Welfare Hostels
-
సంక్షేమ హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: పేద పిల్లలు చదువుకునే సంక్షేమ హాస్టళ్ల(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు)పై ఇంత నిర్లక్ష్యమా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే పిల్లలెందుకు నేలపై నిద్రిస్తున్నారని నిల దీసింది. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎంత నిధులు కేటాయించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? ఆ నిధులతో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? తదితర వివ రాలను గణాంకాలతో సహా తమ ముందుంచాలని సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణకు సంక్షేమ శాఖ కమిషనర్ను ఆన్లైన్లో హాజరవ్వాలని తేల్చిచెప్పింది. అలాగే ప్రతి జిల్లాలో కనీసం ఐదు సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి.. నివేదిక ఇవ్వాలని అన్ని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. విద్యార్థులతో సంభాషించి వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించాలని.. పౌష్టికాహారం, తాగునీరు, దుప్పట్లు, దోమ తెరలు వంటి కనీస అవసరాలు తీరుతున్నాయో, లేదో తెలుసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలకు.. కులాలతో ఏం సంబంధం?జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సంక్షేమ హాస్టళ్లలో తప్పనిసరిగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని.. కానీ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఆ పరిస్థితులు లేవంటూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అరుణ్ శౌరి వాదనలు వినిపిస్తూ.. సంక్షేమ హాస్టళ్లలో తగినన్ని బాత్రూమ్లు లేక ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ధర్మాసనం స్పంది స్తూ.. దీనిపై మీ వైఖరి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపులు పెంచామని చెప్పారు. అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు పెంచుతామని.. ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. 1:7 నిష్పత్తిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. ఈ విషయాలను కౌంటర్లో పేర్కొన్నామని ఆమె తెలిపారు. కాగా, ఆ కౌంటర్లో హాస్టళ్లలో చదువుతున్న పిల్లల కులాలను పొందుపరచడాన్ని ధర్మాసనం గమనించింది. పిల్లలకు కులాలతో ఏం సంబంధమని.. పిల్లలు పిల్లలేనని ధర్మాసనం వ్యా ఖ్యా నించింది. ప్రభుత్వ కౌంటర్ సాదాసీదాగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. పూర్తి వివరా లతో నివేదికను కోర్టు ముందుంచుతామని ప్రణతి చెప్పారు.ఇంత తక్కువ నిధులతో నిర్వహణ ఎలా సాధ్యం?బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం నిధులిస్తుంటే.. విద్యార్థులు ఎందుకు నేలపై నిద్రపోతారని ప్రశ్నించింది. తగినన్ని మరుగుదొడ్లు, బెడ్లు, బెడ్షీట్లు, పౌష్టికాహారం తదితరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి దోమ తెరలు అందించాలని ప్రభుత్వానికి గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంక్షేమ హాస్టళ్ల కోసం రూ.143 కోట్లే కేటాయించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తంతో హాస్టళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. భావిభారత పౌరుల కోసం నామామాత్రంగా నిధులు కేటాయిస్తే ఎలా? అంటూ నిలదీసింది. 90,148 మంది విద్యార్థులకు ఇంత తక్కువ మొత్తం ఎలా సరిపోతాయని ప్రశ్నించింది. ఇప్పటి వరకు హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత అవసరం? తదితర వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ నివేదిక, జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు అందించే నివేదికలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. -
తెలంగాణ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల మరణాలు ఆగేదెన్నడు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో వరుసగా ఆహారం కలుషిత మైన (ఫుడ్ పాయిజన్) సంఘటనలు, విద్యార్థుల మరణాలు కొనసాగున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపాన్నీ, సౌకర్యాల కల్పనలో వైఫల్యాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఘటనలన్నిటికీ రాష్ట్ర సర్కారే భాధ్యత వహించాలి. ఈ ఏడాది విద్యాసంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు 500 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అనారోగ్యం పాలవ్వగా, 42 మంది విద్యార్థుల మరణాలు సంభవించాయి. వీరిలో ఫుడ్ పాయిజన్ వలన అనారోగ్యంతో మరణించిన వారు, బలవన్మరణానికి పాల్పడినవారూ, అనుమానాస్పదంగా మృతి చెందినవారూ ఉన్నారు.ఇదే ఏడాది ఆగస్టు నెలలో తెలంగాణ ప్రభుత్వ సంస్థలైన ఏసీబీ, తూనికలు, శానిటరీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పది బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా 10 హాస్టళ్ళలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ తనిఖీలలో విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, భోజనం అందడం లేదని గుర్తించారు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వడ్డిస్తున్నారని తెలిసింది. ఎక్కడ కూడా ఆహార మెనూ పాటించడం లేదు. అరటిపండ్లు, గుడ్లు ఇవ్వడం లేదు. హాస్టళ్ళ చుట్టూ ప్రహరీ గోడలు లేవు. వంటశాలలు రేకుల షెడ్లలో కొనసాగుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు నిలువచేస్తున్నారనీ, మరుగుదొడ్లు– బాత్రూంలలో కనీస శుభ్రత లేదనీ, విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగా లేదనీ తేలింది. తాజాగా నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఈ పర్వం ఇంకా కొనసాగుతున్నదని రుజువవుతోంది. నవంబర్ ఆరవ తేదీన మంచిర్యాల జిల్లాలోని సాయికుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో 12 మంది విద్యార్థినులు ఆరోగ్యం దెబ్బతిన్నది. అక్టోబర్ 30వ తేదీన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 50 మందికి పైగా గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మార్చి 8న జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థినులు, ఆగస్టు 7న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని తెలంగాణ మైనారిటీ రెసి డెన్షియల్ బాలుర పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.ఆగస్టు 9న జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందాడు. మార్చి నెల నుంచి నవంబర్ 15 వరకు 200 మంది గురుకుల, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏప్రిల్ 14వ తేదీన భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 27 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా... 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆగస్టు 22న భువనగిరిలోని ఈ గురుకులాన్ని ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్’ బృందం సందర్శించినప్పటికీ న్యాయం మాత్రం జరగలేదు.చదవండి: విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం.. పిల్లలకు నాణ్యమైన చదువు దూరం!ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసు కోకపోతే పరిస్థితులు మరింతగా విషమిస్తాయి. ప్రభుత్వం శిక్షణ పొందిన పర్మనెంట్ వంట మనుషులను నియమించాలి. ప్రతి హాస్టల్లో కౌన్సిలింగ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పి డ్యూటీ డాక్టర్, స్టాఫ్ నర్స్లను నియమించాలి. ఇటీవల పెంచిన మెస్ చార్జీలను వెంటనే అమలు చేసి నాణ్యమైన భోజనాన్ని అందించాలి. వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు మండల స్థాయిలో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ దిశలో ప్రభుత్వం పనిచేసే విధంగా విద్యార్థి – యువజనులు, విద్యార్థుల తల్లి దండ్రులు, ప్రజలు వివిధ రూపాలలో పోరాటాలు కొనసాగించి ఒత్తిడి తేవాలి.– కోట ఆనంద్ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు -
సంక్షేమ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ కమిటీ
-
సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు
నీళ్ల పప్పు.. ఉడికీ ఉడకని అన్నం.. సంక్షేమ హాస్టళ్లలో రోజూ ఇదే మెనూ. ఈ భోజనాన్ని తినలేక పిల్లలు అల్లాడిపోతున్నారు. చలి వణికిస్తోంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేక విలవిల్లాడిపోతున్నారు. ఓ వైపు దోమల మోత.. మరో వైపు బయటి నుంచి దుర్గంధం వెదజల్లుతుండటంతో రాత్రిళ్లు పడుకోలేకపోతున్నారు. ‘ఇదేంటయ్యా..’ అని పిల్లల తల్లిదండ్రులు వార్డెన్లను ప్రశ్నిస్తే.. ‘మేమేం చేయాలి.. ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు.. ఎన్ని రోజులని మేం అప్పులు చేసి తెచ్చిపెట్టాలి? ఇప్పటికే చాలా వరకు అప్పులు చేశాం.. ఆ అప్పు తీరిస్తేనే కొత్తగా సరుకులు ఇస్తామని కిరాణా కొట్ల వాళ్లు చెబుతున్నారు. పై ఆఫీసర్లకు రోజూపరిస్థితి చెబుతూనే ఉన్నాం. వారు అంతా విని ఫోన్ పెట్టేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుప్పట్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టినా.. కనీసం మెస్ చార్జీలన్నా సమయానికి ఇవ్వాలి కదా..’ అంటూ వాపోతున్నారు. వార్డెన్లే ఇలా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు బిక్కమోహం వేసుకుని చూడాల్సిన దుస్థితి. సరిగ్గా ఐదు నెలలకు ముందు వరకు వారంలో రోజుకొక మెనూతో చక్కటి భోజనం తిన్న విద్యార్థులు ఆ రోజులు గుర్తు చేసుకుంటూ.. ప్రస్తుత పరిస్థితిపై వాపోతున్నారు.సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : మానవత్వం లేని కూటమి సర్కారు తీరుతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు చలి వణికిస్తుండగా, మరోవైపు పిల్లలకు సరైన భోజనం కరువైంది. చాలా చోట్ల మరుగుదొడ్లు, మంచి నీటి సమస్యతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. వారికి క్రమం తప్పకుండా ఇవ్వాల్సిన వస్తువులతోపాటు కాస్మోటిక్, మెస్ చార్జీలు విడుదల చేయడం లేదు. ఈ దిశగా కూటమి పార్టీల నేతలు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఐదు నెలలైనా అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రాష్ట్రంలో 3,836 హాస్టళ్లు, గురుకులాల్లో చదివే 6,34,491 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర పేద వర్గాల విద్యార్థులతోపాటు వాటిలో పని చేస్తున్న 36,537 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ప్రతి సంక్షేమ హాస్టల్, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి ఏటా స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో ఒక దుప్పటి, ఒక కార్పెట్, రెండు టవళ్లు, ప్లేటు, గ్లాసు, బౌలు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక్కొక్కరికి రోజుకు రూ.46 చొప్పున డైట్ బిల్లు (మెస్ చార్జీలు) ఇవ్వాలి. మూడు నెలలు (ప్రస్తుతం నాల్గవ నెల)గా ఈ బిల్లులు పెండింగ్ పెట్టడంతో హాస్టల్, గురుకులాల నిర్వాహకులే చేతి నుంచి డబ్బులు పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు, బార్బర్ ఖర్చులను తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ప్రతి నెల ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం ఐదు నెలలుగా పెండింగ్లో పెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం కంటింజెంట్ బిల్లులు కూడా విడుదల చేయలేదు. ఈ నిధులను స్టేషనరీ, నిత్యావసర వస్తువులు, హెల్త్ కిట్స్, రిపేర్లు వంటి అత్యవసరమైన వాటికి ఖర్చు పెడతారు. ఒక్కొక్క హాస్టల్, గురుకులానికి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కంటింజెంట్ అవసరాలు ఉంటాయి.అంతటా అవే సమస్యలే..» ఉమ్మడి కృష్ణా జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందడం లేదు. చాలా చోట్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. మంచి నీరు సరిగా ఉండదు. మచిలీపట్నంలోని సాంఘిక సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూలన పడింది. బీసీ కళాశాల బాలికల వసతి గృహంలో 88 మంది విద్యార్థినిలు నేల మీదే పడుకుంటున్నారు. వీరికి కనీసం దుప్పట్లు కూడా పంపిణీ చేయలేదు. అవనిగడ్డ ఎస్సీ బాలికల వసతి గృహంలో మే నుంచి కాస్మటిక్స్ ఛార్జీలు ఇవ్వ లేదు. ఏ ఒక్క హాస్టల్లోనూ సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. » గుంటూరు నగరంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కరువయ్యాయి. మార్చి నుంచి సంక్షేమ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు రాలేదు. దీంతో వార్డెన్ న్లు అప్పు తీసుకువచ్చి విద్యార్థినులకు ఆహారం పెట్టాల్సిన పరిస్థితి. జూన్ నెలలో ఇవ్వాల్సిన దుప్పట్లు, ప్లేట్లు, గ్లాస్లు ఇంత వరకు ఇవ్వలేదు. » ఒంగోలు జిల్లాలోని చాలా వరకు హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు చేయడం లేదు. వారంలో 6 సార్లు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా ఒక్కరోజుతో సరిపెడుతున్నారు. ప్రతి రోజూ పాలు అందించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో కనిగిరి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం–2లో 45 మందికి గాను ముగ్గురు పిల్లలే హాస్టల్లో ఉన్నారు. పామూరు పట్టంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో 30 మందికి గాను ఒక్క విద్యార్థి మాత్రమే కనిపించాడు. గిద్దలూరు బేస్తవారిపేటలోని బీసీ హాస్టల్లో వాచ్మెన్, అటెండర్లే వంట చేస్తున్నారు.» ఏలూరు జిల్లాలోని హాస్టళ్లలో చలికి తట్టుకోలేక చాలా మంది పిల్లలు హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దెందులూరు మండలం కొవ్వలిలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో 400 మంది విద్యార్థులకు ఇప్పుడు 50 మంది మాత్రమే ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని హాస్టళ్లలో పారిశుద్ధ్యం బాగోలేక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. » కాకినాడ జిల్లాలోని పలు సంక్షేమ హాస్టళ్లలో భద్రతా లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అధ్వాన పారిశుద్ధ్యం వల్ల పందులు, దోమలతో సావాసం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గురుకుల పాఠశాల ప్రాంగణం అధ్వానంగా తయారైంది. సామర్లకోట బీసీ బాలికల వసతి గృహం చుట్టూ తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పిఠాపురం బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల సంక్షేమ హాస్టల్లో భద్రత కరువైంది. చివరకు బాలికలు దుస్తులు మార్చుకునే సౌకర్యం కూడా లేదు. రాత్రి పూట విద్యుత్ పోయిందంటే హాస్టల్లో అంధకారమే. » విజయనగరం జిల్లా కేంద్రంలో కాటవీధిలోనున్న బీసీ సంక్షేమ వసతి గృహంలో కోండ్రు సాంబశివరావు అనే విద్యార్థి ఇటీవల మృత్యువాతపడ్డాడు. కారణమేమిటో ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ ఘటనతో ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థుల్లో చాలా మంది మళ్లీ తిరిగి హాస్టల్లో అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత మూడు నాలుగు నెలల్లో 8 మంది విద్యార్థులు అనారోగ్య సమస్యలతో మరణించారు.» విశాఖపట్నం జిల్లాలో కాస్మొటిక్ చార్జీలు ఇవ్వలేదు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనకాపల్లి జిల్లాలో బాలికల హాస్టళ్లన్నింటిలో సీసీ కెమెరాల్లేవు. విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, జంబుకానాలు ఇవ్వలేదు. అల్లూరి జిల్లాలోనూ అదే పరిస్థితి. » బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో కనీస వసతులు కరువయ్యాయి. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గింది.» మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి స్వగ్రామమైన కర్నూలు జిల్లా లద్దగిరిలో బాత్రూమ్లు లేక పిల్లలు ఆరు బయట స్నానాలు చేస్తున్నారు. కోసిగిలో పందుల బెడద తీవ్రంగా ఉంది. నంద్యాలలోని ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహాల్లో నీటి సౌకర్యం లేదు. విద్యార్థులు బహిర్భూమికి ముళ్ల పొదలు, రైల్వే ట్రాక్ వద్దకు వెళుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలకు ప్రహరీ లేదు. ఈ హాస్టళ్లు నల్లమల అభయారణ్యం పరిధిలో ఉన్నందున అడవి జంతువులు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుమార్లు వసతి గృహాలకు సమీపంలో చిరుతలు సంచరించాయి. ప్యాపిలి ఎస్సీ వసతి గృహంలో మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పాణ్యంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంచి నీటి సమస్య ఉంది. » చిత్తూరులో ఎస్సీ ప్రీ మెట్రిక్ వసతి గృహంలో కుక్, కామాటి, వార్డెన్ లేరు. వాచ్మెన్ బంధువులతో అనధికారికంగా వంటలు వండిస్తున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో వార్డెన్లు చేతి నుంచి ఖర్చు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు తిరిగి తీసుకుంటామని చెబుతున్నారు. చౌడేపల్లిలో మరుగుదొడ్లు సహా వసతి గృహాన్ని బాలురే శుభ్రం చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోని బీసీ, ఎస్టీ వసతి గృహాల్లో మరుగు దొడ్లకు నీటి సౌకర్యం లేదు. నిధుల లేమితో తిరుపతిలోని హాస్టళ్లలో ఐదు నెలలుగా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. కడుపునిండా భోజనం కరువు..ప్రభుత్వం మూడు నెలలుగా డైట్ చార్జీలు ఇవ్వక పోవడంతో హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు ఎలా భోజనం పెట్టాలో తెలియక వార్డెన్లు తలలు పట్టుకుంటున్నారు. సరుకులను అప్పుపై తెచ్చి వంట చేయించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. పెద్ద మొత్తంలో సరుకులను అప్పుగా ఇవ్వడానికి దుకాణదారులు ముందుకు రావడం లేదని గ్రామీణ ప్రాంత హాస్టల్, గురుకులాల వార్డెన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో విద్యార్థులకు అందించే ఆహారంలో పూర్తిగా నాణ్యత కరువైంది. నీళ్ల చారు, నాసిరకం అన్నంతో కడుపు నింపుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే సమస్యలు.. ఆపై ఆకలి కేకలతో హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు భద్రత కరువైంది. ఎవరు పడితే వారు హాస్టల్ ప్రాంగణంలో వచ్చి పోతుంటారు. ఎవరు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో అడిగే నాథుడే ఉండడు. ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తూ ఇటీవల హైకోర్టు ప్రాథమికంగా పలు మార్గదర్శకాలు సూచిస్తూ ఆదేశించినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు.హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా..» హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. » హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. » హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.» మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. » భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. » సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ళీ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. » హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి.ఆత్మరక్షణకు వర్క్షాపులు నిర్వహించండి » హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. » తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. » హాస్టళ్లలో సమ వయస్కులతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే గుర్తించి సరిచేయాలి. » హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీనిమహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. -
భద్రత ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/కోసిగి/తిరుపతి తుడా: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు భద్రత లేకుండా పోతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో మార్గదర్శకాలేవీ అమలు కావడం లేదు. ఫలితంగా చీకటి పడితే చాలాచోట్ల హాస్టల్ ప్రాంగణాలు మందుబాబులకు నిలయంగా మారుతున్నాయి. ఎవరు పడితే వారు యథేచ్ఛగా హాస్టళ్లలోకి వచ్చి వెళ్తుండటం కనిపిస్తోంది. కనీస సౌకర్యాలు, భద్రత ఎండమావిగా మారింది. గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇటీవల గుంటూరు నగరంలో రెండు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థినులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లడంతో దుమారం రేగింది. అధికారులు దిద్దుబాటు చర్యల్లో భాగంగా మెమోలు ఇవ్వడంతో పాటు చిన్న స్థాయి సిబ్బందిని విధుల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. నగరంలోని ఒక ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్లో ఒక విద్యార్థినిని ఓ ఆకతాయి మాయామాటలు చెప్పి ఒక రోజంతా బయటకు తీసుకువెళ్లాడు. సదరు విద్యార్థిని కనపించకపోవడంతో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైంది. స్టాల్ గరŠల్స్ కాంపౌండ్లోని బీసీ ప్రీ మెట్రిక్ (చిన్న పిల్లల) హాస్టల్లో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులను ఇద్దరు ఆకతాయిలు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లారు. దీనిపై తోటి విద్యార్థిని వార్డెన్కు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదైంది. పట్టించుకోవాల్సిన వార్డెన్పై చర్యలు తీసుకోలేదు. ఈ విషయంలో గతంలో పనిచేసిన నగరపాలెం సీఐ వార్డెన్ను, వార్డెన్ డ్రైవర్ను కేసు నుంచి తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు భారీ మొత్తంలో సదరు సీఐ నగదు తీసుకున్నట్లు విమర్శలు వినిపించాయి. ఎస్టీ బాలికల హాస్టల్లో కూడా ఇలాంటే సంఘటనలు జరుగుతున్నప్పటికి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం. ఇదంతా హాస్టల్ సిబ్బంది సహకారంతోనే జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో మహిళ వార్డెన్స్తో పాటు వారి భర్తలు కూడా హాస్టళ్లకు వస్తుంటారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. నేరుగా బాలికల రూముల్లోకి వార్డెన్ల భర్తలు వెళుతుంటారనే ఫిర్యాదులూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా సంక్షేమ హాస్టళ్ల అధికారులు మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది విద్యార్థులున్న హాస్టళ్లకు సోలార్ ఫెన్సింగ్ లేదు. సీసీ కెమెరాలు లేవు. హాస్టల్కు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళ్తున్నారు.. అని గమనించే వారే లేరు. చాలా చోట్ల హాస్టల్స్కు కాపలా ఉన్న సిబ్బంది ఆకతాయిలతో కుమ్మక్కు కావడంతో ఘోరాలు జరుగుతున్నాయి. ఈ హాస్టల్లో పిల్లలను ఉంచలేం..» కర్నూలు జిల్లా కోసిగి మండలం నుంచి అత్యధికంగా ప్రజలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. తమ పిల్లలను హాస్టల్లో వదిలి వెళ్తున్నారు. అయితే విద్యార్థులకు హాస్టల్లో భద్రత కరువైంది. కోసిగిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను పాత సంతమార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేశారు. హాస్టల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 210 మంది విద్యార్థులు ఉన్నారు. హాస్టల్ చుట్టూ కంపు కొడుతోంది. హాస్టల్ ఒకవైపు మహిళల బహిర్భూమి ప్రాంతం ఉంది. మరో వైపు మురుగు నీరు నిల్వ ఉంది. ముందు భాగంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నిరుపయోగంగా వదిలేశారు. దీంతో పందులు గుంపులు గుంపులుగా తిష్ట వేస్తున్నాయి. చీకటి పడితే చాలు మందుబాబులు హాస్టల్ ప్రాంతంలోనే మద్యం తాగి.. గ్లాసులు, సీసాలు అక్కడే పడేస్తున్నారు. పగటి పూట కోతుల బెడద ఉంది. కిటికీలకు ఉన్న గ్లాసు తలుపులన్నీ ధ్వంసమైపోయాయి. ఇద్దరికి గాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఈ హాస్టల్లో తమ పిల్లలను ఉంచలేమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు చదువు మాన్పించి వెంట తీసుకెళ్లారు. »తిరుపతి జిల్లాలో నాలుగు నెలలుగా గురుకుల వసతి గృహాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వింత పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తిరుపతిలోని బైరాగిపట్టెడ సమీపంలోని గిరిజన బాలికల గురుకుల వసతి సముదాయంలో కలుషిత ఆహారం తిని 23 మంది విద్యార్థినులు ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోందిమా సొంత గ్రామం సోమలగూడురు. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ చుట్టూ దుర్వాసన వస్తోంది. చుట్టూ చెత్తా చెదారమే. కాంపౌండ్ వాల్ లేక పోవడంతో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉంది. ఎవరెంటే ఎవరు వస్తూ పోతూ ఉంటారు. – వీరేంద్ర, 9వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాభద్రత కల్పించాలిరాత్రిళ్లు చలి గాలి వీస్తోంది. హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లు ఇవ్వలేదు. హాస్టల్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచితే బావుంటుంది. హాస్టల్ కిటికీల తలుపులు పగిలి పోవడంతో దుర్వాసన వస్తోంది. ముఖ్యంగా భద్రత కల్పించాలి. – శ్రీధర్, 8వ తరగతి, కోసిగి, కర్నూలు జిల్లాసంక్షోభ హాస్టళ్లుపేద విద్యార్థుల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంసాక్షి, అమరావతి: ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భద్రతను కూటమి సర్కారు గాలికి వదిలేసింది. తమకు సంబంధం లేదన్నట్లు బాధ్యత మరిచి వ్యవహరిస్తోంది. పేద పిల్లలు ఉండే వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను పటిష్టంగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 5 నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. విద్యార్థుల భద్రతకు గత ప్రభుత్వం ప్రాధాన్యం విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షోభ నివారణ వంటి పటిష్ట చర్యల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేసింది. జాతీయ విద్యా విధానం–2020ని అనుసరించి విద్యార్థుల రక్షణ, భద్రత, మౌలిక వసతులు, విద్య, వైద్యం, వసతి వంటి అనేక అంశాలపై మార్గదర్శకాలు జారీ చేస్తూ గతేడాది జూలైలో జీవో 46 జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలోని 3,783 వసతి గృహాలు, గురుకులాలు తదితర విద్యా సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. తద్వారా వీటిలో చదువుతున్న సుమారు 6.40 లక్షల మంది పేద విద్యార్థుల భద్రత, సౌకర్యాలకు సంబంధించిన జాగ్రత్తలు, భోజనం, మంచి నీరు, వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత వంటి వాటి పట్ల శ్రద్ధ తీసుకుంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో సందర్శించి వాటి నిర్వహణను పర్యవేక్షించి చర్యలు చేపట్టేలా మార్గదర్శకాలను అమలు చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్య తీసుకోవడంతోపాటు సంక్షోభ నిర్వహణలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు స్పందించి చర్యలు తీసుకునేలా పటిష్టమైన మార్గదర్శకాలను అమలు చేశారు. వాటిని కొత్త ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పేద విద్యార్థుల భద్రత, భవిత ఇబ్బందుల్లో పడింది. కాగా, రాష్ట్రంలో సుమారు 900 పైగా ఆశ్రమాలు, ట్రస్ట్ హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో మేం నిర్వహించలేమంటూ (నాట్ విల్లింగ్) ఇచ్చిన సంస్థలు 65 నుంచి 70 శాతం ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ నుంచి తప్పించుకునేందుకు.. మేం ట్రస్ట్, ఆశ్రమాలు నడపడం లేదంటూ బుకాయించి, అనధికారికంగా వాటిని నిర్వహిస్తూ దేశ, విదేశీ దాతల నుంచి విరాళాలు దండుకుంటున్నవి అనేకం. ప్రతి నెలా వీటిని తనిఖీ చేసి నిర్వహణ లోపాలు, అనుమతి ధ్రువపత్రాలు వంటి వాటిని పరిశీలించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. -
హాస్టళ్లలో సం‘క్షేమం’ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని తెలిపింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భవిష్యత్ తరాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ‘వివిధ సామాజిక, ఆర్ధిక నేపథ్యాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్స్ స్కూళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో చదివే విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, ప్రిన్సిపల్ది. రెసిడెన్షియల్ క్యాంపస్లో చదువుకునే అమ్మాయిలతో అక్కడ పనిచేసే సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించినా, వారిని లైంగికంగా వేధించినా అది పిల్లల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తుంది. తద్వారా తమ పిల్లలను ఆ క్యాంపస్లో చేర్చడానికి వారు విముఖత చూపుతారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ క్యాంపస్లలో భద్రమైన, సురక్షిత, పరిశుభ్ర వాతావరణం ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే విద్యా పరంగా గ్రామీణ, పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది’ అని పేర్కొంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బి.పప్పూరు గ్రామానికి చెందిన కె.శంకరయ్య గుత్తిలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో వంట మనిషిగా పని చేస్తూ 2011 జూలై 24న ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అధికారులు విచారించి అతన్నిసర్వీసు నుంచి తొలగించారు. దీనిని సవాలు చేస్తూ 2014 ఫిబ్రవరిలో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ తుది విచారణ జరిపి.. శంకరయ్యపై తీసుకున్న చర్యలు సబబే అని మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై లోతుగా స్పందిస్తూ ప్రాథమిక మార్గదర్శకాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో కఠినంగా అమలయ్యే విధంగా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా కోసిగిలో మురుగుతో పందులకు ఆవాసంగా మారిన హాస్టల్ ప్రాంగణం హైకోర్టు సూచించిన ప్రాథమిక మార్గదర్శకాలు ఇలా.. ⇒ హాస్టల్ భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో ప్రహరీ నిర్మించాలి. తప్పనిసరిగా గేటు ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ ప్రాంగణంలో రాకపోకలను పర్యవేక్షించడంతో పాటు వాటిని ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. ⇒ హాస్టల్ ప్రవేశ మార్గం, కారిడార్లు, కామన్ ఏరియాలు వంటి చోట్ల విద్యార్థుల వ్యక్తిగత గోపత్యకు భంగం కలగకుండా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అనధికారికంగా ఆ కెమెరాలను ఆపరేట్ చేయకుండా చర్యలు తీసుకోవాలి. ⇒ మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలి. తగిన నీటి సదుపాయం కల్పించాలి. ⇒ భద్రతా సిబ్బంది సహా మొత్తం సిబ్బంది నేపథ్యాన్ని సమగ్రంగా పరిశీలన చేయాలి. తరచూ శిక్షణ, అవగాహన సెషన్లు ఏర్పాటు చేయాలి. ⇒ సిబ్బంది ముఖ్యంగా ఆడ పిల్లలతో సన్నిహితంగా మెలిగే వారికి లింగ సమానత్వం గురించి, సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తగిన శిక్షణ ఇవ్వాలి. తద్వారా సమస్య ఏదైనా ఎదురైనప్పుడు ఆడ పిల్లలు ధైర్యంగా ముందుకు వచ్చే సురక్షిత వాతావరణం కల్పించడం సాధ్యమవుతుంది. ⇒ సిబ్బందికి స్పష్టమైన ప్రవర్తనా నియమావళిని నిర్ధేశించాలి. దుష్ప్రవర్తన, అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. ప్రవర్తనా నియమావళిని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ⇒ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడేలా, వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడేలా ఆడ పిల్లలకు మానసిక వైద్యులను అందుబాటులో ఉంచాలి. ఆత్మరక్షణకు వర్క్షాపులు నిర్వహించండి ⇒ హాస్టళ్లన్నీ జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ప్రతి చోట పోక్సో చట్టం అమలయ్యేలా చూడాలి. పోక్సో చట్టం కింద విధించే శిక్షల గురించి అందరికీ కనిపించే చోట పోస్టర్లు ఏర్పాటు చేయాలి. ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ఫిర్యాదు చేసేలా వ్యవస్థ ఉండాలి. ⇒ తల్లిదండ్రులు, స్థానిక అధికారులు, విద్యా నిర్వహకులు కలిసి ఆడ పిల్లలకు మద్దతుగా నిలిచే వ్యవస్థను సృష్టించాలి. ఆడ పిల్లలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఆత్మ రక్షణకు సంబంధించిన వర్క్షాపులను తరచూ నిర్వహించాలి. దీని వల్ల అభద్రతా పరిస్థితుల్లో ఆడ పిల్లలు మనోస్థైర్యంతో ధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ⇒ హాస్టళ్లలో సమ వయసు్కలతో బృందాలను ఏర్పాటు చేయాలి. తద్వారా విపత్కర పరిస్థితుల్లో ఒకరి బాగోగులు మరొకరు చూసుకునే అవకాశం ఉంటుంది. భద్రత పరమైన చర్యలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. లోపాలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలి. ⇒ హాస్టళ్లలో ఉండే విద్యార్థులతో పాటు వారి కుటుంబాల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండాలి. తద్వారా మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సాయం చేసేందుకు వీలుగా చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. ⇒ ఈ చర్యలన్నింటి ద్వారా రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఆడపిల్లల భద్రతకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర, ఆదేశ పూర్వక మార్గదర్శకాల రూపకల్పనకు వీలుగా ఈ తీర్పు కాపీని మహిళ, శిశు సంక్షేమ శాఖకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం.ఇప్పటికీ హాస్టళ్ల పరిస్థితిలో మార్పు లేదు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రికార్డులను కూడా పరిశీలించారు. అనంతరం తీర్పు వెలువరిస్తూ, పిటిషనర్ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. శంకరయ్యది తీవ్ర దుష్ప్రవర్తన అని తేల్చారు. హాస్టల్లో నిద్రపోతున్న బాలికల పట్ల శంకరయ్య అనుచిత ప్రవర్తన గురించి ఓ టీచర్ అధికారులకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. నిద్రపోయే సమయంలో తలుపులేసుకోవడంతో పాటు తాళం కూడా వేసుకోవాలని బాలికలకు ఆ టీచర్ చెప్పారంటే శంకరయ్యది ఎలాంటి అభ్యంతరకర ప్రవర్తనో అర్థం చేసుకోవచ్చన్నారు. శంకరయ్యను సర్వీసు నుంచి తొలగిస్తూ అధికారులు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఎలాంటి తప్పు లేదని, వాటిని సమర్ధిస్తున్నట్లు జస్టిస్ హరినాథ్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచిపోయినప్పటికీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. -
