టోల్‌ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన | villagers protests at nizamabad district toll plaza | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన

Feb 7 2016 4:45 PM | Updated on Aug 28 2018 4:00 PM

టోల్‌ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన - Sakshi

టోల్‌ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన

నిజామాబాద్ జిల్లా బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు.

బిక్నూర్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. టోల్‌ప్లాజా వద్ద స్థానికులకు చెందిన వాహనాలకు చలానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

తమకు చెందిన వాహనాలకు పదేపదే చలానాలు చెల్లించవలసి వస్తుందని దీనిపై మినహాయింపు ఇవ్వాలని టోల్‌ప్లాజా ఇంచార్జ్కు ప్రజలు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఇంచార్జ్ గ్రామస్థులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement