చెట్టును ఢీకొన్న కారు : ఇద్దరు మృతి | Two die and Five injured in Road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు : ఇద్దరు మృతి

Published Fri, Jul 17 2015 4:02 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Two die and Five injured in Road accident

కాటారం : కరీంనగర్ జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

వీరంతా కర్నూలు జిల్లాకు చెందిన వారు. గోదావరి పుష్కరాల కోసం కాళేశ్వరం వెళుతుండగా ప్రమాదం బారినపడ్డారు. క్షతగాత్రులను మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement