
ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 రాత్రి 12 గంటల వరకూ ఈ పార్ట్ - 2 అప్లికేషన్ను ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి
సాక్షి, హైదరాబాద్ : కాసిస్టేబుల్, ఎస్సై ప్రాథమిక రాత పరీక్షలో పాస్ అయిన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ టెస్ట్లు(ఈవెంట్స్) నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లోని పలు పోస్టులకు గాను ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబర్ 17 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
ఇందుకు గాను అభ్యర్థులు అప్లికేషన్ పార్ట్ - 2 ను ఫిల్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నెల 29(సోమవారం) ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 రాత్రి 12 గంటల వరకూ ఈ పార్ట్ - 2 అప్లికేషన్ను ఫిలప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇందుకు గాను అభ్యర్థులు www.tslprb.in సైట్కు లాగిన్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిందిగా తెలిపింది. పూర్తి వివరాల కోసం పోలీస్ రిక్యుర్మెంట్ బోర్డ్ వెబెసైట్ ను సంప్రదించాల్సిందిగా సూచించింది.