మురికి కూపం.. పురుగుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లు దారుణమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వారికి మంచి అల్పాహారం కాని, భోజనం కాని అందడం లేదు. నాసిరకం కందిపప్పు, కూరగాయలు, పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహార పదార్థాలనే వడ్డిస్తున్నారు. మెనూ పాటించడం లేదు. రోజూ ఇవ్వాల్సిన అరటిపండ్లు, గుడ్లు లాంటివి ఇవ్వడం లేదు. వసతి గృహాల్లో పారిశుధ్యం ఆనవాళ్లే లేవు. మరుగుదొడ్లు, స్నానాల గదులతో పాటు వంటశాలల్లోనూ అపరిశుభ్ర వాతావరణం కొనసాగుతోంది. కొన్నిచోట్ల విద్యార్థులతోనే గదులు, ఆవరణ శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు, హాజరు పట్టీలో నమోదు చేసిన సంఖ్యకు, వాస్తవంగా తర గతి గదిలో ఉన్నవారి సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. కొన్నిచోట్ల వార్డెన్లు అందుబాటులో లేరు. వారు ఇష్టారాజ్యంగా వచ్చి వెళుతున్నారు. మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారు అందినంత దండుకునే వ్యవహారంగానే హాస్టళ్ల పనితీరు ఉన్న ట్లు ఈ సోదాల్లో బయటపడింది. డీజీ సీవీ ఆనంద్ ఆదేశాలతో ఏసీబీ అధికారులు, స్థానిక తూనికలు, కొలతల అధికారులు, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లతో కూడిన 10 బృందాలు.. రాష్ట్రంలోని 10 సంక్షేమ హాస్టళ్లలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. అత్యంత అధ్వాన పరిస్థితుల మధ్య విద్యార్థులు కాలం వెల్లదీస్తున్నట్టు గుర్తించాయి. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. ఈ సోదాలపై ఏసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ జాంబాగ్లోని ఎస్సీ బాలుర హాస్టల్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని బీసీ బాలుర హాస్టల్, మహబూబ్నగర్ జిల్లా కోయల్కొండలోని బీసీ బాలుర వసతిగృహం, నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల వసతి గృహం, మంచిర్యాల జిల్లా వెమ్మనపల్లిలోని ఎస్టీ బాలుర హాస్టల్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలోని ఎస్సీ బాలుర హాస్టల్, జనగామలోని ఎస్సీ బాలికల హాస్టల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్, సిద్దిపేటలోని బీసీ బాలుర వసతిగృహం, నిజామాబాద్ కొత్తగల్లీలోని ఎస్సీ బాలికల హాస్టల్లో తనిఖీలు జరిగాయి. మెనూకు చెల్లు చీటీ.. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం గాందీనగర్ గిరిజన జూనియర్ కళాశాల, గురుకుల విద్యాలయం నిర్వహణ అస్తవ్యస్థంగా ఉంది. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీగోడ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు, వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మెనూ కూడా పాటించడం లేదు. మంగళవారం ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరుకాలేదు. నాణ్యత లేని భోజనం.. నల్లగొండ జిల్లా తిప్పర్తి ఎస్సీ బాలికల హాస్టల్ మొత్తం అపరిశుభ్ర వాతావరణంలోనే ఉంది. మరుగుదొడ్లే కాదు.. వంట గది పరిస్థితీ దారుణంగా ఉంది. నాణ్యత లేని టిఫిన్, భోజనం పెడుతున్నారు. తాగునీరు కూడా బాగా లేదు. వసతి గృహంలో 52 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా 23 మందే ఉన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. ఖర్చుల వివరాల్లేవు.. సిద్దిపేట పట్టణంలోని బీసీ విద్యార్థుల వసతి గృహంలో రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేదు. విద్యార్థుల హాజరుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. విద్యార్థులు గైర్హాజరు అయితే కేవలం చుక్క మాత్రమే పెడుతున్నారు. జూన్, జూలై నెలలకు సంబంధించిన ఖర్చు, తదితర వివరాలను రికార్డుల్లో పొందుపరచలేదు. రేకుల షెడ్డులో కిచెన్.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి ఇప్పలపల్లి గ్రామ శివారులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులం కిచెన్ తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. విద్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా లేవు. మౌలిక సదుపాయాల లోపం కూడా ఉంది. ఆహార పదార్థాలు సీజ్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు పెట్టే భోజనం సక్రమంగా లేదు. మంగళవారం తనిఖీల సందర్భంగా నాణ్యత లోపించిన ఆహార పదార్థాలను సీజ్ చేసి, ల్యాబ్కు తరలించారు. మూత్రశాలల నిర్వహణ సరిగా లేదు. కోడిగుడ్లు, అరటిపండ్లకు ఎగనామం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ఎస్సీ బాలికల ప్రీ, పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో తనిఖీల సమయంలో వార్డెన్ కవిత విధుల్లో లేరు. వసతి గృహంలో రికార్డుల పరంగా 110 మంది విద్యార్థులుంటే 73 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. తనిఖీల సమయంలో 60 మంది మాత్రమే ఉన్నారు. మెనూ ప్రకారం కోడిగుడ్లు, అరటిపండ్లు ఇవ్వడం లేదు. భోజనంలో నాణ్యత లోపించింది. టాయిలెట్లు, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. విద్యార్థుల హెల్త్ చెకప్కు సంబంధించిన ప్రొఫైల్ కార్డులు నిర్వహించడం లేదు. త్వరలో ప్రభుత్వానికి వేర్వేరు నివేదికలు! అధికారుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన మరికొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..విద్యార్థుల గదులకు సరైన గాలి, వెలుతురు రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఆహార పదార్థాల పట్టిక పాటించడం లేదు. బాలికల హాస్టళ్లల్లో బాత్రూంల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మొత్తం 18 రకాల రికార్డులు అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది. అయినా ఏ ఒక్కటీ సరిగా పాటించడం లేదు. వార్డెన్లు హాస్టళ్లలోనే ఉండాలి. కానీ వారానికి ఒకరోజు లేదంటే నెలకు ఒకరోజు వచ్చి, పోతున్నారు. రిజిస్టర్లలో రాసిన దానికి అందుబాటులో ఉన్న సరుకుల పరిమాణానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఎక్కువ హాస్టళ్లలో కాలం చెల్లిన ఆహారపదార్థాలను వాడుతున్నారు. ఈ అంశాలతో పాటు ప్రభుత్వ నిధుల దురి్వనియోగంపై, హాస్టళ్ల సిబ్బందిపై తీసుకోవాల్సిన చర్యలు, హాస్టళ్లలోని ప్రస్తుత పరిస్థితులను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వేర్వేరుగా త్వరలో ప్రభుత్వానికి నివేదికలు సమరి్పంచనున్నట్టు ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల క్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన 15 రకాల ప్రమాదాలను నివారించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 3,783 హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. హాస్టళ్లలో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ, వికలాంగుల, జువైనల్ సంక్షేమ శాఖలకు చెందిన వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థుల భద్రత, విద్య, ఆహారం, ఆరోగ్యం, సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో అనేక ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంది. వాటిలో పాము కాటు, కుక్క కాటు, తేలు కుట్టడం, కరెంట్ షాక్, ఎత్తయిన ప్రదేశం నుంచి పడిపోవడం, గాయపడటం, ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నం, అనారోగ్యం, కలుíÙత ఆహారం, ఈవ్ టీజింగ్ తదితరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించింది. యంత్రాంగం తక్షణమే స్పందించడం వల్ల ప్రమాద తీవ్రతను, నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే హాస్టల్ బాధ్యులు సంబంధిత అధికారులకు సమాచారం తెలియజేసి.. ఉపశమన చర్యలు చేపట్టాలని సూచించింది. హాస్టళ్లలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను ఆస్పత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఏదైనా హాస్టల్లో ఘటన జరిగితే.. 5 నిమిషాల్లోనే సంబంధిత హాస్టల్ బాధ్యులు స్పందించి అక్కడికి చేరుకోవాలని సూచించింది. పది నిమిషాల్లో ఉన్నతాధికారులకు.. 15 నిమిషాల్లో కలెక్టర్కు.. అరగంటలోగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారమివ్వాలని స్పష్టం చేసింది. ఘటన తీవ్రత ఆధారంగా హాస్టల్ నిర్వాహకులతో పాటు డివిజనల్, జిల్లా స్థాయి అధికారులు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన 24 గంటల్లో విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందించాల్సి ఉంటుంది. 48 గంటల్లోగా జిల్లా స్థాయి అధికారి ఘటనాస్థలిని సందర్శించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
Fact Check: అది రోత రాతల వంటకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై పనిగట్టుకుని ఈనాడు వండి వారుస్తున్న అసత్య కథనాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. తాజాగా.. రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థల డైట్ చార్జీలపై ఆ పత్రిక వండిన రాతల వంటకం రోత పుట్టించేలా ఉంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించే ఆ క్షుద్ర పత్రిక ‘మాటల వంటకమే’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని అచ్చోసింది. నిజానికి.. ఆ వసతి గృహాలపై చంద్రబాబు సవతి ప్రేమ గత పరిస్థితిని గమనించిన వారెవరికైనా ఇట్టే అర్థమవుతుంది. పైగా బోలెడు బకాయిలు తన హయాంలో చెల్లించలేదు. నిజానికి.. ఈ డైట్ ఛార్జీలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇవి ఆమోదించే దశలో ఉండగా ఈనాడు ఈ వాస్తవాలన్నింటినీ మరుగునపరిచి ఉద్దేశపూర్వకంగా, ఎప్పటిలాగే తన కడుపుమంటను తీర్చుకుంది. దీనిని ఖండిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు కె. హర్షవర్థన్ శుక్రవారం వాస్తవాలు వెల్లడించారు. అవి ఏమిటంటే.. ►2012లో ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లకు డైట్ ఛార్జీలు పెంచారు. ►2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు 2018 వరకు వాటిని పెంచాలనే ఆలోచన చేయలేదు. ►కానీ, 2019లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2018 జూలై నుంచి పెంచింది. అంటే.. ఈ చార్జీలు పెంచింది కేవలం ఎనిమిది నెలలు మాత్రమే. పైగా ఇందుకు అవసరమైన బడ్జెట్ను విడుదల చేయలేదు. ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ►2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. బాబు మిగిల్చిన బకాయిల మొత్తం రూ.132 కోట్లను క్లియర్ చేసింది. ►ఆ తర్వాత డైట్ ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని 2022 ఆగస్టులో సీఎం జగన్ అధికారులను ఆదేశించగా వారు పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ► దీని ద్వారా 5.92 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే, డైట్ ఛార్జీల కోసం రూ.755 కోట్లు బడ్జెట్ కేటాయించారు. తాజా పెంపు ప్రతిపాదనలతో ప్రభుత్వంపై అదనపు ఆరి్థక భారం రూ.110 కోట్లకు పైగానే ఉంటుంది. ఆరి్థకపరమైన భారంతో కూడుకున్న ఈ అంశంపై ఆయా విభాగాల వివరణాత్మక పరిశీలన, సంప్రదింపులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ ఫైలు ఆమోదించే దశలో ఉంది. ►ఇవేకాక.. నాడు–నేడు కింద రాష్ట్రంలో వివిధ రకాల 3,013 సంక్షేమ వసతి గృహాలు, విద్యా సంస్థలను మూడు దశల్లో రూ.3,300 కోట్ల అంచనాతో అభివృద్ధి చేసేందుకు చేసిన ప్రతిపాదనలు ఆమోదానికి సిద్ధంగా ఉన్నాయి. ►ఇందులో ప్రధానంగా టాయిలెట్లలో నీటి సరఫరా, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, ఎల్ఈడీ లైట్లు, మంచినీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బంది కోసం ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, వంటగది ఆధునీకరణ, ప్రహారీ గోడలు, దోమల మ్యాట్లు, స్మార్ట్ టీవీ, క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, డ్రైనేజీ వ్యర్థ జలాలను సురక్షితంగా పారవేయడంతో పాటు పరిసరాల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ►ఈ సమయంలో డైట్ ఛార్జీల పెంపుదల ఫైల్ క్లియరెన్స్ అవకాశం ఉందనే విషయాన్ని మరుగున పరిచి ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించడం సరికాదు. బలహీనవర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో బురదజల్లే రాతలు రాయడం దుర్మార్గం. -
AP: రూ.3,364 కోట్లతో సకల వసతులు.. మారనున్న రూపురేఖలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల ఆధునీకరణకు నాడు–నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో మంచి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కిచెన్లు సైతం ఆధునీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలని, సమాజంలో అట్టడుగున ఉన్న వారు చదువుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించాలని చెప్పారు. బంకర్ బెడ్స్, తదితర అన్ని సౌకర్యాలు నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనాలను పరిగణనలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలు చదువుకోవడానికి మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. హాస్టళ్లలోకి వెళ్లగానే జైల్లోకి వెళ్లామనే భావన వారికి కలగకూడదు. చదువులు కొనలేని కుటుంబాల వారే పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. అందువల్ల అలాంటి పిల్లలు బాగా చదువుకుని, బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. మన పిల్లలనే హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి వసతులు, వాతావరణం ఉండాలనుకుంటామో సంక్షేమ హాస్టళ్లన్నింటినీ అలా తీర్చిదిద్దాలి.’ – సీఎం వైఎస్ జగన్ మూడు దశల్లో పనులు ► మూడు దశల్లో హాస్టళ్ల ఆధునీకరణ పూర్తి చేయాలి. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3,013 చోట్ల రూ.3,364 కోట్లతో నాడు–నేడు పనులు చేపట్టాలి. మొదటి దశలో మొత్తం సుమారు 1,366 చోట్ల పనులు చేపట్టాలి. దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ తొలి విడతలోనే బాగు చేయాలి. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలి. కిచెన్కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను కొనుగోలు చేయాలి. హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు స్పష్టంగా కన్పించాలి. పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యమైన వాటిని అందించాలి. హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలి. మండలాల వారీగా పర్యవేక్షణ ఉండాలి. వెల్ఫేర్ అధికారులు, కేర్ టేకర్ల పోస్టులు భర్తీ చేయండి ► హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలి. ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీ చేయాలి. గిరిజన సంక్షేమ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్–4 ఉద్యోగుల నియామకంపై దృష్టి పెట్టాలి. ప్రతి హాస్టల్ను పరిశీలించి, కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలి. ► హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలి. అంగన్వాడీలలో నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలి. టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి. అంగన్వాడీల్లో ఫ్లేవర్డ్ మిల్క్ ► అంగన్వాడీలలో సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేసినట్టు అధికారులు సీఎం వైఎస్ జగన్కు తెలిపారు. గత సమీక్షలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ► అక్టోబర్ నెలలో నూటికి నూరు శాతం పాల సరఫరా జరిగింది. డిసెంబర్ 1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ► మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్లేవర్డ్ మిల్క్ను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్, ప్ర«భుత్వ ప్రధాన కార్యాదర్శి సమీర్ శర్మ, బీసీ సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు జి.జయలక్ష్మి, ముద్దాడ రవి చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఎ.బాబు, మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టర్లు ఎ.సిరి, ఎం.జాహ్నవి, జీసీ కిషోర్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు. రూ.3,364 కోట్లతో హాస్టళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా హాస్టళ్ల కోసం రూ.1500 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి జనవరిలో పనులు ప్రారంభానికి కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పిల్లలకు మంచి మౌలిక సదుపాయాలతో పాటు కిచెన్ల ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. సమీక్షలోని ముఖ్యాంశాలు.. ►అంగన్వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేసిన అధికారులు. ►అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను వివరించిన అధికారులు. ►అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్న అధికారులు. ►డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్వాడీల్లో అమలు చేస్తామన్న అధికారులు. ►మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం. అంగన్వాడీలలో నాడు – నేడు కార్యక్రమంపైనా సీఎం సమీక్ష ►అంగన్వాడీల నాడు–నేడు పనులు, అనంతర నిర్వహణపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం ఆదేశం. ►మన పిల్లలే అక్కడకి వెళ్తారనుకుంటే ఎలాంటి వాతావరణం ఉండాలని కోరుకుంటామో అవన్నీ కూడా అంగన్వాడీలలో ఉండాలన్న సీఎం. ►అంగన్వాడీలలో టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్న సీఎం. ►ఈ మేరకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశం. గురుకుల పాఠశాలలు, హాస్టళ్లలో నాడు – నేడుపై సీఎం సమీక్ష ►మొత్తం మూడు దశల్లో నాడు – నేడు కార్యక్రమం. ►హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. ►హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదు. ►చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారు. ►వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలి. ►సమాజంలో అట్టడుగున ఉన్నవారు తాము చదువుకోవడానికి తగిన పరిస్థితులు లేవన్న భావన ఉండకూడదు. ►హాస్టళ్లలో ఉంచాల్సిన బంకర్ బెడ్స్.. తదితర సౌకర్యాలన్నీ కూడా నాణ్యతతో ఉండాలి. ►భవనాలను పరిగణలోకి తీసుకుని వాటి డిజైన్లను రూపొందించాలి. ►గురుకుల పాఠశాలలు– హాస్టళ్లు అన్నీ కలిపి మొత్తంగా 3013 చోట్ల నాడు–నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►మొదటి ఫేజ్లో మొత్తం సుమారు 1366 చోట్ల నాడు – నేడు పనులు చేపట్టాలని నిర్ణయం. ►దశాబ్దాలుగా వెనకబాటుకు గురైన కర్నూలు పశ్చిమప్రాంతంలోని హాస్టళ్లన్నింటినీ కూడా మొదట విడతలోనే బాగుచేయాలని సీఎం ఆదేశం. ►మొదట విడతకు దాదాపుగా రూ.1500 కోట్లు, మొత్తంగా సుమారు రూ.3364కోట్ల వరకూ హాస్టళ్లలో నాడు – నేడు కోసం ఖర్చు అవుతుందని అంచనా. ►తొలివిడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఏడాదిలోగా ఆ పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశం ►హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేయడంతో పాటు, కిచెన్లను కూడా ఆధునీకరించే పనులు చేపట్టాలని సీఎం ఆదేశం. ►కిచెన్కు అవసరమైన దాదాపు 10 రకాల వస్తువులను ప్రతి హాస్టల్ కిచెన్ కోసం కొనుగోలు చేయాలని నిర్ణయం. ►హాస్టళ్ల పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు కనిపించాలని సీఎం ఆదేశం. ►పిల్లలకు ఇవ్వాల్సిన వస్తువులను సకాలంలో నాణ్యతతో అందించాలని సీఎం ఆదేశం. ►హాస్టళ్ల పర్యవేక్షణ పద్ధతిని సమూలంగా మార్చాలన్న సీఎం. ►మండలాలవారీగా పర్యవేక్షణ ఉండాలన్న సీఎం. ►హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని సీఎం ఆదేశం. ►ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ల పోస్టులను భర్తీచేయాలన్న సీఎం. ►ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్సిగ్నల్. ►పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో క్లాస్ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని ఆదేశం. ►ప్రతి హాస్టల్ను పరిశీలించి... కల్పించాల్సిన సౌకర్యాలు, ఉండాల్సిన సిబ్బంది తదితర అంశాలపై ముందుగా సమాచారాన్ని తెప్పించుకోవాలన్న సీఎం. ►హాస్టళ్ల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే.. ఫిర్యాదు చేయడానికి ప్రతి హాస్టల్లో ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ►అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక నంబర్ ఉంచాలని సీఎం ఆదేశం. ఈ సమావేశానికి మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీ డీడీసీఎఫ్ ఎండీ ఏ బాబు, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
హాస్టళ్లకు మహర్దశ.. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు శాశ్వత భవనాలు
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన ఆహారం, వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి. మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో, అలాంటి వసతులే ఉండాలి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ప్రస్తుతం ఉన్న డైట్ చార్జీలను నిశితంగా పరిశీలించి.. పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన పిల్లలు హాస్టళ్లలో ఉంటే ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటామో అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, వసతి గృహాలను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురుకులాలు, వసతి గృహాలకు కొత్త రూపు తీసుకు రావాలని చెప్పారు. నాడు–నేడు పథకం కింద ఏడాదిలోగా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం ఆయన గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న దానిపై తాను స్వయంగా పరిశీలన చేయించానని, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందన్నారు. దీనిపై ఒక స్పష్టమైన కార్యాచరణతో అడుగులు ముందుకు వేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని చెప్పారు. ‘ఈ పనులు మావి’ అనుకుని పని చేయాలని కోరారు. పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఇప్పటికే నాడు – నేడు కింద తొలి దశలో స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. మొదటి దశలోని స్కూళ్లలో అదనపు తరగతి గదులు నిర్మించే పని జరుగుతోందన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోనందున, అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలని చెప్పారు. అభివృద్ధి పనులు చేశాక, వాటి నిర్వహణ కూడా బావుండేలా దృష్టి పెట్టాలని, దీనిపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిపడా సిబ్బంది ఉండాలి.. ► స్కూళ్ల నిర్వహణ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల నిర్వహణ ఫండ్ను ఏర్పాటు చేయండి. ప్రతి హాస్టల్లో తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి. హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్.. ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. నెలకోసారి హాస్టల్ను సందర్శించాలి. ► విద్యార్థులకు మంచి ఆహారం అందించేలా డైట్ చార్జీలను పెంచాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ చార్జీలను పెంచింది. అప్పటి వరకూ హాస్టల్ విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు. ఏడాదిలోగా హాస్టళ్లలో నాడు–నేడు పూర్తవ్వాలి ► అద్దె ప్రాతిపదికన నడుస్తున్న వసతి గృహాలపై కూడా దృష్టి సారించాలి. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించండి. అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలి. మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రతి పనిలోనూ నాణ్యత చాలా ముఖ్యం. వీటికి అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలి. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించాలి. ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలి. ► ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై సీఎం జగన్ సమీక్ష
-
పిల్లల భవిష్యత్తే మనకు ముఖ్యం.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అమరావతి: సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్లకు కొత్తరూపు, సమగ్ర కార్యాచరణకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిలోగా అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు చేపట్టాలన్నారు. స్కూళ్ల నిర్వహణ నిధిలానే హాస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు చేయాలన్న సీఎం.. హాస్టళ్లలో వైద్యుల సందర్శన తప్పనిసరి అన్నారు. హాస్టళ్ల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని, ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులపాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, నాడు–నేడుపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ నేతృత్వంలో విస్తృత సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో.. ► ఏడాదిలోగా అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. ► ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సమూల మార్పులు చేపట్టాలి. ► స్కూళ్ల నిర్వహణా నిధి తరహాలోనే హస్టళ్ల నిర్వహణకూ నిధి ఏర్పాటు ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కిందకు హాస్టళ్లు, గురుకులాలు ► గురుకులాలు, వసతి గృహాల నిర్వహణా ఖర్చులు, డైట్ ఛార్జీలను పెంచాలని.. సీఎం జగన్ ఆదేశించారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఎలా ఉన్నాయన్నదానిపై పరిశీలన స్వయంగా నేనే చేయించాను. ► మనం చేయాల్సింది చాలా ఉంది. దీనిపై ఒక కార్యాచరణ ఉండాలి. ► ఈ ఏడాది మొత్తం అన్ని గురుకులాలు, హాస్టళ్లను నాడు – నేడు కింద యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి. ఈ పనులు మీవి అనుకుని పనిచేయాలి. ► ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ పరిధిలో నాడు – నేడు కింద తొలిదశలో స్కూళ్లను అభివృద్ధి చేశాం. ► మొదటి దశలో చేసిన స్కూళ్లకు సంబంధించి అదనపు తరగతి గదులు నిర్మించే పనికూడా జరుగుతోంది. ► సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేయాలి. ► దశాబ్దాలుగా సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకునే నాథుడు లేడు. వీటిని ఎవ్వరూ కూడా పట్టించుకునే పాపానపోలేదు. అధికారులుగా వీటి అభివృద్ధి పనుల్లో మీ ముద్ర కనిపించాలి. ► అభివృద్ధి పనులు చేశాక.. వీటి నిర్వహణకూడా బాగా చేసేలా దృష్టిపెట్టాలి. దీనిమీద ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధంచేయాలి. దీనికోసం ఒక వ్యవస్థ ఉండాలి. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల సమగ్రాభివృద్ధి... సీఎం జగన్ ► హాస్టళ్ల నిర్వహణకోసం ఇప్పుడున్న మొత్తాన్ని పెంచండి. ► పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి ఎంత కావాలో నిర్ణయించండి: ► మన పిల్లలు ఇవే హాస్టళ్లలో ఉంటే.. ఎలాంటి వసతులు ఉండాలని కోరుకుంటామో.. అలాంటి వసతులే ఉండాలి. ► పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అడుగులు ముందుకేయండి. ► స్కూళ్ల మెయింటెనెన్స్ ఫండ్ మాదిరిగానే హాస్టళ్ల మెయింటెనెన్స్ ఫండ్ను కూడా ఏర్పాటు చేయండి: ► ప్రతి హాస్టల్లోనూ తప్పనిసరిగా వార్డెన్లను నియమించాలి : ► హాస్టళ్లలో ఉండాల్సిన కమాటి, కుక్, వాచ్మెన్ల వంటి ఇతర సిబ్బంది కచ్చితంగా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి: ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో.. వైద్యుడు తప్పనిసరిగా హాస్టల్ విద్యార్థుల బాగోగులపై దృష్టిపెట్టాలి. ► డైట్ ఛార్జీలపై పూర్తిగా పరిశీలన చేయాలి. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించేలా డైట్ ఛార్జీలను పెంచాలి. సమూలంగా డైట్ ఛార్జీలు పరిశీలించి.. ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలి. గత ప్రభుత్వం కేవలం ఎన్నికలకు ముందు డైట్ ఛార్జీలను పెంచింది. అప్పటివరకూ హాస్టల్ విద్యార్థుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రభుత్వం అలాంటిది కాదు అని సీఎం జగన్ అధికారుల వద్ద ప్రస్తావించారు. హాస్టళ్లలో నాడు–నేడు అద్దె ప్రాతిపదికన ఉన్న వసతి గృహాలను వెంటనే పరిశీలన చేయాలన్న సీఎం జగన్.. వాటి నిర్వహణను కూడా చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేకాదు.. అలాంటి చోట్ల నాడు – నేడు కింద శాశ్వత భవనాలను నిర్మించాలని ఆదేశించారు. ఇంకా.. ► వచ్చే ఏడాది అద్దె వసతి గృహాల స్థానంలో శాశ్వత భవనాల నిర్మాణం. ► మరోవైపు ప్రస్తుతం ఉన్న హాస్టళ్లను ఉత్తమ స్థాయిలో తీర్చిదిద్దాలి. ► నాడు–నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలి. ► ప్రతి పనిలోనూ నాణ్యత తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ► అదనంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను కూడా చేర్చాలని.. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు తాము అక్కడ ఉన్నందుకు గర్వంగా భావించేలా ఉండాలని సీఎం జగన్, అధికారులతో చెప్పారు. ► ఏడాది లోగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో నాడు–నేడు పనులు పూర్తి కావాలన్న సీఎం జగన్.. దీనికి సంబంధించిన కార్యాచరణను వెంటనే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం ఎం నాయక్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎం జాహ్నవి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఈసురోమని మనుషులుంటే...
