![Telangana CM kcr visits Jahangir Pir Dargah - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/10/KCR_0.jpg.webp?itok=6Rh4WaaQ)
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వచ్చి దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment