యువరైతు ఆత్మహత్య | The young farmer committed suicide | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Published Fri, Feb 26 2016 12:03 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

The young farmer committed suicide

వ్యవసాయం కలిసి రాక చెల్లి పెళ్లి చేసే మార్గం తోచక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎలెగావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జాదవ్ ప్రదీప్ (25)కు ఓ సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి అనారోగ్యంతో ఉండటంతో సోదరులు వ్యవసాయం చూసుకుంటున్నారు.
అయితే, పంటలు సరిగా పండక పోవడంతో గతేడాది చెల్లిపెళ్లిని వాయిదా వేశారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉండటంతో చెల్లిపెళ్లి ఎలా చేయాలో వారికి పాలుపోలేదు. దీంతో మనస్తాపం చెందిన ప్రదీప్ గురువారం రాత్రి పొలం దగ్గర పురుగుల మందు సేవించగా ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం ఉదయం గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement