ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్ | telangana should raise with i.t. congress: ktr | Sakshi
Sakshi News home page

ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్

Published Fri, Jan 16 2015 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్

ఐటీ కాంగ్రెస్ తో తెలంగాణకు గుర్తింపు: కేటీఆర్

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.  ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మొదటిసారి దేశంలో జరుగుతోందని  తెలియజేశారు. ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో నిర్వహించే ఐటీ కాంగ్రెస్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యమిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement