
పాఠ్యపుస్తకాల్లో ‘పల్లె కన్నీరు పెడుతుందో..’
హైదరాబాద్: తెలంగాణ జానపద కళాకారుడు గోరటి వెంకన్న సాహిత్యానికి పాఠ్య పుస్తకాల్లో చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ముద్రించిన ‘మన చదువు-మన కోసం’ 5వ తరగతి లెవెల్-బీ పాఠ్యపుస్తకంలో ఆయన రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపిం చని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోయిందో కనిపించని కుట్రల’ అనే పాటను చేర్చారు. పూర్తి పాటను ఇందులో పాఠ్యాంశంగా ముద్రించారు.