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి అనేక సమస్యలకు నిలయాలుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు నేడు అంతకు రెండింతల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో 2022–2023 వార్షిక బడ్జెట్ కేటాయింపులలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవ నాల నిర్మాణం, వాటి అభివృద్ధికి ఎటువంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నెలకొల్పిన గురుకుల పాఠశాలలు, కళాశాలలు 90% శాతం ప్రైవేటు అద్దె బిల్డింగు లలో కొనసాగుతున్నాయి. కొన్ని గురుకులాల్లో తరగతి గది, వసతి గది (డార్మెటరీ) రెండూ ఒకటే. ఇక సంక్షేమ హాస్టళ్ల విషయానికి వస్తే... అవి సమస్యల నిలయాలుగా ఉన్నాయి. గతంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్ల పేరుతో కొన సాగిన హస్టళ్ళు, నేడు పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టళ్లు, ప్రీ మెట్రిక్ హాస్టళ్లుగా మారాయి. సంక్షేమ వసతి గృహాలలో కొన్నింటిని 1990 ప్రాంతంలో రేకుల షెడ్డులుగా నిర్మించగా... ఇవ్వాల అవి శిథిలావస్థకి చేరాయి, మెజారిటీ హాస్టళ్లు ప్రైవేటు అద్దె బిల్డింగులలో కొనసాగుతున్నాయి. అద్దె బిల్డింగుల సముదా యాలు వ్యాపార సంబంధిత అవసరాలకై నిర్మించినవి కావడంతో కనీస వసతి సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తల్ల డిల్లిపోతున్నారు. మా క్షేత్ర స్థాయి పరిశీలనలో... గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలో 22 బాలుర హాస్టళ్లు, 16 బాలికల హాస్టళ్లు పూర్తిగా ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. పదవ తరగతిలోపు విద్యార్థు లుండే ప్రీ మెట్రిక్ బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు బాల బాలికలవి 12 ఉండగా... ఇందులో మూడు మాత్రమే ప్రభుత్వ భవనాలలో కొనసాగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు భవనాలలో ఉన్నాయి. అదేవిధంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 24 ఉండగా, ఇందులో 23 హాస్టళ్లు ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. ఈ ప్రైవేట్ బిల్డింగు లలో కనీస సౌకర్యాలు లేక పోగా, ప్రతి నెల అద్దె లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బుతో ప్రభుత్వ హాస్టళ్లు నిర్మించ వచ్చు. కానీ ఆ పని చేయడంలేదు. హాస్టళ్లలో రీడింగ్ రూమ్లు, లైబ్రరీలు, స్టడీ టేబుళ్లు, కుర్చీల సమస్యలు వెంటాడుతున్నాయి. గురుకులాల్లో కంప్యూ టర్ బోధన పేరుకు మాత్రమే సాగుతోంది. సంక్షేమ హస్టళ్ళలో చదువుతున్న పదవతరగతిలోపు విద్యార్థులకు రూ. 62 మాత్రమే కాస్మోటిక్స్ చార్జీలు ఇస్తుండగా... పోస్ట్ మెట్రిక్ కాలేజి హాస్టల్ విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వటం లేదు. నెల నెలా కాస్మోటిక్స్ కొనుక్కో వడానికి, బస్ పాస్, ఇంటర్నెట్ రీచార్జీ తదితర అవసరాలు నెరవేర్చుకోవడానికైప్రభుత్వం ఎలాంటి స్టైఫండ్ ఇవ్వక పోవడంతో విద్యార్థులు కూలీ పనులకు వెళ్తూ అర్ధ కార్మికు లవుతున్నారు. ఇటీవల పనికి వెళ్లొస్తున్న అంబర్పేట హాస్టల్ విద్యార్థి యాక్సిడెంట్లో మరణించిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం. చాలా హాస్టళ్లకు రెగ్యులర్ వాచ్ మెన్, వాచ్ ఉమెన్, ఇతర సిబ్బంది లేరు, హాస్టళ్లలో వైద్యసదుపాయాలు అందుబాటులో లేవు. సంక్షేమ హాస్టళ్లలో ప్రీ మెట్రిక్ విద్యార్థులకు భోజన ఖర్చులకు రోజుకు రూ. 35 ఇస్తుండగా, కాలేజి విద్యార్థులకు రూ. 50 ఇస్తున్నారు. విద్యార్థులు ఈ ఖర్చుతోనే ప్రతిరోజూ మూడుసార్లు భోజనం చేయాలి. మధ్యాహ్నం, సాయంత్రం భోజనం మెనూలో కూరగాయలతో కూర వండాల్సి ఉండగా... చాలా వసతి గృహాల్లో పప్పుతోనే సరిపెడు తున్నారు. మూడు పూటలా బియ్యంతో తయారైన ఆహారాన్నే తినటంతో... కార్బోహైడ్రేట్లు తప్ప శరీరానికి అందవలసిన మిగతా విటమిన్లు ఏ, సీ, బీ–కాంప్లెక్స్; ప్రొటీన్స్, కొవ్వులు ఇతర పోషకాలు తగినంతగా పిల్లలకు అందటంలేదు. భారత దేశంలోని పిల్లలందరి మనుగడ, పెరుగుదల, అభివృద్ధి, సామర్థ్యాలకు ఉపకరించే పోషకాహార విధానం లేదని యుని సెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్ఎన్ఎస్) 2016–18 ప్రకారం పాఠశాలలకు వెళ్లే పిల్లల పోషక స్థితి గమనిస్తే 21.9 శాతం మంది పిల్లలు కుంగిపోతున్నారని తేలింది. చాలామంది అండర్ వెయిట్కి చేరి రోగాల బారిన పడుతున్నారు. ‘‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడు నోయ్’ అన్న గురజాడ మాటలు అందరూ ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. సరైన తిండి, బట్ట, వసతి సౌకర్యాల లేమితో బలహీనంగా తయారవుతున్న రేపటి పౌరులను ఆదుకోవలసిన బాధ్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కదా! కె. ఆనంద్ వ్యాసకర్త పి.డి.ఎస్.యు. (విజృంభణ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొబైల్: 96523 57076 -
రేషన్ బియ్యంలో పురుగులు
సాక్షి, ఉప్పల్(హైదరాబాద్): ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యంలో పురుగులు, బూజు ఉంటుండటంతో వాటిని తీసుకొని మేమేం చేయాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచిత బియ్యం పనికిరానివిగా తయారయ్యాయి. దీంతో వండుకొని ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తమకు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ చేస్తున్నారని మండిపడుతున్నారు. నవంబర్ కోటా కింద మెజారిటీ చౌకధరల దుకాణాలకు నాసిరకం బియ్యం పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. అధికంగా నాసిరకం బియ్యమే వచ్చాయని డీలర్లు పేర్కొంటున్నారు. గోదాముల్లో నిల్వ ఉన్న స్టాక్ పంపిస్తుండటంతో బియ్యం పురుగులు, తుట్టెల మయంగా మారింది. సంబందిత అదికారుల పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నట్లు డీలర్లు ఆరోపిస్తున్నారు. డీలర్లతో లబ్ధిదారుల గొడవ ఉచిత పంపిణీ ప్రక్రియతో సన్న బియ్యం కాస్త దొడ్డుగా మారినట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. వాస్తవంగా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని స్టాకు ఉన్నంత వరకు రేన్ షాపులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినా...అమలు మాత్రం మునాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు డీలర్లతో వాగ్వివాదానికి దిగడం సర్వసాధారణమైంది. సన్నబియ్యం అమ్ముకుని తమకు నాసిరకమైన దొడ్డుబియ్యాన్ని అంటగడుతున్నారని వాదనకు దిగుతున్నారు. బియ్యం అంతా పురుగులు పట్టి తుట్టెలు కట్టి ఉండడంతో తమకు వద్దని, నాణ్యమైన బియ్యం అందించాలని మరికొందరు అక్కడే ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ చూపి నాణ్యమైన బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వసతి గృహాల్లో సైతం.. వసతిగృహాల విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కయింది. వేసవి సెలవులకు ముందొచ్చిన బియ్యాన్ని వసతిగృహాల్లో నిల్వ ఉంచగా పురుగులు పట్టాయి. వాటినే వండి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసతిగృహాల్లో బియ్యం పురుగు పడుతున్నాయి. వసతిగృహ అధికారులకు ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వసతి గృహాలు మూత పడి బియ్యం నిల్వ ఉండడంతో పురుగులు పడినట్లు తెలుస్తోంది. తాజాగా వసతి గృహాలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులకు నిల్వ బియ్యాన్నే వార్డెన్లు వండి పెడుతున్నారు. పురుగులు పట్టిన బియ్యాన్ని పౌర సరఫరాల గోదాముకు అప్పగించి వాటి స్థానంలో కొత్త బియ్యాన్ని తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉన్న నిల్వ బియ్యాన్నే వండి పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. -
సంక్షేమ హాస్టళ్లు.. మన పిల్లలు చదివేలా ఉండాలి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి, వాటి పరిస్థితులను సమూలంగా మార్చాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన కొడుకు లేక కూతురు ఆ హాస్టల్లో ఉండి చదివితే, అక్కడ ఎలా ఉండాలని కోరుకుంటామో.. ఆ విధంగా మన సంక్షేమ హాస్టళ్లను మార్చాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడు అమలుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి. ►నాడు–నేడులో భాగంగా హాస్టళ్లలో పూర్తి వసతులు కల్పిస్తాం. అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత (శానిటేషన్), చక్కటి వాతావరణం, విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు ఉండాలి. బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు కల్పించాలి. ►ముఖ్యంగా పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండాలి. మెనూ ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా ఉండాలి. జగనన్న విద్యా కానుకను హాస్టల్ విద్యార్థులకు కూడా ఇస్తాం. కాబట్టి హాస్టళ్లలో కూడా స్థితిగతులు పూర్తిగా మారాలి. ►పిల్లలకు ఏం కావాలి? ఏం ఇస్తే బాగుంటుంది? వారికి ఏ విధంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి? అనేదానిపై ఆలోచన చేయాలి. దీనిపై మనం ఏది చెప్పినా, తప్పనిసరిగా అమలు చేయాలి. వీటన్నింటిపై పక్కాగా ప్రణాళిక రూపొందించి వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. (సాకారం కానున్న గిరిజన రైతుల స్వప్నం) 4,472 హాస్టళ్లలో 4,84,862 మంది విద్యార్థులు ►రాష్ట్రంలో సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4,772 హాస్టళ్లు ఉండగా, 4,84,862 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. దాదాపు 4 వేల హాస్టళ్లు సొంత భవనాల్లో ఉన్నాయని తెలిపారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేస్తామన్నారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. (దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?) -
స్కిల్ @ హాస్టల్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు హాస్టళ్లంటే కేవలం విద్యార్థులకు వసతితో పాటు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పించేవనే మనకు తెలుసు. తాజాగా ఈ కేంద్రాల్లో వసతి పొందే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా కళాశాల వసతి గృహాల్లో (కాలేజీ హాస్టల్స్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీ తరగతులు పూర్తికాగానే సంక్షేమ వసతిగృహానికి చేరుకోవడం, కాలేజీల్లో జరిగిన పాఠశాలను పునశ్చరణ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం సబ్జెక్టుపరంగా వారికి కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇతర అంశాల్లో పరిజ్ఞానం మాత్రం అంతంతమాత్రం గానే ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లోని వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇంగ్లిష్లో మాట్లాడేలా.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు కంప్యూటర్స్లో ప్రాథమికాంశాలపై (బేసిక్స్) అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించబోతోంది. హాస్టల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇంగ్లిష్ వాడకాన్ని వృద్ధిచేస్తే భాషపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో పాటు కొంతసేపు కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ తరగతుల బోధనకు క్షేత్రస్థాయిలో నిపుణులైన ట్యూటర్లను ఎంగేజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్స్ బేసిక్స్పైనా అవగాహన కల్పించి సర్టిఫికెట్ కూడా ఇచ్చేలా మరో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేయనుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్లను కొనుగోలు చేసింది. ఒక కంప్యూటర్పై పది మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేసేలా టైమ్షెడ్యూల్ను సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి రూపొందిస్తారు. త్వరలో నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగిరం చేశారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ... వచ్చే ఏడాది నుంచి అన్ని వసతిగృహాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
వంద మంది లేకుంటే.. మూసివేయడమే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను హేతుబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,850 వసతి గృహాలున్నాయి. వీటిలో వెయ్యికిపైగా ప్రీ మెట్రిక్ హాస్టళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విడతల వారీగా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంతో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈక్రమంలో పిల్లల సంఖ్య అధారంగా హేతుబద్ధీకరిస్తే.. మరింత మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమరి్పంచాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. నిర్వహణ భారం ఎక్కువవుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో కనీసం వంద మంది పిల్లలుండాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలాచోట్ల ప్రీమె ట్రిక్ హాస్టళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 50 మంది వరకే ఉండటంతో నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో 50 కంటే తక్కువ మంది విద్యార్థులున్న హాస్టళ్లను మూసేయాలని.. అక్కడున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని ప్రాథమికంగా తేల్చారు. ఈ దిశగా హాస్టళ్ల వారీగా విద్యార్థుల వివరాలు.. తక్కువున్న హాస్టళ్లకు సమీపంలో ఉన్న వసతిగృహాలు.. ఇలా నిర్దేశించిన కేటగిరీలో సమాచారాన్ని సమర్పించాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. ఈ క్రమంలో అధి కారులు వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఈ నెలాఖరు లోగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
బకాయిలు రూ.6 కోట్లు?
సాక్షి, కరీంనగర్ : సంక్షేమ హాస్టళ్లు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. నెలనెలా రావాల్సిన మెస్ చార్జీలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ వార్డెన్లకు తలకుమించిన భారంగా మారింది. హాస్టళ్లల్లో చదివే పిల్లల భోజనం, ఇతర సదుపాయాలకు నిధుల కొరత ఏర్పడింది. పేద విద్యార్థులకు అన్నం పెట్టేందుకు ఇచ్చే డైట్ చార్జీలు ఏడు నెలలుగా అందడంలేదు. దీంతో వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకొస్తున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక దివాలా తీస్తున్నారు. బిల్లులు మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే ఇక హాస్టళ్లను నడుపలేమని చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లకు సరుకులు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా బిల్లులు పెండింగ్లో ఉండడంతో సరుకుల సరఫరా చేయలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే జిల్లాలోని బీసీ, ఎస్సీ హాస్టళ్లల్లోని విద్యార్థులకు భోజనం కూడా దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో బీసీ, ఎస్సీ కలిపి సంక్షేమ హాస్టళ్లు 51 ఉన్నాయి. ఇందులో పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 20 ఉండగా ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులు 2,438 మంది వసతి పొందుతున్నారు. అలాగే 31 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ఉండగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేద విద్యార్థులు 2,720 మంది వరకు వసతి పొందుతున్నారు. పోస్టుమెట్రిక్ హాస్టళ్లల్లో ఉంటున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,200 నుంచి రూ.1,500 వరకు ప్రతినెలా డైట్ చార్జీలు ఇవ్వాల్సి ఉంది. ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులకు తరగతిని బట్టి రూ.750 నుంచి రూ.1,100 వరకు ఒక్కొక్కరికీ ప్రతినెలా ఇవ్వాలి. హాస్టళ్లకు ప్రభుత్వం బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. నూనెలు, ఉప్పు, కారం, చింతపండు మొద లగు సరుకులు కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుండగా, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్, ఇత ర వస్తువులు హాస్టల్ వార్డెన్లు భరించాలి. ఖర్చు చేసిన వాటికి వార్డెన్లు బిల్లులు చూపితే ప్రతి నెలా మంజూరీ చేయాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కోట్లల్లో బకాయిలు... బీసీ, ఎస్సీ, పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్లకు ఈ ఏడాది మార్చి నుంచి బిల్లులు రావడం లేదు. ఆలస్యమైన ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది కదా అని వార్డెన్లు స్థోమత లేకున్నా బయట అప్పులు చేసి మరి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. పోస్టుమెట్రిక్, ప్రీమెట్రిక్ హాస్టళ్ల బకాయిలు దాదాపు జిల్లాలో రూ.6 కోట్ల పైచిలుకు ఉన్నట్లు సమాచారం. ప్రీమెట్రిక్ హాస్టళ్ల కన్నా పోస్టుమెట్రిక్ హాస్టళ్ల వార్డెన్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు అయ్యే ఖర్చును ముందుగానే 80 శాతం భరించాల్సి ఉంటుంది. బిల్లులు గత ఏడు నెలలుగా నిలిచిపోవడంతో ఒక పోస్టుమెట్రిక్ హాస్టల్ వార్డెన్కు రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు రావాల్సి ఉంది. గుడ్లు, పాలు, చికెన్, కూరగాయల వ్యాపారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. బకాయి డబ్బులు చెల్లిస్తే కానీ సరుకులు ఇవ్వలేమని చెబుతున్నారు. దీంతో మరోచోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చి మళ్లీ అప్పు చేసి సరుకులు, కూరగాయలు కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో హాస్టళ్ల నిర్వహణ వారి కుటుంబాల పోషణకు తలకుమించిన భారంగా మారిందని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని కాస్మోటిక్ చార్జీలు... బీసీ, ఎస్సీ ప్రీమెట్రిక్ హాస్టళ్లల్లో చదువుతున్న పాఠశాలస్థాయి పేద విద్యార్థులకు నెలనెలా కాస్మోటిక్, హేయిర్ కటింగ్, నాప్కిన్ చార్జీలు ప్రభుత్వం ఇవ్వాలి. అబ్బాయిలకు నెలకు కాస్మోటిక్ చార్జీల కింద రూ.50, కటింగ్ చార్జీల కింద రూ.12 మొత్తం రూ.62 ఇవ్వాల్సి ఉంది. ప్రైమరీస్థాయి బాలికలకు కాస్మోటిక్ చార్జీలు రూ. 55, హైస్కూల్ విద్యార్థినీలకు నాప్కిన్ చార్జీలతో కలిపి రూ.75 ఇవ్వాలి. అయితే ఈ కాస్మోటిక్ చార్జీలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చినప్పుడు తీసుకోవచ్చనే దృక్పథంతో కటింగ్ చార్జీలు, సబ్బులు, నూనెలకు వార్డెన్లు వారి జేబుల నుంచి ఇస్తున్నారు. ఇలా వార్డెన్ల జేబులు ఖాళీ అవుతున్నాయే తప్ప బిల్లులు రావడం లేదు. ఫ్రీజింగ్ ఉండటంతో.. ఏడు నెలలుగా మెస్చార్జీలు, ఇతరత్రా నిధులు రావాల్సి ఉంది. మధ్యలో రెండుసార్లు నిధులు వచ్చాయి. ఫ్రీజింగ్లో ఉండటం వల్ల నిధుల విడుదలకు ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే వార్డెన్లకు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – బాలసురేందర్, ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి -
వేలిముద్ర పడదే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచి్చన బయోమెట్రిక్ హాజరు నమోదు విధానం క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులకు తలనొప్పిగా మారింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతిని వినియోగిస్తున్న నేపథ్యంలో హాజరుస్వీకరణ గందరగోళంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు. దీంతో హాస్టల్లో ఉంటున్నప్పటికీ గైర్హాజరైనట్లే నమోదవుతోంది. ఈ పరిస్థితి హాస్టల్ డైట్ బిల్లుల రూపకల్పనలతో వసతిగృహ సంక్షేమాధికారులకు చిక్కులు తెచి్చపెడుతున్నాయి. ప్రతి విద్యా సంస్థలో బయోమెట్రిక్ హాజరువిధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వవిభాగాలు, క్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. సంక్షేమశాఖల పరిధిలోని వసతిగృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖతో పాటు బీసీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్రయోగ పద్ధతిని కొనసాగిస్తున్నారు. అప్డేట్ కాకపోవడంతో... ఆధార్ వివరాలను ప్రతి కార్డుదారు ఐదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా వేలిముద్రల్లో వచ్చే మార్పులను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల్లో వేలిముద్రలు మారడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ చాలావరకు కార్డు తీసుకున్న సమయంలో తప్ప వివరాలను అప్డేట్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానానికి విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడానికి ఇదే కారణం. ఆయా విద్యార్థులు తమ వేలిముద్రలు అప్డేట్ చేసుకుంటే తప్ప బయోమెట్రిక్ హాజరు నమోదుకు అవకాశం లేదు. హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నప్పటికీ వారి హాజరు నమోదు కాకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన క్రమంలో విద్యార్థుల హాజరు ఆధారంగా డైట్ బిల్లులను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సగానికిపైగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కాకపోవడంతో వారు వసతిపొందుతున్నా, రికార్డుల ప్రకారం గైర్హాజరు చూపడంతో వారికి సంబంధించిన బిల్లులు విడుదల కావు. ప్రభుత్వం మాన్యువల్ పద్ధతి బిల్లులను అనుమతించకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారులు తలపట్టుకుంటున్నారు. -
విద్యార్థులు చస్తున్నా పట్టించుకోరా..?!
లక్సెట్టిపేట(మంచిర్యాల) : వసతిగృహాల్లో విద్యార్థులు మరణిస్తున్నా... తీవ్ర విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపిస్తూ ఇళ్ళకు పంపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అయితే ఉన్నత అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకుండా పోయింది. అపరిశుభ్రంగా గదులు, బాత్రూంలు, టాయిలెట్లు విద్యార్థులకు ఇబ్బందులు పెడుతున్నాయి. జిల్లా మొత్తంగా రెగ్యూలర్ వార్డెన్లు, హెడ్మాస్టర్లు లేక ఇన్చార్జిలతో కాలం వెల్లదీస్తున్నారు. పూర్తిస్థాయిలో విద్యార్థులకు న్యాయం చేయలేని పరిస్థితి. అధికారులు పట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇబ్బందుల్లో విద్యార్థులు జిల్లాలో మొత్తంగా 10 బాలుర, 6 బాలికల ఆశ్రమ పాఠశాలులున్నాయి. ఇందుకు ఆరుగురు రెగ్యూలర్ వార్డెన్లు, 10 మంది ఇన్చార్జి వార్డెన్లు ఉండగా ముగ్గురు రెగ్యూలర్, 13మంది ఇన్చార్జి హెడ్మాస్టర్లు ఉన్నారు. ఎటీడబ్లూవో ప్రతి నెలకు రెండుసార్లు పాఠశాలలను పరిశీలించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు రుచికరమైన భోజనం అందిస్తున్నారా తెలుసుకోవాలి. సీజనల్ వ్యాధులు వచ్చినప్పుడు విద్యార్థులు అన్ని విధాలా చికిత్సలు అందించాలి. ఇటీవల స్థానిక పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి శివశంకర్ ఆకస్మత్తుగా మృతిచెందడంతో మిగతా విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పలువురు విద్యార్థులు వ్యాధులతో ఇళ్ళలోకి వెళ్తున్నారు. దీంతో ఆశ్రమ పాఠశాలలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. పరిశుభ్రత పాటించకుండా వ్యాధులపై అవగాహన కల్పించకుండా హెల్త్ క్యాంపులు చేపట్టకుండా కాలం వెల్లదీస్తున్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు. అధ్వానంగా పట్టణ పాఠశాల మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటారు. మొత్తంగా 141మంది విద్యార్థులకు నలుగురు వెళ్లిపోగా ప్రస్తుతం 137మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతోంది. సీజనల్ వ్యాధులు రావడంతో 105 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉండగా మిగతా వారు ఇంటికి వెళ్లినట్లు వార్డెన్ చెప్పారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం, టాయిలెట్లు శుభ్రంగా లేకపోవడం, డార్మిటరీ గదులు ఇరుకుగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల విద్యార్థి శివశంకర్ మృతిచెందడంతో పాఠశాల వార్డెన్ శ్రీనివాస్ను సస్పెండ్ చేసి హెడ్మాస్టర్ రవీందర్కు బాధ్యతలు ఇచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఏఎన్ఎంను విధుల నుంచి తొలగించడంతో ప్రస్తుతం విద్యార్థులను పరిశీలించేందుకు ఏఎన్ఎం లేదు. రాత్రివేళ అత్యవసర పరిస్థితి వస్తే ఇబ్బంది పడాల్సిందే. 6వ తరగది విద్యార్థి చరణ్ పాఠశాల నచ్చడం లేదంటు పారిపోయి దినమంతా ఒంటరిగా తిరిగి రాత్రివేళ ఇంటికి చేరడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాల విద్యార్థి ఉదయం వెళ్లిపోయిన సిబ్బందికి తెలియకపోవడం శోచనీయం. తదుపరి ఉదయం పాఠశాలకు వచ్చి పాఠశాల నచ్చడం లేదంటూ టీసీ తీసుకునివెళ్లిపోయాడు. విద్యార్థులకు జ్వరాలు వచ్చిన సమాచారం ఇవ్వడం లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
సంక్షేమం’లో స్వాహా పర్వం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్షేమ హాస్టళ్ల మాటున గత పాలకులు, అధికారులు దోచుకుతిన్నారు. అదే అధికారులు ఇప్పటికీ అడ్డంగా దిగమింగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మెస్ చార్జీలు పెంచామని గత ప్రభుత్వం చెబుతూ బినామీ టెండర్లతో దోపిడీకి దారులు తెరిచింది. చిత్తూరు జిల్లాకు చెందిన బినామీ కాంట్రాక్టరు ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించి అవినీతి బాగోతానికి తెరలేపారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లాది రూపాయలు బొక్కేశారు. 40 శాతం అధిక ధరలకు టెండర్లు ఖరారు... రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు వేరుశనగ అచ్చులు (మిల్లెట్స్ కేకులు) సరఫరా చేయడానికి కిలోకు రూ. 80లు అదనంగా కోట్ చేస్తూ గత ప్రభుత్వ పెద్దల బినామీ దారులు టెండర్లు వేశారు. అన్ని సరుకులకు 40 శాతం అధిక ధరలకు టెండర్లు ఆమోదించారు. సరుకును విశాఖపటా్ననికి చెందిన నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ నుంచి కొనుగోలు చేసేవారు. నాసిరకం సరుకుల సరఫరా... టెండరు నిబంధన మేరకు మొదటి రకం సరుకులు సరఫరా చేయకుండా నాసిరకం సరుకులు సరఫరా చేసి కాంట్రాక్టు సంస్థ బాగా దండుకుంది. పాఠశాలలతో ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ద్వారా చెల్లింపులు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాఠశాల స్థాయిలో అయితే ప్రిన్సిపాళ్లు సరుకు నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తారని, అందు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన కాంట్రాక్టు సంస్థ, ఉన్నతాధికారులు తెలివిగా ఈ విధానాన్ని అమలు చేశారు. జాయింట్ సెక్రటరీ ద్వారా చక్కబెట్టేశారు... టెండరుదారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఆరుగొలనుకు చెందిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించే రాజారావుకు రాష్ట్రస్థాయిలో జాయింట్ సెక్రటరీగా దొడ్డిదారిలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి ఈ తతంగానికి తెరలేపారు. అంతే కాకుండా కంప్యూటర్లు, సీసీ కెమెరాలకు బిల్లులు చెల్లింపు చేసి గురుకులాల పేరుతో దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రాజారావు ప్రిన్సిపాల్ బాధ్యతలు కూడా పోస్ట్గ్రాడ్యుయేట్ టీచర్గా విధులు నిర్వహిస్తూ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ రాష్ట్రస్థాయి ఇన్చార్జిగా పనులు అప్పగించారు. అన్నింటా అవినీతే... గురుకుల పాఠశాల కేటరింగ్ టెండరుదారుడు ఎనిమిది మందితో పనులు చేయించాల్సి ఉండగా నలుగురు, లేక ఐదుగురిచే పనిచేయించి వారికి తక్కువగా జీతాలు ఇస్తూ మిగులు సొమ్ములు దోపిడీ చేస్తున్నారు. పై సంస్థలలో స్కావెంజర్, స్వీపర్, కాపలాదారుడు ఇలా ప్రతి మనిషికి పది వేల రూపాయలు చెల్లించాలి. కాని వారికి ఏడు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. ఎక్కువ మంది చేయాల్సిన పని తక్కువ మందితో చేయించడంతో వండిన పదార్థాల్లో నాణ్యత లోపించేది. రాష్ట్ర వ్యాప్తంగా రు.6 కోట్లు అవినీతి జరిగినా పట్టించుకునే నాధుడే లేడు. గత ప్రభుత్వం అవినీతికి అండగా నిలిచింది. సరుకు వివరాలు టెండరు రేటు మార్కెట్ రేటు వేరుశెనగ అచ్చు రూ.162.50 రూ. 37.00 పామాయిల్ రూ. 90.00 రూ.61.00 చింతపండు రూ. 95.00 రూ. 50.00 గోధుమ రవ్వ రూ. 44.00 రూ. 27.00 వేరుశెనగగుళ్ళు రూ. 128.00 రూ. 100.00 కారం రూ. 285.00 రూ. 145.00 -
మరీ ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, కోటబొమ్మాళి(శ్రీకాకుళం) : హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి విస్తుపోయారు.. విద్యార్థుల దురవస్థను చూసి చలించిపోయారు.. మాజీ మంత్రి, టెక్క లి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జమానాలోని బీసీ బాలుర వసతి గృహం లోని దయనీయ స్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. శుక్రవారం రాత్రి నిమ్మాడ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ధ ర్మాన కృష్ణదాస్ ఓ విద్యార్థి తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతున్న విషయాన్ని గ మనించి, వైద్య సిబ్బందిని వసతి గృ హా నికి రప్పించి విద్యార్థికి వైద్య సాయం అం దే విధంగా చర్యలు చేపట్టారు. ఆ సమయంలో హాస్టల్ వార్డెన్తోపాటు సిబ్బంది ఎవరూ హాస్టల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అక్కడ అందుబాటులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాణి నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. హాస్టల్లో 98 విద్యార్ధులుండగా శుక్రవారం వారిలో 78 మంది ఉ న్నారు. వారిలో ధనుంజయరావు అనే వి ద్యార్ధికి తీవ్ర అస్వస్థత నెలకొనడంతో వై ద్యసేవలందించారు. మెనూ అమలు, కా స్మొటిక్స్ సొమ్ముల గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు స్వంత గ్రామంలో హాస్టల్ పరిస్థితి ఇంత దారుణంగా ఉండడాన్ని ధర్మాన ఆక్షేపిం చారు. హాస్టల్లో మురుగు వ్యవస్థ , మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంపై మంత్రి విస్తుపోయారు. వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరిస్తాం నరసన్నపేట: వసతి గృహాల్లో నెలకొన్న మౌలిక సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని, విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేటలో బీసీ కళాశాల విద్యార్థుల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వార్డెన్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అద్దె భవనంలో వసతిగృహం నిర్వహిస్తున్నామని, శాశ్వత భవనం కావాలని వసతిగృహ అధికారులు మంత్రికి తెలిపారు. తాగేందుకు మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే స్పందించిన మంత్రి వారం రోజుల్లో మంచినీటి సమస్య పరిష్కారం కావాలని, ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో భోజన సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని విద్యార్థులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేట్రిన్లు చూడాలని, చేతివాటం చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. -
తేడాలేంటో తేల్చేద్దాం...!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో మరింత పారదర్శకత కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానంపై సంక్షేమ శాఖలు సరికొత్త ఆలోచనలు చేస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరులో అవకతవకలకు చెక్ పెట్టొచ్చనే ఉద్దేశ్యంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఇకపై అంతా సవ్యంగా జరుగుతుందని అధికారులు భావించినప్పటికీ... గతంలో జరిగిన అవకతవకలను వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ప్రస్తుతం విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు తీరుతో పాటు గతంలో నమోదైన హాజరు విధానంపైన విశ్లేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బయోమెట్రిక్ హాజరు విశ్లేషణ కోసం వసతిగృహ సంక్షేమాధికారులకు అవగాహన కల్పించనుంది. మూడు రోజుల పాటు శిక్షణను నిర్వహించి 2019–20 విద్యా సంవత్సరంలో నమోదయ్యే రికార్డును... 2018–19 సంవత్సరంతో పాటు 2017–18 విద్యా సంవత్సరంలో నమోదైన రికార్డును సరిపోలుస్తూ విశ్లేషణ చేపట్టనుంది. వసతిగృహం వారీగా అధ్యయనం..: రాష్ట్రవ్యాప్తంగా 674 గిరిజన సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు 50వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. బయోమెట్రిక్ హాజరు విశ్లేషణతో విద్యార్థుల హాజరు తీరెలా ఉందనే దానిపైన అధికారులు అధ్యయనం చేస్తారు. ఇందులో వసతిగృహాన్ని యూనిట్గా తీసుకుని ప్రస్తుత హాజరు, గతంలో నమోదైన హాజరును సరిపోలుస్తారు. దీంతో హాజరులో వ్యత్యాసం స్పష్టం కానుంది. వరుసగా ఏడాది పాటు హాజరు శాతాన్ని పరిశీలిస్తే గతంలో హాజరు శాతాల వ్యత్యాసం కూడా తెలుస్తుంది. దీంతో అక్రమాలపై స్పష్టత వస్తే సదరు అధికారిపై చర్యలు తీసుకునే అవకాశంఉంటుంది. -
సంక్షేమంలో బిల్లుల సంక్షోభం!
