
కోర్టుకు హాజరైన స్పీకర్
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం వరంగల్ జిల్లా ములుగు సివిల్ కోర్టుకు హాజరయ్యారు.
ములుగు : స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సోమవారం వరంగల్ జిల్లా ములుగు సివిల్ కోర్టుకు హాజరయ్యారు. 2014 శాసనసభ ఎన్నికల సందర్భంగా గణపురం మండలం బంగ్లపల్లిలో పార్టీ కార్యకర్త రాజేశ్వరరావు వద్ద రూ. 20 లక్షలు దొరకగా, ఈ కేసులో రాజేశ్వరరావు ఏ-1గా, మధుసూధనాచారి ఏ-2గా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన కోర్టుకు హాజరు కాగా, కేసు ఈ నెల 29కి వాయిదా పడింది.