villagers
-
పిన్నెల్లి ప్రజలకు YS జగన్ భరోసా
-
‘ఫొటో దిగారుగా వెళ్లిపోండి’.. గ్రామస్తులపై బాలకృష్ణ చిందులు
సాక్షి, కృష్ణా జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి అసహనానికి గురయ్యారు. మా ఊరిని అభివృద్ధి చేయరు అంటూ విజ్ఞప్తి చేసిన గ్రామస్థులపై కస్సుబుస్సుమన్నారు. 'ఫొటో దిగారుగా.. చాలు ఇక వెళ్లిపోండి' అంటూ ఫైరయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. అయితే, నిమ్మకూరుకు వచ్చిన బాలకృష్ణను కలిసేందుకు ఆయన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలు గ్రామస్తులు వచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు.. బాలకృష్ణను పలకరించారు. ఫొటోలు సైతం దిగారు.అనంతరం, మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కొమరవోలు గ్రామస్తులు బాలకృష్ణను కోరారు. అందుకు ఆయన ‘నేను పట్టించుకోను.. ఫొటోలు దిగారుగా వెళ్లండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమరవోలు గ్రామమా? అదెక్కడ ఉంది? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లింగాయత్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని వ్యాఖ్యానించారు. దీంతో, తన తల్లి బసవతారకమ్మ స్వగ్రామమైన కొమరవోలును బాలకృష్ణ విస్మరించడం, అసహనం వ్యక్తం చేయడంతో గ్రామస్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
ఇసుకాసురులపై జనాగ్రహం
నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ వద్ద కుశస్థలి నది నుంచి ఇసుకను ఎడాపెడా తరలించేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి యేటిగట్టుపైకి వెళ్లే మహిళలను ఫొటోలు, వీడియోలు తీస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్రవాడ, వినాయకపురం గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం సత్రవాడ సచివాలయం ఎదురుగా రోడ్డుపై బైటాయించి రాకపోకలను స్తంభింపజేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుకను దోచుకెళుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపుదారులు యేటిగట్టుకు వెళ్లే మహిళల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. -
పని లేదు.. తిండి లేదు.. ఊరెళ్ళిపోతోంది
-
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు -
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
-
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు
-
తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసిన లగచర్ల గ్రామస్తులు
-
వికారాబాద్ జిల్లా కలెక్టర్పై దాడి.. లగచర్లలో ఉద్రిక్తత
వికారాబాద్, సాక్షి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కు చేదు అనుభవం ఎదురైంది. దుద్యాల మండలం లగచర్లకు వెళ్లిన ఆయనకు నిరసన సెగ తగలడంతో పాటు గ్రామస్తులు దాడి చేశారు. లగచర్లలో సోమవారం ఫార్మా కంపెనీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ జరిగింది. దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ప్రజలతో చర్చించేందుకు కలెక్టర్ సహా అధికారులు వచ్చారు. అయితే ఫార్మా కంపెనీకి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ కలెక్టర్ ప్రతీక్ జైన్పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై దాడి జరిగినట్లు సమాచారం. ఆపై గ్రామస్తులు పట్టరాని కోపంతో అధికారుల వాహనాలపై గ్రామస్తులు కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వెంటనే అధికారులంతా అక్కడి నుంచి వెళ్లేపోయే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం లగచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. భారీగా పోలీసులు మోహరించారు. -
వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్గా మార్చి..
చంపావత్: ఉత్తరాఖండ్లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీల్ గ్రామంలో ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. గంగలి, నేత్ర సలాన్ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. सड़क बंद एंबुलेंस बनी 'डोली'..उत्तराखंड: चंपावत में ग्रामीणों ने तीन किलोमीटर पैदल चलकर सड़क तक बीमार महिला को ऐसे पहुंचाया.#Uttarakhand । #Champawat । #Ambulance pic.twitter.com/7sL9cnRqCL— NDTV India (@ndtvindia) September 23, 2024ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
ఓటింగ్ను బహిష్కరించిన గ్రామస్తులు
ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.తాము ఇక్కడి రైల్వేలైన్పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు. -
ప్రియాంక ఉంటేనే ఓటు.. గ్రామస్తుల హెచ్చరిక!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో యూపీలో ఆసక్తికర రాజకీయం నెలకొంది. ఐదో దశ నామినేషన్లకు గడువు సమీపిస్తున్నా, అటు రాయ్బరేలీ, ఇటు అమేధీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులెవరనేది కాంగ్రెస్ ఇంకా వెల్లడించలేదు. రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ పేరు వినిపించింది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇక్కడి పార్టీ నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అయోమయంలో చిక్కుకున్నారు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో రాయ్బరేలీ జిల్లాలోని కనకపూర్ గ్రామస్తులు మరో ముందడుగు వేశారు. గ్రామం బయట ‘ప్రియాంకా గాంధీ పోటీ చేయకుంటే తాము ఓటు వేయం’ అని రాసివున్న బ్యానర్ను ఉంచారు. రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీచేయకుంటే ఓటింగ్ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గాంధీ కుటుంబంతో తమ అనుబంధం ఏళ్ల నాటిదని, అందుకే గాంధీ కుటుంబం నుండి ప్రియాంక లేదా రాహుల్ ఇక్కడి నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.మరోవైపు అమేథీ, రాయ్బరేలీ స్థానాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాంధీ కుటుంబం ఆసక్తి చూపడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంకా గాంధీకి రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేయడం ఇష్టం లేదని, రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల అభ్యర్థులను కాంగ్రెస్ నేడు (బుధవారం) ప్రకటిస్తుందనే వార్త వినిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేకుంటే కాంగ్రెస్ ప్లాన్ బీని సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఈ ఊరు మాది.. అందరూ ఖాళీ చేయండి!
కిషోర్కుమార్ పెరుమాండ్ల, మహబూబ్నగర్: ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు.. 1,000 మంది జనాభా. ఇందులో నాలుగు సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా.. ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్వ, ముస్లిం, గౌడ్లు ఉన్నారు. చాలావరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపదొచ్చింది. కొందరు వ్యక్తులు గ్రామం మొత్తాన్ని ఖాళీ చేయించి, 200 కుటుంబాల్ని నిరాశ్రయుల్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకులు, పోలీసులు తోడుకావడంతో పల్లెవాసులు ఎప్పుడు ఇల్లు వదిలి పోవాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చమన్ఖాన్దొడ్డి వాసుల దీనగాథపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. అనుబంధ గ్రామం నుంచి పంచాయతీగా.. చమన్ఖాన్దొడ్డి మొదట్లో మల్లంపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉండేది. శాసనసభ, లోక్ సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ గ్రామంలోని ఓటర్లు మల్లంపల్లికి వెళ్లి ఓటు వేసేవారు. ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పుడు చమన్ఖాన్దొడ్డి కూడా నూతన గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 450 మంది ఓటర్లు ఉన్నారు. భూమి మొత్తం మాదేనంటూ.. ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదేనంటూ.. ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న ముగ్గురు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్పార్టీ డిక్రీ ఆర్డర్ వచ్చింది. దీంతో వారు కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఊరు ఖాళీ చేయమంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన పరిస్థితుల నేపథ్యంలో.. రాజకీయ నాయకులు, పోలీసులు కూడా వారికే దన్నుగా నిలవడంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మేము మూడు తరాలుగా ఇక్కడే ఉంటున్నామని, మా పెద్దలు ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారని.. ఉన్న ఫళంగా ఊరు వదిలి పొమ్మంటే ఎక్కడికి పోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ రితిరాజ్కు వినతిపత్రం అందజేశారు. మరి ప్రభుత్వం ఎలా అభివృద్ధి పనులు చేపట్టింది?! గ్రామంలో ప్రభుత్వ పంచాయతీ కార్యాలయం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలున్నాయి. గ్రామంలో బ్రహ్మంగారి గుడి, కనకదాసు గుడి, దర్గా, మసీదు, పీర్లగుడి, ఆంజనేయస్వామి, శివాలయాలతో పాటు గ్రామ దేవతలైన మారెమ్మ, సుంకులమ్మ, బొడ్రాయి, సావిడి వంటి నిర్మాణాలు ఏళ్ల క్రితమే ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సౌకర్యం, వాటర్ ట్యాంకులు వంటివి కూడా ప్రభుత్వం ఎప్పుడో ఏర్పాటు చేసింది. గ్రామ కంఠానికి చెందిన భూముల్లో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రికార్డులు ఉండగా.. ఇప్పుడు ఎవరో వచ్చి ఈ భూమి తమదే అని ఎలా అంటారని, ఎలా ఖాళీ చేయమంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఊరొదిలి పొమ్మంటే ఎలా? నేను ఈ గ్రామంలోనే పుట్టా. మా తాత, ముత్తాతలు కూడా ఇక్కడే పుట్టి, ఇక్కడే చనిపోయారు. ప్రస్తుతం మా కుటుంబ సభ్యులమే 30 మంది వరకు ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఊరు వదిలిపొమ్మంటే ఎలా కుదురుతుంది? – భీమయ్య గ్రామకంఠం కిందే ఉంది.. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి తహసీల్దార్ వచ్చి మా ఊరు మొత్తం 9 ఎకరాల వరకు ఉంటుందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో భూమి మొత్తం గ్రామ కంఠం కిందే ఉందన్నారు. అలాంటిది మా ఊరి ముఖం ఒక్కసారి కూడా చూడని వారు వచ్చి.. గ్రామం మొత్తం మాదే, ఖాళీ చేసి వెళ్లిపొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? – ఆంజనేయులు ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతాం చమన్ఖాన్దొడ్డికి సంబంధించిన అంశం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. దీనిపై గ్రామస్తులు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. – రాంచందర్, ఆర్డీఓ, గద్వాల -
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు: వేలాదిమందికి అన్నదానం
అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్లోని జామ్నగరం సందడిగా మారిపోతోంది. జామ్ నగరం అనంగానే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల కుమారుడు పెళ్లి జరుగుతున్న ప్రాంతం అని ఠక్కున చెప్పేలా వార్తల్లో నిలిచిపోయింది. ఆ వివాహ వేడుకకు ముందే ఆ నగరంలో ఏకంగా 14 దేవాలయాలను నిర్మించడంతో ఆ నగరం పేరు మరోసారి మారుమ్రోగిపోయింది. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకనే ఏకంగా అన్నదానంతో ప్రారంభించడంతో ఆ నగర సమీపంలోని గ్రామాల పేర్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. . ఈ కార్యక్రమంలో భాగంగా అంబానీల కుంటుంబం ఎంతమందికి బోజనాలందించిందంటే.. రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండగ్ వేడుకలు వచ్చే నెల మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చెంట్తో జులై 12 ఘనంగా వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఇరు కుటుంబాలు అన్నదాన సేవతో ప్రారంభించారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలతో స్థానికులకు భోజనాలు పెట్టారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహం జయప్రదంగా జరిగేలా స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం అన్నసేవను ప్రారంభించింది. ఈ అనదానాన్ని జామ్నగర్ రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో నిర్వహించారు. ఈ అన్నదాన సేవలో రాధికా మర్చంట్ కుటుంభ సభ్యులు కూడా పాల్గొనడం విశేషం. సుమారు 51 వేల మంది స్థానికులకు అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన గాధ్వి తన గాన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అలాగే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా సంప్రదాయబద్ధంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనే అతిథులకు గుజరాత్లోని కచ్ఛ్ లాల్పూర్కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అందజేస్తారు. ఇక ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖతార్ ప్రధాని మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ, భూటాన్ రాణి జెట్సన్ పెమా, మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, సౌదీ అరాంకో చైర్పర్సన్ యాసిర్ అల్ రుమయ్యన్ ఉన్నారు. (చదవండి: అనంత్ అంబానీ అధిక బరువుకి కారణం ఇదే! కాబోయే భార్య..!) -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
తుఫాన్ ప్రభావిత బాధితులతో సీఎం వైఎస్ జగన్...అందరికీ సాయం చేస్తాం
-
రేవంత్ రెడ్డి చదువుకున్న బడి ఇదే..!
-
కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్తులు
సిద్దిపేట రూరల్/మర్కూక్ (గజ్వేల్): బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్రావును తన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కలిశారు. బుధవారం తొమ్మిది బస్సుల్లో సుమారు 540 మంది గ్రామస్తులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్కు చేరుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ను పలువురు ప్రముఖులు కలుస్తున్నందున వారిని లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో సుమారు రెండు గంటలపాటు నిరీక్షించారు. అనంతరం లోపలికి అనుమతించారు. దీంతో కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ నినాదాలు చేశారు. అయితే...ఆయన మాట్లాడకుండానే అభివాదం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్రావు తదితరులు ఉన్నారు. -
గ్రామస్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మధ్య వాగ్వాదం
-
ఏకంగా రోడ్డునే దోచేశారు: అవాక్కవుతున్న నెటిజన్లు, వైరల్ వీడియో
బిహార్లో మరో వింత చోరీ వైరల్గా మారింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ రాష్ట్రంలోని జెహనాబాద్లో ఈ షాకింగ్ దొంగతనం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. జెహనాబాద్ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాంట్రాక్టర్లు పాక్షికంగా పూర్తి చేసినా సిమెంట్ పనులను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అదును చూసి గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డుకు సంబంధించిన కాంక్రీటు, ఇసుక, చిప్స్ మొత్తాన్ని క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ తన పని కానిచ్చారు. పాక్షికంగా నిర్మించిన రహదారి నిర్మాణ సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించినట్లు అధికారులు ధృవకరించారు. జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో స్థానిక RJD ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెండు నెలల క్రితం రహదారికి శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్ పనులు పూర్తి కాకుండానే గ్రామస్తులు చోరీ చేశారని సతీష్ ఆరోపించారు. దీనిపై మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామన్నారు. ఇది ఇలా ఉంటే అయితే రోడ్డు వేయకముందే అడ్డగోలుగా దోచుకున్నారనీ ఈ రహదారిని ఇంకా మూడు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. వాస్తవానికి ఇది స్థానిక పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, వైఫల్యమేనని గ్రామానికి చెందిన కొంతమంది విమర్శించారు. అయితే బిహార్లో ఇలాంటి వింత వింత చోరీలు ఇదే మొదటిసారి కాదు. గతంలో రైల్వే ట్రాక్స్ దొంగిలించారు. మరోసారి రైల్వే ఇంజిన్ మాయమైంది. ఆ తరువాత ఏకంగా వంతెననే ఎత్తుకుపోయారు. ఇపుడు మరో దొంగతనంతో తమ రికార్డును తామే అధిగమించారు. ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటువంటి దొంగలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారిని 5 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉంచాలంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली! जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y — Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023 -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు!