కోవెలకుంట్ల: సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో కూరుకుపోయాయి. అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల తాయిలాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది. దీంతో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ, ఎస్సీ కళాశాలల హాస్టళ్లకు బిల్లుల చెల్లింపు ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగు నెలల నుంచి హాస్టళ్లకు ఎలాంటి బిల్లులు మంజూరు కావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి వసతి గృహాల అధికారులు, సిబ్బంది అప్పులు చేసి విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. ఈ నెల 24న ప్రభుత్వ పాఠశాలలతోపాటు హాస్టళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. జిల్లాలో 52 బీసీ వసతి గృహాలు, 51 ఎస్సీ హాస్టళ్లు, 15 రెసిడెన్షియల్ పాఠశాలలు, 21 ఎస్సీ, 28 బీసీ కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటిలో ఉంటూ విద్యనభ్యసించే పేద విద్యార్థులకు గత ఏడాది జూలై నెల నుంచి కొత్త మెనూ ప్రకారం వారంలో మంగళ, శుక్ర, ఆదివారం చికెన్తో కూడిన ఆహారం అందజేశారు. ఉదయం విద్యార్థులకు అందజేసే రాగి మాల్ట్ను సాయంత్రానికి మార్చి ఆ స్థానంలో పా లు సరఫరా చేశారు. జనవరి నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీల బిల్లులు నిలిచిపోవడంతో వసతి గృహాల అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఖజనా ఖాళీతో అందని బిల్లులు.. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొత్త మెనూ ఆధారంగా ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. గతంలో 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750 ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ. 1050, 5వ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ. 850 నుంచి రూ. 1250, కళాశాల హాస్టళ్ల విద్యార్థులకు రూ. 1050 నుంచి రూ. 1400లకు డైట్ చార్జీలు పెంచారు. ఈ మొత్తంతో విద్యార్థులకు చికెన్, పాలు, భోజనానికి సరిపడు నిత్యావసరాలు వెచ్చిస్తున్నారు. హాస్టళ్లలో వారంలో మూడు రోజులపాటు ఒక్కో విద్యార్థికి 80 గ్రాముల చికెన్, 100 ఎంఎల్ పాలు అందజేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో డైట్ చార్జీల బిల్లులను సంబంధిత హాస్టల్ వెల్పేర్ అధికారులు మ్యానువల్ పద్ధతిలో ట్రెజరికి పంపితే అక్కడ బిల్లు పాసై వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి. ఈ ఏడాదిని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది వేతనాలతోపాటు డైట్ చార్జీలను సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పసుపు– కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో ఖజనాలో ఉన్న నిధులను ఖాళీ చేయడంతో నాలుగు నెలల నుంచి బిల్లులు నిలిచిపోయాయి. అప్పులు చేసి విద్యార్థులకు భోజనం నాలుగు నెలల నుంచి సంక్షేమ వసతి గృహాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో ఆయా వసతిగృహాల అధికారులు అప్పులు చేసి హాస్టళ్లను ¯ð నెట్టుకొచ్చారు. వారంలో మూడు రోజులపాటు చికెన్తో కూడిన భోజనం, పాలు సరఫరా చేయాల్సి ఉండగా నాలుగు నెలల పాటు అప్పు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెట్టాల్సి వచ్చింది. డైట్ చార్జీలతోపాటు గత ఏడాది నవంబర్ నెల నుంచి విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు అందకపోవడం గమనార్హం. విద్యార్థులకు సబ్బు, నూనెకు సంబంధించి 6వ తరగతి వరకు నెలకు రూ. 130, 7వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ. 155 ప్రకారం కాస్మొటిక్ చార్జీలను అందజేయాల్సి ఉంది. అయితే ఆరు నెలల కాస్మొటిక్ చార్జీలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించి ఆదుకోవాలని ఆయా వసతిగృహాల హాస్టల్ వెల్ఫేర్ అధికారులు కోరుతున్నారు. బిల్లుల విడుదలకు ప్రతిపాదనలు పంపాం సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ఈ ఏడాది జనవరి నెల నుంచి డైట్, కాస్మొటిక్ చార్జీలు విడుదల కావాల్సి ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగింపు, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో బిల్లులు నిలిచిపోయాయి. బిల్లుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. వీలైనంత త్వరలో బిల్లులు విడుదల అవుతాయి. సత్యనారాయణ,ఏఎస్డబ్లు్యఓ, కోవెలకుంట్ల -
సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లపై సర్కార్ శీతకన్ను కొనసాగుతోంది. గత మూడు నెలల నుంచి హాస్టళ్ల మెస్ బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడమే దీనికి నిదర్శనం. హాస్టల్ మెస్ బిల్లులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ విదేశీ విద్యా దీవెన ఫీజురీయింబర్స్మెంట్, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల మెస్ చార్జీలు కూడా విడుదల కాలేదు. దీంతో సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు, విదేశాల్లో చదువుకుంటున్నవారు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్ నుంచి సుమారు రూ.500 కోట్ల వరకు బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం 3,39,664 మంది విద్యార్థినీవిద్యార్థులు (కాలేజీ, ప్రీమెట్రిక్) చదువుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,065, గిరిజన సంక్షేమ శాఖలో 639, బీసీ సంక్షేమ శాఖలో 1,137 చొప్పున మొత్తం 2,841 హాస్టళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా గురుకుల విద్యాలయాలు కూడా ఉన్నాయి. హాస్టళ్లకు జనరల్ బడ్జెట్ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. బిల్లులు పెట్టినా కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్)లో పెండింగ్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక శాఖకు ప్రభుత్వ పెద్దల ఆదేశాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలకు ముందుగా నిధులు ఇవ్వాలని ఆదేశించడంతో సాధారణ బిల్లులకు నిధులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో అప్పులు ఇచ్చినవారు హాస్టల్ వార్డెన్లపై ఒత్తిడి మొదలు పెట్టారు. ఒక్కో హాస్టల్ వార్డెన్ కనీసం రూ.ఐదు లక్షల వరకు అప్పులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్ వార్డెన్ల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి సంక్షేమ శాఖలోనూ హాస్టళ్ల మెస్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు పైనే పేరుకున్నాయి. విదేశీ విద్యాదీవెన.. ఇబ్బందులెన్నో.. ఎన్టీఆర్ విదేశీ విద్యాదీవెన కింద విదేశాల్లో విద్యనభ్యసిస్తున్నవారికి మూడు నెలలైనా ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారికి, రెండో విడత రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సినవారికి ఆపేశారు. దీంతో విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగాలు చూసుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. కొందరు పెట్రోల్ బంకుల్లో గంటల ప్రకారం పనిచేసి వచ్చిన డబ్బులతో కాలం గడుపుతున్నారు. ఆస్ట్రేలియా వెళ్లినవారిలో సుమారు 90 శాతం మందికి రెండో విడత ఇవ్వాల్సిన ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. నాలుగు నెలల క్రితం ఎంపిక చేసినవారికి జిల్లాల డీడీలు నిధులు విడుదల చేయలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే ట్రెజరీల్లో డబ్బులు లేవని, అవి రాగానే విడుదల చేస్తామని, బిల్లులు పెట్టామని డిప్యూటీ డైరెక్టర్లు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్లలో ఈ దుస్థితి ఉంది. సివిల్స్ అభ్యర్థుల గగ్గోలు ఇక సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు ఇవ్వాల్సిన డైట్ చార్జీలను కూడా సకాలంలో ఇవ్వలేదు. ఒకటీ, అరా ఇన్స్టిట్యూషన్లలో కొంత మొత్తం ఇచ్చినా మిగిలిన సంస్థలకు ఇవ్వలేదు. కోచింగ్ తీసుకుంటున్న నగరాన్ని బట్టి ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు అభ్యర్థుల భోజన, వసతి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇవ్వకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు, చెన్నైల్లో కోచింగ్ తీసుకుంటున్నవారు నానా అవస్థలు పడుతున్నారు. రూము అద్దెలు, మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో యజమానులు ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వకపోవడంతో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి తామే అద్దెలు, మెస్ బిల్లులు కట్టుకుంటున్నామని చెబుతున్నారు. అధికారులను ఈ విషయమై ప్రశ్నిస్తే.. పరిశీలించాల్సి ఉందని మాటదాటేస్తున్నారు. -
అద్దె భవనాలు కావాలి ‘గురు’!
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ అద్దె భవనాల వెతు కులాటలో పడింది. 2019–20 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో మరో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వీటికి శాశ్వత భవనాలు లేనందున అద్దె భవనాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వాటిని వెతికేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. ఏప్రిల్ నెలాఖరులోగా అద్దె భవనాలను గుర్తించి లొకేషన్లు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులు బీసీ గురుకుల సొసైటీ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురుకుల పాఠశాలలను నెలకొల్పే విస్తీర్ణంలో భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. 20 వేల చదరపు అడుగుల భవనం... ఒక గురుకుల పాఠశాల ఏర్పాటుకు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ఐదు నుంచి పదో తరగతి వరకు రెండేసి సెక్షన్లు... ఒక్కో సెక్షన్లో నలభై మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతిగృహాలు, డైనింగ్ హాలు, కిచెన్, మూత్రశాల, స్టాఫ్ రూమ్, ప్రిన్సిపాల్ రూమ్, స్టోర్ రూమ్ తదితరాలకు కచ్చితంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంగల భవనం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, క్షేత్రస్థాయిలో అంత విస్తీర్ణమున్న భవనాల లభ్యత కష్టంగా మారింది. రెండేళ్ల క్రితం మంజూరు చేసిన గురుకుల పాఠశాలల ఏర్పాటును అతి కష్టంగా పూర్తి చేసిన అధికారులకు ప్రస్తుత లక్ష్యం సాధించడం ‘కత్తి మీద సాము’లా మారింది. పాత వాటిలో ప్రారంభిస్తే... రెండేళ్ల క్రితం బీసీ గురుకుల సొసైటీ 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న భవనాలను అద్దెకు తీసుకుంది. ప్రస్తుతం ఆయా గురుకులాల్లో ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది తొమ్మిదో తరగతి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కొత్త గురుకులాలకు భవనాలు లభించకుంటే ఇప్పుడు నడుస్తున్న భవనాల్లో ఒక భాగంలో కొత్త గురుకులాలను ప్రాథమికంగా ప్రారంభించే అంశంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణీకరణ నేపథ్యంలో అద్దె సైతం ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే రెట్టింపు ఉంది. ఈ క్రమంలో కొత్త గురుకులాల ఏర్పాటు ఎలా ఖరారు చేయాలనేదానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వచ్చే నెల రెండోవారం వరకు ప్రయత్నాలు జరిపి తర్వాత ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
వసతి గృహాల్లో వైద్యం ఏదీ..!
సాక్షి, ఒంగోలు టూటౌన్: సంక్షేమ విద్యార్థులకు వైద్యం కరువైంది. నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయించాల్సిన అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు రోగాల బారిన పడుతుండటంతో పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కొక్క వసతి గృహంలో 50 నుంచి 100 మందికి పైగా ఉండటంతో అంటువ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువగా గజ్జి, తామర, సీజనల్ వ్యాధులైన వైరల్ జ్వరాలు ఇలా పలు రోగాల బారిన పడుతూ ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో నెలకొంది. దీనికి తోడు సరైన పౌష్టికాహారం లేక రక్తహీనత వంటి రోగాల బారిన కూడా ఎక్కువ మంది విద్యార్థులు పడుతుంటారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులకు నెలనెలా ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన ప్రభుత్వ వైద్యాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పేద పిల్లలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు వసతి గృహ వార్డెన్ల దృష్టికి తీసుకెళ్లలేక తమలో తామే కుమిలిపోతున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 89 వరకు ఉన్నాయి. వీటిలో బాలురకు 71, బాలికలకు 18 వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో దాదాపు 9,300 మంది వరకు పేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. అయితే వీరికి ప్రతి నెలా ఆరోగ్య పరీక్షలు చేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ వైద్యాధికారులు ఎప్పుడు వసతి గృహాలను సందర్శించాలి, ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయాలి, అనారోగ్య బారిన పడిన పిల్లలకు ఎలాంటి వైద్యం అందించాలి అనే అంశాలపై విధి, విధానాలతో సర్క్యులర్ జారీ చేస్తోంది. అయితే వసతి గృహాలకు వైద్యాధికారులు వెళ్లిన దాఖలాలే కనిపించడం లేదు. కనీసం ఆయా ప్రభుత్వ ఆరోగ్య సెంటర్ల నుంచి నర్సులను కూడా పంపించే ఆలోచన కూడా చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నామమాత్రంగా తనిఖీలు.. వసతి గృహాల తనిఖీ సమయంలో కూడా ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై పిల్లలను అడిగిన దాఖలాలు లేవు. తనిఖీల సమయంలో అన్నం సరిగా పెడుతున్నారా.. కోడిగుడ్లు వేస్తున్నారా.. కూరలు బాగున్నాయా..ఇలాంటి ప్రశ్నలు మాత్రమే పిల్లలను అడిగి చేతులు దులుపుకొని రావడం పరిపాటిగా మారింది. మారుమూల పల్లెల నుంచి వచ్చి సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న పిల్లలు అన్ని విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఏదైనా గట్టిగా అడిగితే ఇంటికి పంపిస్తారేమోనన్న భయం ఉంటుంది. తనిఖీకి వచ్చిన అధికారులకు ఇలాంటి విషయాలు చెబితే తరువాత వార్డెన్లు కొడతారేమోననని భయపడుతుంటారు. అందుకని పిల్లలు ఎలాంటి విషయాలు తొందరపడి ఉన్నతాధికారులకు చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితే వెనుకబడిన వసతి గృహాల్లోనూ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో కూడా నెలకొంది. జిల్లాలో వెనుకబడిన వసతి గృహాలు 76 వరకు ఉన్నాయి. వీటిలో బాలురకు 58, బాలికల కోసం 18 వరకు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాలు దాదాపు 6,961 మంది వరకు ఉన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో మూడు వసతి గృహాలు, 14 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు 17 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ వసతి గృహాల్లో కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. కనీస మౌలిక వసతులు కరువు చాలా వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయలు నేటికీ కల్పించక సతమతమవుతుంటారు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కనీసం ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నా చేయకపోవడంపై పలు దళిత, గిరిజన, బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పేద పిల్లల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం కొత్తపట్నంలోని వెనుకబడిన వసతి గృహంలో ఒక విద్యార్థికి అర్ధరాత్రి గుండెపోటు రావడంతో చనిపోయాడని బీసీ సంఘం నాయకులు బంకా చిరంజీవి, వీరభద్రాచారి గుర్తు చేశారు. ఉన్నతాధికారులు వసతి గృహాలను సందర్శిస్తే అసలు నెలనెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నది లేనిదీ తేటతెల్లమవుతుందని తెలిపారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. వసతి గృహాల పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయకపోవడంపై సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యం.లక్ష్మీ సుధ దృష్టికి తీసుకురాగా ఆమె స్పందించారు. ప్రతి నెలా విద్యార్థులకు ప్రభుత్వ వైద్యాధికారులు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ చాలా వసతి గృహాల్లో నెలనెలా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయడం లేదని తమ దృష్టికి కూడా వచ్చిందని తెలిపారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వసతి గృహాల్లో పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించేలా చర్యలు చేపడతామన్నారు. -
సమోసా, టీ, దిల్పసంద్..
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక మెనూను ప్రభుత్వం అమలు చేస్తోంది. పదోతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో అభ్యాసనకు ఎక్కువ సమయం కేటాయించేలా సంక్షేమ శాఖలు ప్రణాళికలు రూపొందించాయి. దీనిలో భాగంగా రాత్రి 11 గంటల వరకు స్టడీ అవర్స్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ అదనంగా స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాన్ని ఇస్తున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఇస్తున్నారు. విద్యార్థులకు రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ఇస్తుండటంతో 9 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమిస్తారు. టెన్త్ విద్యార్థులకు అదనం.. పదో తరగతి విద్యార్థులకు మాత్రం అదనంగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మరోసారి ఇవ్వనున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యే టెన్త్ విద్యార్థులకు సమోసా, దిల్పసంద్, టీ, పండ్లు తదితరాలు రోజుకో రకం చొప్పున ఇవ్వనుంది. ఇలా పరీక్షలు ముగిసే వరకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక బడ్జెట్ను ఎస్సీ అభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ. 15 చొప్పున వంద రోజుల పాటు ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 715 సంక్షేమ హాస్టళ్లున్నాయి. వీటిలో పదో తరగతి చదువుతున్న వారు 22 వేలకుపైగా ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో రెండ్రోజుల నుంచి కొత్త మెనూను అమలు చేస్తున్నారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంతో స్టడీ అవర్స్లో కొనసాగుతున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. త్వరలో ఎస్టీ, బీసీ హాస్టళ్లలోనూ.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రత్యేక మెనూను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి శాఖలో కూడా అమలు చేసేందుకు ఆయా శాఖ చర్యలు తీసుకుంటున్నాయి. అత్యుత్తమ ఫలితాల కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
నిధులు కరువు.. లేదు అరువు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు సంకటంలో పడ్డాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 776 పాఠశాల వసతిగృహాలున్నాయి. వీటిలో దాదాపు లక్ష మంది చిన్నారులు వసతి పొందుతున్నారు. ఈ హాస్టళ్లలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనాన్ని అందిస్తారు. మధ్యాహ్న భోజనం మాత్రం పాఠశాలల్లో తీసుకుంటారు. ఈ క్రమంలో ఉదయం స్నాక్స్, సాయంత్రం భోజనంతోపాటు పాలు, చిరుతిళ్లకు సంబంధించిన బిల్లులను సదరు హాస్టల్ వార్డెన్కు ప్రతినెలా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. 82కోట్లు బకాయిలు బీసీ సంక్షేమ హాస్టళ్లలో బకాయిలు భారీగా పేరుకు పోయాయి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం పెద్దగా నిధులివ్వలేదు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని హాస్టళ్లకు నిధులిచ్చినప్ప టికీ వాటిని గతేడాది బకాయిల తాలూకు బిల్లులుగా చెల్లించినట్లు వసతిగృహ సంక్షేమాధికారులు చెబుతు న్నారు. ప్రస్తుతం బీసీ హాస్టళ్లకు సంబంధించి రూ.82 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువగా మెస్ చార్జీలకు సం బంధించినవే ఉన్నాయి. ఇవిగాకుండా వసతిగృహ నిర్వ హణ కేటగిరీలోనూ బకాయిలు భారీగానే ఉన్నాయి. విద్యుత్ బిల్లులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలతోపాటు హాస్టల్ మరమ్మతులు, నిర్వహణకు సంబంధించిన బిల్లులు సైతం ఆర్నెల్లుగా అందలేదు. మెస్ చార్జీలతో పాటు ఇతర బిల్లులేవీ రాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులకు ఇబ్బం దులు తీవ్రమయ్యాయి. వరుసగా 5నెలల బిల్లులు రాకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ భారమవుతోంది. విద్యార్థులకు క్రమం తప్పకుండా స్నాక్స్, భోజనం ఇచ్చేందుకు కిరాణా షాపుల్లో అరువు పద్ధతిలో సరుకులు తీసుకొసు ్తన్నారు. 5 నెలలుగా సరుకులకు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయా దుకాణదారులు సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు కూరగాయల కొనుగోలుపైనా ఇదే ప్రభావం పడింది. కూరగాయల వ్యాపారులు సైతం సరుకులు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి వస్తోందని రం గారెడ్డి జిల్లాకు చెందిన ఓ వసతి గృహ సంక్షేమాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు గత పది నెలలుగా కాస్మెటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. కేసీఆర్ కిట్ల పేరుతో ప్రత్యేకంగా కాస్మెటిక్ కిట్లు ఇస్తామని అధి కారులు ప్రకటిం చినప్పటికీ, అవి కేవలం గురుకులాలకు మాత్రమే పరిమితమయ్యాయని, హాస్టల్ విద్యార్థులకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వసతిగృహ నిర్వహణ నిధులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులను కలిసి వినతులు సమర్పిం చినప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. -
అప్పు చేసి హాస్టల్ కూడు!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఇది వరకు అప్పు చేసి పప్పు కూడు తినేవారేమో. ఇప్పుడు హాస్టల్ కూడు పెట్టడానికి కూడా అప్పు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మెనూలు మార్చడం, కాగితాల్లో డైట్ చార్జీలు పెంచడం చేస్తోంది గానీ.. మెనూ అమలు చేయడానికి కావాల్సిన డబ్బులు ఇవ్వడంలో మాత్రం ఎక్కడలేని పిసినారితనం చూపుతోంది. ఫలితంగా విద్యార్థులకు వండి పెట్టడానికి వసతి గృహ సంక్షేమాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. డైట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే జీఓ విడుదల చేసింది. అయితే పెంచిన చార్జీలు వసతి గృహ అధికారులకు అందడం లేదు. నిధుల విడుదల లేకపోవడంతో కొత్త మెనూ అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ప్రధానంగా బీసీ వసతి గృహాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు ఉన్నాయి. ఈ వసతి గృహాల్లో కొత్త మెనూ అమలు చేయాలంటే అధి కారులకు భారంగా మారుతోంది. ఒక్కో సంక్షేమ వసతి గృహం అధికారికి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.4 లక్షల నుంచి రూ.6లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. హాస్టళ్లలో సరుకుల కోసం వార్డెన్లు చేసిన అప్పులే ఇవి. ఇంకా ఈ బిల్లులు మంజూరు కాకపోవడంతో కొందరు వార్డెన్లకు అప్పు కూడా దొరకని పరిస్థితి ఉంది. అధ్యయనం చేసినా.. రాష్ట్రంలో వసతి గృహాల నిర్వహణపై ఓ కమిటీ అధ్యయనం చేసి మహారాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాల్లో అమలు చేస్తున్న డైట్ను ఆదర్శంగా తీసుకుని ఇక్కడ కూడా అదే మెనూ అమలు చేయాలని నిర్ణయించారు. అయితే మెనూ మార్చినా అప్పటి కి చార్జీలు పెంచలేదు. పెరుగుతున్న ధరలకు ఈ మెస్ చార్జీలు అస్సలు సరిపోవు. ప్రీ మెట్రిక్ వారి కంటే పోస్టు మెట్రిక్ వారికి మరింత ఇబ్బంది ఉంది. వారికి పెరిగిన ధరతో పాటు ఒక పూట భోజనం అదనంగా ఉంటుంది. దీంతో వారికి ఇబ్బం దిగా మారుతోంది. ఇటీవల జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా, ఆ పథకం ఇంకా పురిటి దశలో సమస్యల్లోనే ఉంది. జూలై ఒకటి నుంచి నూతన డైట్ విధానం అమలు చేయాలని జీఓ 82ను విడుదల చేసింది. వారంలో మూడు రోజు లు కోడి కూర ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆదేశాలు బాగానే ఉన్నా వసతి గృహాలకు, డైట్, కాస్మొటిక్ చార్జీలు చెల్లించలేదు. రూ.5.2 కోట్ల బకాయిలు జిల్లాలో బీసీ, ఎస్సీ వసతి గృహాలు 132 ఉన్నా యి. వీటిలో సుమారు 19వేల మంది చదువుతున్నారు. ఒక్కో వసతి గృహానికి రూ.4లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మెస్ చార్జీలు బకాయిలు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.5.2 కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే బీసీ వసతి గృహాలకు, ఎస్సీ వసతి గృహాలకు ఐదు నెలల డైట్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వస తి గృహ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసిన భోజనాలు పెడుతున్నామని, ఇప్పుడు కొత్త అప్పులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు తీయలేరు..! గతంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో సంక్షేమాధికారులకే నిధులు డ్రా చేసే అధికారాలు ఉండేవి. కొత్త పద్ధతిలో ఈ డ్రాయింగ్ అధి కారాలు ఏబీసీడబ్ల్యూ, లేదా ఏఎస్డబ్ల్యూలకు అప్పగించారు. దీని వల్ల బిల్లులు పెట్టడం సమస్యగా మారింది. ఖజానాలకు బిల్లులు వెల్లడంలోనూ, అ బిల్లులు ఆమోదం పొందడంలోనూ తీవ్ర జాప్యం అవుతోంది. సన్నబియ్యం మాటే లేదు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సన్న బి య్యం అందిస్తామని పాలకులు చాలాసార్లు హా మీ ఇచ్చారు. ఈ సారి మెనూ చార్జీలు పెంచినా ఈ బియ్యం విషయం మాత్రం ప్రస్తావనకు రాలేదు. ఇప్పుడు ఇస్తున్న పీడీఎస్ బియ్యం కొన్ని సార్లు నాసిరకంగా వస్తోంది. బియ్యం మినహా మిగిలిన సరుకులు, కూరగాయలు, చికెన్, గుడ్లు, పాలు, అరటి పండ్లు మొదలైనవి సంక్షేమాధికారులు కొ నుగోలు చేయాలి. అయితే వ్యాపారులు అరువులు ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. పెంచిన డైట్ చార్జీల మేరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ. 38.70 పడుతుందని, కానీ మెనూ యథావిధిగా అమలు చేయడానికి రూ.50 ఖర్చు పెట్టాల్సి ఉం టుందని వార్డెన్లు చెబుతున్నారు. అలాగే ఆహార పట్టికలో పరిమాణం, ధరలు నిర్ణయించలేదు. దీంతో వార్డెన్లలో అయోమయం నెలకొంది. కొత్త మెనూ అమలు చేయడానికి నాల్గో తరగతి ఉద్యోగుల కొరత కూడా ఉంది. మెనూ కచ్చితంగా అమలు చేస్తాం ఈ విషయంపై బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. శ్రీదేవి వద్ద ప్రస్తావించగా, మెనూ కచ్చితంగా పాటించాలన్నారు. సీఎఫ్ఎంఎస్ విధానం కొత్తది కావడంతో ఇబ్బంది ఉందని, అయితే బిల్లులు పెట్టి సిద్ధంగా ఉన్నామని, వాటిని వసతి గృహ అధికారులకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పోస్ట్మెట్రిక్ హెచ్డబ్ల్యూవో సస్పెన్షన్
సీతంపేట : సీతంపేట పోస్ట్మెట్రిక్ వసతిగృహ సంక్షేమాధికారి కె.రాజారావును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ ఆదివారం సస్పెండ్ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో పీవో ఆకస్మికంగా ఈ వసతిగృహాన్ని తనిఖీ చేశారు. వసతిగృహ మేనేజ్మెంట్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించకపోవడం, మౌలికవసతులు కల్పించాలని గతంలో హెచ్చరించినా సరైన మౌలికవసతులు కల్పించకపోవడం, నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ఆయన్ని సస్పెండ్ చేసినట్టు పీవో తెలిపారు. సరైన పర్యవేక్షణ లేనందుకు ఏటీడబ్ల్యూవో వెంకటరమణకు షోకాజ్నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు. -
సమస్యల సంక్షేమం
తాండూర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం సమస్యలకు నిలయంగా మారింది. మౌళిక వసతులు కానరావడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టూ వెక్కిరిస్తున్న సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ వసతి గృహంలో మొత్తం 85 మంది నిరుపేద విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. సుదుర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సమీప పాఠశాలల్లో చేరి చదువు కొనసాగిస్తున్నారు. మెరుగైన సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు వసతి గృహంలో ఏర్పడిన సమస్యలతో సతమతమవుతున్నారు. మౌలిక సదుపాయాలు మృగ్యం.. వసతి గృహ ప్రాంగణంలో సుమారు రూ.7 లక్షలతో నీటి ట్యాంకు నిర్మించి ఐదేళ్లు గడుస్తుంది. అయినా నేటికీ దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. పాత నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకుని నీరు నిలువ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు మోటార్ వేసుకుని ఇద్దరు, ముగ్గురు విద్యార్థులే ఒకసారి స్నానం చేసే పరిస్థితి నెలకొంది. నీటి సరఫరా లేకపోవడం వల్ల మరుగుదొడ్లు ఉపయోగపడడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు రెల్వే ట్రాక్ పక్కన బహిర్భూమికి వెళుతున్నారు. దీనికి తోడు వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో పందులు స్వైర విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. చలికి గజగజ.. హాస్టల్ గదుల్లో తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. దీంతో విద్యార్థులు చలికి గజగజ వణుకుతూ రాత్రిళ్లు నిద్రించాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయి. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ (ఆర్వో ) ప్లాంటు నేటికీ నిరుపయోగంగానే ఉంది. ఇలా అనేక సమస్యలు విద్యార్థులను వెంటాడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన సమయంలో విద్యార్థులు సమస్యలు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులను ఆదేశించినా మార్పేమి లేకుండా పోయింది. ఐదేళ్లుగా ఇన్చార్జిలే... సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఐదేళ్లుగా ఇన్చార్జి వార్డెన్లే కొనసాగుతున్నారు. 2012 వరకు రెగ్యూలర్ వార్డెన్ నియమించిన అధికారులు ఆ తరువాత ఇన్చార్జిలతో సరిపెడుతున్నారు. ప్రస్తు తం ఉన్న వార్డెన్కు ఓ చోట రెగ్యులర్గా డ్యూటీ నిర్వహిస్తుండగా, మరో మూడిం టికి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. దీంతో హాస్టల్, విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో పాటు పలువురు కోరుతున్నారు. -
సంక్షేమ హాస్టళ్లను వణికిస్తున్న చలిపులి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు చలికి గజగజ వణుకుతున్నారు. చలికాలం వచ్చినా దుప్పట్లు, రగ్గులు, పరుపులు ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకపోవడం, చాలా హాస్టళ్లకు కిటికీలు, తలుపులు లేకపోవడమే ఇందుకు కారణం. మరోవైపు దోమలు విజృంభిస్తున్నాయి. ఈ సమస్యలతో విద్యార్థులు రాత్రిళ్లు నిద్రకు దూరమై చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మరికొందరు చలికి, దోమలకు తట్టుకోలేక ఇంటి బాట పడుతున్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం మిన్నకుంటోంది. శీతాకాలం వచ్చినా.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు 2,020 ఉన్నాయి. వీటిల్లో 1,88,917 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్లలో దాదాపు 500పైగా ప్రైవేటు భవనాలతోపాటు శిథిల భవనాల్లో కొనసాగు తున్నాయి. హాస్టళ్లను తగ్గించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కనీసం ఉన్న హాస్టళ్ల లోనైనా సదుపా యాలను కల్పించడం లేదు. ఏటా శీతా కాలంలో విద్యార్థులు చలికష్టాలు ఎదుర్కొం టున్నారు. ఇంకా వసతి గృహాల్లో దుప్పట్లు, పరుపులు పంపిణీ చేయలేదు. ఆగస్టులో పంపిణీ చేశామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఒక్కో పరుపుపై ముగ్గురు చొప్పున విద్యార్థులు నిద్రిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేక ఇద్దరేసి ఒక దుప్పటితో సరిపెట్టుకుంటున్నారు. కిటీకీలు, తలుపులు లేని హాస్టల్స్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిద్ర పట్టక చలిమంటలతో జాగారం చేస్తున్న సంఘటనలున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమతెరలు ఇస్తామని గతంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. విద్యార్థులు ఇటు చలి, అటు దోమల బెడదతో నిద్రకు దూరమై అనారోగ్యం బారినపడుతున్నారు. స్కూలుకెళ్లినా నిద్రలేమితో చదువుపై శ్రద్ధచూపలేకపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా.. - తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటీకేశ్వరం బీసీ హాస్టల్ పరిస్థితి దయనీయంగా ఉంది. శిథిల భవనంలో వసతి గృహాన్ని నిర్వహిం చలేక స్థానిక హైస్కూల్లోనే మూడు గదులను హాస్టల్ కింద నిర్వహిస్తున్నారు. అందు లోనూ కిటికీలు, తలు పులు లేక చలితో విద్యార్థులు సతమతమవుతున్నారు. కిర్లంపూడి, అద్దరిపేట, ములకపూడి బీసీ హాస్టల్స్ ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. - కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో ఉంది. అందులో 85 మంది విద్యార్థులు ఉంటే మూడు గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదులు చాలక వరండాలోనే నిద్రిస్తున్నారు. ఈ చలికాలంలో వారి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇదే జిల్లాలో పెడనలో కూడా ఇదే పరిస్థితి ఉంది. - కర్నూలులో బి క్యాంపులో ఉన్న బీసీ హాస్టల్లో 220 మంది విద్యార్థులు ఉన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుంది. కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు దుప్పట్లను, గోనె సంచులను అడ్డుపెట్టుకుని చలిగాలుల నుంచి రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు చాలక అల్లాడుతున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే.. ఆ హాస్టల్ జిల్లా ఉన్నతాధికారులకు కూతవేటు దూరంలోనే ఉంది. అయినా హాస్టల్ వైపు తొంగిచూసినవారు లేరు. -
సంక్షేమ హాస్టళ్లకు సేంద్రియ పంట!
