వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ మంగళవారం సాయంత్రం భేటీ కానుంది.
హైదరాబాద్: వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై ఈ భేటీ లో చర్చించనున్నారు. అధేవిధంగా రాష్ట్రంలో తీవ్రవాదుల కదలికలపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. తీవ్రవాద, మావోయిస్టుల కార్యకలాపాల్లో చనిపోయిన పోలీసులకు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం పెంచనుంది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.