భోపాల్: మధ్య ప్రదేశ్లోని ఓ గ్రామ శివారులోకి చిరుతపులి ప్రవేశించింది. మొదట చిరుతను చూసి భయపడిన జనాలు.. అది ఆవేశంగా, హుషారుగా కనిపించకపోవడంతో ఆశ్యర్యపోయారు. తరువాత దాని దగ్గరకు వెళ్లి పరీక్షించగా.. సదరు చిరుత అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని దానికి పెంపుడు జంతువుగా చూస్తూ ఆటపట్టించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి బెంబేలెత్తిన గ్రామస్తులు దూరంగా పారపోయేందుకు ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికి చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండటం చూసి అది అస్వస్థతకు గురైనట్లు అర్థమైంది. దీంతో గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. పెంపుడు జంతువులా చూస్తూ దానితో సెల్ఫీలు తీసుకున్నారు. కొంతమంది అయితే చిరుతపై ఎక్కి రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. చదవండి: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6 — Press Trust of India (@PTI_News) August 30, 2023 ఈ విషయాన్ని ఓ గ్రామస్తుడు అటవీశాఖకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకు కూడా కొంతమంది ఆగకుండా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్లోని వాన్ విహార్కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు చిరుత సరిగ్గా నడవలేని స్థితిలో అడవిలో సంచరిస్తుందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. దానికి వాన్విహార్లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక గ్రామస్థులు చిరుతతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైర్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వాటి(జంతువుల) స్థలాలను ఆక్రమిస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడాఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
‘కొంగకు వారు.. వారికి కొంగ’.. జంతు ప్రేమకు నిదర్శనం!
ఉత్తరప్రదేశ్లోని అమేథీకి చెందిన ఆరిఫ్ అతని ఫ్రెండ్ కొంగ మధ్యగల స్నేహబంధాన్ని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు చాలామంది ఇటువంటి కథలను ఎక్కడా వినివుండరు. ఈ ఉదంతం ఎంతవరకూ చేరిందంటే యూపీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం ఆరిఫ్, ఆ కొంగను కలుసుకున్నారు. అనంతరం ఆయన ఆ కొంగను జూపార్కుకు తరలించారు. అయినా గ్రామంలోని వారెవరూ ఆ కొంగను మరచిపోలేరు. ఆ కొంగకు గ్రామంలోని వారంతా స్నేహితులే. ఆ కొంగ గ్రామంలోని వారందరితో కలసిమెలసి ఉండేది. గ్రామంలోని వారంతా ఆ కొంగ అంటే ఎంతో ప్రేమ చూపించేవారు. ఆరిఫ్కు అత్యంత సన్నిహితంగా మెలిగే ఆ కొంగ ప్రతీరోజూ ఉదయాన్నే తన అరుపులతో అందరినీ నిద్ర నుంచి లేపేది. అనంతరం స్థానికుల మధ్య కలివిడిగా తిరిగేది. కొంగను చూసినవారంతా దానికి ఫొటోలు తీసేవారు. కుద్రహా బ్లాక్ పరిధిలోని రోహరి గ్రామం.. కైద్హవా తాల్ సమీపంలో ఉంది. తాల్లో ఇసుకబట్టీలు ఉన్నాయి. ఉదయం కాగానే ఈ ప్రాంతం నుంచి ఒక కొంగవచ్చి గ్రామంలో కలివిడిగా తిరుగుతుంటుంది. ఊరి జనం దానిని చూడగానే స్నేహ పూర్వంగా ఉంటూ, దానికి ఏదో ఒక ఆహారం అందించేవారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం సాగుతూ వస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి సమీపంలోని ఇటుకబట్టీ దగ్లర కూలీలకు విచ్రితమైన రీతిలో రెండు గుడ్లు లభించాయి. వాటిని కూలీలు.. కొన్ని కొంగల దగ్గర విడిచిపెట్టారు. తరువాత ఆ గుడ్ల నుంచి కొంగ పిల్లలు బయటకు వచ్చాయి. కొద్ది రోజుల తరువాత ఒక కొంగ పిల్ల చనిపోయింది. మిగిలిన మరో కొంగను ఆ బట్టీలో పనిచేసే కూలీలు గ్రామానికి తీసుకువచ్చి, అక్కడ విడిచిపెట్టారు. ప్రస్తుతం ఆ కొంగ ఆ గ్రామంలో లేకపోయినా, స్థానికులు దానిని తలచుకోని రోజుంటూ ఉండదు. ఆరిఫ్ ఆ కొంగను ఎంతో ప్రేమగా సాకేవాడు. ఇది కూడా చదవండి: నడక చైర్లోని పసివాడు.. పైకప్పు కూలిపోయేంతలో.. వైరల్ వీడియో! -
దారుణం: సగం గుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండలు వేసి..
రాంచీ: జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి: డ్రైవింగ్లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే! -
బాబోయ్ ఇదేం ఆచారం! ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి.. ఆపై
బెంగళూరు: వేసవి కాలం పోయింది.. ఇక వానల కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాల కోసం వాళ్ల పూర్వికులు ఆచరించిన ఆచారాలు పాటించడం ప్రారంభించారు. ఇందులో కొన్ని వింతగా కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ గ్రామంలో వానలు పడటంలేదని ఆ గ్రామస్తులంతా కలిసి ఓ విచిత్ర కార్యక్రమం నిర్వహించారు. వాన దేవుళ్లను తృప్తిపర్చడం కోసం గ్రామంలోని ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి జరిపించారు. ఒక అబ్బాయికి పెళ్లి కొడుకు లాగా, మరో అబ్బాయికి పెళ్లి కూతురు లాగా తయారు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతేడాది కంటే తక్కువ వర్షపాతం నమోదైందని మాండ్య జిల్లాలోని కృష్ణరాజ్పేట తాలూకా గంగేనహళ్లి గ్రామంలో ఈ పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా ప్రజలకు ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేసి వర్షం కురవాలని వానదేవుడిని ప్రార్థించారు. వాన దేవతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా వర్షాలు పడుతాయని ఇది సాంప్రదాయ ప్రార్థనలో ఒక భాగమని స్థానికులు తెలిపారు. రాష్ట్రంలో రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో గతేడాది కంటే ఈ ఏడాది తక్కువ వర్షాలు కురిశాయని వారు తెలిపారు. ఇదిలావుండగా, రానున్న మూడు రోజుల పాటు కోస్తా, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కర్ణాటక వాతావరణ శాఖ తెలిపింది. మెజారిటీ కోస్తా జిల్లాలు, దక్షిణ లోతట్టు ప్రాంతాల్లోని అనేక జిల్లాలు, ఉత్తర లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షం, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చదవండి: కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయిందా?.. అసలేం జరిగిందంటే.. -
ఆ ఊర్లో మహిళలు దుస్తులే ధరించరు.. 5 రోజుల పాటు!
భారతదేశంలోని నివసిస్తున్న ప్రజలు.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ప్రత్యేకించి గ్రామాల్లో నివసించే ప్రజలు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామంలో ఒక వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారట. సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడి మహిళలు దుస్తులు ధరించరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఒక కారణముందని అంటున్నారు. అదేంటంటే..! ఈ గ్రామం ఎక్కడ ఉంది? అవును, మనం మాట్లాడుకుంటున్న గ్రామం పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో, శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది, ఇందులో మహిళలు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరు. ఈ ఐదు రోజులు పిని గ్రామానికి బయటి వ్యక్తులెవరూ రాలేరు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కూడా దాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. మహిళలు బట్టలు ధరించరు ఈ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించరు. మహిళులు వారి ఇంటి వద్దనే ఉంటారు, బయటకు రారు. మరోవైపు ఈ ఐదు రోజులు నియమనిష్టలతో ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తారట. ఈ సమయంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వారు మద్యం తాగలేరు, నాన్ వెజ్ తినరు. అంతే కాదు ఈ ఐదు రోజులు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు? గ్రామస్తుల ప్రకారం, ఈ సంప్రదాయం పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మహిళకు చెడు జరుగుతుందని అక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇది పాటిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చూసి నవ్వకూడదట. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరి. సంప్రదాయం చరిత్ర సంప్రదాయ చరిత్ర పుటలు ఆసక్తికరంగా ఉన్నాయి. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించాయి. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు ఎత్తుకెళ్లేవారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. చదవండి: చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
అనుమానం వచ్చింది.. అంతే వాళ్లని చెట్టుకు కట్టేసి..
సదాశివపేటరూరల్ (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కొల్కూర్ గ్రామంలో మంత్రాల(చేతబడి) నెపంతో గ్రామస్తులు శనివారం ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. సదాశివపేట సీఐ నవీన్ కుమా ర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ముత్తంగి యాదయ్య కుటుంబం చేతబడి చేస్తోందనే అనుమానంతో గ్రామానికి చెందిన శివ య్య, లక్ష్మణ్, కోవూరి కుమార్, గడ్డం పెంటయ్య, బాగప్ప, బెగరి కుమార్, గడ్డం శ్యామల, గడ్డం ఆగమ్మ తదితరులు కలిసి యాదయ్య కుటుంబాన్ని తాళ్లతో చెట్టుకు కట్టేసి కట్టెలతో దాడి చేశారు. కొందరు గ్రామస్తులు నిలువరించడంతో యాదయ్య, ఆయన భార్య అమృత, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దళితులపై మంత్రాలనెపంతో దా డి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్, జిల్లా అధ్యక్షుడు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు... -
111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు
జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది రియల్ ఎస్టేట్ రికార్డులు.. 111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది. లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. చాలా ఏళ్లుగా పోరాటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సంబరాలు మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే.. -
చేపలకు పొతే నోట్ల కట్టలు దొరికాయోచ్..
-
పేదింటి పెళ్లికి.. ఊరంతా ఒక్కటై..
భైంసా టౌన్: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా ఒక్కటయ్యారు. తలా కొంత కలేసి జమచేసిన డబ్బును కుటుంబానికి అందించి మానవత్వం చాటుకున్నారు నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్ (బి) వాసులు. వివరాల్లోకి వెళితే.. కిర్గుల్(బి)కు చెందిన కరాండె గోదావరి, గంగన్న దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. గంగన్న గ్రామంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గోదా వరి కూలీ పనులకు వెళ్తుంది. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఇటీవల పెద్ద కూతురు వివాహం కుదిరింది. మే 7న వివాహ ము హూర్తం నిశ్చయించారు. ఉన్నంతలో ఘనంగా వివాహం చేద్దామనుకున్నారు. తెలిసిన వారి వద్ద అప్పుచేసి బంగారం, పెళ్లి సామ గ్రి కొని ఇంట్లో సిద్ధంగా పెట్టుకున్నారు. రోజులాగానే బుధవారం రాత్రి భోజనం చేసి, ఓ గదిలో అందరూ నిద్రపోయారు. అర్ధరాత్రి ఇంట్లో చొరబడిన దొంగలు వారు పడుకున్న గదికి గడియపెట్టి మరో గది లోని బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం నిద్రలేచి చూసేసరికి ఇల్లు గుల్లయింది. పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా నగదు, సొమ్ము దొంగలు ఎత్తుకెళ్లడంతో గంగన్న, గోదావరి దంపతులు బోరున విలపిస్తున్నా రు. వీరి దీనస్థితి అర్థం చేసుకున్న గ్రామస్తు లు తామున్నామని అండగా నిలిచారు. యువకులు ఇంటింటికీ తిరిగి రూ.1,01,000 సేకరించి బాధిత కుటుంబానికి అందించారు. వీడీసీ ఆధ్వర్యంలో చైర్మన్ పోతారెడ్డి రూ.20 వేలు, సర్పంచ్ సుధాకర్రెడ్డి రూ.20 వేలు, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. దీంతో గంగన్న, గోదావరి దంపతులు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. -
గ్రామస్తులు వద్దన్నా గుడి వద్ద షూటింగ్ చేసాం
-
కిమ్స్ ఆసుపత్రి లో చీమలపాడు క్షతగాత్రులు
-
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
కలకలం రేపిన ’సందేశ’ పావురం.. అది ఎక్కడిదో.. ఎవరిదో?