- 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో కిచెన్ గార్డెన్లు - నేడు రెండు చోట్ల ప్రారంభించనున్న వ్యవసాయ మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 514 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందించేందుకు ఉద్యాన శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కిచెన్ గార్డెన్లలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిం ది. ముందుగా కామారెడ్డి జిల్లా జంగంపల్లి, బూరగాం హాస్టళ్లలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కిచెన్ గార్డెన్లకు మంగళ వారం ప్రారంభోత్సవం చేస్తారని ఆ శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సూక్ష్మ సేద్యం, విత్తనాలు సరఫరా సంక్షేమ హాస్టళ్లకు ఉన్న భూమిని ఖాళీగా వదిలేయకుండా వాటిలో అవసరమైన సేంద్రి య కూరగాయలు పండించాలని, వాటినే విద్యార్థులకు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. తద్వారా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటారని భావన. ఆ ప్రకారం కనీసం ఐదు నుంచి ఏడెకరాల వరకు స్థలం ఉన్న హాస్టళ్లను గుర్తించారు. ఆ భూమిలో నిమ్మ, సీతాఫలం, మామిడి తదితర పండ్ల తోటలు కూడా పెంచుతారు. అలాగే టమాట, వంకాయ, చిక్కుడు, కాకర, బీర, దొండ, పొట్ల తదితర కూరగాయలు పండిస్తారు. పాలకూర, చుక్కకూర, పొనగంటికూర, కొత్తిమీర, పుదీన వంటి వాటిని పండిస్తారు. ఇందుకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలు, రోజువారీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తారు. అలాగే ఆయా తోటలకు నీటిని సరఫరా చేసేందుకు సూక్ష్మ సేద్యం పరికరాలను బిగించి ఇస్తారు. విద్యార్థులే గ్రీన్ బ్రిగేడియర్లు: కిచెన్ గార్డెన్లపై రోజువారీ నిర్వహణ బాధ్యత, చెట్ల పెంపకంపై ఆసక్తి పెంచేందుకు ఆయా హాస్టల్ విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడియర్లను సిద్ధం చేస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. వాటి పెంపకంపై వార్డెన్లకు శిక్షణ ఇస్తామన్నారు. కిచెన్ గార్డెన్లలో నూటికి నూరు శాతం సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తామని, తద్వారా విద్యార్థులకు రసాయనాలు లేని కూరగాయలు, పండ్లు అందిస్తామని చెప్పారు. ఎకరానికి సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేయాలంటే రూ.47 వేలు ఖర్చు అవుతుందని, దాన్ని వివిధ పథకాల కింద తాము ఉచితంగానే అందజేస్తామని చెప్పారు. స్థానికంగా ఉండే ఉద్యాన శాఖ అధికారులు కిచెన్ గార్డెన్లపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతారని వెల్లడించారు. -
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
అమరావతి: రాష్ట్రంలోని పలు సంక్షేమ హాస్టళ్లలో అవినీతి నిరోదక శాఖ అధికారులు మంగళవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆముదాలవలస, తోటవాడలోగల బీసీ హాస్టళ్లు, పిఠాపురంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా తోటవాడ హాస్టల్లో 62 మందికి 18 మంది విద్యార్థులు, ఆముదాలవలసలో 89 మందికి 36 మంది విద్యార్థులే హాజరైనట్లు గుర్తించారు. -
మన వంటింట్లో మన వంట నూనె
సంక్షేమ హాస్టళ్లకు ‘విజయ’ పామాయిల్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ విభాగం ‘విజయ’ పామాయిల్ను మన వంటింట్లో మన వంట నూనె నినాదంతో ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తామని పేర్కొంది. అంతేకాక అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఈ బ్రాండ్ వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో విజయ నూనెలను మాత్రమే ఉపయోగించాలని రాష్ట్ర ఆయిల్ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ రాజేశం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే అన్ని రేషన్ దుకాణాల్లోనూ విజయ నూనెలను మాత్రమే విక్రయించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్లో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వంటనూనెలను సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం డబుల్ ఫిల్టర్ల వేరుశనగ, రిఫైన్డ్ సన్ ఫ్లవర్, ఆర్బీడీ పామాయిల్, నువ్వుల, రైస్బ్రాండ్, కొబ్బరి నూనెలు వివిధ పరిమాణాల్లో విక్రయిస్తున్నామన్నారు. -
సంక్షేమ హాస్టళ్లపై చావుదెబ్బ
► రెండేళ్లుగా హాస్టళ్లను రద్దు చేస్తున్న ప్రభుత్వం ► ఇప్పటికే 83 వసతి గృహాల మూసివేత ► ఈ ఏడాది 28 మూసివేతకు నిర్ణయం ► ప్రశ్నార్థకంగా వేలాది మంది విద్యార్థుల జీవితాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రంగంపై చావుదెబ్బ కొడుతోంది. ఏటా ప్రభుత్వ వసతి గృహాలను మూసివేస్తూ వేలాది మంది విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతోంది. హాస్టళ్ల మూసివేత కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మంది బడుగు, బలహీన, గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువులు కొనసాగించలేకపోతున్నారు. హాస్టళ్లలో ఉంటూ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ నిరుపేద విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. రెండేళ్లుగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను వరుసగా రద్దు చేస్తూ క్రమేణా పూర్తి స్థాయిలో మూసివేత దిశగా ప్రభుత్వం పయనిస్తోంది. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగానే సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా మూసివేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మూసివేసేందుకు కసరత్తు పూర్తయింది. ఈ ఏడాది జిల్లాలోని 28 ఎస్సీ హాస్టళ్లను మూసివేయాలని నిర్ణయించారు. ఆయా హాస్టళ్లలో ఈ ఏడాది 1424 మంది బాలబాలికల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ నెల 21వ తేదీ లోగా ఇతర ప్రాంతాల్లోని వసతి గృహాలకు విద్యార్థులను తరలించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. 5, 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులను జిల్లాలోని 11 గురుకుల పాఠశాలలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలురకు సంబంధించి తాడికొండ, చుండూరు, అడవితక్కెళ్ళపాడు, కారంపూడి, నిజాంపట్నం, అచ్చంపేట హాస్టళ్లు ఉన్నాయి. బాలికలకు సంబంధించి అమరావతి, బాపట్ల, విజయపురి సౌత్, వినుకొండ, రేపల్లె, ఆర్కెపురం ఉన్నాయి. సమీకృత హాస్టళ్లకు సంబంధించి 3, 4, 9, 10 తరగతులు చదివే విద్యార్థులను బాలురకు సంబంధించి అమరావతి, పెదనందిపాడు, బృందావన్ గార్డెన్స్, గురజాల, మునిపల్లె, పొన్నూరు, రేపల్లె, ఫిరంగిపురంలలో చేర్చుతున్నారు. బాలికలకు సంబంధించి మంగళగిరి, రెంటచింతల, నరసరావుపేట, పిడుగురాళ్ళ, దుగ్గిరాల, గుంటూరుల్లోని వసతి గృహాల్లో చేర్చుతున్నారు. మొత్తం 83 హాస్టళ్ల మూసివేత... జిల్లాలో మొత్తం 94 ఎస్సీ హాస్టళ్లు ఉండగా 2015–16లో 31 హాస్టళ్లను రద్దు చేశారు. 2016–17 లో 28 హాస్టల్స్ను మూసివేస్తున్నట్లు తెలిపారు. బీసీ హాస్టల్స్ 66 ఉండగా గత ఏడాది 8 హాస్టల్స్ను మూసివేశారు. ఈ ఏడాది మరికొన్ని హాస్టళ్లను మూసివేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్టీ హాస్టళ్లకు సంబంధించి జిల్లాలో మొత్తం 33 ఉండగా గత ఏడాది 13 హాస్టళ్లను మూసివేశారు. ఈ ఏడాది కూడా 3 హాస్టళ్లను మూసివేసేందుకు సమాయత్తమయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో కనీస వసతులు కరువు... విద్యార్థులను గురుకుల పాఠశాలల్లో చేర్చి ఇంగ్లీషు మీడియం భోదిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు కనీస వసతులు లేవు. కాంట్రాక్టు టీచర్లతో పాటు తగిన సిబ్బంది కూడా లేకపోవడంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. దీనికి తోడు విద్యార్థులను చేరుస్తున్న సమీప హాస్టల్స్లో సైతం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది గురుకుల పాఠశాలల్లో, హాస్టల్స్లో చేరిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానేసినట్లు తెలుస్తోంది. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మూసివేస్తున్న ఎస్సీ బాలుర హాస్టళ్లు ఇవే... జిల్లాలో మూతబడుతున్న బాలుర వసతి గృహాల్లో.. గుంటూరు, తాడికొండ, తుళ్ళూరు, కొప్పర్రు, రెంటచింతల, కర్లపాలెం, పొన్నూరు, చేబ్రోలు, నగరం, మేడికొండూరు, అచ్చంపేట, సత్తెనపల్లి, దుగ్గిరాల, కాట్రగడ్డ రేపల్లె, ప్రత్తిపాడు, గుంటూరు బృందావన్ గార్డెన్స్, వెల్లటూరు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 795 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికల హాస్టళ్లు ఇవీ... మూతబడుతున్న బాలికల వసతి గృహాల్లో.. కొల్లిపర, క్రోసూరు, సత్తెనపల్లి, రేపల్లె, నగరం, మునిపల్లె, ముత్తుకూరు, చేబ్రోలు, తుళ్ళూరు, ముప్పాళ్ళ, గురజాల ఉన్నాయి. ఆయా హాస్టళ్లలో 629 మంది విద్యార్థినులు ఉన్నారు. -
ఏ అధికారంతో ఈ తనిఖీలు?
హాస్టళ్లలో టీఎన్ఎస్ఎఫ్ హంగామా తమను కలవాలంటూ వార్డెన్లపై ఒత్తిళ్లు ‘చినబాబు’ చెప్పాడంటూ జులుం విశాఖపట్నం: సంక్షేమ హాస్టళ్లపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నేతలు జులుం చెలాయిస్తున్నారు. లేని అధికారాలను అందిపుచ్చు కుని ఏకంగా తనిఖీలకే తెగబడుతున్నారు. చినబాబు (సీఎం తనయుడు లోకేష్) పేరు చెప్పి నానా హంగామా చేస్తున్నారు. వీరంతా ‘చంద్రన్న సంక్షేమ వసతి గృహాల సముద్ధరణ’ పేరుతో హాస్టళ్లకు వెళుతున్నారు. జిల్లాలో పలు బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లపై పడుతున్నారు. అక్కడ హాస్టల్ వార్డెన్లకు దడ పుట్టిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకుని తనకు నివేదించాలంటూ లోకేష్ టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను ఆదేశించినట్టు వారు చెబుతున్నారు. దీంతో 26 మంది సభ్యులు గల వీరు జిల్లాలో నాలుగైదు బృందాలుగా ఏర్పడి హాస్టళ్లకు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలంటూ రహస్యంగా వెళ్లి హడావుడి చేస్తున్నారు. తాము వసతి గృహాలు ఎలా ఉన్నాయో పరిశీలించి లోకేష్తో పాటు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని, అందుకే వచ్చామని చెబుతుండడంతో వార్డెన్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆయా హాస్టళ్లలో పరిశుభ్రత, ఆహారం, మెనూ, మరుగుదొడ్లు తదితర సమస్యలపై వీరు ఆరా తీస్తున్నారు. పిల్లలకు పెట్టే ఆహారాన్ని వీరు రుచి చూస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి పూట వారితో సహపంక్తి భోజనాలు చేసి అక్కడే బస చేస్తున్నారు. వారితో ఫొటోలు కూడా దిగుతున్నారు. హాస్టళ్లలో సమస్యలపై ఫొటోలు తీస్తున్నారు. ఆయా హాస్టళ్లలో ఏవో లోపాలుండడం వల్ల వీరు తమ గురించి ఎలాంటి నివేదికలు ఇస్తారోనని వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి ‘ఘన స్వాగతం’ పలుకుతూ ప్రత్యేక అతిథులుగా రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారు. మరోవైపు కొంతమంది హాస్టళ్లకు తాము తనిఖీలకు వస్తున్నట్టు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. దీంతో ఆయా వార్డెన్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడమేగాక ఆ రోజు విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. విద్యార్థులను సమస్యలు చెప్పవద్దని కోరుతున్నారు. వార్డెన్లకు హుకుంలు.. ఎక్కడైనా వీరు తనిఖీలకు వెళ్లినప్పుడు సంబంధిత వసతి గృహం వార్డెన్ అందుబాటులో లేనిపక్షంలో ఉన్నతాధికారులకంటే గట్టిగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ వార్డెన్కు ఫోన్ చేసి తమను కలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులైతే హాస్టల్ పిల్లల వద్దకు వెళ్లి వారిని పొంతనలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం కాలేజీ హాస్టల్లో ఎంపీసీ విద్యార్థుల వద్దకు వెళ్లి మీరు భవిష్యత్లో ఏమి కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఇంజినీర్లు కావాలనుకుంటున్నామని చెప్పగా, డాక్టర్లు ఎందుకు కావాలనుకోవడం లేదని ప్రశ్నించేసరికి ఆ విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిని బట్టి వీరికి ఎలాంటి అవగాహన ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలోని మరోక హాస్టల్కు వెళ్లిన బృంద సభ్యులు తనిఖీ చేసి వచ్చారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో బృందంలోని ఒక సభ్యుడు తరచూ తనను కలవాలంటూ ఫోన్లో ఆదేశాలు జారీ చేస్తున్నాడు. లేనిపక్షంలో మీ గురించి సీఎంకు, లోకేష్కు నివేదిక పంపిస్తామని బెదిరిస్తున్నాడు. ఇలా టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్లో కొందరు అదుపు తప్పి నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటిదాకా తాము జిల్లా, నగరంలోని 25 హాస్టళ్లను తనిఖీ చేసినట్టు ఈ బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి చెప్పాడు. ఈ హాస్టళ్లలోని పరిస్థితులను కొద్దిరోజుల్లోనే సీఎంతో పాటు లోకేష్కు నివేదిస్తామని వివరించాడు. -
వసతి గృహాలకు చంద్రన్న సరుకులు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని కేజీబీవీ విద్యాలయాల్లో విద్యార్థినులు కొద్ది నెలల కిందట అస్వస్థతకు గురైన సంగతి తెల్సిందే. నాసిరకం సరుకులు సరఫరా చేయడం.. వాటిని వండి వడ్డించడం వల్లే ఇలా జరిగిందంటూ జిల్లాలోని సంక్షేమ శాఖలన్నింటినీ సమావేశపరచి రాష్ట్ర మంత్రి మృణాళిని, కలెక్టర్ వివేక్యాదవ్లు పలువురికి మెమోలు జారీ చేశారు. శాంపిళ్లు తీయించి మరీ హెచ్చరించారు. ఇది కేవలం కాంట్రాక్టర్ తప్పిదం కనుక. మరి చంద్రన్న సంక్రాంతి సరుకుల్లో నాణ్యత లేదని సాక్షాత్తూ ఆ శాఖ మంత్రి పరిటాల సునీత హెచ్చరించారు. డిసెంబర్లో వివిధ కాంట్రాక్టుదారుల నుంచి పంపించిన సరుకులు అప్పటికే నాణ్యత బాగాలేదన్నారు. ఇప్పుడు అవే సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపించేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. డిసెంబర్, జనవరి నెలల్లో పంపిణీ చేసిన సరుకుల్లో చాలా వరకు మిగిలిపోయాయి. బాగాలేవని కొందరు, కార్డుదారుల కన్నా అధికంగా పంపిణీ చేయడంతో మరికొందరు డీలర్ల వద్ద సరుకులు ఉండిపోయాయి. ఇప్పుడీ సరుకులను సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 50 వేల ప్యాకెట్లను ఇలా ఆయా వసతి గృహాలకు పంపిణీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడంతో ఉన్నతాధికారుల ఆయా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మిగిలిపోయిన బెల్లం, నెయ్యి, గోధుమ పిండి సరుకులను జిల్లాలోని 42 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ, ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయాలకు సంబంధిత సమాచారం వచ్చింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏఏ సరుకులు ఎంత మొత్తంలో పంపిణీ చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. గతంలో సంక్షేమ వసతి గృహాలకు నాసిరకం సరుకులను పంపిణీ చేసిన రెండు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టిన యంత్రాంగం మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే ఫరవాలేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసి చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని కోరుతున్నారు. -
వంద హాస్టళ్లకు తాళం
సంక్షేమ వసతిగృహాల్లో తగ్గుతున్న విద్యార్థులు తగినంతమంది విద్యార్థులు లేక హాస్టళ్ల మూత మూతబడుతున్న వాటిలో ఎస్సీ హాస్టళ్లే అత్యధికం ఈ ఏడాది 59 ఎస్సీ హాస్టళ్లలో చేరని విద్యార్థులు 35 బీసీ వసతి గృహాలదీ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు తిరోగమన బాటలో పడ్డాయి. విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతుండడంతో క్రమంగా ఈ హాస్టళ్లకు తాళాలు పడుతున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఏకంగా వంద వసతి గృహాలు మూతబడడం గమనార్హం. విద్యార్థులు చేరక పోవడంతోనే వీటిలో అధిక శాతం వసతి గృహాలను మూసివేశారు. మరికొన్నిచోట్ల మౌలిక వసతులు కొరవడడం, విద్యార్థుల సంఖ్య అత్యంత తక్కువగా ఉండడంతో వాటిని సమీప వసతిగృహాల్లో విలీనం చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,360 హాస్టళ్లున్నాయి. వీటిలో 1,28,149 మంది విద్యార్థులున్నారు. వాస్త వానికి ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో 1,460 హాస్టళ్లలో విద్యార్థుల నమోదుకు అధికారులు ఉపక్రమించగా క్షేత్రస్థాయిలో స్పందన సంతృప్తికరంగా రాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉన్న వంద హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేశారు. ఒక హాస్టల్లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుండాలి. కానీ ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్ల లో ఈ సంఖ్య 75గా ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రభుత్వానికి వాటి నిర్వహణ భారం తడిసి మోపెడవుతుంది. వంద మంది విద్యార్థులున్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్వహించడం కష్టమని వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో విద్యార్థుల సంఖ్య సగటన 91గా ఉంది. అయితే ఎస్టీ సంక్షేమశాఖ పరిధిలో సగటున విద్యా ర్థుల సంఖ్య 181గా ఉంది. ఎస్టీ సంక్షేమంలోని హాస్టళ్లు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉంది. కాగా, ఈ ఏడాది మూతబడ్డ హాస్టళ్లల్లో 59 ఎస్సీ, 35 బీసీ, 6 ఎస్టీ హాస్టళ్లున్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఇన్చార్జీల పాలనతో... మెజార్టీ హాస్టళ్లు ఇన్చార్జి సంక్షేమాధికారుల పాలనలోనే ఉన్నాయి. ఈ హాస్టళ్లకు పూర్తిస్థాయి సంక్షేమాధికారులు లేకపోవడంతో వాటి పర్యవేక్షణ గందరగోళంగా మారింది. వాస్తవానికి పూర్తి స్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారి ఉంటే విద్యాసంవత్సరం ప్రారంభంలో గ్రామస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకునే అవకాశముంటుంది. కానీ ఒక్కో వసతిగృహ సంక్షేమాధికారికి రెండు, అంతకంటే ఎక్కువ వసతిగృహాల నిర్వహణ బాధ్యతలుండ డంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు డెప్యూటేషన్ పద్ధతిలో సంక్షేమాధికారులుగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఓ వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్డబ్ల్యూఓ) రెండు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు, రెండు ప్రీమెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు హెచ్డబ్ల్యూఓ ఒకేరోజు నాలుగు హాస్టళ్లకు హాజరు కావడం కష్టమే. దాంతో పర్యవేక్షణ లేక అక్కడ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. -
చలిలో సంక్షేమం!
–వర్దా తుపానుతో జిల్లాలో భారీ గాలులు - రాత్రిపూట తీవ్రంగా పడిపోతున్న ఉషో్ణగ్రత – చలికి వనుకుతున్న హాస్టళ్ల విద్యార్థులు - పట్టించుకోని సంక్షేమ అధికారులు కర్నూలు (సిటీ): సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో చల్లటి గాలులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలయితే చాలు చలి పంజా విసురుతోంది. దీంతో తల్లిదండ్రులకు, ఇంటికి దూరంగా వచ్చి సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులు చల్లటి గాలులకు తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గదులకు సరైన కిటికిలు, వాకిళ్లు లేకపోవడం, దీనికితోడు వారికి బెడ్షీట్లు, స్వెటర్లు అందించకపోవడంతో రాత్రి వేళ వారు సరిగ్గా నిద్రపోలేని పరిస్థితి. జిల్లాలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు 93, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లు 101, గిరిజన హాస్టళ్లు 9, ఆశ్రమ హాస్టళ్లు 12 ఉన్నాయి. ఇందులో ఉన్న ఒక్కో విద్యార్థికి ఒక కార్పెట్, బెడ్షీట్ను ప్రభుత్వం అందించింది. అయితే, అవి నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులను చలి నుంచి కాపాడలేకపోతున్నాయి. వర్దా తుపాను ప్రభావంతో ఎప్పుడు లేని విధంగా గత నాలుగైదు రోజులుగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం తుపాను తీవ్రత మరింత పెరగడంతో గంటకు 192 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన దుప్పట్లు ఆ చల్లని గాలులకు ఏమాత్రం తట్టుకోలేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ రాత్రిళ్లు జాగరణ చేస్తున్నారు. ఇప్పటికే చలితీవ్రతతో చాలా హాస్టళ్ల విద్యార్థులు జలుబు, జ్వరం, అలర్జీ తదితర రోగాల బారిన పడ్డారు. పట్టించుకోవాల్సిన సంక్షేమ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వెటర్లు ఇచ్చేదెన్నడో: వాస్తవంగా ప్రతి హాస్టల్ విద్యార్థికి శీతాకాలంలో వీచే చల్లటి గాలుల నుంచి రక్షణ కోసం స్వెటర్లు ఇవ్వాలని డిమాండ్ ఉంది. దీనిపై పలు విద్యార్థిసంఘాల నాయకులు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించారు. చాలా వసతిగృహాల్లో గదులకు తలుపులు, కిటికిలు లేవు వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, సర్కారు హాస్టల్ విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వసతి గృహాల్లోని విద్యార్థులు రాత్రిపూట చలికి వణుకుతూ పడుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఆయా హాస్టళ్ల పరిసరాల్లోని చెత్త, కట్టెల సహాయంతో చలి మంటలు వేసుకుంటున్నారు. విద్యార్థుల అవస్థ తెలిసిన హాస్టళ్ల వార్డెన్లు ప్రభుత్వం స్పందించనప్పుడు మేమేమి చేయగలమంటూ చేతులెత్తేస్తున్నారు. మరికొన్ని హాస్టళ్లలో అనారోగ్యాల బారిన పడిన విద్యార్థులను వార్డెన్లు ఇళ్లకు పంపుతున్నట్లు విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. -
వసతిగృహాలకు ‘పెద్ద’ కష్టం
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఇబ్బందులు - పిల్లల భోజనంలో మాయమైన గుడ్డు, పండ్లు - సాయంత్రం ఇచ్చే చిరుతిళ్లకు బ్రేక్ - గత నాలుగు నెలలుగా పెండింగ్లో డైట్ బిల్లులు - దాదాపు రూ.180 కోట్ల బకాయిలు - ఆందోళనలో వసతిగృహ సంక్షేమాధికారులు సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు ప్రభావం సంక్షేమ వసతి గృహాలపై తీవ్రంగా ఉంది. విద్యార్థులకు అందించే భోజనం మెనూలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పౌష్టికాహారం కింద ఇచ్చే గుడ్డు, పండ్లను పలువురు వసతిగృహ సంక్షేమాధికారులు నిలిపివేశారు. అంతేకాకుండా బడి నుంచి వసతిగృహానికి చేరుకున్న తర్వాత ఇచ్చే చిరుతిళ్ల(స్నాక్స్)కు సైతం మంగళం పాడారు. దీంతో సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులు గత పది రోజులుగా ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం భోజనంతో సరిపెట్టుకుంటున్నా రు. రాష్ట్రంలో 1,635 సంక్షేమ వసతి గృహాలు న్నారుు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖ పరిధి లో 462 హాస్టళ్లు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కింద 454 హాస్టళ్లు, ఎస్సీ అభి వృద్ధిశాఖ పరిధిలో 719 వసతిగృహాలున్నారుు. వీటిలో రెండు లక్షలకు పైగా విద్యార్థులున్నారు. ఇవన్నీ పాఠశాలస్థారుు హాస్టళ్లే. వీటిలో వసతి పొందే విద్యార్థులు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం.. ఉదయం వస తిగృహంలో బ్రేక్ఫాస్ట్(ఉప్మా, పులిహోర, కిచి డీలలో ఒకటి) చేస్తారు. మధ్యాహ్నం పాఠశా లలో మధ్యాహ్న భోజనాన్ని భుజిస్తారు. బడి ముగిసిన తర్వాత సాయంత్రం వసతి గృహా నికి చేరుకుని స్నాక్స్(అటుకులు, చిక్కిలు, ఉడికించిన బొబ్బర్లు, పెసర్లలో ఒకటి) తీసు కోవడంతో పాటు రాత్రి భోజనం చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం వసతి గృహాల్లో మెనూ తలకిందులైంది. పెద్దనోట్లు మార్కెట్లో చెల్లుబాటు కాకపోవడంతో సంక్షే మాధికారులకు సరుకులు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోరుుంది. గుడ్లు, పండ్లకు రోజువారీగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు కావడం, కొత్త నోట్లు అందుబాటులో లేకపోవడంతో సంక్షేమాధికారులు రోజువారీ చెల్లింపులపై చేతులెత్తేశారు. ఫలితంగా విద్యార్థులకు ఇచ్చే కోడి గుడ్డు, పండుకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నాలుగు రోజుల వరకు గుడ్లు, పండ్లు పంపిణీ చేశామని, తర్వాతే ఇబ్బందులు వచ్చాయని వికారాబాద్ జిల్లా పరిగి వసతిగృహానికి చెందిన ఓ సంక్షేమాధికారి పేర్కొన్నారు. నిధుల సమస్యకు తోడు నోట్ల రద్దుతో ఇబ్బందులు తలెత్తడంతో శనివారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ఎస్సీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులకు చారు, మజ్జిగతో భోజనాన్ని వడ్డించారు. బకాయిలతో మరిన్ని ఇబ్బందులు వసతిగృహాల్లో డైట్ బిల్లుల చెల్లిం పులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.180 కోట్ల బకారుు లున్నారుు. ఈ నిధులను సంక్షేమ శాఖలు విడుదల చేసినప్పటికీ.. ట్రెజరీలు మాత్రం వాటిని సంక్షేమా ధికారుల ఖాతాల్లో జమ కాకుండా నిలిపేశారుు. సంక్షేమ హాస్టళ్లకు ప్రతినెలా పౌరసరఫరాల శాఖనుంచి బియ్యం కోటా విడుదల కావడంతో కొంత ఉపశమనం కలుగుతోంది. కానీ కిరాణా సరుకులు, కూరగాయలు, చిల్లర కొను గోళ్లకు డైట్చార్జీలే కీలకం. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో సంక్షే మాధికారులు అప్పులు చేయాల్సి వస్తోంది. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోవడంతో రూ.2లక్షలు అప్పు చేసినట్లు ఓ అధికారి వాపోయారు. -
హాస్టళ్ల మూసివేతకు నిరసనగా జీపు జాతా
ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల మూసివేతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంక్షేమ హాస్టళ్ళ పోరుబాట పేరుతో నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఏపీ గిరిజన విద్యార్థి జేఏసీ తలపెట్టిన జీపు జాతాను మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు బయల్దేరిన జీపు జాతాను నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో సోమవారం ప్రారంభించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.అయ్యస్వామి మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉప సంహరించుకోవాలన్నారు. ఏపీ గిరిజన విద్యార్ధి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కె. పాండునాయక్ గిరిజన విద్యార్థుల సమస్యలపై మంత్రి రావెల కిషోర్బాబుకు చిన్నచూపు తగదన్నారు. గురుకులాల పేరుతో హాస్టళ్లను మూసివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్, నాయకులు రాజేష్ పాల్గొన్నారు. -
సంక్షేమానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం
– వసతి గృహాలను మూసి వేస్తే మూల్యం చెల్లించక తప్పదు – వైఎస్సార్ విద్యార్థి విభాగ్ జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం హిందూపురం టౌన్ : సంక్షేమ ధ్యేయమంటూ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం పేర్కొన్నారు. శనివారం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ చేపట్టి తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరుశురాం మాట్లాడుతూ కరువు జిల్లా అయిన అనంతపురంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 207 సంక్షేమ హాస్టళ్లు ఉండగా అందులో 37 వేల మంది విద్యార్థులు చదుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు విద్యార్థులకు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. హాస్టళ్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు రఘురెడ్డి, లవన్కుమార్, భరత్, సాయికుమార్, ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. -
హాస్టళ్లలో ఇన్చార్జి వార్డెన్లు
స్థానికంగా ఉండేలా చర్యలు అవసరం భైంసా: నియోజకవర్గవ్యాప్తంగా వసతిగృహాల్లో పారిశుధ్యం మెరుగైనప్పటికీ చాలా చోట్ల మరుగుదొడ్లు పనిచేయడం లేదు. వర్షాకాలం ప్రారంభంకావడంతో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరుగుదొడ్ల నిర్వాహణపై అధికారులు దృష్టిసారించాలి. భైంసా బీసీ బాలుర వసతిగృహాంలో మరుగుదొడ్లు పనిచేయడంలేదు. 70 మంది పిల్లలు ఉన్న ఈ వసతి గృహంలో రెండే మరుగుదొడ్లు పనిచేస్తున్నాయి. ఇక కుభీర్లోని ఎస్టీ, బీసీ వసతిగృహాలకు, పల్సి బీసీ వసతిగృహానికి ఇన్చార్జి వార్డెన్లే పనిచేస్తున్నారు. దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూడాల్సిన వార్డెన్ల స్థానంలో ఇన్చార్జిలకు అప్పగించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కుభీర్ బీసీ వసతిగృహం అద్దె గదిలోనే కొనసాగుతోంది. స్థానికంగా పారిశుధ్యనిర్వాహణ సక్రమంగా లేదు. ముథోల్, బాసర, కుంటాల వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు అస్వస్థతకులోనైన సమయంలోనే సమీపంలోని వైద్యశాలలకు తీసుకువెళ్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యందృష్ట్యా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు జరిగేలా చూడాలని పోషకులు కోరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురియడంతో అధికారులు అప్రమత్తంగాఉండాలని పోషకులుకోరుతున్నారు. -
అన్నదానానికి హాస్టల్ విద్యార్థులు...
వీరఘట్టం (నీలానగరం) : పలు సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు పలు ఉత్సవాల సమయంలో గ్రామాల్లో జరుగుతున్న అన్నదానాలకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నారు. అరుుతే హాస్టళ్లలో మాత్రం ఆ పూట విద్యార్థులకు భోజనం పెడుతున్నట్టు రికార్డుల్లో చూపిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా నీలానగరంలో శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని హాస్టల్ విద్యార్థులు వెళ్లారు. అయితే హాస్టల్లో భోజనం వండినట్టు చూపించారు. సెలవు రోజు విద్యార్థులను హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి తర్ఫీదు ఇవ్వాలి. అందుకు విరుద్దంగా శుక్రవారం నీలానగరం హాస్టల్ను ఉదయం 9 గంటలకు సాక్షి వెళ్లినపుడు ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. మిగిలిన విద్యార్థులేరి అని అడిగితే నీలానగరం, కుమ్మరిగుంట గ్రామాల్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లినట్టు తెలిపాడు. ఇదీ విషయం... నీలానగరంలో అధునాతన హంగులతో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు. ప్రత్యేక హాస్టళ్లు ఎత్తి వేయడంతో ఇక్కడ మూడు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో సగం మంది స్థానికంగా ఉన్నవారు కావడంతో రాత్రి ఇక్కడ 20 నుంచి 25 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నట్లు పలువురు చెబుతున్నా. గ్రామంలో అప్పుడప్పుడు గ్రామంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకు విద్యార్థులు హాజరు కావడం పరిపాటిగా మారింది. అధికారులు మాత్రం హాస్టళ్లలోనే విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు బిల్లులు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై వార్డెన్ జోగినాయుడును సాక్షి అడుగ్గా శుక్రవారం మధ్యాహ్నం 25 మంది విద్యార్థులు హాస్టల్లోనే భోజనం చేసినట్టు చెప్పడం విశేషం. అన్నదానానికి వెళ్ళారు.. ఉదయం హాస్టల్లో భోజనం చేసి అందరూ కుమ్మరిగుంట, నీలానగరంలో జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి వెళ్లారు. నేను కూడా వెళ్తున్నాను. - ఆర్.రాజు, 8వ తరగతి విద్యార్ధి, ఎస్సీ హాస్టల్ విద్యార్థి, నీలానగరం ఊరులో భోజనాలు ఉన్నాయి... ఊరులో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం జరుగుతున్నందున పిల్లలంద రూ ఊరులోకి భోజనాలకు వెళ్ళారు. అందుకే మధ్యాహ్నం వంట చేయలేదు. - పి.సురేష్, వంట మనిషి -
‘వసతి’కి ఎసరు!
