలో పనిచేసుకుంటున్న శివ తల్లిదండ్రులకు చెప్పారు. వారు పరుగు పరుగున బోరు గుంత వద్దకు చేరుకున్నారు. వీరి రోదనలు విని చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకున్నారు. అమ్మా ఊపిరి ఆడడం లేదమ్మా..! బోరు బావిలో పది, పదిహేను అడుగుల లోతులోనే శివ ఇరుక్కుపోయాడు. పైన ఉన్నవారికి కనిపించాడు. తల్లిదండ్రులు శివా.. శివా.. అని పిలిస్తే స్పందించాడు. ‘మమ్మీ.. భయమేస్తుందమ్మా.. ఊపిరి ఆడటం లేదు.. దప్పిక వేస్తోంది’ అని ఏడుస్తూ చెప్పాడు. దీంతో వారు తాడును గుంతలోకి వేసి, దాన్ని పట్టుకొమ్మని చెప్పటంతో శివ అలాగే చేశాడు. తల్లిదండ్రులు తాడును లాగటానికి ప్రయత్నించారు. కానీ కాసేపటికి ‘డాడీ.. చేతులు నొప్పి పెడుతున్నాయి’ అంటూ తాడును వదిలేశాడు. ఒక్కసారిగా కిందికి వెళ్లడంతో అప్పటి దాకా బస్తాల సాయంతో బోరు మధ్యలో ఆగిన బాలుడు నీటిలోకి జారిపోయాడు. అప్పట్నుంచీ ఎంత పిలిచినా స్పందించలేదు. తాడుతో లాగకుండా అలాగే ఉంచితే బతికేవాడేమోనని పలువురు పేర్కొంటున్నారు. మూడు గంటలపాటు సహాయక చర్యలు బాలుడు బోరు బావిలో పడిన విషయం తెలియడంతో ఎస్సై ప్రసాదరావు తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మూడు జేసీబీలు ఏర్పాటు చేసి బోరు గుంతకు సమాంతరంగా గుంత తీయించారు. పదిహేను అడుగులు తవ్వగానే బోరు బావి గుంత బయట పడింది. అక్కడినుంచి ఒక కర్రను బోరు గుంతలోకి ప్రవేశపెట్టి.. బాలుడు ఎంత లోతులో ఉన్నాడో చూసి, మరో 5 అడుగుల గుంత తీశారు. 20 అడుగుల లోతులో బోరు బావిలోకి సొరంగం ఏర్పాటు చేయగానే అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. సొరంగం నుంచి బాలుడిని పైకి లాగారు. బాలుడు బతికే ఉన్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే 108 వాహనంలోకి తరలించి, ఆక్సిజన్ పెట్టారు. ప్రథమ చికిత్స చేస్తూ నాగార్జునసాగర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గుంతను పూడ్చాలనుకుని.. శివ తాత అయిన బొలగోని వెంకటేశ్వర్లు గత శుక్రవారమే తన చేలో 230 అడుగుల మేర ఈ బోరు బావిని తవ్వించారు. అందులో నీరు పడలేదు. ఆదివారం బోరు గుంతను పూడ్చాలనుకుని పార కూడా తీసుకువచ్చాడు. కానీ వర్షం రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. వర్షం ఆగిన తర్వాత గంటలోపే శివ అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోవడం విషాదం! -
బోరు బావిలో పడిన చిన్నారి
నల్లగొండ: నల్లగొండ జిల్లా పెద్దఉర మండలం పులిచెర్ల గ్రామంలో నాలుగు సంవత్సరాల బాలుడు ఆదివారం సాయంత్రం 3.25 గంటలకు బోరుబావిలో పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న బోరు గుంతలో పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు, అతని అరుపులు వినిపిస్తున్నట్టు తల్లిదండ్రులు చెప్పారు. విషయం అధికారులకు తెలియడంతో చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
స్కూలు వ్యాను ఢీకొని చిన్నారికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం ఉదయం స్కూలు వ్యాను ఢీకొన్న ఘటనలో చిన్నారి కాలు పోగొట్టుకుంది. మండల కేంద్రం హన్మాన్బస్తీకి చెందిన ఓదెలు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె హనీ(3) బుధవారం ఉదయం రోడ్డు పక్కన ఉండగా స్థానిక ప్రైవేట్ స్కూలు బస్సు అటుగా వెళుతోంది. ప్రమాదవశాత్తు బస్సు తాకటంతో చిన్నారి కాలు పూర్తిగా నుజ్జయింది. దీంతో ఆమెను ములుగు ఆస్పత్రికి, అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనకు కారకుడైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని, బస్సును పోలీస్స్టేషన్కు తరలించారు. పాఠశాల వాహనాల్లో చిన్నారులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలంటూ అధికారులు అవగాహన కల్పించిన మరునాడే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