సాక్షి, ఎర్రుపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మామునూరుకు గురువారం చేరిన ఓ పావురం కలకలం రేపింది. గ్రామంలోని గంతాల లక్ష్మణరావు ఇంట్లో వాలిన పావురాన్ని పరిశీలించగా, ఒక కాలికి టీఎన్–999 అని, మరో కాలికి 7417 నంబర్తో కూడిన స్టిక్ట్కర్ ఉంది. రెక్కలకు డెల్టా 1000 కేఎం అని స్టాంప్ వేసి ఉండగా.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఎం.సురేశ్ పరిశీలించి ఇది బెట్టింగ్ పావురం అయి ఉండొచ్చని, ప్రజలు అపోహలకు గురికావొద్దని సూచించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చిన్న పట్టణాల్లోనే రుణాలకు అధిక డిమాండ్
ముంబై: కొత్తగా రుణాలు తీసుకునే ప్రతి ముగ్గురిలో ఇద్దరు గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల నుంచే ఉంటున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ సంస్థ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారిలో మహిళలు, రైతులు, యువత ఉంటున్నట్టు తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవల విస్తృతికి ఇది కీలకమని పేర్కొంది. 2021లో తొలిసారి రుణాలు తీసుకున్నవారు 3.5 కోట్లుగా ఉంటే, 2022లో జనవరి–సెప్టెంబర్ మధ్య కొత్తగా 3.1 కోట్ల మంది పెరిగినట్టు వెల్లడించింది. కొత్త రుణ ఖాతాదారులు (ఎన్టీసీ) అంటే అప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోకుండా, రుణ చరిత్ర లేని వారు అని అర్థం. కన్జ్యూమర్ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ రుణాలు, ద్విచక్ర వాహన రుణాలు, బంగారం రుణాలను వీరు తీసుకున్నారు. 2022 మొదటి తొమ్మిది నెలల్లో కొత్తగా రుణ చరిత్ర ఆరంభించిన కస్టమర్లలో 30 శాతం మేర కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు తీసుకున్న వారు కావడం గమనార్హం. అంటే ఇంట్లో ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ఫోన్ తదితర ఉత్పత్తుల కోసం తీసుకున్న రుణాలుగా వీటిని భావించొచ్చు. వీటి తర్వాత 16 శాతం మంది వ్యవసాయ రుణాలు తీసుకుంటే, 13 శాతం మేర వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్టు ట్రాన్స్యూనియన్ సిబిల్ నివేదిక వివరించింది. -
'విజిల్ విలేజ్'! అక్కడ శిశువు పుట్టిన వెంటనే..కొత్త రాగం పుట్టుకొస్తోంది!
ఇంతవరకు ఎన్నో గ్రామాలు గురించి విన్నాం. అక్కడ ఉండే వింత ఆచారాలో లేక విచిత్రమైన వాతావరణ పరిస్థితులు గురించో విని ఉంటాం. కానీ ఇలాంటి విచిత్రమైన గ్రామం పేరు ఇప్పుడూ దాక విని ఉండే అవకాశమే లేదు. పైగా ఈ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా అవార్డును కూడా గెలుచుకుంది. వివరాల్లోకెళ్తే.. మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్ నుంచి 60 కి.మీ దూరంలో కాంగ్థాంగ్ అనే గ్రామం ఉంది. దీన్ని 'విజిల్ విలేజ్'గా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు తమ తోటి గ్రామస్తులను పేర్లతో పిలవరు. ఒక ట్యూన్(రాగం) పేరుతో పిలుచుకోవడమే ఇక్కడ ప్రత్యేకత. తమ సందేశాలను తెలియజేయడానికి ఈలలు వేయడం వంటివి చేస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు రెండు పేర్లు ఉంటాయి. ఒకటి సాధారణ పేరు, మరోకటి పాట పేరు. షార్ట్ ట్యూన్లో ఇంటిలో పిలుచుకుంటే ఊరిలో ఉన్నప్పుడూ లాంగ్ ట్యూన్తో పిలుచుకుంటారు. ఈ గ్రామంలో సుమారుగా 700 మంది గ్రామస్తులు ఉన్నారు. అందరికీ విభిన్న రాగాల ట్యూన్లు ఉన్నాయి. ఈ మేరకు కాంగ్థాంగ్ గ్రామ నివాసి ఫివ్స్టార్ ఖోంగ్సిట్ మాట్లాడుతూ...ఒక వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించే ట్యూన్ని వారి తల్లులే కంపోజ్ చేస్తారట. అలాగే అక్కడ గ్రామస్తుడు ఎవరైన చనిపోతే అతనితో పాటే అతడిని పిలిచే ట్యూన్ కూడా చనిపోతుందట. అక్కడ ఉండే ప్రతి ఒక్క గ్రామస్తుడికి ఒకో రాగం పేరుతో పిలుచుకుంటారు. ఈ రాగాలతోటే వాళ్లు ఒకరితో ఒకరు సంభాషించుకుంటామని చెబుతున్నారు. ఇది వారికి తరతరాలుగా సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు స్థానికులు. గతేడాది పర్యాటక మంత్రిత్వశాఖ కాంగ్థాంగ్ ఉత్తమ పర్యాట గ్రామంగా ది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎంపిక చేసింది. అంతేగాదు 2019లె బిహార్కు చెందిన రాజ్యసభ ఎంపీ రాకేష్ సిన్హా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని యూనెస్కో ట్యాగ్ ఇవ్వాల్సిందిగా సూచించారు కూడా. (చదవండి: యాదృచ్ఛికంగా తీసిన డాక్యుమెంటరీ కాదు!: జై శంకర్) -
గూడు చెదిరి.. గుండె పగిలె.. ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన
సాక్షి, యాదాద్రి: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లకు పూర్తి పరిహారం ఇవ్వకుండానే అధికార యంత్రాంగం అక్కడి ప్రజలను ఖాళీ చేయిస్తోంది. దీంతో ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, ఆందోళన కారణంగా మనస్తాపం చెందిన నిర్వాసితుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీఎన్ తిమ్మాపూర్ గ్రామంలో నెలకొన్న దయనీయపరిస్థితి ఇది. వ్యవసాయ భూములు, ఇళ్లు పోయి.. పరిహారం రాక భవిష్యత్తుపై భయంతో పాటు రకరకాల కారణాలతో దాదాపు ఐదేళ్లలో గ్రామంలో 50 మందికి పైగా చనిపోయారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు.., తమకు పిల్లను ఇవ్వడంలేదని మనోవేదనతో కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో గత 57 రోజులుగా బస్వాపూర్ ప్రాజెక్టు కట్టపై నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. బుధవారం కూడా ఓ నిర్వాసితుడు బెంగతో చనిపోయాడు. ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు.. కాళేశ్వరం ప్రాజెక్టులో చివరిదైన నృసింహసాగర్ రిజర్వాయర్ (బస్వాపూర్ రిజర్వాయర్)ను 11.39 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు 1,724 ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఇందులో 700 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయకుని తండా, చోకల్నాయకుని తండాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. ప్రభుత్వం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ముంపు గ్రామాల వాసులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జాప్యం అవుతోంది. బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తుల వ్యవసాయ భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు అందరికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న గ్రామంలోని 655 నివాస గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ముంపు భూములకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులను మరింత పెంచి ఇవ్వాలని గ్రామస్తులు తీర్మానం చేసి నోటీసులు తీసుకోకుండా అధికారులను తిప్పిపంపారు. 655 మందికే పరిహారం.. బీఎన్ తిమ్మాపూర్లో గ్రామకంఠంతోపాటు పరిసరాల్లోని 36.11 ఎకరాల భూమి మునుగుతోంది. ఇంతవరకు ఈ భూమికి సంబంధించి అవార్డు ప్రక్రియ మొదలుకాలేదు. దీంతో ఎంత పరిహారం వస్తుందో తెలియని పరిస్థితి. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో 90 ఎకరాల్లో లేఅవుట్ను అభివృద్ధి చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గ్రామంలో 1,086 మంది నిర్వాసితులు తేలారు. వీరిలో 655 మందికి పరిహారం చెల్లించారు. ఒక్కొక్కరికి రూ.7.61 లక్షల చొప్పున రూ.50 కోట్లు పంపిణీ చేశారు. మిగతా వారికి రూ.34 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఒకేసారి ఇవ్వకపోవడంతో విడతలుగా వచ్చిన డబ్బులు వృథాగా ఖర్చవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. డబ్బులు చేతికి వచ్చిన వారిలో సగం మందికిపైగా చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా ఖర్చు అయ్యాయని చెపుతున్నారు. పరిహారం రాని వారు ఎప్పుడిస్తారో.. అని ఎదురుచూస్తున్నారు. గ్రామస్తుల ప్రధాన డిమాండ్లు.. ►2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. ►2019లో ప్రకటించిన అవార్డును రద్దు చేసి కొత్తగా భూసేకరణ అవార్డును ప్రకటించాలి. ►ప్రాజెక్టు ముంపులో కోల్పోతున్న వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం ఒకేసారి చెల్లించాలి. ►గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ప్రకటించాలి ►భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని హుస్నాబాద్ వద్ద 107 సర్వే నంబర్లో చేపట్టిన లేఅవుట్ ప్లాట్లను వెంటనే బీఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులకు కేటాయించాలి. ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి. పరిహారం డబ్బులన్నీ పప్పు పుట్నాలకే.. ప్రభుత్వం తీసుకున్న భూములకు పరిహారం డబ్బులన్నీ ఒకేసారి ఇవ్వకపోవడంతో నిర్వాసితులకు ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ ఇతర అవసరాలకే ఖర్చయ్యాయి. అప్పుడప్పుడు ఇచ్చిన పరిహారం డబ్బులు ఇలా ఖర్చు కావడంతో రైతుల చేతులు ఖాళీ అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు తొలుత ఎకరానికి రూ.6 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. బస్వాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఆ తర్వాత రిజర్వాయర్ సామర్థ్యాన్ని 0.87 టీఎంసీలనుంచి 11.39 టీఎంసీలకు పెంచిన ప్రభుత్వం.. నిర్వాసితులకు 123 జీవో ప్రకారం పరస్పర అంగీకారం ద్వారా ఎకరానికి రూ.15.60 లక్షల చొప్పున 400 ఎకరాలకు పరిహారం ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2019 డిసెంబర్ 11న జారీచేసిన అవార్డు ప్రకారం దానిని సవరించి ఎకరానికి రూ.15.30 లక్షలు నిర్ణయించింది. అయితే, పరిహారం మరింత ఎక్కువగా ఇవ్వాలని రైతులు కోరుతూ వస్తుండగా.. రూ.30 వేలు తగ్గడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎక్కువ పరిహారం వస్తుందని భావించిన రైతులకు పరిహారం ఇలా తక్కువగా రావడంతో తీవ్ర మనో వేదన చెందుతున్నారు. మా భూమికి డబ్బులు రాలేదు బస్వాపురం రిజర్వాయర్లో మా భూమి 12 ఎకరాలు పోయింది. ఇందులో 5 గుంటల భూమి పైసలు మాత్రమే పడ్డాయి. మిగతా డబ్బులు నేటికీ ఇవ్వలేదు. పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు కానీ నేటికీ లేదు. రెవెన్యూ అధికారులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గ్రామంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. ముంపు భూములు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు మొత్తం అందరికీ ఇస్తే తప్ప నోటీసులు తీసుకోబోమని చెప్పాం. – ఎండీ సాబేర్, బీఎన్ తిమ్మాపురం అనారోగ్యం పాలవుతున్నాం ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూస్తూ, ఎంత వస్తుందో.. ఎప్పుడు ఇస్తా రో అని ఆలోచిస్తూ అనారోగ్యం పాలు అవుతున్నాం. గ్రామంలో ఇలా ఆలోచించి కొందరు చనిపోగా, మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. నాకున్న అర ఎకరం వ్యవసాయ భూమి బస్వాపురం రిజర్వాయర్ కట్ట కోసం పోయింది. అప్పుడు ఎకరానికి రూ.6 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఆ డబ్బులతో ఎక్కడా భూమి కొనుగోలు చేయలేకపోయాం. ఇంటి కోసం ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకెజీ కోసం ఎదురు చూస్తున్నాం. – జంగిటి సుగుణ, బీఎన్ తిమ్మాపూర్ రూ. 46.35 కోట్లు విడుదల బస్వాపూర్ ప్రాజెక్టు ముంపు బాధిత కుటుంబాల పరిహారం, లే అవుట్ అభివృద్ధికి ప్రభుత్వం బుధవారం రూ.46.35 కోట్లను విడుదల చేసింది. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలసి బా«ధితులకు పరిహారం ఇవ్వాలని కోరడంతో వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం రూ.33.45 కోట్లు, పునరావాస లేఅవుట్ అభివృద్ధికి రూ.12.90 కోట్లు ఉన్నాయి. రెండురోజుల్లో బాధితులకు పరిహారం అందుతుంది. – ఫైళ్ల శేఖర్రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి -
మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదు.. మార్పు మంచిదే..
మాంసం ముట్టకూడదు.. మద్యం సేవించ కూడదన్నది ఆ ఊరివాళ్ల ఆచారం. అలాంటి ఆచారాన్ని పాటించే వారితోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని పూర్వమే నిర్ణయించారు. దానినే ఆచారంగా.. కట్టుబాటుగా నిన్నమొన్నటి వరకు పాటిస్తూ వచ్చారు. తమ కులం వారు తగినంత మంది లేకపోవడం.. దూర ప్రాంతాల్లో అదే కులానికి చెందిన వ్యక్తులు ఉన్నప్పటికీ వారు మాంసం, మద్యం ముట్టుకుని ఉంటారేమోననే భయం వారిని మేనరిక వివాహాల చట్రంలోకి నెట్టేసింది. ఫలితంగా ఉన్న ఊళ్లోనే దశాబ్దాలుగా మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా పరిణమించింది. ఇప్పుడా గ్రామంలోని యువతరం మారుతోంది.. తమ కులస్తుల బతుకులను మార్చేందుకు కృషి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: ఆ ఊరి పేరు మడూరు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని తొండూరు మండలంలో ఉంది. గ్రామంలో 200 గడపలు ఉండగా.. 1,200 మందికి పైగా జనాభా ఉంది. అంతా సాతాని (బీసీ–డీ) కుటుంబాల వారే. అక్కడ ఒక్కరు కూడా మాంసం ముట్టరు. మద్యం సేవించరు. అది పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. కట్టుబాటు తప్పితే కుటుంబం అభివృద్ధి చెందదనేది వారి భయం. ఇప్పటికీ గ్రామంలోకి మాంసాన్ని అనుమతించరు. మద్యాన్ని కూడా సేవించరు. మాంసం తినే ఇతర సామాజిక వర్గాల వారు గ్రామంలోకి వచ్చినా.. వారిని ఇంట్లోకి రానివ్వరు. మంచాలపై కూర్చోనివ్వరు. బయట నుంచే మాట్లాడి పంపేస్తారు. తమ జీవిత భాగస్వాములుగా వచ్చేవారు.. వారి కుటుంబాలు కూడా మద్యం, మాంసాన్ని ముట్టకూడదన్నది వారి నియమం. సాతాని కులస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా తగినంత మంది లేకపోవడం.. ఒకవేళ ఉన్నా బయటి ప్రాంతాల వారైతే మాంసం ముట్టుకుని ఉంటారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఉన్న ఊళ్లోనే దశాబ్దాల తరబడి మేనరికం వివాహాలు చేసుకుంటున్నారు. ఇదే భావితరాలకు శాపంగా మారింది. మేనరికాల వల్ల బిడ్డలు బుద్ధి మాంద్యం, అంధత్వం, ఇతర వైకల్యాలతో పుడుతున్నారు. గ్రామంలో ప్రతి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నవారే. ఎవరెన్ని చెప్పినా.. మేనరికం వల్లే బిడ్డలు వైకల్యం బారినపడుతున్నారని వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా గ్రామస్తులెవరూ వినిపించుకోలేదు. ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినా పెడచెవిన పెడుతూ వచ్చారు. దీంతో ఆ కుటుంబాల్లో పుట్టిన బిడ్డల జీవితాలు బుగ్గి పాలయ్యాయి. కొందరు మంచానికే పరిమితం కాగా.. మరికొందరు ఏ పనీ చేయలేక జీవచ్ఛవాలుగా మారారు. చూపు కోల్పోయినవారు కొందరైతే.. మాట్లాడలేని.. మాటలు వినలేని వారు ఇంకొందరు. పులివెందుల, కడప, కర్నూలు, అనంతపురం, హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లోని ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. ఎంత సొమ్ము వెచ్చించినా వారి సమస్యలు నయం కాలేదు. ఓ ఇంట్లోఇద్దరు సోదరులు చనిపోగా.. మరో ఇంట్లో 22 ఏళ్ల వయసులో నిర్జీవంగా పడివున్న ప్రశాంత్.. ఇంకో కుటుంబంలో పుట్టుకతోనే చూపు కోల్పోయిన స్వర్ణలత.. వరలక్ష్మి, వెంకటశేషయ్య, మూగవారిగా బతుకీడుస్తున్న సంతోష్, కల్యాణి, వైకల్యంతో అవస్థలు పడుతూ బీటెక్ చదువుతున్న అరుణ్, పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బతుకీడుస్తున్న ఐదేళ్ల ఐశ్వర్య, 26 ఏళ్ల వయసొచ్చినా చిన్నపిల్లాడిగానే కనిపించే సాయిరామ్ వంటి వారెందరో గ్రామంలో ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని చూసినా మనసు చెదిరిపోతుంది. గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడిప్పుడే మార్పొస్తోంది నాలుగైదు సంవత్సరాలుగా మడూరు యువతలో మార్పు కనిపిస్తోంది. కొందరు చదువుకున్న యువకులు బయట ప్రాంతాల వారిని వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామానికి చెందిన వెంకట నారాయణ, పల్లె ఎద్దులకొండయ్య, పల్లె సూర్యనారాయణ, జి.రామానాయుడు, ఎ.రమేష్, పల్లె నవీన్, పల్లె శ్రేష్ట, ఎం.నాగలక్ష్మి తదితరులు ఉన్నత చదువులు చదివారు. వీరిలో కొందరు బయటి ప్రాంతాల వారిని వివాహం చేసుకున్నారు. తమ గ్రామానికి చెందిన కొందరు కులాంతర వివాహాలు సైతం చేసుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎవరిపైనా ఆంక్షలు పెట్టడం లేదని బయటి ప్రాంతాల్లోని సాతాని కులస్తులను వివాహం చేసుకున్నా.. చివరకు కులాంతర వివాహాలు చేసుకున్నా అనుమతిస్తున్నామని మాజీ సర్పంచ్ ప్రకాశరావు చెప్పారు. నెల్లూరు నుంచి వచ్చా మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మిట్టపాలెం గ్రామం. తొండూరు మండలం మడూరు గ్రామానికి చెందిన శివగణేష్ నన్ను వివాహం చేసుకున్నారు. నేను దూర ప్రాంతం నుంచి వచ్చినా.. చాలా బాగా చూసుకుంటున్నారు. గతంలో మడూరు గ్రామంలోనే వివాహాలు చేసుకునే వారు. పుట్టిన పిల్లలు వైకల్యం బారిన పడుతుండటంతో బయటి ప్రాంతాల వారిని వివాహాలు చేసుకుంటున్నారు. – ఎస్.పవిత్ర, యువతి, మడూరు కలిసికట్టుగా ఉంటాం మేమంతా ఒకే కులస్తులం. అందరం కలిసికట్టుగా ఉంటాం. గతంలో అందరూ ఇక్కడి వారినే వివాహాలు చేసుకునేవారం. ఏదైనా సమస్య వచ్చినా ఓర్పుతో కలిసికట్టుగా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకుంటాం. గతంలో మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల గ్రామంలో దాదాపు 50శాతం వైకల్యం ఉండేది. ఇప్పుడు దూర ప్రాంతాలైన నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల వారిని వివాహాలు చేసుకోవడం వల్ల వైకల్యం తగ్గింది. – గోపాల్, సర్పంచ్, మడూరు -
చలపతిరావు మృతితో బల్లిపర్రులో విషాదం
బల్లిపర్రు (పామర్రు) : ప్రముఖ సినీనటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) మృతి ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో తీవ్ర విషాదం నింపింది. ఆయన మృతిపట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని, మంచి మిత్రుణ్ణి కోల్పోయామని గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో తనకున్న స్థలంలో ఒక చిన్న ఇల్లుని నిర్మించారని దానిని తన సోదరి అయిన భ్రమరాంబకు ఇచ్చారన్నారు. ఏటా గ్రామానికి వచ్చి స్థానికులు, బంధువులతో ఆయన ముచ్చటించే వారని, గ్రామంలో ఉన్న 1.40 ఎకరాల పొలాన్ని చలపతిరావే సాగు చేస్తుండేవారని వారు తెలిపారు. స్థానిక గంగానమ్మ ఆలయ అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందజేశారని వారు గుర్తుచేశారు. అత్తవారి ఇల్లు కూడా పామర్రు మండల పరిధిలోని జమీగొల్వేపల్లి గ్రామం కావడంతో అక్కడి వారితో కూడా సత్సంబంధాలున్నాయని తెలిపారు. -
గన్ షాట్ : రాజకీయ లబ్ది కోసం కోర్టులనే తప్పుదోవ పట్టిస్తారా..?
-
బిగ్ క్వశ్చన్ : కరకట్ట బాబు, కల్యాణ్ బాబు కుతంత్రాలు
-
హైకోర్టు తీర్పు తో ఇప్పటం గ్రామం పరువు పోయింది : స్థానికులు
-
గన్ షాట్ : నీ ప్యాకేజీ మాకొద్దు ..
-
గ్రహణ ప్రభావం.. ఆశ్చర్యం, ఆ వింతని చూసేందుకు ఎగబడ్డ జనం!
రామకుప్పం: మండలంలోని కెంచనబళ్ల పంచాయతీ, రెడ్డివానిపోడు గ్రామానికి చెందిన కర్ణ కుటుంబీకులు పూర్వీకుల కాలం నుంచి సూర్యగ్రహణం రోజు రోలుకు పూజలు చేసి రోకలిని నిలబెట్టేవారు. మంగళవారం సూర్యగ్రహణం వేళల్లో రోలుకు పూజలు చేసి అందులో నీరుపోసి రోకలిని నిలబెట్టారు. గ్రహణ ప్రభావం ఉండడం చేత రోకలి ఎటువంటి సపోర్టు (ఆధారం) లేకుండా రోలు మీద నిటారుగా నిలబడింది. గ్రహణ సమయంలో రోలు నుంచి రోకలిని వేరుచేసి తట్టలో నింపిన కుంకుమ నీళ్లలో రోకలిని నిలబెట్టగా రోకలి నిటారుగా నిలబడింది. రోకలిని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇదే వింత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఆలయాలు మంగళవారం మూతపడ్డాయి. కృష్ణా జిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం, మండల కేంద్రమైన తోట్లవల్లూరులో గ్రహణం ప్రభావంతో ఎటువంటి ఆధారం లేకుండా రోకళ్లు నిలబడటం స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు ప్రసవం.. క్యాంటమ్ కంపెనీ బాత్రూమ్లో శిశువు కలకలం -
పునాదుల్లేని ఊరు.. ఎక్కడ ఉందో తెలుసా?
దేవనకొండ(కర్నూలు జిల్లా): పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించడం సాధ్యమేనా? అవి నిలబడతాయా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు కరిడికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. దశాబ్దాలుగా అవి చెక్కుచెదరకుండా ఉన్నాయి. గ్రామ సమీపంలోని బొమ్మదేవత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గతంలో ఏనుగుల సంచారం ఉన్న ఈ గ్రామంపై ప్రత్యేక కథనం.. చదవండి: కూలుతున్న టీడీపీ కంచుకోట.. కుప్పంలో వైఎస్సార్సీపీ రెపరెపలు మండల కేంద్రమైన దేవనకొండకు నాలుగు కిలోమీటర్ల దూరంలో కరిడికొండ గ్రామం ఉంది. కొండల మధ్య చదును ప్రాంతంలో 1952 వరకు పాత ఊరు ఉండేది. ప్రజలు పూరి గుడిసెలు వేసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. కొండల మధ్య కుంట ప్రాంతంలో ఊరు ఉండడంతో కన్నపుకుంటగా పిలిచేవారు. అయితే కుంటలో నీరు తాగేందుకు ఏనుగులు వచ్చేవి. దీంతో కాలక్రమేణా ఈ ఊరికి ‘కరి’డికొండ అనే పేరొచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు. గ్రామంలో ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయాలు ఉండేవి. చిన్నరాళ్లపై నిలబడిన పెద్దరాయిని గ్రామస్తులు బొమ్మ దేవతగా కొలుస్తున్నారు. ప్లేగు వ్యాధి రావడంతో పాత ఊరంతా ఖాళీ చేసి కొందరు పక్క గ్రామాలకు వెళ్లారు. గ్రామానికి చెందిన తిమ్మప్ప, రామప్ప అనే కుటుంబాలకు చెందిన వారు కొండపైకి వెళ్లి పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. వారిని చూసి మిగతా వారు కూడా అక్కడే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండలో బండలను తొలుస్తూ, రాళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. బొమ్మదేవత ఊరిని కాపాడుకుంటూ వస్తోందని గ్రామస్తుల నమ్మకం. శ్రావణమాసంలో ఆ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనిపించని పూరి గుడిసె గ్రామంలో ప్రస్తుతం 2,450 మంది నివసిస్తున్నారు. 1,619 ఎకరాల్లో ఉల్లి, పత్తి, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. పచ్చని పైర్లతో, చుట్టుతా చిన్న చిన్న కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. పునాదులు లేకుండా ఇల్లు నిర్మించుకోవడంతో రూ.3 లక్షల వరకు ఆదా అవుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడా పూరిగుడిసె లేదు. కొండపై తిమ్మప్పస్వామి దేవాలయం ఉంది. గ్రామ సమీపంలోని కొండల నుంచి రాళ్ల తొలచి, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. గ్రామంలో గతంలో 80 గృహాలు ఉండగా..ప్రస్తుతం వాటి సంఖ్య 210కి చేరుకుంది. ఎలాంటి ఇబ్బందులూ లేవు కరిడికొండలో పునాదులు లేకుండా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. కొండ ప్రాంతం కావడంతో ఇళ్లు కూలే అవకాశమే లేదు. నేరుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. – అవినిధ్, హౌసింగ్ ఏఈ ఇల్లు కట్టుకోవడం చాలా సులభం కొన్నేళ్ల నుంచి మేం ఇక్కడే నివాసం ఉంటున్నాం. పునాది తీయకుండా ఇల్లు కట్టుకున్నాం. గ్రామంలో డ్రెయినేజీ సమస్య లేదు. మా ఊళ్లో ఇల్లు కట్టుకోవాలంటే చాలా సులభంగా. పక్కనే రాళ్లు కూడా దొరుకుతాయి. – పీరా, కరిడికొండ గ్రామస్తుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వం సీసీ రోడ్లు నిర్మించింది. గ్రామస్తులు సమీప కొండల్లో కారి్మకులుగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మా గ్రామం ఎత్తైన కొండపై ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవనకొండ మండలంలోని చాలా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు కరిడికొండ నుంచే రాళ్లు తరలిస్తున్నాం. – నాగేష్, కరిడికొండ గ్రామస్తుడు -
విచిత్ర వ్రతం.. చెప్పులు తొడగరు.. బండ్లు నడపరు.. ఎందుకంటే?