హాస్టళ్లను దశలవారీగా మూసివేస్తున్న సర్కారు ఇప్పటికే 22 మూసివేత మరో 20 మూసివేసేందుకు రంగం సిద్ధం విద్యార్థులకు శాపంగా మారనున్న ప్రభుత్వ నిర్ణయంస పిఠాపురం : నిరుపేద విద్యార్థుల చదువుకు తోడ్పడుతున్న సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం ఎసరు పెడుతోంది. వాటిని దశల వారీగా మూసివేస్తూ.. పేదలకు చదువును దూరం చేస్తోంది. వార్డెన్కు సైతం తెలియకుండా ‘వసతి’కి ప్రభుత్వం ఎసరు పెడుతున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాస్తవానికి వసతి గృహాలను దశలవారీగా మూసివేసే పనికి ప్రభుత్వం గత ఏడాదే శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఎస్సీ వసతి గృహాలను మాత్రమే మూసివేయగా దానిని ఈ ఏడాది ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా విస్తరించింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 94, బీసీ సంక్షేమ వసతి గృహాలు 120 ఉన్నాయి. వీటిలో సుమారు 9400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. గత ఏడాది 22 సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ వసతి గృహాలను మూసివేయగా, ఈ ఏడాది మరో 20 ఎస్సీ, బీసీ వసతి గృహాలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో సుమారు 1500 మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి వేలితోనే వారి కన్ను పొడిచేలా.. వార్డెన్ల వేలితోనే వారి కన్ను పొడిచేలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. జిల్లాలోని హాస్టళ్లలో గత మూడేళ్లకు సంబంధించిన విద్యార్థుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తక్కువగా (వందలోపు) ఉన్న హాస్టళ్లను వెంటనే మూసివేయాల్సిందిగా ఆయా వార్డెన్లే అభ్యర్థించినట్లుగా నివేదికలను మారుస్తూ, వాటిని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవ్వరికీ అనుమానం రానివిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్లినప్పుడు ఈ తతంగం చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర శాఖలకు వార్డెన్ల బదిలీ! మూసివేసే హాస్టళ్ల వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎవరు ఏ శాఖకు వెళతారో ఆప్షన్ ఇవ్వాల్సిందిగా వార్డెన్లను అధికారులు ఆదేశిస్తున్నారు. కొందరు గ్రామ కార్యదర్శులుగానూ మరికొందరు వీఆర్ఓలుగాను వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. వీధిన పడనున్న సిబ్బంది కుటుంబాలు హాస్టళ్ల మూసివేత పుణ్యమా అని.. వాటిల్లో పని చేసే ఆయాలు, వాచ్మన్లు, వంటపనివారు, సహాయకులు సుమారు 120 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ సిబ్బంది వాపోతున్నారు. క్రమబద్ధీకరణ మాత్రమే.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట హాస్టళ్లను మూసివేస్తున్నాం. అలాగే, అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలను మూసివేసి, అక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉన్న హాస్టళ్లలో ఆ విద్యార్థులకు వసతి కల్పిస్తాం. వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియ ఏదీ చేపట్టలేదు. ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి తదుపరి చర్యలుంటాయి. అన్ని హాస్టళ్లూ మూసివేస్తారన్న దానిలో నిజం లేదు. - ఎంసీ శోభారాణి, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ, కాకినాడ మాకు ఇబ్బందే.. మా అమ్మానాన్న నిరుపేదలు. వాళ్లు చదువు చెప్పించలేని పరిస్థితుల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నాలాగే చాలామంది వసతి గృహాల వల్లే చదువుకుంటున్నారు. వీటిని మూసివేస్తే మాకు ఇబ్బందే. - ఆర్.పవన్కుమార్, విద్యార్థి, ఉప్పాడ హాస్టళ్లే దొరికాయా? పేద విద్యార్థులకు విద్యనందించడానికి ఉద్దేశించిన హాస్టళ్లే దొరికాయా మూసివేయడానికి? ఎటువంటి ప్రయోజనం లేని పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. అంతేకానీ మాలాంటి నిరుపేదల ఆసరాను తొలగించడం చాలా అన్యాయం. - సీహెచ్ చిన్న, విద్యార్థి, ఉప్పాడ -
వసతికి మంగళం!
సంక్షేమ హాస్టళ్ల మూసి వేత వైపే ప్రభుత్వం మొగ్గు దశల వారీగా విద్యార్థులను గురుకులాల్లో చేర్పిస్తున్న వైనం గత ఏడాది 12 ఎస్సీ హాస్టళ్ల మూసివేత ఈ ఏడాది 47 హాస్టళ్ల మూసివేతకు రంగం సిద్ధం నేడు జిల్లా కమిటీ సమావేశంలో నిర్ణయం ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మూతవేసే దిశగా రంగం సిద్ధం అవుతోంది. ఆ గృహాల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో పాటు మెరుగైన విద్యను అందిస్తామనే సాకుతో పాలకులు వసతికి మంగళం పాడనున్నారు. ఇదే కారణంతో గత ఏడాది 12 ఎస్సీ హాస్టళ్లను మూసేశారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 32 ఎస్సీ, 15 బీసీ హాస్టళ్లు మూత పడనున్నాయి. కడప రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను బలోపేతం చేయాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మెరుగైన వసతులు కల్పించి మరింత మంది విద్యార్థులు చేరేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి, విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ‘సంక్షేమం’పై వేటు వేస్తున్నారు. ప్రతి ఏడాది 25 శాతం చొప్పున హాస్టళ్ల సంఖ్యను తగ్గించాలని పాలకులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 131, గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో 10, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 60 మొత్తం 201 హాస్టళ్లు ఉన్నాయి. 131 ఎస్సీ హాస్టళ్లలో 10,629 మంది బాల, బాలికలు వసతి పొందుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లలో 50 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్నారనే కారణంతో ఈ ఏడాది 32 హాస్టళ్లు మూత పడనున్నాయి. ఇదే కారణంతో గడిచిన విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 12 ఎస్సీ హాస్టళ్లు మూత పడ్డాయి. బీసీ హాస్టళ్లు 60 ఉండగా వాటిల్లో మొత్తం ఏడు వేల మందికి పైగా బాల, బాలికలు ఉంటున్నారు. ఇందులో 22 హస్టళ్లు ప్రైవేట్ భవనాల్లో నడుస్తుండగా ఇపుడు 15 హాస్టళ్ల తలుపులను పాలకులు శాశ్వతంగా మూతవేయనున్నారు. ఎస్టీ హాస్టళ్లు 10 ఉన్నాయి. వీటిల్లో 1014 మంది బాల, బాలికలు ఉన్నారు. పోరుమామిళ్ల, రాయచోటి,టి సుండుపల్లె (బాలుర), పులివెందుల (బాలికల) హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు. మిగతా ఎస్టీ హాస్టళ్ల విషయమై నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది హాస్టళ్లు మూత పడనున్నాయి. ఈ లెక్కన రానున్న మూడేళ్లలో దశల వారీగా హాస్టళ్లు దాదాపుగా మూత పడనున్నట్లు తెలుస్తోంది. గురుకులాల్లో గురి కుదిరేనా...? రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టాక నిరుపేదల విద్యా సంక్షేమ రంగం కుదేలవుతోంది. గడిచిన ఏడాది 50 మంది కంటే తక్కువ ఉన్న విద్యార్ధులు, ప్రైవేట్ భవనాల్లో హస్టళ్లు ఉన్నాయనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాస్టళ్లను మూసేశారు. మూసివేతను వ్యతిరేకించిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల ఆందోళనలను ప్రభుత్వం ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. నాకుండేది మూడే కాళ్లు అన్న చందంగా తాను అనుకున్న పనిని చేసుకుపోయింది. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేయడానికే నిర్ణయించుకుంది. ఆ మేరకు ప్రభుత్వం ఇటీవల ఆ శాఖలకు సర్కులర్ జారీ చేసింది. ఆ ప్రకారం ఆదేశాలను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో మంగళవారం కమిటీ సభ్యులు విధి విధానాలపై సమావేశం కానున్నారు. కాగా మూసివేసే హాస్టళ్లలోని విద్యార్థులను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేరుస్తారు. అందుకుగాను గురుకులాల్లో అన్ని వసతులు కల్పించి, మెరుగైన విద్యను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే గురుకులాల్లో పలు సమస్యలు తిష్ట వేసి ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి అదనంగా చేరే విద్యార్థులకు ఎలాంటి వసతులు సమకూరుస్తార నే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పరిణామం కొత్త విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెట్టనుంది. గురుకులాల్లో ప్రవేశాలు కఠిన తరంగా ఉంటాయి. అదే హాస్టళ్లలోకి అయితే ప్రవేశం సులువుగా ఉంటుంది. వ్యతిరేకిస్తాం హాస్టళ్లను మూసి వేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తాం. గతంలో కూడా తీవ్రంగా ఉద్యమాలు చేశాం. హాస్టళ్లను మూసి వేసే బదులుగా వాటిని అభివృద్ధి చేయాలి. ప్రైవేటు భవనాల స్థానాల్లో పక్కా భవనాలను నిర్మించి నిరుపేదల విద్యాభివృద్ధికి కృషి చేయాలి. సంక్షేమ హాస్టళ్లను ఎత్తి వేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాం. - గంగా సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐఎస్ఎఫ్ ఉద్యమం తప్పదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లను క్రమేణా మూసి వేయాలనుకోవడం తగదు. ఈ విధానంపై ఉద్యమాలు చేస్తాం. - ఆర్ఎన్ రాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, దళిత విద్యార్థి సమాఖ్య మెరుగైన విద్య కోసం హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మెరుగై న విద్యను అందివ్వడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భా గంగానే కొన్ని హాస్టళ్లలోని విద్యార్థులను గురుకులాల్లో చేర్పిస్తున్నాం. ప్రభు త్వ ఆదేశాల ప్రకారం నడుచుకోక తప్పదు. - సరస్వతి, డెప్యూటీ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ -
అరకొరకూ ఎసరు
ఇచ్చేది చాలీచాలని జీతం.. అదీ ఏడాదిగా అందని వైనం గౌరవ వేతనం కోసం ట్యూటర్ల ఎదురుచూపులు నిధులు విడుదలకు సర్కారు మీనమేషాలు వారికిచ్చేదే అరకొర వేతనం.. అదీ నెలనెలా ఇవ్వరు. ఏ మూడు నెలలకో ఓ సారిస్తారు. టీడీపీ సర్కారు కొన్నాళ్లుగా అదీ ఇవ్వడం లేదు. అలా ఏడాదికి పైగా అతీగతీ లేదు. ఎప్పుడు చెల్లిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ట్యూటర్లు గౌరవ వేతనం అందక నానా యాతన పడుతున్నారు. విశాఖపట్నం: వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం ట్యూటర్లను నియమించింది. ఇందు కు సబ్జెక్టుకు రూ.300 చొప్పున వారికి నెలకు రూ.1500 గౌర వ వేతనంగా చెల్లిస్తుంది. వారు సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు బోధన చేస్తుంటారు. గతంలో వీరికి సకాలంలోనే వేతనాలు అందేవి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిటి మాదిరిగా నే వీటి నిధుల విడుదలకు కూడా గ్రహణం పట్టించింది. దీంతో చాన్నాళ్లుగా వీరి గౌరవ వేత నం నిలిచిపోయింది. నిరుద్యోగ సమస్యతో సతమత మవుతున్న డిగ్రీ, పీజీలతో పాటు బీఈడీలు పూర్తిచేసిన వారు సైతం ఈ అతి తక్కువ గౌరవ వేతనంతో విద్యా బోధన చేస్తున్నారు. వీరికి బయోమెట్రిక్ విధానం కూడా అమలవుతోంది. ఒకవేళ ఏ రోజైనా విధులకు రాకుంటే ఆ రోజు వేతనంలో కోత విధిస్తారు. ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న వీరికి గౌరవ వేతనాల చెల్లిం పుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. 400కు పైగా ట్యూటర్లు.. జిల్లాలో 65 సాంఘిక సంక్షేమ (ఎస్సీ) హాస్టళ్లు, 64 బీసీ సంక్షేమ హాస్టళ్లు వెరసి 129 ఉన్నాయి. ఒక్కో వసతి గృహంలో ఐదుగురు చొప్పున ట్యూటర్లు పాఠాలు చెబుతున్నారు. వివిధ హాస్టళ్లలో 400కు పైగా ట్యూటర్లు జిల్లావ్యాప్తంగా బోధన చేస్తున్నారు. ఎస్సీ వసతి గృహాల్లో ట్యూటర్లకు 2014 నవంబరు నుంచి ఇప్పటిదాకా గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అలాగే బీసీ సంక్షేమ హాస్టళ్ల ట్యూటర్లకు గత ఏడాది జూలై, ఆగస్టు మినహా ఇప్పటి వరకు చెల్లించలేదు. 2014లో మూడు నెలల గౌరవ వేతనాలను కూడా సంబంధిత అధికారులు ఏవో కుంటిసాకులు చెప్పి నొక్కేశారని ట్యూటర్లు ఆవేదన చెందుతున్నారు. దీనిపై సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను ఎన్నిసార్లు అడిగినా ఫలితం ఉండడం లేదని వీరు పేర్కొంటున్నారు. ఉన్నత చదువులు చదివి విధిలేని పరిస్థితుల్లో తాము ట్యూటర్లుగా అతి తక్కువ గౌరవ వేతనాలకు పనిచేస్తున్నామని, ఈ చిన్న మొత్తాల చెల్లింపులకు కూడా ఏడాదిగా ఎదురు చూపులు చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. నెలనెలా ఇవ్వకపోయినా మూడు నెలలకోసారైనా చెల్లించాలని కోరుతున్నారు. వీరికి చెల్లించాల్సిన గౌరవ వేతనాలకు బడ్జెట్ రాలేదని సంక్షేమశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ సొమ్మును ఇతర అవసరాలకు వినియోగిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ట్యూటర్లు ఆరోపిస్తున్నారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో పనిచేసే వారికి చెల్లింపుల్లో మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. మరో పక్షం రోజుల్లో పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నప్పటికీ తమకు ఇంకెప్పుడు గౌరవ వేతనాలు చెల్లిస్తారని వీరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గౌరవ వేతనాలు చెల్లించకపోవడం వ ల్ల ఆర్థిక ఇబ్బందులతో కొన్నిచోట్ల ట్యూటర్లు మానేస్తున్నారు. -
ప్రభుత్వ వసతి గృహాల్లో ఏసీబీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నడుస్తున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలపై అవినీతి నిరోధక విభాగం అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి బృందాలుగా ఏర్పడ్డ అధికారులు సంక్షేమ గృహాలకు చేరుకుని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల రికార్డుల్లో చూపిన సంఖ్యకు, విద్యార్థుల వాస్తవ సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. కొన్ని హాస్టళ్ల వార్డెన్లు అందుబాటులో లేకపోవటంతో వారికి సమాచారం అందించారు. -
సిగ్గు.. సిగ్గు...
సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి తారాస్థాయికి చేరింది. సర్కారు అందించే ప్రతీ పైసాలోనూ ఉన్నతాధికారులు సైతం వాటాకొట్టేస్తున్నారు. పిల్లల కడుపులు కొట్టి తామ చక్కగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఏసీబీ అధికారుల దాడులతో ఈ వాస్తవం కాస్తా బట్టబయలైంది. కాస్మొటిక్ చార్జీల్లోనూ మామ్మూళ్లు వసూలు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తుండగా అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టుకున్నారు. విజయనగరం కంటోన్మెంట్: హాస్టల్ పిల్లలకు కాస్మొటిక్ చార్జీల పేరిట ఏటా సర్కారు నిధులు విడుదల చేస్తుంది. అందులో ఒక్కో విద్యార్థినుంచి పదిరూపాయలు వంతున వసూలు చేసి ఆ మొత్తాన్ని జిల్లా అధికారికి అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలోని బీసీ వసతి గృహాల వార్డెన్ల సంఘం అధ్యక్షుడు మోహనరావు ఆ శాఖ ఇన్ఛార్జి అధికారి అయిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.రాజుకు అలా సేకరించిన మొత్తాన్ని రూ.1.15లక్షలు ఇస్తుండ గా శనివారం రాత్రి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ మొత్తం అందతుందన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ సీహెచ్.లక్ష్మీపతి, సీఐలు ఎస్ లకో్ష్మజి, డి.రమేష్, హెచ్సీ స్వామినాయుడుతో కలసి దాడులు నిర్వహించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ చేపట్టారు. నివేదికను ఏసీబీ కోర్టుకు అందజేసి ఆపై వచ్చిన ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలుంటాయని డీఎస్పీ ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. నిర్వహణలో అక్రమాలనుంచి గట్టెక్కేందుకే... వసతి గృహాలు సక్రమంగా నిర్వహించడం లేదు, మెనూ అమలుకు అరకొరగా నిధులొస్తున్నా అందులోనూ కోతపెట్టి నాసిరకంగా భోజనం అందిస్తున్నారు. ఇవి సక్రమంగా అమలు చేస్తున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ప్రతి పది రోజులకోసారి సంక్షేమాధికారులు తనిఖీ చేయాలి. వారి పరిశీలనలో గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేయాలి. కానీ జిల్లా సంక్షేమాధికారులు వసతి గృహాల తనిఖీకి రానీయకుండా వార్డెన్లు ప్రతీ నెలా కొంత మొత్తాన్ని అందిస్తున్నారు. రూ. నెలకు రెండుకోట్ల బిల్లులు జిల్లాలో 58 బీసీ వెల్ఫేర్ వసతి గృహాలున్నాయి. ప్రతీ వసతిగృహంలో సుమా రు వంద మంది విద్యార్థులు ఉంటారు. వీరికి ఇచ్చే కాస్మొటిక్ చార్జీలు సక్రమంగా ఇవ్వరు. ఇచ్చిన దాంట్లో కోత పెడుతుంటారు. ఒక్కో విద్యార్థికి వచ్చే మొత్తంలో పదిరూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. జిల్లాలోని బీసీ వెల్ఫేర్ వసతి గృహాల్లో విద్యుత్ బిల్లులు, పేపర్ బిల్లులు, కూరగాయలు, వంట కు సంబంధించిన వస్తువులతో పాటు ఆటవస్తువులు, మరమ్మతులు తదితర నిత్యం జరుగని పనులకూ బిల్లులు పెడుతుంటారనే ప్రచారం ఉంది. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెలా సుమారు రూ. రెండు కోట్ల బిల్లులు అవుతాయని ఓ అంచనా! వార్డెన్లు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి వచ్చిన బిల్లుల్లో కొంత మొత్తాన్ని ఉన్నతాధికారులకు లంచాలుగా ఇస్తున్నారు. అందుకే వారు ఏ వార్డెన్పైనా తీసుకున్న చర్యలు తక్కువగానే ఉంటున్నాయి. ఇన్చార్జి బాధ్యతల్లో అడ్డంగా బుక్కయిన అధికారి! ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న ఎం.రాజుకు ఇటీవలే జిల్లా కలెక్టర్ బీసీ వెల్ఫేర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు పనిచేసిన కె.వి. ఆదిత్యలక్ష్మికి బదిలీ అవడంతో ఆ బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ కార్పొరేషన్లో కోట్లాది రూపాయల రుణాల వ్యవహారం నడుస్తున్నప్పటికీ అందులో ఎటువంటి లోపాలూ బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్న అధికారి ఇన్చార్జి పోస్టులో మాత్రం రూ. లక్షా 15వేలు తీసుకుంటూ బుక్కయిపోవడం విశేషం. -
ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో సోదాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని ఐటీడీఏ పోస్ట్మెట్రిక్ బాలుర వసతి గృహంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. 308 మంది విద్యార్థులకు 173 మందే ఉన్నట్టు గుర్తించారు. అలాగే పారిశుద్ధ నిర్వహణ సరిగా లేదని, రికార్డుల నిర్వహణ కూడా సరిగా లేదని గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. -
సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు
-
సంక్షేమ హాస్టళ్లపై ఏసీబీ దాడులు
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లపై ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం దాడులకు దిగారు. విద్యార్ధుల సంఖ్య, రికార్డుల్లోని వివరాల తనిఖీ చేపట్టారు. కాగా, ఎస్టీ హాస్టల్లో కుక్ ఒక్కరే ఉండగా, విద్యార్థులు ఎవరూ లేకపోవడం తనిఖీలకు దిగిన అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. 20 మంది విద్యార్థులు ఉన్నారని కుక్ చెప్పగా, హాస్టల్ లో ఒక్క విద్యార్థి కనిపించలేదు. కాగా సంబంధిత సంక్షేమ అధికారి అందుబాటులో లేనట్టు సమాచారం. -
వసతులు కల్పించాలని విద్యార్థుల ధర్నా
మిర్యాల గూడ: నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అన్ని వసతి గృహాల విద్యార్థులు మంగళవారం ఉదయం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో స్వయంగా వచ్చి పట్టణంలోని హాస్టళ్ల తీరుతెన్నులను పరిశీలించాలని వారు కోరారు. హాస్టళ్లలో సదుపాయాలు మెరుగుపరచకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. -
సంక్షోభ హాస్టళ్లు
సంక్షేమ హాస్టళ్లు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతో కాలం వెల్లబుచ్చాల్సి వస్తోంది. కొన్నిచోట్ల హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల ఇరుకు గదుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నెలనెలా ఇవ్వాల్సిన కాస్మొటిక్ చార్జీలు సైతం అందడం లేదు. విద్యార్థినుల హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఆకతాయిల బెడద తప్పడం లేదు. వార్డెన్లు అందుబాటులో ఉండడం లేదు. మొత్తానికి జిల్లాలోని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేక సంక్షేమ హాస్టళ్లు కాస్తా.. సం‘క్షోభ’హాస్టళ్లుగా మారాయి. తిరుపతిః జిల్లాలో హాస్టళ్లు.. నరకానికి నకళ్లుగా మారాయి. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి ఎస్సీ బాలుర హాస్ట ల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. బీసీ బాలికల హాస్టల్ భవనం అధ్వానంగా ఉంది. నగరంలోని అన్ని మరుగుదొడ్లు కొంపుకొడుతున్నాయి. విద్యార్థులకు సరిప డా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. వీటికి తలుపులు లేవు. కాస్మొటిక్ చార్జీలు చాలా వరకు అందలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో పలు హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేవు. నెరబైలు, పుది పట్ల, పాకాలలోని ఎస్సీ బాలుర హాస్ట ల్స్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది.మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా అన్ని హాస్టల్స్లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలే అధికంగా ఉన్నా యి. పలు చోట్ల మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదు. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో తేడాలు కన్పించాయి. }M>-âహస్తి నియోజకవర్గంలో పలు హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. తాగునీరు, అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు వంటి సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. పలమనేరు నియోజకవర్గంలో 10 హాస్ట ల్స్ ఉన్నాయి. 4 పక్కాభవనాలు, 6 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పలు హాస్టల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం వస్తే కొన్ని ఉరుస్తున్నాయి.సత్యవేడు బీసీ బాలుర హాస్టల్కు తలుపులు లేవు. భద్రతా సిబ్బంది లేదు. వార్డెన్ అందుబాటులో ఉండరు. దీంతో పగటి పూట పశువులు లోనికి ప్రవేశించి పిల్లల పాఠ్య, నోటుపుస్తకాలను తినేస్తున్నాయి. కాస్మొటిక్ చార్జీలు 3నెలలు నుంచి ఇవ్వలేదు. ఎన్రోల్మెంట్కు అనుగుణంగా విద్యార్థులు లేరు. పూతలపట్టు నియోజకవర్గంలో పలు హాస్టళ్ల నిర్వహణ లోపంతో అపరిశుభ్రత కు ఆలవాలంగా మారాయి. విద్యార్థుల కు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. బంగారుపాళెం యాదమరి, ఐరాలలోని బాలికల ఎస్సీ హాస్టల్స్కు ప్రహరీగోడ లేకపోవడం తో ఆకతాయిల బెడదతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని అన్ని హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అన్నీ పాత భవనాలు కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.పీలేరులో హాస్టల్లలో మౌలిక వసతులు కొరవడ్డాయి. మరుగుదొడ్లు నిర్వహణ అటకెక్కింది. పీలేరు, గ్యారంపల్లె హాస్ట ల్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి.గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మెనూ ప్రకారం వడ్డిస్తున్నా భోజనంలో నాణ్యత కొరవడింది. చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నాయి. కొన్ని హాస్టల్లలో వార్డెన్లు అందుబాటు లో లేరు. తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ట్యూటర్లు రాకుండా ఎగ్గొడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. కలెక్టర్ బంగళా వెనుక ఉన్న హాస్టల్లో అన్నీ స మస్యలే. పాముల బెడద కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
‘సంక్షేమం’పై అదనపు వేటు!
నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేస్తే.. కచ్చితంగా నాణ్యత తగ్గుతుంది. లక్ష్యసాధనా అంతంత మాత్రంగానే ఉంటుంది. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో సరిగ్గా ఇదే సీను కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు లేకపోవడంతో ప్రతి ఒక్కరికీ అదనపు బాధ్యతలు అంటగట్టారు. దీంతో వారి పనితీరు మసకబారడంతోపాటు హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది. - ‘ఇన్చార్జి’లతో నెట్టుకొస్తున్న బీసీ సంక్షేమశాఖ - ఒక్కో అధికారికి రెండు మూడు ‘అదనపు బాధ్యతలు’ - వసతిగృహాల పర్యవేక్షణపై ప్రభావం - అస్తవ్యస్తంగా తయారైన సంక్షేమ హాస్టళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ వార్షిక బడ్జెట్ రూ.650 కోట్లకు పైమాటే. 47 పాఠశాల విద్యార్థి వసతి గృహాలు, 28 కాలేజీ విద్యార్థి వసతి గృహాలున్న ఈ శాఖ పరిధిలో లక్షలాది మంది విద్యార్థులకు యేటా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేసే బృహత్తర కార్యక్రమాలున్నాయి. ఇంతటి ప్రాముఖ్యమున్న శాఖలో డివిజన్ స్థాయి అధికారులు.. వ సతి గృహ సంక్షేమాధికారులు.. ఇలా ఏ కేటగిరిలో చూసినా అదనపు బాధ్యులే కన్పిస్తున్నారు. చివరకు సిబ్బందిని పర్యవేక్షించే జిల్లా ఉన్నతాధికారి కూడా ‘ఇన్చార్జే’ కావడం గమనార్హం. రెండు డివిజన్లకు ఒక్కరే..! జిల్లా బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎనిమిది డివిజన్లున్నాయి. ప్రతి డివిజన్కు ఒక సహాయ సంక్షేమాధికారి (ఏబీసీడబ్ల్యూఓ) ఉంటారు. సంక్షేమ వసతిగృహాల పర్యవేక్షణతోపాటు కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు బాధ్యతలు చూసుకోవాలి. ఇంతటి కీలక బాధ్యతలున్న డివిజన్ స్థాయి అధికారులకు కూడా అదనపు భారం తప్పలేదు. ఒక్కో అధికారి రెండేసి డివిజన్లను పర్యవేక్షిస్తున్నారు. ఘట్కేసర్ ఏబీసీడబ్ల్యూఓకు మేడ్చల్ అదనపు బాధ్యతలు చూసుకుంటున్నారు. అదేవిధంగా హయత్నగర్ ఏబీసీడబ్ల్యూఓ దిల్సుఖ్నగర్ బాధ్యతలనూ నెట్టుకొస్తున్నారు. వికారాబాద్ ఏబీసీడబ్ల్యూఓ చేవెళ్లకు ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. కూకట్పల్లి ఏబీసీడబ్ల్యూఓ తాండూరు డివిజన్ బాధ్యతల్ని కూడా చక్కబెడుతున్నారు. ఏబీసీడబ్ల్యూఓలపై అదనపు భారం పడడంతో.. పారదర్శకతపై సర్కారు చెబుతున్న మాటలకు పాతరేసినట్లవుతోంది. హాస్టళ్లలో ‘చతుర్విన్యాసం’.. డివిజన్ స్థాయిలో రెండేసి అదనపు బాధ్యతలుండగా.. వసతిగృహ స్థాయిలో ఈ బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఒక్కో వసతి గృహ సంక్షేమాధికారి (హెచ్డబ్ల్యూఓ) ఏకంగా నాలుగు హాస్టళ్ల బాధ్యతలు చూసుకుంటున్నారు. వాస్తవానికి వసతిగృహ సంక్షేమాధికారి అదే హాస్టల్లో ఉంటూ పిల్లల బాగోగులు చూసుకోవాలి. కానీ సిబ్బంది లేరనే సాకుతో జిల్లాలో ఒక్కో హెచ్డబ్ల్యూఓకు నాలుగు హాస్టళ్ల బాధ్యతలు అప్పగించారు. హయత్నగర్లో పనిచేసే హెచ్డబ్ల్యూఓ తారామతిపేట్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం హాస్టళ్లను కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఘట్కేసర్ బాలుర వసతిగృహ అధికారి కూకట్పల్లి, మల్కాజిగిరి కాలేజీ విద్యార్థుల వసతిగృహా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇలా హాస్టల్ సంక్షేమాధికారులకు ఇష్టానుసారంగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో వసతిగృహాల పర్యవేక్షణ, విద్యార్థుల సంక్షేమ ఆగమ్యగోచరమవుతోంది. -
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు
ఏలూరు: నాణ్యతలేని విద్యను, ఆహారాన్ని అందిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం చెందిన విద్యార్థులు ఏపీలోని పలు జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పశ్చిమగోదారి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూసివేసిన సంక్షేమ హాస్టళ్లను వెంటనే తెరవాలని, నాణ్యమైన విద్యతో పాటు, ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో, హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించి ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినదించారు. ఏపీలోని పలు కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. -
సంక్షోభ హాస్టళ్లు!
సీట్ల భర్తీ కోసం అధికారుల పాట్లు జిల్లాలో మూడుచోట్ల హాస్టళ్ల మూసివేత అయోమయంలోతల్లిదండ్రులు జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సంక్షోభంలో చిక్కుకున్నాయి. హాస్టళ్లలో వసతులు.. చదువులు అంతంతమాత్రంగా ఉండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా సంక్షేమ హాస్టళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు లేక ఇప్పటికే మూడు హాస్టళ్లు మూతపడగా, మరిన్ని హాస్టళ్లు అదే దారిలో నడుస్తుండడం అధికారులకు గుబులు పుట్టిస్తోంది. చిత్తూరు (గిరింపేట) : సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా మారింది. సీటిస్తాం.. మీ పిల్లల్ని హాస్టల్కు పంపండి అంటూ ఆయా హాస్టళ్ల వార్డెన్లు ఇల్లిల్లూ తిరిగినా స్పందన లేదు. ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య వేలల్లో తగ్గిపోయింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఇవి మూతపడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 123 ఉన్నాయి. వీటిల్లో 12వేల సీట్లు భర్తీ చేయాలి. అయితే ఇప్పటివరకు దాదాపు పది వేలలోపే భర్తీ అయ్యాయి. రెండు వేల సీట్లు వరకు భర్తీ కావాల్సి ఉంది. బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు 65 ఉండగా ఇందులో 8,500 సీట్లు భర్తీ చేయాలి. కానీ ఇప్పటివరకు ఏడువేల లోపే భర్తీ అయ్యాయి. ఇంకా 1,500 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఎస్టీ హాస్టళ్లు 12కు గాను 1,200 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఏ డు వందల లోపే సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 500 సీట్లు భర్తీ చేసేందుకు అధికారుల పాట్లు అన్నీఇన్నీకావు. ఇది లావుండగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో బీసీ వేల్ఫేర్ హాస్టళ్లు కార్వేటినగరంలో ఒకటి, శ్రీకాళహస్తిలో ఒకటి మూసేందుకు అధికారులు సంబంధిత అధికారులకు నివేదిక పంపారు. ఇక్కడున్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలల్లో చేర్పించనున్నట్లు వారు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది పుత్తూరు సహాయక సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని బాలికల హాస్టల్లో గత సంవత్సరం 128 మంది విద్యార్థులుండేవారు. ప్రస్తుతం ఎంత ఉన్నారో కూడా చెప్పలేని పరిస్థితి. కార్వేటినగరంలోని బాలుర హాస్టల్ రెండులో గత సంవత్సరంలో 47 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం దాదాపు ఖాళీ అయిపోయింది.సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం బాలుర హాస్టల్లో గత ఏడాది 82 మంది ఉండగా ప్రస్తుతం 40కి తగ్గిపోయింది. చిత్తూరు సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని అరుల్పురం బాలుర హాస్టల్, చిత్తూరు బాలికల హాస్టల్-2, పెద్దతిప్పసముద్రం మండలంలోని కందుకూరు బాలుర హాస్టల్ ఇప్పటికే మూతపడ్డాయి. ఆయా హాస్టళ్లలో నామమాత్రంగా ఉన్న విద్యార్థులను సమీపంలోని గురుకుల పాఠశాలలకు చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ వీరిని ఇంకా ఎక్కడా చేర్చకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండేళ్లలో 30 మంది విద్యార్థులున్న హాస్టళ్లలన్నింటినీ గురుకుల పాఠశాలల హాస్టళ్లలోకిమార్పు చేసేందుకు కసరత్తు సాగుతోంది. అన్నీ ఉన్నా.. హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెం చుకునేందుకు అధికారులు ఈ ఏడాది విద్యార్థులకు అవసరమైన స్టడీమెటీరియల్, యూనిఫాం, దుప్పట్లు సిద్ధం గా ఉంచారు. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల్లో స్పందన రావడం లేదు. ఈ ఏడాది కనీస సంఖ్యలో కూడా ప్రవేశా లు లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మండలాల్లో వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలకు తోడు, కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వైపే మక్కువ చూపుతున్నారని వారు అంటున్నారు. -
పనులు జరిగినా... బిల్లులేవీ?
