యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ఉన్న సన్సిటీ రియల్ ఎస్టేట్ వెంచర్ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు వ్యాపారులు, పెట్టుబడిదారులు సహకరించాలని కోరారు. ఆంధ్రా పెట్టుబడిదారులకు అన్నివిధాలుగా సహకరిస్తామని చెప్పారు.
పర్యాటక అభివృద్ధికి కృషి: కేసీఆర్
Published Mon, May 12 2014 1:11 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Related news by tags
-
ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నా..
సాక్షి, హైదరాబాద్: ‘అత్యంత చిన్న వయసులోనే జీహెచ్ఎంసీ కార్పొరేటర్గా ఎన్నికవ్వడం... ఆ తర్వాత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్రంగా కలిచివేసింది. ఆమె మరణం నేపథ్యంలో అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నందుకు చింతిస్తున్నాను’అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 2024–25 వార్షిక బడ్జెట్కు సంబంధించి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశంలో భాగంగా సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని స్పీకర్ జి.ప్రసాద్కుమార్ సూచించగా...సీఎం రేవంత్రెడ్డి లాస్య నందిత సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నుంచి ఐదుసార్లు గెలుపొందిన సాయన్న తనకు అత్యంత సన్నిహితుడన్నారు. అనారోగ్య కారణాలతో గతేడాది ఆయన మరణించగా... ఆయన వారసురాలిగా లాస్య కంటోన్మెంట్ నుంచి గెలుపొందారని, గత ఫిబ్రవరి 23న జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని చెప్పారు. సాయన్న, లాస్య నందిత ఇద్దరూ గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి, కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో కృషి చేశారన్నారు. లాస్య కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్ లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచిన మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మరణించడం పార్టీకి తీరని లోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జి.సాయన్న అజాతశత్రువన్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్, సాయన్న మంచి మిత్రులని, వారిద్దరూ కలిసి వచ్చి లాస్య నందితకు కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని కేసీఆర్ను కోరగా, వెంటనే ఆమెకు టికెట్ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో విజయపథంలో ముందుగా సాగిన లాస్య నందితను విధి వెంటాడిందన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశ అనంతరం ఒక ప్రమాదం ముంచుకొచి్చందని, అక్కడ్నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన ఆమె... కొన్నాళ్లకు ఇంట్లో లిఫ్ట్ ప్రమాదం బారిన పడ్డారని, రెండింటి నుంచి బయటపడినా, ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకోలేక పోయిందని చెప్పారు. » రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ లాస్య నందిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. » రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలియగానే సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో వెంటనే వారి ఇంటిని చేరుకున్నానని, అక్కడి పరిస్థితిని సమీక్షించి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. » బీజేపీ పక్షనేత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ లాస్య ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పారు»ఎమ్మెల్యేలు బలాల, కూనంనేని సాంబశివరావు, తలసాని శ్రీనివాస్యాదవ్, సునీతాలక్ష్మారెడ్డి, రాజ్ ఠాకూర్, ముఠా గోపాల్, శ్రీగణేశ్, పాయల్ శంకర్, కేపీ.వివేకానంద, రాజశేఖర్రెడ్డి తదితరులు లాస్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. » లాస్య మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget Told him that we will get the same thing that we got for last 10 yearsA Big Zero— KTR (@KTRBRS) July 23, 2024 మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. -
ఫిరాయింపులపై వారంలో సుప్రీంకు..!
సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై వారం రోజుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలను దేశవ్యాప్తంగా తెలియ చెబుతామని పేర్కొన్నా రు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సోమవారం సోదరి, ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలులో కలిసేందుకు వచ్చిన కేటీఆర్.. సుప్రీంకోర్టుకు చెందిన న్యాయనిపు ణులతో భేటీ అయ్యి, ఫిరా యింపులపై సుదీర్ఘంగా చర్చించారు. దానం నాగేందర్ వ్యవహారంపై తాము ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించామని, అక్కడ చాలారోజుల నుంచి జాప్యం జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. హరియాణా, హిమాచల్ప్రదేశ్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీని వీడి మరొక పార్టీలోకి చేరిన వారిపై పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఫిరాయింపులకు ఎందుకు పాల్పడుతోందని ప్రశ్నించారు. వాషింగ్ మెషీన్ పార్టీగా బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో వ్యవహరిస్తున్న తీరును ఏవిధంగా సంబోధించాలో చెప్పాలన్నారు. ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ నిపుణులకు అన్ని ఆధారాలను ఇచ్చామని, సుప్రీంకోర్టులో ఫైట్ చేయనున్నట్లు కేటీఆర్ వివరించారు.రాజ్యసభలో గళం విప్పుతాంతమ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని కాంగ్రెస్ చేర్చుకోవడంపై రాజ్యసభలో గళం విప్పుతామని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రతీ ఒక్కరిపై అనర్హత వేటు వేయాల్సిందేనని, ఆ దిశగా తాము న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాజ్యసభ, లోక్సభలో అనుభవజ్ఞులైన సభ్యులున్నారని వారితో ఫిరాయింపులపై ఓ కమిటీని వేయాలంటూ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అఖిలపక్ష సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. బరువు తగ్గిన కవిత సోదరి కవితను కలిశానని, అనారోగ్యం నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని కేటీఆర్ చెప్పారు. ఆమె దాదాపు 7–10 కిలోల బరువు తగ్గిందని, బలహీనంగా కనిపించడం వల్ల బాధ కలిగిందన్నారు. 130 రోజులుగా న్యాయం కోసం తన సోదరి జైల్లో పోరాడుతోందని చెప్పారు. కవిత కొద్దిరోజుల్లో కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. మరో వైపు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఈ నెల 26 వరకూ ట్రయల్ కోర్టు పొడిగించింది. నూతన నేర చట్టాలపై మీ వైఖరేంటి?రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్కు కేటీఆర్ ప్రశ్నపలు నిబంధనలు, సెక్షన్లు వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉన్నాయిపశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో వీటి అమలుపై వ్యతిరేకతనియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని డిమాండ్సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేర చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తమ వైఖరి వెల్లడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. నూతన న్యాయ చట్టాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో నియంతృత్వ సెక్షన్లపై రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి పంపాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ చట్టాల్లోని పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ చట్టాలు పోలీసులు, ప్రభుత్వానికి మితిమీరిన అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్నాయని, వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని హక్కుల సంఘాలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామికవాదులు, న్యాయ నిపుణులతోపాటు పలు రాష్ట్రాలు కూడా నూతన చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారని పేర్కొన్నారు.తొందరపాటు చట్టాలుదేశవ్యాప్తంగా విస్తృత స్థాయి సంప్రదింపులు జరపకుండానే కేంద్రం తొందరపాటుతో ఈ చట్టాలను తెచ్చిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసి ఆమోదించిన ఈ చట్టాలపై ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులతోపాటు పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరించేలా ఉన్న ఈ చట్టాలతో నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ప్రభుత్వచర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలపై కేసుల నమోదు అధికారం వచ్చిందన్నారు. సైబర్ నేరాలు, హ్యాకింగ్, ఆర్థిక నేరాలు, గోప్యత, సాంకేతికత ద్వారా విధ్వంసం వంటి వాటి కోసం రూపొందించిన ప్రత్యేక అధ్యాయంలో అనేక అస్పష్టతలున్నాయని పేర్కొన్నారు. ఏడు నెలలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను, యువకులను, నిరుద్యోగులను, సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అణిచివేసేందుకు సర్కారు పోలీసులను విస్తృతంగా వినియోగిస్తోందన్నారు. నూతన చట్టాల నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత దుర్మార్గమైన వాతావరణానికి దారితీస్తాయని చెప్పారు. -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ప్రజా ఉద్యమాలకు దశాబ్దాలుగా కేరాఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ గడ్డపైన నిరంకుశ నియంతృత్వ నూతన క్రిమినల్ చట్టాలను ఇక్కడ యధాతధంగా అమలు చేయడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమా అని ప్రశ్నించారు. లేక తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాదిరిగా సవరణలు తీసుకొస్తారా అనే విషయాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు.నూతన చట్టాల్లో ఉన్న నియంతృత్వ పూరిత సెక్షన్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే లేఖ రాయాలని కోరారు. దీంతోపాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రం తరఫున ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా పరిగణిస్తారని గుర్తుంచుకోవాలని హె చ్చరించారు. -
కవితకు అస్వస్థత.. నేడు తీహార్ జైలుకు కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నేడు తీహార్ జైలులో ఉన్న తన సోదరి కవితతో కేటీఆర్ ములాఖత్ కానున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.కాగా, కేటీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కవితను కలువనున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కవిత ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు.. కొద్దిరోజుల క్రితమే కవితకు ఎయిమ్స్ వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Related News by category
-
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.
Advertisement