బైక్ రూపంలో చిన్నారిని బలిగొన్న మృత్యువు
కృష్ణా: పాఠశాలకు వెళ్లిన చిన్నారిని మృత్యువు మోటారు సైకిల్ రూపంలో బలి తీసుకున్న సంఘటన కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో శనివారం జరిగింది. ఎస్ఐ లవరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చినగొల్లపాలెం రాళ్లరేవుకు చెందిన పెద్ది బాలాజి కుమారుడు మణికంఠ(6) లక్ష్మీపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. శనివారం తన సోదరుడితో కలసి పాఠశాలకు వచ్చాడు. స్కూలు ముగిసిన అనంతరం స్కూలు వ్యాన్ ఎక్కడం మరిచిపోయాడు. దీంతో పాఠశాల యాజమాన్యం తమ సిబ్బందితో మోటారు సైకిల్ మీద మణికంఠ, అతని సోదరుడిని వ్యాన్ వద్దకు పంపించారు. వీరు ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొట్టింది. ఈసమయంలో రోడ్డుపై వెళుతున్న ట్రాక్టరు చక్రానికి మణికంఠ గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం ఘటనా స్థలికి చేరుకుని మణికంఠను భీమవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో 108 సిబ్బంది మణికంఠను పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించారు. దీంతో మణికంఠ మృతదేహాన్ని తీసుకుని వెనుకకు వచ్చేశారు. ఈ ఘటనపై అందిన సమాచారం మేరకు పోలీసులు వచ్చి ట్రాక్టర్, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై లవరాజు తెలిపారు. మణికంఠ మృతదేహం వద్ద తల్లి, కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. -
నీటి గుంతలో పడి బాలుడు మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి భద్యతండాకు చెందిన ఓ బాలుడు శనివారం ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన మూడావత్ రాంజీ, మంగ్లి దంపతులు తమ కుమారుడు పులేందర్ అలియాస్ పుల్య(9)ను తీసుకుని శనివారం పొలం వద్దకు వెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా పుల్య సమీపంలోని నీటి గుంత వద్ద ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు నీటి గుంతలోకి జారిపడిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా గుంతలో శవమై కనిపించాడు. బాలుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. -
నీటితొట్టెలో పడి చిన్నారి మృతి
మదనపల్లె రూరల్: నీటితొట్టెలోపడి ఓ చిన్నారి దుర్మరణం చెందిన విషాధ సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని అంకిశెట్టిపల్లెకు చెందిన జాస్మీన్, బాబ్జాన్ల ఏకైక కుమార్తె ఎస్.షబ్రీన్(3) ఆడుకుంటూ ఇంటి ముందు ఏర్పాటు చేసిన నీటితొట్టెలో అనుకోకుండా పడిపోయింది. కుటుంబీకులు బాలిక కనబడకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. నీటి సంపులో చూడగా అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని గమనించారు. వెంటనే బయటకు తీసి 108కు సమాచారం అందించారు. సిబ్బంది ఆ పాపను బతికించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆ చిన్నారి మృతి చెందింది. -
చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం
ప్రకాశం(కంభం): ఏడేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన గురువారం ఉదయం ప్రకాశం జిల్ల్లా కంభం మండలంలో వెలుగుచూసింది. మండలంలోని రాయపాడు గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... అదే గ్రామానికి చెందిన పోలిక వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు బుధవారం సాయంత్రం చిన్నారిని గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసి చంపేందుకు యత్నించాడు. బాలిక కనిపించకపోవడంతో కుటంబ సభ్యులు చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అర్ధరాత్రి తర్వాత బాలికను తీసుకుని వెంకటేశ్వర్లు గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు వ్యక్తిని చితక బాది పోలీసులకు అప్పగించారు. -
మురుగు కాల్వలో కవలలు
విజయవాడ: పసికందులు రోడ్డు పాలవుతున్న ఘటనలు తెలుగుగడ్డపై నానాటికీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆశశిశువులను వదిలించుకునేందుకు రోడ్డు పక్కన వదిలేస్తున్న ఉదంతాలు అధికమవుతున్నాయి. తాజాగా కవల పిల్లలను మురుగు కాల్వలో పడేసిన విదారక ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పాపలను గుర్తుతెలియని వ్యక్తులు ఏలూరు లాకులు సమీపంలో మురుగు కాల్వలో పారేశారు. శిశువుల మృతదేహాలను వెలికితీశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పాపను పీర్జాదిగూడ-బుద్ధానగర్ పరిసర ప్రాంతంలో ముళ్లపొదల్లో వదిలేశారు. పసికందు గుక్కపెట్టి ఏడుస్తుండగా గుర్తించిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ పాపను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో ఆదివారం స్నానాల గదిలో ఆడ శిశువు మృతదేహం లభించిన సంగతి తెలిసిందే. -
అయ్యో ‘పాప’ం!
భారమైంది..! కల్వకుర్తి: ఆడపిల్లల పోషణభారమని భావించిన ఓ తల్లి పేగుబంధాన్ని మరిచి తన కూతుర్ని అమ్మకానికి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగుచూసింది. కల్వకుర్తికి చెందిన సైదమ్మకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులో కొడుకు పుడతాడని భావించిన ఆమెకు మరో కూతురు జన్మించింది. ఈ క్రమంలో వంగూరు గేటు సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై ఆ చిన్నారిని రూ.200కు విక్రయించేందుకు ఉంచింది. ఇది గమనించిన స్థానికులు కల్వకుర్తి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించారు. వారు అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. పాపను శిశువిహార్కు తరలించనున్నట్లు వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తన కూతురును విక్రయానికి పెట్టినట్లు సైదమ్మ తెలిపింది. వద్దనుకుంది..! గుంటూరు: ఏ తల్లి కన్న బిడ్డో... పుట్టి పట్టుమని పదిరోజులైనా అయిందో లేదో... ఓ పసికందు ఎండ వేడికి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తోంది. బస్టాండ్లో ఎవరో వదిలేసిన ఆ ఆడశిశువును చూసిన ప్రయాణికులు చలించిపోయారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో ఆదివారం రోజుల వయసున్న ఆడ శిశువు అదేపనిగా ఏడుస్తోంది. బస్టాండ్లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలు పక్కనే ఉన్న డార్మెటరీ వద్ద నేలపై పరిచి ఉన్న కాగితాలపై ఉన్న ఆ పసికందు సంబంధీకులెవరూ ఎంతకీ దగ్గరకు రాలేదు. ఇది గమనించిన ఒక ప్రయాణికుడు విషయాన్ని అవుట్పోస్టు పోలీసులకు తెలిపాడు. పాత గుంటూరు ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని శిశువు తల్లిదండ్రుల గురించి ఆరా తీసినా ఫలితం లేకపోయింది. శిశువు చేతికి ఉన్న బ్యాండ్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు, ఓ యువతి కలిసి చిన్నారితో డార్మెటరీ ప్రాంతంలో సంచరించడం తాము గమనించినట్లు కొందరు ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. అనంతరం చైల్డ్కేర్ అధికారులు పసికందును గుంటూరు జీజీహెచ్కి తరలించారు.