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఏపీ విద్యా సంక్షేమ మౌలికవనరుల అభివృద్ధి కార్పొరేషన్(ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న పనులకు బిల్లులు మంజూరుకాక కాంట్రాక్టర్లు అవస్థలు పడుతున్నారు. నిర్మాణం పూర్తిచేసుకుని ఎనిమిది నెలలు కావస్తున్నా బిల్లుల మంజూరుకు అవరోధం ఏర్పడుతోంది. ఈ సంస్థ ద్వారా ఆర్ఎంఎస్ఏ(రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్), సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నారు. వీటికి సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో భవనాలు లేక విద్యార్థులు, నిర్మాణం పూర్తయినా డబ్బులు అందక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా జిల్లా మొత్తమ్మీద సుమారు రూ. 14కోట్లు వరకు బకాయిలున్నాయి. వాస్తవానికి ఈ సంస్థ ద్వారా జరిగే నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవన్న సాకుతో తమ వాటా చెల్లించక మొత్తం బిల్లులే నిలిచిపోయాయి. పైగా కేంద్రం విడుదల చేసిన నిధులన్నీ సర్కారు దారి మళ్లించేస్తోందనీ, వేరే అవసరాలకు వినియోగిస్తోందనీ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎంఎస్ఏ(రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్) పేరిట ఉన్నత పాఠశాలలకు రూ. 29 నుంచి రూ. 35 లక్షల అంచనా విలువతో 80వరకు భవనాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లులు మాత్రం ఆ మేరకు మంజూరు కాలేదు. ఇంకొన్ని భవనాలు గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలలో పూర్తి చేశారు. వాటికీ ఒక్కోదానికి రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు బకాయిలున్నాయి. ఈ ఆర్ఎంఎస్ఏ భవనాలకు సంబంధించి మొత్తం రూ. 12 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఎనిమిది నెలలుగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు. సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి జిల్లాలో 12 పనులు మంజూరయ్యాయి. వీటిలో రెండు నూతన భవనాలు నిర్మించాల్సి ఉండగా, మిగిలిన 10 గురుకులాల్లో భవనాల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ పనులు కూడా పూర్తయి సుమారుగా ఆరునెలలు కావొస్తోంది. వీటికీ రూ. రెండుకోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. బకాయిల విషయమై ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ జగ్గారావువద్ద ప్రస్తావించగా బిల్లుల కోసం పలుమార్లు ప్రభుత్వాన్ని కోరామని, వారు మంజూరు చేయాల్సి ఉందని తెలిపారు. -
అనగనగా ఓ చందంపేట..!
దేవరకొండ/చందంపేట చందంపేట... ఛిద్రమైన మండలం. మూఢనమ్మకాలు, శిశు విక్రయాలు, బ్రూణ హత్యలు, నిరక్షరాస్యత వేళ్లూనుకుపోయిన ప్రాంతం. అధికారగణం, ప్రజాప్రతినిధులు ఈ తీరును కళ్ళప్పగిస్తూ చూస్తూ కాలం గడుపుతున్నారే తప్ప కారణాలు అన్వేషించడం లేదు. తమకెందుకులే అనుకుంటున్నారు తప్ప తాము సైతం అనుకోవడం లేదు. నీటి కోసం అల్లాడే గ్రామాలు, కరెంటు లేక దీపాల వెలుగులో ఉన్న తండాలు, రోడ్లు లేక ఇంకా అడవి బాటన ప్రయాణించాల్సిన ఆవాసాలు, బడి కోసం మైళ్ల దూరం నడిచే విద్యార్థులు, సంక్షేమ హాస్టళ్లలో అడ్మిషన్ దొరక్క చదువు మానేసిన పిల్లలు, వ్యవసాయం కలిసిరాక వలసవెళ్లే కుటుంబాలు, రోగమొస్తే ప్రాణాలమీదికి తెచ్చుకునే గిరిజనులు అడుగడునా కనిపిస్తారు. ఇదంతా అధికారులకు తెలియనిదా ? ఇది ప్రభుత్వం దృష్టికి పోవడం లేదా ? అన్న ప్రశ్న జిల్లా ప్రజలను తొలచివేస్తుంది. రాజకీయ శిక్షణ తరగతుల పేరుతో నాగార్జునసాగర్కు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు సమీపంలోని చందంపేట దిక్కు ఓ సారి చూడమని, వారి సమస్యలు ఆలకించమని విజ్ఞప్తి చేస్తున్నారు. 40శాతం మంది వలస జీవులే.. బతుకుదెరువు లేక, వ్యవసాయం కలిసిరాక, పిల్లల్ని సాకలేక వలస వెళ్తున్న వారు 40శాతం పైనే ఉన్నారు. సుమారు 57వేల జనాభా ఉన్న మండలంలో ఇప్పటికీ సుమారు 20వేల మంది గుంటూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రాం తాల్లో ఉంటున్న వారే. పండుగకో, పబ్బానికో, ఓట్ల సమయంలో మాత్రమే వీరికి సొంత ఊళ్ళు గుర్తుకొస్తాయి. అధికారులకు హడల్ చందంపేట మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. కానీ మండల స్థాయి నుంచి మొదలుకుని గ్రామస్థాయి అధికారి వరకు చందంపేట మండల కేంద్రంలో గానీ, స్థానికంగా కానీ నివాసం ఉన్న దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడ పని చేయాలంటేనే అధికారులు ఆపసోపాలు పడిపోతారు. వసతులుండవనే సాకుతో పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. దీంతో గ్రామ, మండల స్థాయిలో అధికారులకు క్షేత్ర స్థాయి అవగాహనలేమి ఏర్పడుతుంది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు సుమారు వంద కిలోమీటర్లకు పైగ ప్రయాణించి మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. 1196 మంది పిల్లలు బడిబయటే.. ప్రభుత్వం నిర్భంద ప్రాథమిక విద్యను తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా చందంపేట మండలంలో 1196 మంది బడి బయట పిల్లలు (6-14 సంవత్సరాలు) ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిపించిన కుటుంబ సర్వేలో తేలిన సంఖ్య. ఇదిలా ఉంటే మన విద్యాధికారులు మాత్రం బడి బయట విద్యార్థులు కేవలం 83 మందినే చూపిస్తున్నారు. ఐకేపీ, సీఆర్పీలు చేసిన సర్వేలో 83 మంది బడి బయట విద్యార్థులున్నట్లు చెప్తున్న ఈ సంఖ్య అధికారులు చేస్తున్న అంకెల గారడికి సాక్ష్యం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే.. మొత్తం మండల జనాభా 51,408 మంది కాగా 37,548 మంది ఓటర్లు. ఆరేళ్ల లోపు పిల్లలు 7,136 మంది. ఇంకా మిగిలిన 6,724 మంది విద్యార్థులలో 1,196 మంది బడిబయటే ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 19 గ్రామ పంచాయతీల్లో సరాసరిన గ్రామానికి 62 మంది పిల్లలు బడి బయటే ఉంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వీడని మూఢనమ్మకాలు గ్రామాలు, తండాల్లో ఇంకా మూఢవిశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఆడపిల్లంటే అరిష్టమని, క్షుద్ర పూజల ద్వారా అనుకున్నది సాధించవచ్చని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అనారోగ్యం పాలైనవారు మంత్రాలు, తంత్రాలంటూ అడవుల వెంట తిరుగుతున్నారు. తాజాగా శనివారం రాత్రి నేరడుగొమ్ము గ్రామపంచాయతీ పరిధిలో నడిరోడ్డుపై జంతు బలి చేసి క్షుద్ర పూజలు నిర్వహించినఘటన ఇందుకు సజీవ సాక్ష్యం. -
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శనివారం ఉదయం ఆకస్మకి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వలి, జంగారెడ్డి గూడెం లోని హాస్టళ్లను అధికారులు తనిఖీలు చేశారు. హాస్టళ్లలోని వసతులు, నిర్వహణ తీరు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి, సీజ్ చేశారు. -
సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ తనిఖీలు
బాల్కొండ: నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐలు రఘునాథ్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మోటిక్ చార్టీలు చెల్లించకపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందివ్వటం లేదని తనిఖీల్లో తేలినట్టు ఆధికారులు వెల్లడించారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ గిరిజన హాస్టల్, మెదక్ జిల్లా జహీరాబాద్ బీసీ హాస్టల్ లోనూ ఏసీబీ దాడులు నిర్వహించి రిజిస్టర్లను పరిశీలించారు. -
‘సన్న బియ్యంతో అన్నం’ షురూ
నగరంలో పథకం ప్రారంభం పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు 161 హాస్టళ్లలోని విద్యార్థులకు లబ్ధి సిటీబ్యూరో: నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్పూర్ బాలికల హాస్టల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు వేర్వేరుగా ప్రారంభించారు. మహేంద్రహిల్స్లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంత్రి తలసాని పథకాన్ని ప్రారంభించారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్లోని సితాఫల్మండి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కింగ్కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. 15,652 మంది విద్యార్థులకు లబ్ధి నగరంలో 161 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 15,652 మంది విద్యార్థులకు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో.. నగరంలోని 612 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి భోజనంతో విద్యార్థులు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని హాస్టల్ వార్డెన్లు, పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి: దత్తాత్రేయ ముషీరాబాద్: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం కార్యక్రమాన్ని భోలక్పూర్లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ తో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, డ్రాఔట్స్ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్లు తెరిచి అభివృద్ధిని చూడండి:నాయిని భోలక్పూర్లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తాము చేపట్టే అభివృద్ధికి సహకరించాలని కోరారు. పేద విద్యార్థుల పోరాట ఫలితమిది.. అఫ్జల్గంజ్: సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా పేద విద్యార్థుల పోరాట విజయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం కింగ్కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సన్న బియ్యం సరఫరా కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సన్న బియ్యం సరఫరా విషయంలో భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాధిక, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కె.నర్సింహ నాయక్, విద్యార్థి నేతలు పి.సతీష్కుమార్, రేపాక రాంబాబు, సీహెచ్ శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, రతన్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పథకాన్ని వేర్వేరుగా ప్రారంభించిన దత్తాత్రేయ, నాయిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకే హాస్టల్లో వేర్వేరుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి అధికారులు భోలక్పూర్లోని బాలికల ఎస్సీ వసతి గృహాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్కు సమాచారం అందించారు. దత్తాత్రేయ, లక్ష్మణ్లు అనుకున్న సమయానికి రాగా నాయిని నర్సింహారెడ్డి కోసం దాదాపు 45 నిమిషాలు వేచి చూశారు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్లు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత అరగంటకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాస్టల్కు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్కు సన్న బియ్యం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. -
సన్నబియ్యం చేరేనా?
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సన్నబియ్యం వండిపెట్టడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. జనవరి ఒకటినుంచి ఈ పథకాన్ని అమలుచేయాలి. అంటే మరో ఐదు రోజులే గడువుంది. కానీ ఇప్పటి వరకు జనవరి కోటాను కొనుగోలు చేయకపోవడం.. బస్తా బియ్యం కూడా హాస్టల్స్కు చేరకపోవడంతో పథకం అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ : సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. పేద విద్యార్థులు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాష్ర్ట ప్రభుత్వం జనవరి 1 తేదీ నుంచి హాస్టళ్లకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భాగంగా బియ్యం పంపిణీకి సంబంధించి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. హాస్టల్స్కు బియ్యం చేరవేసేందుకు గడువు మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా బస్తా బియ్యం హాస్టల్స్కు చేరలేదు. జనవరి నెలకు కావాల్సిన బియ్యం కోటాను మిల్లర్ల నుంచి కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ఇప్పటి వరకు పూర్తికాలేదు. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ (మండల్ లెవల్ స్టాక్ పాయింట్లు) తరలించాలి. అక్కడి నుంచి రవాణా వాహనాల ద్వారా హాస్టల్స్కు చేరవేయాలి. కా నీ ఇప్పటి వరకు బియ్యం కొనుగోలు చేయడమే ఇంకా పూర్తికాలేదు. జిల్లాలో పరిస్థితి ఇదీ... జిల్లాలో 68 బీసీ వసతి గృహాల్లో 6,800 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 26 ఉండగా అందులో 2,050 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వీరికి రోజుకు 400 నుంచి 500 గ్రాముల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకోసం నెలకు 750 క్వింటాళ్ల బియ్యం అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. ఎస్సీ వసతి గృహాలు 121కు గాను 10, 500 మంది విద్యార్థులు, కాలేజీ హాస్టల్స్ 17 కుగాను 1650 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ విద్యార్థులకు రోజుకు 500 గ్రాముల నుంచి 600 గ్రామల బియ్యాన్ని వండిపెట్టాలి. ఇందుకు గాను నెలకు 1500 క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇక ఎస్టీ వసతి గృహాలు 39 ఉన్నాయి. దీంట్లో 10 వేల మంది విద్యార్థులు, 10 కాలేజీ హాస్టల్స్లో 600 మంది, ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా 3 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. వారందరికీ రోజుకు 500 గ్రామలు చొప్పున బియ్యాన్ని వండిపెట్టాలి. దీనికిగాను నెలకు రెండు వేల క్వింటాళ్ల బియ్యం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇవిగాక రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. అరొకర బియ్యం సేకరణ జనవరి నెలకు గాను సంక్షేమ వసతి గృహలకు మొత్తం 18 వందల టన్నుల బియ్యం సేకరించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు కేవలం 2 వందల టన్నుల బియ్యం మాత్రమే సేకరించారు. ప్రభుత్వం కిలో రూ.32ల చొప్పున రైస్ మిల్లర్లకు చెల్లించి కొనుగోలు చేస్తుంది. మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసే బాధ్యత జిల్లా పౌరసరఫరాల శాఖ పైనే ఉంది. ఆ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించి అక్కడి నుంచి హాస్టల్స్కు పంపిణీ చేసే బాధ్యత డీఎం సివిల్ సప్లయ్నే ఉంది. కానీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో బియ్యం కొనుగోలు చేయకపోవడంతో సంక్షేమ అధికారులు ఏటూ తేల్చుకోలే కపోతున్నారు. ఇక్కడ మరో విషయమేమంటే సన్న బియ్యాన్ని తరలించడానికి కంటే ముందే హాస్టల్స్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని సమీ పంలోఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు అప్పగించాలని వార్డెన్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం గ మనార్హం. పక్కదారి పట్టకుండా... దొడ్డు బియ్యాన్నే పక్కదారి పట్టించిన ఘనులు సంక్షేమ శాఖల్లో ఉన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యాన్ని వార్డెన్లు మొత్తం తీసుకెళ్లకుండా కొంత బియ్యాన్ని గోదాముల్లోనే నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్కు తరలించిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సన్నబియ్యం విషయంలో పకడ్బందీ నిఘా లేకపోతే వార్డెన్లు మరింత రెచ్చిపోయే అస్కారం ఉందని సివిల్ సప్లయ్ అధికారులే పేర్కొంటున్నారు. అలా కాకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు, బియ్యం రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించిన బియ్యాన్ని హాస్టల్స్ వరకు చేరేవే సేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇది ఏమేరకు సత్ఫలితాలు సాధిస్తుందో వేచిచూడాల్సిందే. -
‘సంక్షేమానికి’ సన్నబియ్యం
ఖమ్మం : దొడ్డు బియ్యంతో వండిన ముద్ద అన్నం తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు మంచిరోజులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మాధ్యాహ్న భోజనంతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పెట్టే భోజనానికి జనవరి ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం(ఫైన్ రైస్) అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యావేత్తలు, సంక్షేమ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుందోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. 4 లక్షల మందికి ప్రయోజనం... సన్నబియ్యం పథకంతో జిల్లాలో 2400 ప్రాథమిక పాఠశాలల్లో చదివే 1,17,013 మం ది, 474 ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే 63,679 మంది, 411 ఉన్నత పాఠశాలల్లో చదివే 43,458 మంది విద్యార్థులకు, 63 బీసీ హాస్టళ్లకు చెందిన 5,977 మంది, 71 ఎస్సీ హాస్టళ్లలో ఉండే 5,620 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. 33 కేజీబీవీల్లో చదువుతున్న 5,470 బాలికలు, 121 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 వేల మందితోపాటు ఇతర ఇంటిగ్రేటెడ్, మెట్రిక్, పోస్టు మెట్రిక్ పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇక నాణ్యమైన భోజనం అందనుంది. తీరనున్న ‘దొడ్డు’ బాధలు హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం తయారీలో కూరగాయలు, వంట సామగ్రి కోసం గతంలో కంటే నిధులు పెంచినా.. దొడ్డు బియ్యం.. అవికూడా పురుగులు పట్టినవి, ముక్కిపోయినవి పంపడంతో గత్యంతరం లేక వాటినే వండిపెట్టేవారు. బియ్యం నాణ్యంగా లేకపోవడంతో భోజనం ముద్దగా అయ్యేది. ఇందులో ఏ కూర వడ్డించినా రుచించదు. దీనికి తోడు ఇదే అదునుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, హాస్టల్ మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లు ప్రతి రోజూ నీళ్ల చారుతోనే సరిపెట్టేవారు. దీంతో విద్యార్థులు ముద్ద అన్నం, నీళ్ల చారు తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక అర్ధాకలితో అలమటించేవారు. సన్న బియ్యం సరఫరా అయితే కూరలు ఎలా ఉన్న అన్నం మాత్రం తినడానికి అనువుగా ఉంటుందని, పస్తులుండే సరిస్థితి రాదని విద్యార్థులు అంటున్నారు. నెలకు 1208 మెట్రిక్ టన్నులు సరఫరా... జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ, ఇతర ఆశ్రమ, కస్తూర్బాగాందీ బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 1208 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎస్సీ హాస్టళ్లకు 73 మెట్రిక్ టన్నులు, ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలకు 333 మెట్రిక్ టన్నులు, బీసీ హాస్టళ్లకు 60, ఇతర వసతి గృహాలకు 100, పీఎస్లకు 142, యూపీఎస్లకు 118, 9,10 తరగతుల విద్యార్థులకు 112 , అంగన్వాడీ కేంద్రాలకు 270 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. అమలుపై అనుమానాలు.. విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినా... ఈ పథకం అమలు తీరు ఏలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల నుంచి తహశీల్దార్లకు ఆర్వోలు వెళ్తాయి. వారు అంగీకరిస్తే ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా అవుతాయి. అక్కడి నుంచి డీలర్లు పేదలకు అందించే బియ్యంతోపాటు, పాఠశాలలకు అందించే బియ్యం కూడా తీసుకొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పాఠశాలలకు పంపడంలో చేతులు మారే అవకాశం ఉంది. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యంలో మేలిమి రకమైనవి పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు కుమ్మక్కై మేలిమి బియ్యాన్ని పక్కదారి పట్టించిన సందర్బాలున్నాయి. దీంతోపాటు పాఠశాలల్లో బియ్యం మాయం కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం సరఫరా అయినా ఇలాంటివి ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం లెవీ తగ్గించడంతో పాటు ఈ సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. సాగైన పంటలో సగానికి పైగా దొడ్డు రకం ధాన్యమే. ఇలాంటి పరిస్థితిలో సన్న బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
సంక్షేమ హాస్టళ్లు..కష్టాల లోగిళ్లు
సాక్షి నెట్వర్క్ : అదే పరిస్థితి... ఏళ్లు గడుస్తాయి... కోట్ల రూపాయల నిధులు ఖర్చయిపోతాయి... పేపర్ల మీద ఫైళ్లు చక్కర్లు కొడతాయి... పైరవీలు భారీగా జరుగుతాయి... బండ్లు ఓడలయినట్టు కొందరు అధికారుల ‘జీవన ప్రమాణాలు’ ఊహించని విధంగా మారిపోతాయి.. కానీ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మాత్రం అష్టకష్టాలు తప్పడం లేదు. అటు అధికారులకు గానీ, ఇటు పాలించే రాజకీయ నాయకులకు గానీ పేదల చదువులపై మక్కువ లేకపోవడంతో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేసే ఉంటున్నాయి. కాలచక్రం గిర్రున తిరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా అదే దుస్థితి. సరిగా ఉడకని అన్నం, నాలుగు చెంచాల ఉప్మా.. నీళ్లచారు... ఇదీ హాస్టల్ పిల్లలకు పెట్టేది. పకడ్బందీ మెనూ రూపొందించి ఫలానా ఆహారం పిల్లలకు పెట్టాలని హైదరాబాద్ నుంచి వచ్చే ఆదేశాలూ అమలు కావు. మరుగుదొడ్లుండవు... చద్దర్లుండవు. వాతావరణంలో మార్పులొచ్చి చల్లటి చలి పెడుతున్నా.. ఆ చలికి వణుకుతూ పడుకోవాలే తప్ప కప్పుకోవడానికి దుప్పట్లుండవు. అద్దెభవనాల్లోనే వెళ్లదీయాల్సిందే. కాస్మొటిక్ బిల్లులు రాక పౌడర్లు, దువ్వెనలు ఉండక కళాహీనంగా పాఠశాలలకు వెళ్లాలి. సరిగ్గా అన్నం తినేందుకు ప్లేట్లు రావు.. నీళ్లు తాగేందుకు గ్లాసులుండవు... ఇలా సమస్యల అడ్డాలుగా మారిన హాస్టళ్లలోనే భావిభారత పౌరుల బాల్యం గడిచిపోతోంది. కష్టాల కూడళ్లలోనే మట్టిలో మాణిక్యాలు విద్య నేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి... ఈ పరిస్థితికి కారకులెవరు? రాజకీయ నాయకులా? విద్యార్థి సంఘాలా? ఓట్లేసిన పేద విద్యార్థుల తల్లిదండ్రులా?... కారకులెవరైనా కారణమేదైనా... జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నం చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లోని హాస్టళ్లను ‘సాక్షి’ నెట్వర్క్ సందర్శించింది. జిల్లా కేంద్రంలో నల్లగొండ పట్టణంలోని శాంతినగర్లోని బీసీ బాలుర వసతి గృహం భవనంపై పెచ్చులు ఊడాయి. అద్దె భవనంలో హాస్టల్ కొనసాగుతుంది. దీంట్లో 150 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. తిప్పర్తిలో బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతుంది. ఎస్సీ బాలుర హాస్టల్లో టాయిలెట్స్ లేవు. వంద మంది విద్యార్థులకుగాను ఒకటే టాయిలెట్ ఉంది. విద్యార్థులు సక్రమమైన భోజనం పెట్టడంలేదు. మోనూ పాటించడ ం లేదని విద్యార్థులు చెబుతున్నారు. అన్ని హాస్టళ్లకు దుప్పట్లు, బెడ్ షీట్లు వచ్చాయి. -
ఔట్ సోర్సింగ్ వ ర్కర్లకు వేతనం బంద్
15 నెలలుగా పెండింగ్ అప్పులపాలవుతున్న కుటుంబాలు నూజివీడు, న్యూస్లైన్ : సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 15నెలలుగా జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణకోసం అప్పులపాలవుతున్నా ప్రభుత్వం దయచూపడం లేదని ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంఘి కసంక్షేమ శాఖ జిల్లాలో నిర్వహించే హాస్టళ్లలో దాదాపు 230మంది ఔట్సోర్సింగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. నూజివీడు ఏఎస్డబ్ల్యూవో కార్యాలయం పరిధిలోని నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో ఉన్న హాస్టళ్లలో 30మంది వర్కర్లు కుక్లు, సర్వెంట్లు, వాచ్మన్లుగా పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.6,700 వేతనం ఇవ్వాల్సి ఉంది. అరుుతే 15నెలలుగా వీరికి వేతనం ఇవ్వడం లేదు. మేమెలా బతకాలని వీరు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలని వర్కర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నెలానెలా వేతనం ఇవ్వాలి నేను 2008 నుంచి హాస్టల్లో పనిచేస్తున్నా. గత 15నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి అధికవడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. ఇకనుంచైనా నెలనెలా జీతాలు ఇవ్వాలి - చిట్టూరి జమలమ్మ, నూజివీడు బంగారం కుదువపెట్టా నెలానెలా జీతాలు రాక కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వేతనాలు రాకుండా ఇన్ని నెలలు జీవనం సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నాం. ఇంటి అద్దె చెల్లించడానికి బంగారం కుదవపెట్టా. - జుజ్జునూరి రామయ్య, నూజివీడు అప్పులు చేస్తున్నాం దసరా, దీపావళి పండుగలను అప్పులు చేసి జరుపుకోవాల్సి వస్తోంది. 2009నుంచి పనిచేస్తున్నా. నెలకు మాకు ఎంత జీతం ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. జీతాలు వెంటనే విడుదల చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. - చోడవరపు రాణి, నూజివీడు -
కలుషితాహారంతో అస్వస్థత
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట నాసిరకపు భోజనం తిని విద్యార్థినీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితాహారం తిని మార్కాపురంలోని ఎస్టీ బాలికల హాస్టల్లో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినుల కథనం మేరకు..హాస్టల్లో ఆదివారం రాత్రి అన్నం తిన్న తరువాత 8వ తరగతి విద్యార్థిని మేఘావత్ మహేశ్వరిబాయి(కాటంరాజు తండా), 5వ తరగతి చదువుతున్న పీ విజయలక్ష్మి, ఆర్.నాగమణి, పుష్పలత (దొనకొండ మండలం బూనపల్లి), నాలుగో తరగతి చదువుతున్న ఎం.శివాని (వైపాలెం మండలం వాదంపల్లి), చరితకు స్వల్పంగా కడుపునొప్పి వచ్చింది. అయినా అలాగే సోమవారం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నానికి కడుపునొప్పికి తోడు వాంతులు కావడంతో హాస్టల్ వార్డెన్ ఎం.సుబ్బలక్ష్మి రాత్రి పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. మంగళవారం ఉదయానికి కానీ విషయం బయటకు తెలియలేదు. సాయంత్రం మరో ఐదుగురు విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురయ్యారు. 6వ తరగతి చదువుతున్న నాగలక్ష్మీబాయి, 7వ తరగతి చదువుతున్న వీ.నాగలక్ష్మీబాయి (మల్లాపాలెం), 4వ తరగతి చదువుతున్న డి.నాగలక్ష్మీబాయి, డి.ప్రియాంకబాయి (పీఆర్సీ తండా), పదో తరగతి చదువుతున్న సీహెచ్ సావిత్రి (పుచ్చకాయలపల్లి) తలనొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో మార్కాపురం ఏరియా వైద్యశాలలో చేర్చారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్డీవో పీ కొండయ్య, డిప్యూటీ డీఈవో కాశీశ్వరరావులు వైద్యశాలకు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినుల పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. తహశీల్దార్ నాగభూషణం, ఆర్ఐ ఖలీల్, ఎంఈవో సీహెచ్పీ వెంకటరెడ్డిలు ఘటనపై విచారణ చేపట్టారు. మీ పిల్లలను ఇలాగే చూస్తారా: వార్డెన్పై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యశాల నుంచి ఎస్టీ బాలికల హాస్టల్కు వెళ్లిన ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి వార్డెన్ లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్కు వెళ్లగా అక్కడ కుళ్లిపోయిన టమోటాలు, బూజుపట్టిన ఉల్లిగడ్డలు, మగ్గిపోయిన వంకాయలను చూసి ఇలాంటి వాటితో వండి అన్నంలో పెడితే విద్యార్థినుల ఆరోగ్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో ‘మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా, మీ పిల్లలను ఇలాగే చూస్తారా’ అంటూ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు హాస్టల్కు చిన్నారులను పంపుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రాణాపాయం లేదు: చికిత్స అందిస్తున్న వైద్యులు విలేకరులతో మాట్లాడుతూ సోమవారం రాత్రి వార్డెన్ విద్యార్థినులను హడావుడిగా వైద్యశాలకు తీసుకుని రాగా, అవసరాన్ని బట్టి ఒక విద్యార్థినికి 8 నుంచి 12 సెలైన్ బాటిల్స్ పెట్టినట్లు తెలిపారు. కలుషితాహారం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతున్నామని చెప్పిన వెంటనే ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించానన్నారు. ఎమ్మెల్యే వెంట మండల యూత్ అధ్యక్షుడు మందటి మహేశ్వరరెడ్డి, సొసైటీ డెరైక్టర్ నల్లబోతుల కొండయ్య ఉన్నారు. మార్కాపురం ఏటీడబ్ల్యూఓ ఎస్.దస్తగిరి విద్యార్థినులను పరామర్శించారు. -
చదివేదెలా?
మార్కాపురం: సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తున్నా..నేటికీ వారికి అవసరమైన నోట్పుస్తకాలు, యూనిఫాంలు, ట్రంకుపెట్టెలు పంపిణీ చేయలేదు. జిల్లాలోని మార్కాపురం, కందుకూరు, ఒంగోలు డివిజన్లలో 77 బీసీ హాస్టళ్లు, 117 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. మొత్తం మీద 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, బీసీ హాస్టల్ విద్యార్థులందరికీ ఇంత వరకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయలేదు. దీంతో బయట పుస్తకాలు కొనుగోలు చేసి విద్యార్థులు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు కూడా ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ నోట్ పుస్తకాలను జిల్లాకు పంపలేదు. మూడు నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు మూడు పెద్ద నోట్ పుస్తకాలు, మూడు చిన్న నోట్ పుస్తకాలు, 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 12 నోట్ పుస్తకాలు అందిస్తారు. ఈ ఏడాది పాఠ్య పుస్తకాల సిలబస్ మారడంతో నోట్సు రాసుకోవడం విద్యార్థులకు తప్పనిసరైంది. సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు ఉపాధ్యాయులు ప్రతి పాఠ్యాంశానికి నోట్సు ఇస్తుంటారు. ప్రభుత్వం నుంచి నోట్ పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులకు యూనిఫాంలు, ఇంటి నుంచి తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకునే ట్రంకుపెట్టెలు సైతం హాస్టల్ విద్యార్థులకు అందించలేదు. వారం రోజుల్లో రావచ్చు బి.నరసింహారావు,బీసీ సహాయ సంక్షేమ అధికారి, మార్కాపురం రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంత వరకు జిల్లాలోని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన నోట్ పుస్తకాలు, యూనిఫాం రాలేదు. వారం రోజుల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన సామగ్రి వచ్చే అవకాశం ఉంది. రాగానే పంపిణీ చేస్తాం. -
ఒక్క రూపాయిస్తే ఒట్టు!