యశవంతపుర(కర్ణాటక): ఆ గ్రామస్తులు చెప్పులు తొడగరు..బైక్లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఇది వారు ఆచరిస్తున్న విచిత్ర వ్రతం. ఈ ఊరు పేరు కాలేబాగ్. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్లపై నుంచి పడి కొందరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. చదవండి: ట్యాక్సీ డ్రైవర్తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. దీంతో గ్రామస్తులు రోజూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని కలిసి తమను కాపాడాలని కోరారు. గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని, ఈక్రమంలో ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు ధరించరాదని, ఎలాంటి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు. -
ఊరే.. ఓ సైన్యం: ఇంటికో సైనికుడే ఆ గ్రామ ప్రత్యేకత!
కశింకోట: విశాఖ జిల్లా విసన్నపేట.. సైనికుల గ్రామంగా పేరొందింది. ఇక్కడ దాదాపు ఇంటికో సైనికుడు ఉండటం ప్రత్యేకత. ఒక్కో ఇంట్లో ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉన్నారు.. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారత్ తరఫున పోరాడిన ఘనత ఇక్కడి సైనికులకు సొంతం. విసన్నపేట జనాభా దాదాపు 1600. సుమారు 400 వరకు కుటుంబాలు ఉండగా.. 200 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సుమారు 70 మంది రిటైర్ అయి పింఛన్ తీసుకుంటున్నారు. సుమారు వందేళ్ల కిందట నుంచి గ్రామస్తులు రక్షణ రంగంలో విధులు నిర్వర్తిస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో గ్రామ సైనికులు సేవలందించారు. ఆంగ్లేయుల హయాంలో గ్రామానికి చెందిన నడిశెట్టి అప్పన్న, చిదిరెడ్డి కన్నయ్య, నడిశెట్టి చెల్లయ్య, నడిశెట్టి సూర్యనారాయణ తదితరులు సిఫాయి, హవల్దార్, నాయబ్ సుబేదార్ తదితర హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం అధికారి హోదాలో మేజర్ నడిశెట్టి గణేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదో తరగతి పూర్తి కాగానే ఇక్కడి గ్రామ యువత ఆర్మీలో ఆసక్తిగా చేరుతోంది. ఆర్మీలో పనిచేసే వారు తమ పిల్లలు, బంధువులను దేశ సేవకు అంకితం చేస్తున్నారు. సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కొందరు ప్రైవేట్ పరిశ్రమల్లో.. మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు సైనికులయ్యారు. వీరిలో ఒకరు పదవీ విరమణ చేయగా.. మిగిలిన ముగ్గురు సేవలందిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉప్పునూరి అచ్చిలినాయుడు, లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు. వీరంతా టెన్త్ పూర్తి కాగానే ఒకరి తర్వాత ఒకరు ఆర్మీలో చేరారు. పెద్దవాడైన శ్రీను, ఆ తర్వాత వరసగా నాగేశ్వరరావు, సత్తిబాబు, పరమేష్ ఆర్మీలో చేరారు. శ్రీను, నాగేశ్వరరావు కార్గిల్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. ముగ్గురు అన్నదమ్ములు దక్షిణాఫ్రికాలోని లిబనాన్, కాంగోలో కూడా దేశం తరఫున విధులు నిర్వర్తించారు. నాగేశ్వరరావు సుమారు 18 ఏళ్లపాటు పని చేసి 2020లో హవల్దార్ ఏసీపీగా పదవీ విరమణ చేశారు. అచ్యుతాపురంలోని ఐవోసీఎల్లో ప్రస్తుతం సెక్యూరిటీగా పని చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఆర్మీలో కొనసాగుతున్నారు. అదొక్కటే లోటు మాది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం ఆర్మీలో చేరాం. నేను 18 ఏళ్ల పాటు పనిచేసి హవల్దార్గా గతేడాది పదవీ విరమణ చేశారు. ఆర్మీలో చేరడంతో మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. దాని కన్నా దేశానికి సేవలందించగలిగామన్న సంతృప్తి మిగిలింది. ఎత్తైన కార్గిల్ ప్రాంతంలో ఊపిరి ఆడక, సరైన తిండి లేక ఇబ్బందులు ఎదురైనా.. ఎంతో ఇష్టంగా సేవలందించాను. ఆరేళ్లపాటు అక్కడ విధులు నిర్వర్తించా. జమ్ము, కశ్మీర్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలతోపాటు దక్షిణాఫ్రికాలో కూడా ఇండియన్ ఆర్మీ తరఫున సేవలందించా. విధి నిర్వహణ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా కలిసి గడిపే క్షణాలు చాలా తక్కువే. ఆర్మీలో చేరిన తర్వాత.. ఇప్పటివరకు అన్నదమ్ములమంతా ఒక్కసారి కూడా కలవలేదు. అదొక్కటే వెలితిగా ఉంది. – ఉప్పునూరి నాగేశ్వరరావు, రిటైర్డు హవల్దార్, విసన్నపేట సరిహద్దుల్లో విధులు నిర్వర్తించా.. ఆర్మీలో 28 ఏళ్లపాటు పని చేశారు. సుబేదార్గా పదవీ విరమణ చేశాను. నా తమ్ముడు సత్యారావు కూడా ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాను. – నడిశెట్టి పడమటయ్యనాయుడు, రిటైర్డు సుబేదార్, విసన్నపేట సేవా దృక్పథంతోనే చేరుతున్నారు దేశానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆర్మీలో చేరుతున్నారు. ఆర్మీలో సురక్షితంగా విధులను నిర్వర్తించి రిటైర్ అవుతున్నారు. ఉద్యోగం అనంతరం ప్రైవేటు పరిశ్రమల్లో కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు వ్యవసాయం సాగు చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతున్నారు. – కొఠారి నాగేశ్వరరావు, రిటైర్డ్ సుబేదార్, విసన్నపేట -
Huzurabad Bypoll: కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్థులు
-
మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలే.. చివరికి
జయపురం(భువనేశ్వర్): వంతెన నిర్మించండి మహాప్రభో అని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో చందాలు వేసుకుని మరీ వెదురు కర్రలు కొనుగోలు చేసుకున్నారు. మూడు రోజులు కష్టపడి కెరకొండ నదిపై కర్రల వంతెన నిర్మించుకున్నారు. బొరిగుమ్మ సమితిలోని డెంగాపొదర్ పంచాయతీ ప్రజలు చేపట్టిన ఈ పనిని చుట్టుపక్కల గ్రామస్తులంతా మెచ్చుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. సరిగ్గా మూడేళ్ల క్రితం బిజూ పట్నాయక్ సేతు పథకంలో భాగంగా ఇక్కడి నదిపై శాశ్వత వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకు ఆ నిర్మాణంలో కనీసం 10 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఇదే వంతెనపై ఆధారపడిన పంచాయతీలోని డెంగాపొదర్, కెరకొండ, చత్రల, చంపియా, పొడయిగుడ, పకనగుడ, పరసొల, నాగజొడి, బిజాగుడ, అంవులి వంటి దాదాపు 15 గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం నది నీటిలో ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమస్య పరిష్కారానికి అధికారులు, నేతల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఇలా అందరూ కలిసి, వెదురు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. దీంతో తమ కష్టాలు కొంతవరకు అయినా తీరాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Rescued Pregnant Cat: పిల్లిని కాపాడినందుకు రూ.10 లక్షల రివార్డు ! -
దూరం నుంచి చూస్తే రైలు..తీరా దగ్గరకు వచ్చి చూస్తే..
సాక్షి, నవరంగపూర్( భువనేశ్వర్): కొంతమంది కళాకారులు తమ చేతి నైపుణ్యం, పనితనంతో చిత్రాలకు ప్రాణం పోస్తారంటారు. ఇలాంటి అనుభూతి కొన్ని సందర్భాల్లోనే మనకి కలుగుతుంది. ప్రస్తుతం ఓ గోడ మీద వేసిన బొమ్మను చూసి ఇలాంటి అనుభూతి కలిగిందని అంటున్నారు ఓ ప్రాంత ప్రజలు. వివరాల్లోకి వెళితే.. నవరంగపూర్ జిల్లా కలెక్టరేట్ ప్రహరీగోడపై వేసిన రైలు బొమ్మ నగరవాసులను ఇట్టే ఆకట్టుకుంది. అచ్ఛం రైలుబండి లాగానే వేసిన పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఆ బొమ్మ ఎలా ఉందంటే.. దూరం నుంచి చూసిన వారికి... నవరంగపూర్కు రైలు ఎప్పుడు వచ్చిందోనని ఆశ్చర్యం కలగక మానదు. తీరా దగ్గరకు వచ్చి చూడగా, అది రైలుకాదని కేవలం చిత్రమని తెలిసి చాలమంది అచ్చెరువొందారు. శుక్రవారం నగరవాసులు రైలుబొమ్మతో సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. -
Pedapalem: పచ్చని పల్లె.. కరోనాకు హడలే
గుడ్లవల్లేరు (గుడివాడ): ఇంటి పట్టునే ఉంటే కరోనా సోకదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో పెదపాలెం గ్రామస్తులు అదే మాటను కట్టుబాటుగా చేసుకున్నారు. ఊరి పట్టునే ఉంటే కరోనా సోకదని నిరూపిస్తున్నారు కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు శివారు పెదపాలెంలో 125 కుటుంబాలుండగా.. గ్రామ జనాభా 300కు పైగానే ఉంది. ఆకు పచ్చ చీర కట్టినట్టుగా ఉండే ఆ పల్లె కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూ.. మహమ్మారిని దరిచేరకుండా గ్రామస్తుల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పొలం పనులు చేసే సమయంలోనూ కరోనా నియమావళిని బాధ్యతగా పాటిస్తోంది. కఠిన నిబంధనలే శ్రీరామరక్షగా.. ఎలాంటి అవసరం ఉన్నా ఎవరూ ఊరు దాటి వెళ్లకూడదనే కఠిన నియమాన్ని పెట్టుకున్నారు. గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బంధుమిత్రులను కూడా ఊరిలోకి రానివ్వడం లేదు. తమ వారందరికీ ముందే ఈ విషయం తెలియజేశారు. తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లినా నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు. గ్రామంలో ఉన్న వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు. గ్రామస్తులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఎవర్నీ రానివ్వటం లేదు ఎవర్నీ ఊరిలోకి రానివ్వడం లేదు. మేం కూడా ఊరు దాటి వెళ్లకుండా లాక్డౌన్ పెట్టుకున్నాం. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లను వాడుతున్నాం. – గుమ్మడి నరసింహారావు, గ్రామస్తుడు బయట అవసరాలకు మాత్రమే మా గ్రామం నుంచి దాదాపుగా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. బయట అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరిద్దరు మాత్రమే జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తున్నారు. – విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్ శానిటేషన్ ఒక కారణమే... కరోనా వచ్చిన నాటి నుంచి పెదపాలెంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నాం. గ్రామస్తులు కట్టుబాట్లతోనే వైరస్కు దూరంగా ఉన్నారు. – కనుమూరి రామిరెడ్డి, కొండాలమ్మ ఆలయ చైర్మన్ ప్రజల సహకారంతోనే.. ప్రజలు ఇంటి పట్టునే ఉండటం వల్ల గ్రామంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. చేతుల్ని శుభ్రం చేసుకోవటం, మాస్కులు ధరించటం, పారిశుధ్య పనులను చేపట్టడం ద్వారా కరోనాను కట్టడి చేస్తున్నాం. – ఓగిరాల వెంకటరత్నం, గ్రామ కార్యదర్శి -
మూడు స్తంభాల ‘సూపర్ షాప్’
కరోనా విజృంభిస్తున్న సమయం.. ఇళ్లల్లోంచి అడుగు బయట పెట్టాలంటే ఆందోళన.. మార్కెట్కు వెళ్లి సరుకులు తెచ్చుకుందామన్నా భయం.. ఇలాంటి విపత్కర సమయాన్ని అవకాశంగా మార్చుకున్నారు ఆ ముగ్గురు యువకులు. తమ గ్రామస్తులకు ఆన్లైన్ ప్లాట్ ఫాంను అందుబాటులో ఉంచి, వారు బుక్ చేసుకున్న సరుకులను హోం డెలివరీ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆ విధంగా అండగా ఉండటంతో పాటు.. వారూ ఉపాధి పొందుతున్నారు.. కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన నారాయణరెడ్డి, నాగూర్బాషా, తిరుమల కొండారెడ్డి బీటెక్ చదివి ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్నారు. ముగ్గురూ కలిసి వినూత్నంగా ఏదన్నా వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. అయితే ఏం చేయాలా.. అని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కరోనా విజృంభించింది. జనం నిత్యావసర సరుకుల కోసం ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు.. ఆ సమయంలో వారికి ఓ ఆలోచన మెరిసింది. ఆ నిత్యావసర సరుకులను వారి ఇళ్లకు తామే సరఫరా చేస్తే ఎలా ఉంటుందని. వెంటనే దానిని ఆచరణలో పెట్టారు. ‘çççసూపర్ షాప్’ పేరుతో వెబ్సైట్ను ప్రారంభించారు. తమ గ్రామస్తులు బుక్ చేసుకున్న నిత్యావసర వస్తువులను ఉచితంగా హోం డెలివరీ చేస్తున్నారు. బుక్ చేసిన 10 నుంచి 15 నిమిషాల్లో సరుకులతో వారి ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. కొమరోలు నుంచి 10 కి.మీ దూరం వరకు ఏ గ్రామానికైనా ఉచితంగా సరకులను చేరవేస్తున్నారు. కిరాణా, ఫ్యాన్సీ షాపులతో ఒప్పందం కొమరోలులోని కిరాణా, ఫ్యాన్సీ షాపులు, రెస్టారెంట్లతో ముందుగానే ఈ యువకులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు కస్టమర్లు కోరిన సరుకులు, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటమ్స్ను తక్కువ ధరకే ఆయా షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. తాము కూడా తక్కువ లాభాలు మాత్రమే తీసుకుంటూ ఎక్కువ ప్రయోజనాన్ని కస్టమర్లకే అందిస్తున్నారు. దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే దానికంటే ఆన్లైన్లో వీరి వద్ద కొన్న వస్తువులు రెండు, మూడు రూపాయలు తక్కువకే వస్తుండటం, పైగా డోర్ డెలివరీ చేస్తుండటంతో గ్రామస్తులు వీరిని ప్రోత్సహిస్తున్నారు. అన్నీ తామై.. కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువుల కొనుగోలు దగ్గర్నుంచి.. వాటిని హోం డెలివరీ చేసే వరకూ అన్ని పనులూ ఆ ముగ్గురే తామై చక్కబెడుతున్నారు. సూపర్ షాప్ పేరుతో యాప్ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్న తమ సేవలను.. తర్వాత మండలం, ఆ తర్వాత జిల్లాకు విస్తరిస్తామని చెబుతున్నారు. సేవ చేస్తున్నామన్న సంతృప్తి.. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్ వంటివి విజయవంతం కావని పలువురు చెప్పారు. ఆయినా మేం నిరుత్సాహ పడలేదు. సాహసం చేసి ముందుకు సాగుతున్నాం. సత్ఫలితాలొస్తున్నాయ్.. మున్ముందు ఆన్లైన్ ద్వారా మరిన్ని వస్తువులను సరఫరా చేసే ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మా స్థాయిలో సేవ చేస్తున్నామన్న తృప్తితో పాటు, మా కాళ్లమీద మేం నిలబడ్డామన్న సంతృప్తి మాకుంది. – నారాయణరెడ్డి, నాగూర్బాషా, కొండారెడ్డి -
కీచక టీచర్కు దేహశుద్ధి చేసిన గ్రామస్ధులు
-
అటవీ అధికారుల పై దాడి
-
ఎంపీ అభ్యర్థి శివప్రసాద్ను అడ్డుకున్న ఎన్ఆర్ కమ్మపల్లి గ్రామస్తులు
-
పని కోసం పట్నం బాట
సరైన వర్షాలు లేక జలాశయాలు వెలవెలబోతున్నాయి. కరువు పరిస్థితులతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. ఉన్న ఊళ్లో చేయడానికి పనులు లేవు. దీంతో పని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు వలసవెళ్తున్నాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. సాక్షి, నాగిరెడ్డిపేట (కామారెడ్డి ): రోజురోజుకు ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు సైతం పాతాళానికి చేరుతున్నాయి. బోరుబావులు ఒక్కొక్కటిగా వట్టిపోతున్నాయి. కొత్తగా బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండడం లేదు. కరువు పరిస్థితులతో నాగిరెడ్డిపేట మండలంలోని చాలా గ్రామాల్లో వ్యవసాయభూములు బీడుగానే ఉన్నాయి. కొందరు రైతులు ధైర్యంచేసి అక్కడక్కడా వేసిన పంటలు సైతం సాగునీరందక ఎండుముఖం పడుతున్నాయి. దీనికితోడు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సైతం అంతంతమాత్రంగానే ఉండడంతో పల్లె ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పనికోసం వలస బాట పడుతున్నారు. మండలంలోని మాల్తుమ్మెద, గోపాల్పేట, నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాండూర్, ధర్మారెడ్డి, రాఘవపల్లి, కన్నారెడ్డి, మాసాన్పల్లి, ఆత్మకూర్, జలాల్పూర్, జప్తిజాన్కంపల్లి, బొల్లారం తదితర గ్రామాల నుంచి ప్రజలు పొట్ట చేతబట్టుకొని ఇతరప్రాంతాలకు భారీగా వలసవెళ్లారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపేట మండలంతోపాటు ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్, ఆర్మూర్ తదితర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. ఆదుకోని ఉపాధి హామీ.. పేదలకు అండగా ఉండాల్సిన ఉపాధి హామీ పథకం ఈసారి పెద్దగా పనులు కల్పించలేకపోయింది. వరుసగా వస్తున్న ఎన్నికలతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటోంది. అధికారులు ఎన్నికల విధుల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో సకాలంలో పనులను గుర్తించలేకపోయారు. మరోవైపు వరుణుడి కరుణ లేకపోవడంతో వ్యవసాయ పనులూ అంతంతగానే ఉన్నాయి. దీంతో గ్రామాలలో చేయడానికి పనులు లేకుండాపోయాయి. ఇళ్లకు తాళాలు వేసి.. గ్రామాల్లో పనిలేకపోవడంతో చాలాకుటుంబాలు ఇళ్లకు తాళాలువేసి పట్టణాలకు వలసవెళ్తున్నాయి. కొందరు కుటుంబ సభ్యులందరికీ తీసుకుని ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్తుండగా.. మరికొంతమంది వృద్ధులు, పిల్లలను ఇంటివద్దనే వదిలి వలసబాట పడుతున్నారు. పిల్లలు చదువుకు దూరమవకూడదని, వృద్ధులు ఉంటే ఇంటికి కాపలాగా ఉంటారని భావించి కేవలం భార్యాభర్తలు మాత్రమే పనికోసం పట్టణాలకు వెళ్తున్నారు. మాల్తుమ్మెద గ్రామంలో 500లకుపైగా కుటుంబాలుండగా సుమారు వంద కుటుంబాలు బతుకుదెరువు కోసం వలస వెళ్లడం సమస్య తీవ్రతను తెలుపుతోంది. పిల్లల చదువు కోసం నేనిక్కడ ఉన్న ఊళ్లె పనిలేక ఆరునెలల కింద నా కొడుకు, కోడలు హైదరాబాద్కు వలసపోయిండ్రు. నా మువవడు, మనుమరాలి సదువు కోసం నేను ఇంటికాడ్నే ఉంటున్న. నా కొడుకు, కోడలు పనిచేసి పైసలు పంపిస్తుండ్రు. ఆ పైసలతోనే మేము బతుకుతున్నం. – తలారి దుర్గమ్మ, మాల్తుమ్మెద ఇంటికి కాపలాగా.. ఈడ పని దొరక్క ఏడాదికింద నా కొడుకులు, కోడళ్లు బతకపోయిండ్రు. నా మనుమళ్లను గోపాల్పేటలోని హాస్టళ్ల ఏసిండ్రు. నేను మాత్రం ఇంటికి కాపాలాగా ఉన్న. ఆళ్లు పైసలు పంపిస్తే నేను బతుకుతున్న. ఊళ్లె పనిలేక మస్తుమంది బతుకవోతుండ్రు. – నక్క పోచమ్మ, మాల్తుమ్మెద షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న నా కొడుకు, కోడలు పనికోసం ఏడాదికింద ఆర్మూర్కు పోయిండ్రు. నాకు షాతకాదని ఇంటికాడ్నే ఉంటున్న. ఆళ్లు ఆర్మూర్లో కూలిపని చేసుకుంటుండ్రు. ఈ ఏడాది కాలం కాక పొలాలు కూడా పండుతలేవు. దీంతో ఊళ్లెకెళ్లి చానామంది బతుకడానికి యాడపని ఉంటే ఆడికి పోతుండ్రు. – వదల్పర్తి గంగమ్మ, మాల్తుమ్మెద -
పశువుల్లంక రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు
-
ఉపాధ్యాయుడిని నిర్బందించిన గ్రామస్తులు
-
కీచక టీచర్కు దేహశుద్ది
-
చేంగల్ ఘటనలో ఆరుగురి అరెస్టు
నిజామాబాద్ క్రైం : పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలుగా భావించి చేంగల్ గ్రామస్తులు జరిపిన దాడులో ఒకరు మృతి చెందిన కేసులో ఆరుగురిని అరెస్టు చేశామని ఇన్చార్జి ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. చేంగల్ ఘటన వివరాలను ఇన్చార్జి సీపీ వివరించారు. బఢా భీమ్గల్ ఎంజీ తండాకు చెందిన దేగవత్ లాలూ, ధర్పల్లి మండలం ఎంజీ తండాకు చెందిన అతడి బావమరిది మలావత్ దేవ్యాలు ఈనెల 22న చేంగల్ గ్రామ శివారులోని మామిడి తోటలో మామిడి కాయలు తెంపడానికి వెళ్లారన్నారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు సంచరిస్తున్నాయన్న వదంతులు వ్యాప్తిలో ఉండడంతో వారిని దొంగలుగా భావించిన ఓ బాలుడు.. తమను ఎత్తుకెళ్లేందుకు దొంగలు వచ్చారని తండ్రి భిక్షపతికి చెప్పాడన్నారు. అతను గ్రామంలో మరికొందరికి విషయాన్ని తెలిపాడని, వారంతా వచ్చి దేవ్యా, లాలూలను చితకబాది, గ్రామ కమిటీ భవనంలో నిర్బంధించారని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి దేవ్యా, లాలూలను ఆర్మూర్లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారన్నారు. ఇందులో మాలావత్ దేవ్యా పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని హైదరాబాద్కు తీసుకెళ్లారని, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పేర్కొన్నారు. లాలూ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందన్నారు. 23 మందిపై కేసులు.. ఈ ఘటనపై భీమ్గల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి, దేవ్యా మృతికి కారణమైన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారని ఇన్చార్జి సీపీ తెలిపారు. ఈ ఘటనతో 23 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు.. ఇందులో ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టైన చిక్కడి భిక్షపతి, చెవుల శ్రీనివాస్, చాకలి నరేశ్, సిరోల్ల రాహుల్, తోపారం వినీత్, మోహిని నరేశ్లపై కేసులు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న 17 మందిని త్వరలో పట్టుకుంటామని, వీరికోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. అలాగే చేంగల్ గ్రామస్తుల ఇళ్లపై దాడులు చేసిన మృతుడి తాలూకు వారిపైనా కేసులు నమోదు చేశామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు ప్రజలు ఎటువంటి సంఘటనలోనైనా తొందరపడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఇన్చార్జి సీపీ శ్వేత సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు లేదా సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్ సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులు అనుమానితులను పట్టుకుని విచారించి తగిన చర్యలు తీసుకుంటారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వీడియో క్లిప్పులు నిజమైతే వాటిని ఇతరులకు పోస్టు చేయాలే తప్ప వదంతులను వ్యాపింపజేయవద్దని కోరారు. అసత్య ప్రచారాలపై ప్రజల్లో అవగాహన కోసం పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీపీలు ఆకుల రాంరెడ్డి, శ్రీధర్రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ శివకుమార్, సీఐ రమణారెడ్డి పాల్గొన్నారు. -
బూచోడు కాదు.. పక్కూరోడే!
అమరచింత (కొత్తకోట) : సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పుకార్లతో నేటికీ గ్రామాల్లో భయాందోళనలు తొలగడం లేదు. బూచోలొచ్చారని, చంటిపిల్లలను ఎత్తుకెళ్లి చంపుతారని భయపడుతున్న తరుణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి యాచిస్తూ సంచరిస్తున్న సమయంలో యువకులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దకడ్మూర్ గ్రామానికి చెందిన బుడగజంగాల కృష్ణ గురువారం అమరచింతకు వచ్చి భిక్షాటన చేశాడు. రాత్రివేళలో స్వగ్రామానికి వెళ్లడానికి అమరచింత బస్టాండ్కు రాగా అప్పటికే పెద్దకడ్మూర్ బస్సు గ్రామానికి వెళ్లిపోయింది. దీంతో ఆకలితో ఉన్న కృష్ణ స్థానిక సయ్యద్నగర్కాలనీలో భిక్షమెత్తుకున్నాడు. ఈ తరుణంలో కాలనీకి చెందిన యువకులు పిల్లలెత్తుకెళ్లే దొంగగా ఉన్నాడంటూ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి అపరిచిత వ్యక్తిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఎస్ఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విచారించగా బుడగజంగాల కృష్ణ పెద్దకడ్మూర్కు చెందిన వ్యక్తిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా.. తమ గ్రామానికి చెందిన వాడని చెప్పడంతో పోలీసులు కృష్ణను పెద్దకడ్మూర్కు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. -
మంట కలిసిన మానవత్వం, తండ్రి అంత్యక్రియల కోసం..
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో హృదయ విదారక సంఘటన జరిగింది. ప్రమాదంలో తండ్రి మరణిస్తే మృతదేహాన్ని తరలించాడానికి ఒక్కరంటే ఒక్కరు ముందుకురాని అనాగరిక సంఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని గుల్గోడి గ్రామంలో సంచలనం కలిగించింది. సొంత బంధువులు సైతం కాదని వెళ్లిపోతే పోలీసులే వృద్దుడికి మరో ముగ్గురు కొడుకులయ్యారు. వివారాల్లోకి వెళ్తే.. అసలప్ప అనే 80ఏళ్ల వృద్దుడు రోడ్డు దాటుతూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. అయితే ఈ ప్రమాదాన్ని చూసిన చాలా మంది అక్కడ చూస్తు ఉండటం తప్ప ఏమీ చేయలేక పోయారు. విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు అసుపప్ప సంఘటనా స్థలానికి చేరుకొని తండ్రి శవాన్ని తరలించడానికి గొంతు పగిలేలా అరిచాడు. అయినా ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అదే రోజు స్థానికులు సూకట అనే పండుగ జరుపుకుంటున్నారు. పండుగ రోజు ఎవరైనా మృతదేహం దగ్గరి వెళ్తే వారి కుటుంబంలో కూడా అదే సంఘటన జరుగుతుందని భావించి ఏ ఒక్కరు సహాయం అందివ్వడానికి ముందుకు రాలేదు. ఎవరైన ముందుకు వస్తే వారికి గ్రామ ఆచారాల ప్రకారం వారికి ఆలయ ప్రవేశం నిషేధిస్తారు. ఈ కారణంగా అసలప్ప మృతదేహాన్ని తరలించడానికి ఎవరు ముందుకు రాలేదు. తండ్రి మృతదేహం వద్ద అసుపప్ప పడిన రోదన చూసిన పోలీసులు మానవత్వం చాటుకున్నారు. తాము ఉన్నామంటూ ముందుకొచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇంకో హోంగార్డులు తమ భుజాలపై మోసుకెళ్లారు. కొండమీద ఉన్న అసపప్ప ఇంటికి తరలించారు. అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. తనకు సహాయం అందించిన పోలీసులకు అసుపప్ప కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. -
గడసాం పోస్టాఫీసులో డిపాజిట్లు స్వాహా!
