మిర్యాల గూడ: నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని వసతి గృహాల విద్యార్థులు మంగళవారం ఉదయం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో స్వయంగా వచ్చి పట్టణంలోని హాస్టళ్ల తీరుతెన్నులను పరిశీలించాలని వారు కోరారు. హాస్టళ్లలో సదుపాయాలు మెరుగుపరచకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
వసతులు కల్పించాలని విద్యార్థుల ధర్నా
Published Tue, Dec 15 2015 11:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM
Advertisement
Advertisement