వారంతా వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు... ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకొంటున్నారు. హాస్టల్లో ఉంటే కాస్త మంచి దుస్తులు, భోజనం లభిస్తుంది, చక్కగా చదువుకోవచ్చని భావించిన విద్యార్థులకు ఇక్కడ కూడా అవస్థలు తప్పడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కట్లకు గురవుతున్నారు. హాస్టళ్ల నిర్వహణకు ఇంతవరకూ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో వసతి గృహాల అధికారులు బయట అప్పులు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ‘మాది బీసీల పార్టీ. అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటాం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే మా ధ్యేయం’ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పాటు చేశాక గాలి కొదిలేశా రు. అందుకు బీసీ హాస్టళ్లే ఉదాహరణ. వసతి గృహాలు తెరిచి నెలరోజులుకావస్తున్నా ఇంతవరకూ ఒక్క రూపాయి బడ్జెట్ కూడా విడుదల చేయలేదు. విద్యార్థులకు కావాల్సిన యూనిఫారాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయలేదు. పాఠశాలలు తెరిచే నాటికే నిధులతో పాటు విద్యార్థులకు అవసరమైనవన్నీ సిద్ధం చేయాలి. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు హాస్టల్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 12న బీసీ హాస్టళ్లు తెరిచారు. కానీ, ఇంతవరకు యూనిఫారాలు ఇవ్వలేదు. గతంలో మాదిరిగా ఒక్కొక్క విద్యార్థికి నాలుగు జతలు కాకుండా మూడు జతలే ఇస్తామని, వాటితో పాటు ఒక ట్రాక్ షూ ఇవ్వనున్నట్టు ప్రకటిస్తూ అందుకనుగుణంగా ప్రతిపాదనలు పంపాలని జిల్లాల వారీగా అధికారులను సర్కార్ కోరింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్న లక్షా 12వేల మంది విద్యార్థులకు వేర్వేరు రకాలు కలిపి 7లక్షల 97వేల 120మీటర్ల క్లాత్ అవసరం ఉంటుందని అధికారులు నివేదించారు. జిల్లాలో విద్యార్థులకు 46,487.9 మీటర్లు కావాలి. కానీ ఇంతవరకు యూనీఫారాల గురించి పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఎప్పుడిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో గత ఏడాది వాడిన యూనిఫారాలనే విద్యార్థులు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాటిలో చాలావరకు చిరిగిపోయినా తప్పని పరిస్థితుల్లో వేసుకుంటున్నారు. అసలు ధరించడానికే అవకాశం లేకపోతే సాధారణ దుస్తులు(సివిల్ డ్రెస్) ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిఫారాల కోసం రాష్ట్రంలో సుమారు లక్షా 12 వేల మంది విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఇంకో విశేషమేమిటంటే గత ఏడాది విద్యార్థుల దుస్తులు కుట్టిన దర్జీలకు నేటికీ చెల్లింపులు చేయలేదు. దీంతో భవిష్యత్లో విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు సిద్ధంగా లేమని దర్జీలు తెగేసి చెప్పేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం క్లాత్ పంపించినా మూలన పడి ఉండడం తప్ప అధికారులు చేసేదేమీ లేదు. నోటు పుస్తకాల పరిస్థితీ అంతే... ఇంతవరకు ఒక్క హాస్టల్ విద్యార్థికి కూడా నోటు పుస్తకాలు అందజేయలేదు. దీంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలో వసతిగృహాల్లో ఉండి చదువుకుంటున్న 5,715 మంది విద్యార్థులకు 63,839నోటు పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికి ఒక్క పుస్తకం కూడా విద్యార్థికి చేరలేదు. రాష్ట్రంలోని మిగతా 12 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హాస్టళ్ల నిర్వహణకు కూడా ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదు. తెరిచి నెలరోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా మంజూరుచేయలేదు. దీంతో వసతి గృహాల అధికారులంతా అప్పులు చేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. సివిల్ సప్లయిస్ ద్వారా అందిస్తున్న పీడీఎస్ బియ్యం విడిపించుకోవడానికి ప్రభుత్వం నిధులివ్వలేదు. ఈ క్రమంలో విద్యార్థులకు అందించే భోజనం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏడాదీ హాస్టల్ తెరిచే ముందు భవనాలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. అవసరమైతే సున్నాలు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది నిధులు విడుదల చేయకపోవడంతో వసతి గృహ అధికారులు వాటి జోలికే వెళ్లలేదు. దీంతో మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఒంగోలు టౌన్ : పీడీఎస్యూ జిల్లాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యాసంస్థల బంద్ గురించి రెండురోజుల ముందుగానే నేతలు ప్రకటించడంతో ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించాయి. పీడీఎస్యూ నాయకులు మూడు బృందాలుగా ఏర్పడి నగరంలో కొన్నిచోట్ల తెరిచిన విద్యాసంస్థలను మూసివేయించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులవుతున్నప్పటికీ పాఠశాల స్థాయిలో సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. ప్రతి ఏటా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఒకవైపు పాఠ్యపుస్తకాల కొరత, ఇంకోవైపు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారాయాన్నారు. ఎక్కువ శాతం వసతి గృహాల్లో అక్కడే ఉండి విద్యాభ్యాసం చేసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. మంచినీరు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైందని విమర్శించారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఫీజుల రూపంలో దోపిడీకి గురిచేస్తున్నాయన్నారు. కనీస వసతులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు లేకపోయినా ఆర్భాటాలు చేస్తున్నాయని విమర్శించారు. జీవో నంబర్ 42 ప్రకారం జిల్లాస్థాయి ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులనే వసూలు చేయాల్సి ఉండగా, ఇష్టం వచ్చినట్లు ఫీజులు గుంజుతున్నారని పేర్కొన్నారు. గుర్తింపులేని పాఠశాలలను రద్దు చేయకపోగా నోటీసులు, జరిమానాలు విధిస్తూ కాలయాపన చేస్తున్నారని మల్లికార్జున్ విమర్శించారు. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వెంటనే యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ధర్నాలో అరుణోదయ కళాకారుడు అంజయ్య ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జే రమేష్, నాయకులు ఏ రాజు, సీహెచ్ శ్యాంసన్, ఇమ్మానియేల్, అంజి, హనుమంతు పాల్గొన్నారు. -
నోట్ బుక్కులేవీ!
ఇందూరు : ముందుచూపు లేని అధికారులు.. పట్టింపులేని ప్రభుత్వం.. వెరసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు శాపంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల కావస్తున్నా, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రి, వస్తువులు జిల్లాకు ఇంకా పూర్తిస్థాయిలో సరఫరా కాలేదు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నోటుబుక్కులు సరఫరా కాక పోవడంతో పాఠ్యాంశాల నమోదుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నోట్బుక్కుల సరఫరా విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏటా సంక్షే మ శాఖ అధికారులు ప్రస్తుతం ఉంటున్న విద్యార్థుల తో కలిపి కొత్తగా ప్రవేశం పొందే విద్యార్థుల సంఖ్య ను అంచనా వేసి రాష్ర్ట ఉన్నతాధికారులకు నివేదిక పంపుతారు. ఈ నివే దికను వసతిగృహాలు ప్రారంభం కాక ముందు పంపుతారు. కాని ఈ ఏడాది ముందస్తుగా నివే దికను పంపక పోవడంతో అసలుకే ఎసరు వచ్చిపడింది. పాత, కొత్త విద్యార్థుల సంఖ్యను ఆల స్యంగా పైస్థాయి అధికారులకు పంపడం, ఇటు ప్ర భుత్వం ఆలస్యంగా బైండింగ్ చేయడంతో జిల్లాకు కావాల్సిన నోట్బుక్కులు ఇంత వరకు రాలేదు. దీంతో పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు తమ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను నోట్బుక్లు లేక నోట్ చేసుకోవడం లేదు. జిల్లాలో... జిల్లాలో ఎస్సీ 67 వసతిగృహాలు, ఎస్టీ 13 వసతిగృహాలు, బీసీ 60 వసతిగృహాలు ఉన్నాయి. అందులో ఐదు నుంచి పదో తరగతి, ఇంటర్ వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఎస్సీ వసతి గృహాల్లో పాత విద్యార్థులు 4,200 మంది, ఎస్టీ వసతిగృహాల్లో 1,531, బీసీ వసతి గృహాల్లో 3,000 వేల మంది మొత్తం కలిపి 8,731 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రసుత్తం కొత్త విద్యార్థులను చేర్పించడానికి వార్డెన్లు, మహిళా సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత, కొత్త విద్యార్థులకు ఒకేసారి నోట్బుక్కులు అందజేయాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి 18, ఎనిమిది తరగతి వారికి ఒక్కొక్కరికి 16, మిగతా తరగతుల వారికి కేటాయించిన విధంగా నోట్బుక్కులను ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుతానికి సగం నోట్బుక్కులను మాత్రమే పంపిణీ చేసిన ప్రభుత్వం, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యార్థులకు ఇంత వరకు పంపలేదు. పంచేదెలా..? ఎస్సీ సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల కోసం ప్రభుత్వం సగం నోట్బుక్కులను జిల్లాకు పంపింది. ఇవి పాత విద్యార్థుల్లో సగం మందికే సరిపోతాయి. మిగతా వారితో పాటు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడి నుంచి అందించాలోనని సంక్షేమ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి ఇచ్చి, మరికొందరికి ఇవ్వకుంటే బాగుండదని సమాలోచనలు చేస్తున్నారు. తమ హాస్టల్ విద్యార్థుల కే ముందుగా ఇవ్వాలంటూ వార్డెన్లు నోట్బుక్కుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో వచ్చిన కాస్త నోట్బుక్కులను ఎవరికీ పంచకుండా అధికారులు అలాగే పెట్టేశారు. మొత్తం నోట్బుక్కులు వచ్చిన తర్వాతనే అందరికి పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కొత్త నోట్బుక్కులు రాక కొందరు విద్యార్థులు పాత నోట్బుక్కులపైనే పాఠ్యాంశాలు రాయడం, మరి కొందరేమో కొత్తవి డబ్బులకు కొనుక్కుని రాయడం లాంటివి చేస్తున్నారు. నోట్బుక్కులు రావాలంటే మరో వారం పది రోజులు పట్టవచ్చని సంక్షేమ అధికారులు పేర్కొంటున్నారు. అప్పటి వరకు విద్యార్థులకు ఈ బాధ తప్పేలా లేదు. జాడలేని యూనిఫాం క్లాత్... నోట్బుక్కుల విషయం ఇలా ఉంటే, విద్యార్థులకు ఏడాదికి అందించాల్సిన రెండు జతల యూనిఫాంలకు అవసరమైన క్లాత్(బట్ట) ఇంత వరకు జిల్లాకు రాలేదు. దీంతో వసతి గృహ విద్యార్థులు యూనిఫాంలు లేక రంగుల బట్టలు వేసుకుంటున్నారు. మరికొందరు పాత యూనిఫామ్స్ వేసుకుని బడికి వెలుతున్నారు. జిల్లాలో అన్ని వసతిగృహాలు కలిపి మొత్తం 12 వేల మంది విద్యార్థులు యూనిఫాంలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం క్లాత్ పంపించి, పిల్లల కొలతలు తీసుకుని కుట్టించే సరికి మరో నెలన్నర రోజులు పట్టేలా ఉంది. అంత వరకు విద్యార్థులు రంగులు దుస్తులు, పాత చిరిగిపోయిన యూనిఫామ్స్ వేసుకోవడం తప్పేలా లేదు. ట్రంకు పెట్టెలు పాతవే... ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు డొక్కు ట్రంకు పెట్టెలతోనే నెట్టుకొస్తున్నారు. హాస్టళ్ల విద్యార్థులకు ఐదేళ్ల క్రితం ట్రంకు పెట్టెలను సరఫరా చేశారు. అవి పూర్తిగా పాడైపోయాయని, వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి నిధులివ్వాలని ఆయా శాఖల సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదు. ఇక కొత్తగా ప్రవేశాలు పొందిన వారికి ట్రంకు పెట్టెలు ఇంత వరకు ఇవ్వలేదు. -
మెనూ చూడ కడుపు నిండు.. భోజనం చూడ గుండె మండు!
కర్నూలు(అర్బన్): సంక్షేమ వసతి గృహాల్లో నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో సంక్షేమాధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. మెనూ చార్టులో భోజనం వివరాలు పరిశీలిస్తే కడుపు నిండిపోతుంది. వాస్తవంలోకి వెళితే మెనూ ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో వారంలో ఆరు రోజులు(సెలవు రోజులు మినహా) ఆయా పాఠశాలల్లోనే హాస్టల్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇక మిగిలింది ఆదివారం మాత్రమే. ఆ రోజు మూడు పూటలా మెనూ అమలు చేయాల్సి ఉండగా.. పెట్టింది తినాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మెనూ ప్రకారం ఉదయం పాలు, పంచదారతో కలిపిన రాగి జావ, టిఫెన్కు ఇడ్లీ, పల్లీల చెట్నీ, మధ్యాహ్నం గుడ్డుతో బిరియానీ, కుర్మా, పెరుగుపచ్చడి.. సాయంత్రం ఉడికించిన శనగలు.. రాత్రి అన్నం, కూర, రసం వడ్డించాల్సి ఉంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పెద్దపాడు బీసీ బాలుర వసతిగృహాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆదివారం ఉదయం ఉగ్గాని.. మధ్యాహ్నం తెల్లన్నం, ఉడికించిన గుడ్డు, రసంతో సరిపెట్టారు. 250 మంది విద్యార్థులున్న ఈ వసతిగృహంలో సగానికి పైగా విద్యార్థులకు గ్లాసులు కూడా లేకపోవడం గమనార్హం. తిన్న ప్లేట్ను శుభ్రం చేసుకున్న తర్వాత అందులోనే నీళ్లు పట్టుకుని తాగాల్సిన దుస్థితి. అదేవిధంగా ఏడు గదుల్లోనే వీరంతా సర్దుకుపోవాల్సి వస్తోంది. ఒక్కో గదిలో 30 మందికి పైగా విద్యార్థులు ఉండాల్సి రావడం ఇక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. జిల్లాలోని సగానికి పైగా వసతిగృహాల్లోనూ ఇదే పరిస్థితి. ఉడికీ ఉడకని.. లావు బియ్యంతో చేసిన ఆహారం తినలేక అధిక శాతం విద్యార్థులు చెత్తకుండీల్లో పారబోస్తున్నారు. నీళ్ల చారు తినలేక వెక్కిళ్లతో నీటి కోసం విద్యార్థులు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఉన్నతాధికారులెవరూ పర్యవేక్షించరనే భావన సంక్షేమ హాస్టళ్లలో ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. అధిక శాతం హాస్టళ్లకు ప్రహరీ గోడలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో పశువులు, కుక్కలు, పందులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ఈ కారణంగా వ్యాధులు ప్రబలుతుండటం తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. అదేవిధంగా చాలీచీలని గదులు.. తాగునీటి ఇక్కట్లు.. మరుగుదొడ్ల కొరతతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. కొరవడిన పర్యవేక్షణ సంక్షేమ వసతి గృహాలను పర్యవేక్షించాల్సిన సహాయ సంక్షేమాధికారులు ఆయా వసతి గృహాలకు చుట్టపుచూపుగా మాత్రమే వెళ్తున్నారు. వీరంతా కేవలం తమ కార్యాలయాలకే పరిమితం అవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి సహాయ సంక్షేమాధికారుల పోస్టులు దాదాపు ఐదు ఖాళీగా ఉంటే.. వీటికి గ్రేడ్-1 వసతి గృహ సంక్షేమాధికారులు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా 21 హెచ్డబ్ల్యుఓ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మిగిలిన వాచ్మెన్, కమాటీ పోస్టులు దాదాపు 40 వరకు ఖాళీగా ఉన్నా భర్తీకి చర్య చూపని పరిస్థితి నెలకొంది. నాల్గో తరగతి సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న వసతి గృహాల్లో ఆయా పనులన్నీ విద్యార్థులే చేయాల్సి వస్తుండటం గమనార్హం. -
పిల్లల కూడు తినేస్తున్నారు
చింతలపూడి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో అక్రమాలు నెలకు రూ.50 వేలకు పైనే కైంకర్యం హాస్టళ్లలో వేళ్లూనుకున్న అవినీతికి ఇదో మచ్చుతునక ఏసీబీ తనిఖీలో బట్టబయలు స్టాక్ , అటెండెన్స్ రిజిస్టర్లు స్వాధీనం చింతలపూడి, న్యూస్లైన్ : పేద విద్యార్థుల పేరుచెప్పి జేబులు నింపుకోవడం సంక్షేమ హాస్టళ్ల అధికారులకు మామూలైపోరుుంది. పిల్లల సంఖ్యను ఎక్కువగా చూపిస్తూ ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తున్నారు. చింతలపూడిలోని బాలి కల సమగ్ర సంక్షేమ వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్)లో ఇలాంటి బాగోతమే సోమవారం వెలుగుచూసింది. 67 మంది పిల్లల్ని అదనంగా చూపించి నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారుల బండారం అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఒక్కో విద్యార్థి పేరిట రూ.27 చొప్పున రోజుకు రూ.1,800, నెలకు రూ.50 వేలకు పైగా నిధులను స్వాహా చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. స్టాక్ రిజిస్టర్లు, హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్లను సీజ్ చేశారు. జిల్లాలోని ఇతర సాధారణ హాస్టళ్లలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనడానికి ఇదే ఓ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే...చింతలపూడి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల సమగ్ర వసతి గృహంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐలు యూజే విల్సన్, టి.కొమరయ్య, ఉదయం 6 గంటలకే హాస్టల్కు చేరుకున్నారు. బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలి కల సంఖ్యపై ఆరా తీశారు. ఏఎస్డబ్ల్యువో జీవీ సత్యనారాయణ సమక్షంలో వసతి గృహం సంక్షేమాధికారి మంగారత్నం నుంచి వివరాలు సేకరించారు. 67 మందిని అదనంగా చూపించారు తనిఖీల అనంతరం ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వసతి గృహంలో 400 మంది బాలికలకు వసతి కల్పించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హాజరు పట్టీ ప్రకారం 3 నుంచి 10వ తరగతి వరకు చదివే 365 మంది బాలికలు హాస్టల్లో ఉంటున్నట్టు నమోదు చేశారని చెప్పారు. అరుుతే, 298 మాత్ర మే వసతి గృహంలో ఉంటున్నట్టు తనిఖీల్లో తేలిందన్నారు. ఈ హాస్టల్ పిల్లలు చదువుతున్న జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ హాజరు పట్టీని పరిశీలించగా, సుమారు 67 మంది బాలికలను హాస్టల్ రికార్డుల్లో అదనంగా చూపించినట్టు తేలిందని తెలిపారు. హాస్టల్ రికార్డుల ప్రకారం 365 మంది విద్యార్థినులు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్నట్టు ఉందని, వారందరి పేర్లు స్కూల్ హాజరుపట్టీలో నమోదైనా 67 మంది విద్యార్థులు ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు. స్కూల్ హాజరు పట్టీలో వారందరికీ గైర్హాజరు పడుతుండగా, హాస్టల్ రికార్డుల్లో మాత్రం హాజరు నమోదవుతోందని వివరించారు. స్టాక్ రిజిస్టర్లలో కూడా తేడాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ హాస్టల్లో ఏడాది మొత్తంమీద జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని చెప్పారు. స్టాక్ రిజిస్టర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్, హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. -
సం‘క్షామం’
కొత్తగూడెం, న్యూస్లైన్: నిరుపేద విద్యార్థుల కోసం నెలకొల్పిన సాంఘిక సంక్షేమ వసతిగృహాలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. పురుగుల అన్నం, నీళ్లచారు, అందీ అందని గుడ్లు, స్నాక్స్...తదితర విపత్కర పరిస్థితుల్లో నుంచి జిల్లాలోని హాస్టల్స్ ఇప్పటికీ బయటపడలేకపోతున్నాయి. జిల్లాలో మొత్తం 171 హాస్టల్స్ ఉన్నాయి. వీటిలో 79 ఎస్సీ, 45 ఎస్టీ, 47 బీసీ వసతి గృహాలు. వీటిలో మొత్తం 19,410 మంది విద్యార్థులు ఉంటున్నారు. ప్రభుత్వం 3 నుంచి 7 తరగతుల విద్యార్థులకు రూ.7.50, 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు రూ.8.50 చొప్పున ప్రతి రోజు మెస్చార్జి కింద చెల్లిస్తోంది. ఈ కొద్దిపాటి చార్జీలతో నాణ్యమైన ఆహారం అందే పరిస్థితి లేదు. మెనూ ప్రకారం ఉదయం కిచిడీ, ఉప్మా, పులిహోర, ఆదివారం ఇడ్లీ పెట్టాలి. ఎక్కువ హాస్టల్స్లో కేవలం కిచిడీ, పులిహోరనే అందిస్తున్నారు. మధ్యాహ్నం నీళ్ల చారు, ముద్ద అన్నంతోనే కడుపునింపుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వారంలో ఆరు రోజులు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, మెస్చార్జీలు సరిపడక కేవలం రెండు నుంచి మూడు రోజుల పాటు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. పౌష్టికాహారంలో భాగంగా సాయంత్రం స్నాక్స్ ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. నిధుల లేమి కారణంగా ఎక్కడా ఇది అమలు కావట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు పెంచకపోవడం వల్ల మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించలేకపోతున్నామని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అంటున్నారు. ఇకపోతే ఇప్పటికీ పాత భవనాల్లో...వసతుల లేమి మధ్యే పలు హాస్టల్స్ను నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో ఆరు ఎస్సీ హాస్టల్స్ ఉండగా వాటిలో మూడు బాలికల హాస్టల్స్. వీటిలో 300 మంది బాలికలు, 380 మంది బాలురు ఉంటున్నారు. ఎస్టీ బాలుర హాస్టల్లో 147 మంది విద్యార్థులున్నారు, బాలికల హాస్టల్స్ రెండు ఉన్నాయి. ఇందులో 812 మంది విద్యార్థులున్నారు. వీరికి ప్రభుత్వం మెనూ జారీ చేసినప్పటికీ ఆ మెనూను సంక్షేమాధికారులు సరిగ్గా పాటించడం లేదు. విద్యార్థులకు ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు వడ్డిస్తున్నారు. సాయంత్రం ఇచ్చే అల్పాహారం సరిగ్గా ఇవ్వడం లేదు. రాత్రి భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో పడుకుంటున్నారు. ప్రతిరోజూ విద్యార్థులకు గుడ్డు తప్పనిసరిగా పెట్టాల్సి ఉండగా తోచినపుడే వడ్డిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 12 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న మెస్చార్జీలు సరిపోకపోవడంతో మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. వారానికి ఆరు రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే ఇస్తున్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ కూడా ఇవ్వడం లేదు. బొబ్బర్లు, ఉలవలు, గుగ్గిళ్లు అందించలేని పరిస్థితులు ఉన్నాయని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం నాణ్యత లేకపోవడం అన్నం మొత్తం ముద్దగా తయారై తినలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైరా నియోజకవర్గంలో ఆరు ఎస్సీ హాస్టళ్లు, నాలుగు కస్తూర్బాగాంధీ బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వైరాలోని బీసీ బాలుర వసతి గృహాన్ని అద్దెభవనంలో నిర్వహిస్తున్నారు. ఈ హాస్టళ్లలో ఎక్కడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతి రోజు ఉదయం కిచిడీ, ఉప్మా మాత్రమే పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. కూరగాయల రేట్లు పెరగడంతో ప్రతి రోజూ సాంబారుతోనే సరిపెడుతున్నారు. జూలూరుపాడు ఎస్సీ హాస్టల్కు వార్డెన్ లేడు. కొత్తగూడెంకు చెందిన ఇన్చార్జి అప్పుడప్పుడు వచ్చి పోతుండటంతో కుక్ , వాచ్మన్లే దిక్కు. వారానికి ఆరుసార్లు ఇవ్వాల్సిన కోడిగుడ్డు రెండు రోజులు మాత్రమే పెడుతున్నారు. కారేపల్లి బీసీ హాస్టల్లో నీళ్లచారుతో తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. అరటి పండు, సాయంత్రం ఇవ్వాల్సిన స్నాక్స్ ఇవ్వడం లేదు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో ఉంటూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉదయం టిఫిన్ను మధ్యాహ్న భోజనంగా క్యారేజీలో పంపుతున్నారు. నియోజకవర్గంలో హాస్టల్లు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు మొత్తం 37 ఉండగా చాలా చోట్ల మెనూ సక్రమంగా అమలు కావడంలేదు. వారానికి ఒకసారి కూడా స్వీట్ ఇవ్వడంలే దు. అరటిపండు ఊసే చాలాచోట్ల లేదు. సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్, ఎస్సీ బాలుర , ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్, తల్లాడ బీసీ హాస్టళ్లకు ప్రహారీగోడలు లేవు. పశువులు, పందులు ఎంచక్కా తిరుగుతున్నాయి. సత్తుపల్లి ఎస్సీ బాలుర, ఎస్ఎంహెచ్ హాస్టళ్లకు నీటి సౌకర్యం లేకపోవటంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎస్ఎంహెచ్ హాస్టల్లో కిటికీ తలుపులు లేవు. ఫ్యాన్లు లేకపోవటంతో విద్యార్థులు దోమలతో ఇబ్బంది పడుతున్నారు. పెనుబల్లి ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరటంతో విద్యార్థులు పాఠశాల గదుల్లోనే నిద్రించాల్సి వస్తోంది. కల్లూరు బీసీ హాస్టల్కు సొంత భవనం లేకపోవటంతో అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. తల్లాడ బాలికల హాస్టల్ సైతం శిధిలావస్థకు చేరింది. ఈ హాస్టల్లో సరిపడా మరుగుదొడ్లు లేకపోవటంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. సత్తుపల్లి ఎస్టీ బాలుర హాస్టల్లో బాత్రూమ్లు లేకపోవటంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. ఎస్సీ, బీసీ బాలికల ఎస్ఎంహెచ్ హాస్టళ్లలో కిటికీలకు తలుపులు లేకపోవటంతో విద్యార్థినులు చలికి వణికిపోతున్నారు. ఇక్కడ 200 మంది విద్యార్థినులకు రెండు బాత్రూమ్లు మాత్రమే ఉండటం గమనార్హం. పినపాక నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టల్స్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతిగృహం భవనానికి మరమ్మతులు చేపట్టడం లేదు. కిటికీలు, తలుపులు సక్రమంగా లేక చలితో విద్యార్థులు వణికిపోతున్నారు. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కూడా సక్రమంగాలేవు. అశ్వాపురం మండలంలోని బీసీ సంక్షేమ హాస్టల్ను అద్దెభవనంలో అరకొర వసతులు మధ్య నిర్వహిస్తున్నారు. మణుగూరులోని ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్ధులకు కనీస సౌకర్యాలు లేవు. తలుపులు, కిటీకీలు దెబ్బతినడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మెనూ సక్రమంగా పాటించడంలేదు. పినపాక మండలం చిర్రుమల్ల ఆశ్రమ పాఠశాల, గుండాల మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గుండాల హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎస్సీ, బీసీ బాలురకు ఇంటిగ్రేటెడ్ వసతిగృహాన్ని నూతనంగా నిర్మించినా అందులో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ఈ భవనం గదుల్లో కొన్నింటి కిటికీలకు తలుపులు లేక విద్యార్థులు దోమలు, చలికి వణికిపోతున్నారు. వసతిగృహం చుట్టూ చెత్తాచెదారం ఉండటం, ప్రహరీగోడ నిర్మాణం పూర్తికాలేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు దుర్వాసన వస్తున్నాయి. విద్యార్థులకు అందించే స్నాక్స్ మెనూలో ఉన్న విధంగా ఇవ్వటంలేదు. బియ్యం నాణ్యంగా లేకపోవటం, అన్నం కూడా సరిగాలేక విద్యార్థులు కడుపునిండా తినలేని పరిస్థితి. రసం, ఉడికీ ఉడకని కూరలతో సరిపెట్టుకుంటున్నారు. మధిరలోని బీసీ బాలుర వసతిగృహంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టల్ ప్రాంగణంలో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్లలోని బేసిన్లు నిండి దుర్వాసన వస్తోంది. బాత్రూమ్ డోర్ విరిగిపోయింది. భవనం కిటికీలకు జాలీలు లేకపోవడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ముదిగొండలోని బీసీ బాలుర వసతిగృహం అద్దెభవనంలో అవస్థల మధ్య నడుస్తోంది. 40మంది విద్యార్థులు ఒకటే బాత్రూమ్ను వాడాల్సి వస్తోంది. బోనకల్ మండలం జానకీపురం, బోనకల్ గ్రామాల్లోని హాస్టళ్ల విద్యార్థులకు దుప్పట్లు సరిపడాలేక చలికి వణుకుతున్నారు. జానకీపురం హాస్టల్లో నీటి సరఫరా సక్రమంగాలేదు. భవనం కూడా శిథిలావస్థకు చేరింది. ఇల్లెందు పట్టణంలో ఎస్టీబాలికల హస్టళ్లు 2, ఎస్టీ బాలుర ఒకటి, ఎస్సీ బాలుర ఒకటి, బాలికల హాస్టళ్లు రెండు ఉన్నాయి. స్థానిక ఎస్టీ (బీ) హాస్టల్లో 194 మంది విద్యార్థులుం డగా నీటి సమస్య ఉంది. మంచి నీటి ట్యాంక్ఉన్నప్పటికీ బోర్కు మోటార్ ఏర్పాటుచేయకపోవడంతో నీళ్లు ఎక్కడం లేదు. ట్యాంక్ కూడా నిరుపయోగంగా మారింది. బీసీ హాస్టల్లో 95 మంది విద్యార్థుండగా..మరుగుదొడ్లు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఎస్సీ(బీ) బాలికల హాస్టల్లో 60 మంది ఉండగా..సరిపడా మరుగుదొడ్లు లేవు. ఎస్టీ బాలుర హాస్టల్లో 92 మం ది 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం, రేకుల వరండాల్లోనే ఉంటున్నారు. వర్షాకాలంలో భవనం కురుస్తోంది. అలాగే బయ్యారం, గార్ల, టేకులపల్లి మండలాల్లో కూడా సమస్యలు తిష్టవేశాయి. -
సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వణుకు
ఆదిలాబాద్, న్యూస్లైన్ : జిల్లాలోని 73 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 5,544 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత జూలైలో విద్యార్థులకు బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దుప్పట్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 బీసీ హాస్టళ్లలో 4,560 మంది చదువుకుంటున్నారు. ఇందులో 2,755 మందికి విద్యా సంవత్సరం ప్రారంభంలో బెడ్షీట్ల్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. 1,805 మంది విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో చలికి వణుకుతున్నారు. జిల్లాలోని 123 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. మొదట్లో 34,354 మందికి బెడ్షీట్లు, దుప్పట్లు పంపిణీ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 4,800 బెడ్షీట్ల కోసం ప్రతిపాదనలు పంపించగా 2,100 ఇటీవల రావడంతో పంపిణీ చేశామని, మరో 2,700 ఈ వారంలో వస్తాయని చెబుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో గత మార్చిలో హాస్టళ్లలో తలుపులు, కిటికీల మరమ్మతుల కోసం రూ.78 లక్షలు మంజూరు కాగా, 17 హాస్టళ్లలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరో రూ.30 లక్షలతో 11 హాస్టళ్లలో మరమ్మతుల పనులు మంజూరు కాగా, అవి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. బీసీ హాస్టళ్లకు సంబంధించి ఇటీవల రూ.58 లక్షలతో 34 హాస్టళ్లలో మరమ్మతులు నిర్వహించామని, మిగతా హాస్టళ్లలో సమస్యలు లేవని అధికారులు చెబుతుండగా ‘న్యూస్లైన్ విజిట్’లో అనేక బీసీ హాస్టళ్లలో కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. హాస్టళ్లలో విద్యార్థుల గజగజ ఆదిలాబాద్లోని కోలాం ఆశ్రమ పాఠశాలో కిటికీలకు తలుపు లేకపోవడంతో రాత్రి వేళ చల్లని గాలిని విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారు. గజగజ వణుకుతూనే నిద్రపోతున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న చిరిగిన బొంతలను కప్పుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. బేలలోని కస్తూర్భా పాఠశాలలో కిటికీలకు జాలీలు విరిగిపోవడంతో చల్లని గాలులు వీస్తున్నాయి. చెన్నూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జైపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో దుప్పట్లు పంపిణీ కాకపోవడంతో చలికి వణుకుతూనే పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారు. జైనూర్ మండలం మర్లవాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటే చల్లటి నీళ్లతో కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. సిర్పూర్ నియోజకవర్గం వసతి గృహాల్లోని విద్యార్థులకు దుప్పట్లు అందకపోవడంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. అయితే కొన్ని వసతిగృహాలకు అధికారులను దుప్పట్లు అప్పగించినప్పటికీ మరికొన్ని వసతిగృహాల్లో అందించలేదు. నిర్మల్ బీసీ వసతి గృహం, సారంగాపూర్ మండలం జామ్ ఎస్సీ వసతి గృహాల్లో గదులకు సరైన కిటికీలు, తలుపులు లేవు. నిర్మల్ బీసీ వసతి గృహంలో కిటికీలకు, గదులకు తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జామ్ ఎస్సీ వసతి గృహానికి సరైన కిటికీలు లేక విద్యార్థులు చలికి వేగలేకపోతున్నారు. దిలావర్పూర్ బీసీ వసతి గృహం కొత్తగా నిర్మించారు. అయితే స్నానపు గదుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. బెల్లంపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 20 మందికి, బెల్లంపల్లిలోని బీసీ సంక్షేమ బాలికల వసతి గృహం విద్యార్థులు 24 మందికి దుప్పట్లు పంపిణీ చేయలేదు.