దత్తిరాజేరు(గజపతినగరం): నిరుపేదలు పైసాపైసా కూడబెట్టి దాచుకున్న మొత్తాలు గద్దల పాలవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్లో దాచుకున్న సొమ్ము అక్కడి ఇన్చార్జి పోస్టుమాస్టరే కాజేసిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గడశాంలో గ్రామానికి చెందిన పలువురు పేదలు దాచుకున్న రూ. 40 లక్షల వరకు అక్కడ ఇన్చార్జ్గా పని చేస్తున్న చినకాద బీపీఎం శ్యాం, రన్నర్గా పనిచేస్తున్న రామకృష్ణ, గడసాం గ్రామానికి చెందిన విశ్రాంతి బీపీఎం బ్రహ్మం కమారుడు జగదీషకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో స్వాహా చేశారు. కొద్దిరోజులుగా జగదీష్ కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన పెదమానాపురం ఎస్పీఎం(సబ్పోస్ట్ మాస్టర్) సత్యం సిబ్బందితో కలసి గురువారం గ్రామానికి వెళ్లి రికార్డులను పరిశీలింగా వందలాది మంది డిపాజిట్ దారులు దాచుకొన్న సోత్తు స్వాహా చేసినట్లు తేలింది. ఆయన విజయనగరం హెడ్ పోస్టాఫీస్లోని ఐపీఓ పోలేటికి సమాచారం అందించడంతో వారు శుక్రవారం రికార్డులను పరిశీలించి 100 ఖాతాలను సీజ్ చేశారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో తాము పరిశీలనకు వచ్చినట్టు పెదమానాపురం బీపీఎం సత్యం సాక్షికి తెలిపారు. వంద పాస్పుస్తకాలను సీజ్ చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఎంతమొత్తం గల్లంతయిందన్నది ఇంకా లోతుగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. మొత్తమ్మీద గ్రామంలో రూ. 40లక్షల వరకూ కాజేసి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. -
కర్నూలు జిల్లాలో పులుల సంచారం
సాక్షి, కర్నూలు: కర్నూరు జిల్లా వెలుగోడు శివారులో శనివారం కలకలం రేగింది. వెలుగోడు శివారు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప అడవుల్లో చిరుత పులులను చూసిన కొందరు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన అధికారులు రెండు పులులను పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరో పులి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది. -
నడిరోడ్డుపై మంత్రి ఘెరావ్
♦ రోడ్లు పరిశీలించాలని కాన్వాయ్ను అడ్డుకున్న గ్రామస్తులు ♦ కారుదిగకుండా వెళ్లిపోయిన మంత్రి తీరుపై నిరసన పెంటపాడు : తమ సమస్యలు వినేందుకు కారు దిగని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తీరుకు బుధవారం కొండేపాడులో గ్రామస్తులు నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా బుధవారం మంత్రి కాన్వాయ్ బి.కొండేపాడు రాగా గ్రామంలోని ఎస్సీ, బీసీ పేటలకు చెందిన సుమారు 50 మంది అడ్డుకున్నారు. తమ గ్రామంలో వేసిన సీసీ రోడ్లునే రూ.20 లక్షలతో మళ్లీ వేస్తున్నారని, ఎంతో కాలంగా అధ్వానంగా ఉన్న ఎస్సీ, బీసీ పేటలలోని కొన్ని అంతర్గత రహదారులను పట్టించుకోవడం లేదని మంత్రికి వివరించారు. కారు దిగి ఆ రోడ్లును పరిశీలించాల్సిందిగా కోరారు. కాగా మంత్రి మళ్లీ వస్తానని కారుదిగకుండా వెళ్లిపోయారు. దీంతో ఆయన తీరుకు నిరసనగా ప్రజలు రోడ్డుపై కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు పాలా గణపతి, పబ్బా రామారావు, ఎస్సీ నాయకులు కొడమంచిలి జాన్ తదితరులు మాట్లాడుతూ సుమారు 8 చిన్న అంతర్గత రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి మళ్లీ నిరసనకారుల వద్దకు వచ్చి వినతి స్వీకరించారు. కానీ రోడ్లు పరిశీలించాలన్న కోరికను మన్నించకుండానే కారులో వెళ్లిపోయారని గ్రామస్తులు చెప్పారు. ఆందోళనలో అంబటి శ్రీను, దేవరశెట్టి రాంబాబు, పబ్బా పార్వతి, బిట్రా పాపాలు, పాలా పద్మావతి, పి.లక్ష్మి, పి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
-
శీలానికి వెల కట్టిన గ్రామ పెద్దలు
బచ్చన్నపేట(జనగామ జిల్లా): బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. యువతిని నిర్బంధించి వారం రోజుల పాటు ఓ యువకుడు అత్యాచారం జరిపాడు. ఈ విషయం గ్రామస్తులు గమనించి బాధితురాలికి విముక్తి కల్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. జరిగిన అన్యాయంపై పోలీసులకు బాధితులు పిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామ పెద్దలు ఆమె శీలానికి రూ.40 వేలు ఖరీదు కట్టి విషయం సద్దుమనిగేలా చూశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. న్యాయం కోసం ఉన్నత అధికారి సీపీ సుధీర్ బాబుకి వాట్సప్లో బాధితులు పిర్యాదు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
శంకర్దాదా ఆర్ఎంపీ
► పీహెచ్సీల్లో అందుబాటులో ఉండని వైద్యులు ► ఆర్ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్న పల్లె జనం ► వచ్చీరాని వైద్యంతో మందులిస్తున్న ఆర్ఎంపీలు ► ఫిరంగిపురంలో చూపు కోల్పోయిన వివాహిత ► జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే దుస్థితి పొద్దుగాల నుంచి చంటోడు ఒకటే ఏడుస్తున్నడు..వళ్లు పట్టుకుంటే కాలిపోతాంది. చేతిలోనా పైసల్లేవు. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళదాం పదయ్యా..ఊరుకోవే..అక్కడికెళితే ఎవరుంటరే..బిడ్డను పట్టించుకునే నాథుడుంటడా..యాడో ఒక చోట అప్పు పట్టకొస్తా..ఊళ్లో ఉన్న డాక్టర్ బాబు దగ్గరకెళదాం..అంటూ పిల్లాడిని చంకనెత్తుకుని పరుగులు పెట్టారు దంపతులు. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి గ్రామంలో నిరుపేదల దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ మొద్దునిద్రలో జోగుతుంటే..ఆర్ఎంపీలే ఎంబీబీఎస్లైపోతున్నారు. తలనొప్పిగా ఉందంటే మోకాలుకు మందులిచ్చి డాక్టర్ బాబులుగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు. సాక్షి, గుంటూరు: జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆర్ఎంపీలు తమకు తెలిసిన స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారం మందులు రాస్తున్నారు. నిబంధనలకు చెల్లు చీటీ ఆర్ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు. ఆర్ఎంపీ వైద్యంతో చూపు కోల్పోయిన మహిళ ఈ నెల 13వ తేదీ జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఇలాంటి ఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువగా జరుగుతున్నా బాధితులు బయటపడడం లేదు. ఆర్ఎంపీలు ఇచ్చిన మందులతో సైడ్ ఎఫెక్ట్ వచ్చినా రోగులు గుర్తించలేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ఈ పాపం వైద్యులదే.. గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
గ్రామీణులకు సబ్సిడీ గోధుమల నిలిపివేత!
- నగరాల్లో కార్డుకు రెండు కిలోలు.. - పట్టణాల్లో కిలో యథాతథం సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందించే సబ్సిడీ సరుకులు దశల వారీగా నిలిపివేతకు గురవుతున్నాయి. రెండేళ్ల క్రితం పామాయిల్ సరఫరాకు మంగళం పాడిన ప్రభుత్వం ఇటీవల కేంద్రం సబ్సిడీ ఎత్తివేయడంతో చక్కెర పంపిణీ నిలిపివేసింది. మరోవైపు కిరోసిన్ కోటా కూడా తగ్గించింది. తాజాగా గ్రామీణ ప్రాంతాలకు సబ్సిడీ గోధుమల పంపిణీ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లలో సబ్సిడీపై రెండు కిలోల చొప్పున, మున్సిపాలిటీల్లో యథాతథంగా కిలో చొప్పున గోధుమలు పంపిణీ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జూన్ నెల కోటా నుంచి ఈ ఆదేశాలు అమలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖాధికా రులకు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం కోసం తగ్గిన గోధుమల కోటా కేంద్రం నుంచి బియ్యం అదనపు కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం గోధుమల కోటాను తగ్గించుకుంది. కేంద్రం నుంచి కేటాయిస్తున్న బియ్యం కోటా సరిపోని కారణంగా గోధుమలకు బదులు బియ్యం కేటాయించాలని మొరపెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన కారణంగా గోధుమల కోటా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ జరిగే గ్రామీణ ప్రాంతాల గోధుమల కోటాను నిలిపివేసింది. -
కొండ చిలువ కలకలం
ఎమ్మిగనూరు రూరల్ : పార్లపల్లి గ్రామంలో శుక్రవారం ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. గ్రామ సమీపంలోని పశువుల పాకలో కొండవ చిలువను చూసిన గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివెళ్లారు. జనం చప్పుడు విని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. పిల్లలను, మేకలను తినేస్తుందని భయపడి గ్రామస్తులు రాళ్లు, కర్రలతో కొట్టడంతో మృతి చెందింది. -
చేతబడి చేస్తున్నారన్న నెపంతో..
శంషాబాద్(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోకి కొత్వాల్గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని గ్రామస్తులు చితకబాదారు. అబ్రహం, ఆశిర్వాదం, మోసిన్, లలిత, జంగయ్య అనే వారు చేతబడి చేస్తున్నారని గ్రామస్తులు కొంతకాలంగా అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో శనివారం గ్రామస్తులంతా కలిసి.. వీరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఐదుగురినీ పోలీసులకు అప్పగించారు. -
భార్యాభర్తలమని చెప్పినా వినకుండా..
