- జూలై 1 నుంచి అమలు
- ఈ సంవత్సరంలోనే రూ.4 పెంపు
విజయ పాల ధర పెరిగింది
Published Thu, Jun 29 2017 8:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
లాలాపేట: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను టోండ్ మిల్క్పై లీటరుకు రూ 1 , హోల్ మిల్క్పై రూ 3 పెంచుతున్నట్లు విజయ డెయిరి అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిజేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న లీటరు టోండ్ మిల్క్ రూ 41కి అందిస్తున్న పాలు జూలై 1వ తేదీ నుంచి రూ 42 కి విక్రయించనున్నారు. ధర పెంపుకు వినియోగదారులు సహకరించాలనీ అధికారులు కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పెరిగిన పాల దరలు ఇలా....
టైప్ ఆఫ్ మిల్క్ ఫ్యాకేజ్ సైజ్ ప్రస్తుత ధర పెరిగిన ధర
1.హోల్ మిల్క్ 500 ఎం.ల్ రూ. 26.50 రూ .28.00
2.స్టాండడ్జైడ్ మిల్క్ 500 ఎం.ల్ రూ .22.50 రూ .23.00
3.టోండ్ మిల్క్ 1000 ఎం.ల్ రూ. 41.00 రూ. 42.00
4.టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .20.50 రూ. 21.00
5.టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ. 8.50 రూ .8.50
6.ఫ్యామిలీ మిల్క్ 500 ఎం ల్ రూ .19.50 రూ .20.00
7.డబుల్ టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .18.50 రూ .19.00
8.డబుల్ టోండ్ మిల్క్ 300 ఎం ల్ రూ. 11.00 రూ .11.00
9.డబుల్ టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ .8.00 రూ .8.00
10.డైట్ మిల్క్ 500 ఎం.ల్ రూ .17.50 రూ .18.00
11.కౌ మిల్క్ 500 ఎం ల్ రూ .20. 50 రూ .21.10
ఈ సంవత్సరం లోనే రూ .4 భారం
ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరి సరఫరా చేస్తున్న పాలను లీటరుపై జనవరి 5 తేదీన రూ 2 ను పెంచింది. ఏప్రిల్ 1 న రూ 1, తాజాగా మరో రూ 1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ 4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది.
Advertisement
Advertisement