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రొంపల్లెలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న భార్యభర్తలపై అకారణంగా చేయి చేసుకున్న ఎస్సై తీరుకు నిరసనగా రొపంలెల్లో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వివరాలు.. శనివారం రాత్రి గ్రామ శివారు నుంచి నడుచుకుంటూ వస్తున్న దళిత జంటపై పెద్పపల్లి ఎస్సై శ్రీనివాస్ అకారణంగా దాడి చేశాడు.. తప్పుడు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ చితకబాదాడు. తాము భార్యభర్తలమని ఎంత చెప్పినా వినకుండా తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనకు నిరసనగా ఆదివారం ఉదయం గ్రామంలో దళిత మహిళలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పడానికి యత్నిస్తున్న క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
దివీస్పై ఆగని పోరు
-
దివీస్పై ఆగని పోరు
బీచ్ రోడ్డుపై సీపీఎం, బాధిత గ్రామాల ప్రజల భారీ ర్యాలీ అణచివేతకు పోలీసుల వ్యూహం... ఆందోళనకారుల ప్రతిఘటన ప్రహరీ వద్ద బైఠాయించి నిరసన 85 మంది అరెస్టు పోలీసుల దమనకాండపై ఎమ్మెల్యే రాజా ఆగ్రహం ఓ రోజు ముందు నుంచే దివీస్ బాధిత గ్రామాల్లో పోలీసులు మోహరించారు. నిఘా కెమెరాలతో హడావుడి ... బూట్ల శబ్దాలు ... లాఠీల ఝళిపింపులు ... పోలీసు వ్యాన్ల హారన్లు ...ముందుకు వస్తే ఖబడ్దారంటూ హెచ్చరికలతో హోరెత్తించారు. బయటకు వస్తే చాలు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించి ఆందోళనపై ఉక్కుపాదం మోపి భయోత్పాతం సృష్టించారు. అయినా బాధితుల ఆగ్రహం ఆగలేదు ...కట్టలు తెంచుకొని రోడ్డెక్కింది. సేకరించిన భూముల దరిదాపుల్లోకి రానీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఛేదించుకొని దూసుకువచ్చి బైఠాయించారు. ఇంకానా ఇకపై చెల్లదంటూ పిడికిలి బిగించారు. తొండంగి : కోన ప్రాంతంలో రైతులు సాగులో ఉన్న భూములతోపాటు హైకోర్టు స్టేటస్కో భూముల్లోకి వెళ్లేందుకు మార్గం లేకుండా దివీస్ యాజమాన్యం ప్రహరీ నిర్మాణాలు చేపట్టడంతో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం బాధిత గ్రామాల ప్రజలు తమ భూముల్లోకి ప్రవేశించేందుకు ఉప్పెనలా ఎగిసిపడ్డారు. ఇప్పటివరకూ జరిగింది చాలు ఇకపై మీ ఆటలు సాగనివ్వమంటూ ఆగ్రహించారు. దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట తదితర గ్రామాల ప్రజలు కొంతకాలం నుంచి ఉద్యమిస్తున్నారు. దివీస్ను ల్యాబొరేటరీస్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, ఈ ప్రాంతంలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములను ఖాళీ చేసేది లేదంటూ కొంత మంది రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో పొందారు. మరికొంత మంది ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం తీసుకోకుండా గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాల ప్రకారం భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో దివీస్ యాజమాన్యం బలవంతంగా ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించింది. స్టేటస్కో, సాగు భూముల్లో ఏవిధంగా నిర్మాణాలు ప్రారంభిస్తారని బాధితులు దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్వంలో రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి ఎటువంటి చర్యలు లేకపోవడంతో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు వారం రోజులపాటు కొత్తపాకల గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష ప్రారంభించిన రెండు రోజుల తర్వాత రెవెన్యూ అధికారులు వచ్చి భూములను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే విచారణ పూర్తయిందని, అక్రమ నిర్మాణాలు లేవని తెలిపారు. దీంతో అధికారులంతా దివీస్కు వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం జరగలేదని భావించడంతో సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కలిసి 23వ తేదీలోపు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే గురువారం భూముల్లోకి వెళ్తామని పిలుపునిచ్చారు. నడుం బిగించిన మహిళలు... దివీస్ ప్రాంతంలోకి వెళ్లే రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పటికీ మహిళలు పోలీసులను లెక్కచేయకుండా పరుగులు పెడుతూ దివీస్ నిర్మించిన ప్రహరీ గోడ భూముల్లోకి ప్రవేశించారు. పంపాదిపేట ఐద్వా సంఘం అధ్యక్షురాలు అంగుళూరి నాగ కృష్ణవేణి, కొత్తపాకలకు చెందిన ఐద్వా సంఘం ప్రెసిడెంట్ అంగుళూరి సుశీల, అంగుళూరి బేబి, సత్యవతి, సంధ్య, వీరలక్షి్మలతోపాటు మరికొంత మంది ఆ ప్రహరీ వద్ద బైఠాయించారు. ‘మా భూముల్లోకి మార్గం కల్పించకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయమంటూ నినాదాలు చేశారు. గోడను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, మహిళలకు మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడే బైఠాయించిన మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సొమ్మసిల్లిన మహిళలు... ఈడ్చుకువెళ్తున్న సమయంలో సంధ్య అనే మహిళ సొమ్మసిల్లిపోయింది. అయినా సరే పోలీసులు వ్యాన్ వద్దకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా వీరలక్ష్మి అనే మరో మహిళ పోలీసులను ప్రతిఘటించి వాగ్వాదానికి దిగారు. 108కు సమాచారం అందించి, ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. అయినా పోలీసులు లెక్కచేయకుండా మినీ వ్యాన్లో ఎక్కించి యు.కొత్తపల్లి పోలీస్స్టేçÙ¯ŒSకు తరలించారు. వ్యూహాత్మకంగా అడుగులు... పంపాదిపేట గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్యను అరెస్టు చేయడం గ్రామ ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో వారంతా సరుగుడు తోటలు వెంబడి కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వారంతా ఒకేచోట ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొత్తపాకల గ్రామ శివారు సరుగుడు తోటల వద్దకు పోలీసులంతా వెళ్లారు. ఇది తెలుసుకున్న సీపీఎం నాయకులు శేషుబాబ్జి, వేణుగోపాల్, బాధిత గ్రామాల ప్రజలంతా కొత్తపాకల గ్రామం నడిబొడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరి బీచ్ రోడ్డుపైకి వచ్చారు. కొత్తపాకల శివారులో ఉండిపోయిన పోలీసులు మెయిన్ సెంటర్కు వచ్చే సరికి ప్రజలంతా రోడ్డుపై పాదయాత్ర నిర్వహిం చారు. దివీస్ ప్రతిపాదిత ప్రాంతానికి ‘దివీస్ మాకొద్దంటూ’ నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. కాలినడకను వెళ్తున్న వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు అయిన వారిపై కేసులు... బాధిత గ్రామాల ప్రజలను పోలీసులు అరెస్టు చేసి పలు కేసులు నమోదు చేశారు. అయితే డ్రోన్ కెమేరా, ఇతర వీడియో చిత్రీకరణ, ఫొటోల ఆధారంగా మరికొంత మందిపై కేసులు పెట్టేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం. చుట్టుముట్టి నిర్బంధం.. దివీస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న కమిటీ సభ్యుడు మట్ల ముసలయ్య గురువారం ఉదయం టీ తాగేందుకు ఇంటి సమీపంలో ఉన్న హోటల్కు వస్తుండగా సుమారు రెండు వందల మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన మరో వ్యక్తిని కూడా జీపులో ఎక్కించి కిర్లంపూడి పోలీస్స్టేషన్కు తరలించారు. పంపాదిపేట ప్రధాన సెంటర్ కమ్యూనిటీ హాలు, ఇతర ప్రాంతాల్లో భారీగా పోలీసులు పహారా కాసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారు. పోలీసుల మోహరింపు.. దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలోని భూముల్లోకి వెళ్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో అడ్డుకునేందుకు పోలీసులు బుధవారం నుంచి తీర ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పంపాదిపేట, తాటియాకులపాలెం, నర్శిపేట, కొత్తపాకల తదితర ప్రాంతాలను పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ను అమలు చేశారు. గుంపులుగా కనిపిస్తే కేసులు పెడతామని ఆటో ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డ్రోన్ కెమేరాలతో నిఘా... ఉద్యమంపై పూర్తి స్థాయిలో నిఘా వేసేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. అడిషనల్ ఎస్పీ దామోధర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, తుని, తుని రూరల్, ప్రత్తిపాడు సీఐలతోపాటు ఎస్సైలు పంపాదిపేట చేరుకున్నారు. అక్కడ గ్రామస్తుల కదలికలను గమనించేందుకు డ్రోన్ కెమేరాను ఆకాశంలోకి పంపి ఏరియల్ వ్యూ చిత్రీకరించారు. అయినప్పటికీ పోలీసుల కంటపడకుండా పంపాదిపేట ప్రజలు కొత్తపాకల గ్రామానికి చేరుకున్నారు. సీపీఎం, ఇతర నాయకుల అరెస్టు... ర్యాలీగా వెళ్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, సీఐటీయూ నాయకుడు ఎన్.వేణుగోపాల్, ఇతర నాయకులు సింహాచలం, అప్పారెడ్డి, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గంపల దండు, అంగుళూరి శ్రీను తదితరులతోపాటు మరో 85 మందిని పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లలో అన్నవరం పోలీస్స్టేషన్ కు తరలించారు. ఉద్యమ నాయకులను చొక్కాలు పట్టుకొని పోలీసులు లాక్కెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. -
బెల్టుషాపుపై గ్రామస్తుల దాడి
వరికుంటపాడు(నెల్లూరు జిల్లా): నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టుషాపుపై ఆదివారం ఉదయం గ్రామస్తులు దాడిచేశారు. మద్యపానానికి వ్యతిరేకంగా జడదేవి గ్రామస్తులు ఇటీవల తీర్మానించారు. అయితే అందుకు విరుద్ధంగా ఒక దుకాణంలో దొంగచాటుగా మద్యం విక్రయిస్తున్నారని గమనించిన స్థానికులు ఆదివారం ఉదయం ఆ దుకాణంపై దాడిచేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఇకపై గ్రామస్తుల తీర్మానానికి వ్యతిరేకంగా బెల్టుషాపు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
విజయవాడలో దొంగకు దేహశుద్ది
-
వక్కిలేరులో మృతదేహం లభ్యం
పెద్దభోదనం(చాగలమర్రి): మండలంలోని పెద్దబోధనం గ్రామ సమీపంలోని వక్కిలేరులో గురువారం ఓ మృతదేహాన్ని కనుగొన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హెడ్కానిస్టేబుల్లు నారాయణ, వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తుల సాయంతో బయటికి తీశారు. మృతుడు చిన్నబోధనం గ్రామానికి చెందిన ధన్రాజ్(48)గా గుర్తించారు. మూడు రోజుల కిందట ధన్రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి కనపడ లేదు. బంధువులు ఆయన కోసం గాలిస్తుండగా గురువారం సాయంత్రం వక్కిలేరులో శవమై కనిపించాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామాల్లో ఆరోగ్య సేవలకు 10588
న్యూఢిల్లీ: గ్రామీణులు తమ ప్రాంతంలో మాతాశిశువులకు ఉన్న ఆరోగ్య సౌకర్యాల గురించి విచారించుకోడానికి, ఫిర్యాదులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు 10588 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే 90 సెకన్లలో కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. అక్కడి సిబ్బంది వినియోగదారుల సందేహాలను నివృత్తి చేస్తారు. కాల్ సెంటర్ను తెలుగు సహా ఏడు భాషల్లో నిర్వహించనున్నారు. -
ఉపాధ్యాయులు లేరని..
- శిరుగాపురంలో పాఠశాలకు తాళం వేసిన గ్రామస్తులు శిరుగాపురం(హాలహర్వి) : ఉపాధ్యాయులు లేని పాఠశాల ఎందుకని శిరుగాపురం గ్రామస్తులు శుక్రవారం పాఠశాలకు తాళం వేశారు ఈ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒక ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్పై శ్రీధరహాల్ గ్రామ పాఠశాలకు వెళ్లారు. మరో ఉపాధ్యాయుడు సెలవులపై వెళ్లాడు. దీంతో శుక్రవారం విద్యార్థులకు చదువులు చెప్పేవారు లేరు. టీచర్లను నియమించాలని పలుమార్లు విన్నవించినా ఎంఈఓ పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు సోమన్న, ఓంకార్గౌడు, మల్లికార్జున శుక్రవారం పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాల తలుపులు తెరవనివ్వమని వారు చెప్పారు. దీనిపై ఎంఈఓ రాజన్న వివరణ కోరగా త్వరలోనే డిప్యూటేషన్పై ఉపాధ్యాయులను నియమించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
వీఆర్వోను తరిమిన గ్రామస్తులు
తమ్మేపల్లి (డీ.హీరేహాళ్) : రస్తా వివాదంలో వీఆర్వో కలుగజేసుకోవడంతో గ్రామస్తులు తరుముకుని వెళ్లారు. మండలంలోని తమ్మేపల్లి గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం తమ్మేపల్లి నుండి గ్రామదట్లకు వెళ్లే రహదారికి కంపచెట్లు పెరగడంతో స్వచ్చందంగా గ్రామస్థులే తొలగించాలని వెళ్లారు. అక్కడ వీఆర్వో అడ్డుచెప్పడంతో వివాదం నెలకొంది. వివరాలు.. సర్వేనెంబర్ 96లో 23.16 సెంట్ల మధ్యలో 1923 నుంచి గ్రామదట్లకు రహదారి వున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచారు. అయితే ఈ భూమిని గత 20 ఏళ్ల క్రితమే రైతులు రాజశేఖర్రెడ్డి, సంజీవరెడ్డి, సత్యరెడ్డి, కేశవరెడ్డి కొనుగోలు చేశారని, అప్పటి నుండి మధ్యలో దారి వదలమని కోర్టుకు వెళతామని వారు గ్రామస్తులను భయపెట్టారు. అయితే రహదారి గుండా కంపచెట్లు పెరిగి పంట ఇళ్లకు తరలించేటప్పుడు వాటికి తగులుకుంటుండడంతో ఆదివారం గ్రామస్తులే ఇంటికి ఇద్దరు చొప్పున కంపను తొలగించేందుకు వెళ్లారు. అయితే వీఆర్వో అసభ్యంగా మాట్లాడుతూ గ్రామస్తులను రెచ్చగొట్టాడు. దీంతో సహనం కోల్పోయిన గ్రామస్తులు వీఆర్వోపై తిరుగబడ్డారు. కొంత మంది గ్రామస్థులు జోక్యం చేసుకుని వీఆర్వోకు దెబ్బలు తగలకుండా గ్రామం చివరి వరకు సాగనంపారు. -
ఇన్నాళ్లూ ఏమయ్యారు
భీమవరం : గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణానికి సహకరించాలని అడిగేందుకు వెళ్లిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)కు చేదు అనుభవం ఎదురైంది. భీమవరం మండలం తుందుర్రును ఆనుకుని ఉన్న జొన్నలగరువు గ్రామానికి సోమవారం రాత్రి ఎమ్మెల్యే వెళ్లగా, గ్రామస్తులు ఆయనను చుట్టుముట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు సోమవారం సాయంత్రం కంసాలి బేతపూడిలోని ఓ కాలనీకి రహస్యంగా వెళ్లిన అంజిబాబు ఫుడ్పార్క్ అనుకూల వర్గానికి చెందిన కొందరితో మాట్లాడారు. అనంతరం జొన్నలగరువు గ్రామంలోని చర్చిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చర్చి వద్దకు చేరుకోగానే అక్కడి ప్రజలు ఆయనను చుట్టుముట్టారు. చర్చిలో సమావేశాలు వద్దని, ఏమైనా ఉంటే బయటే నిలబడి మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే ప్రజల మధ్య నిలబడి ఫుడ్పార్క్ నిర్మాణం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం చేయగా మహిళలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘ఆక్వా పార్క్ వద్దంటూ రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చామా.. సామాన్య జనంపై కేసులు పెట్టినప్పుడు, 144 సెక్షన్ పెట్టి ప్రజల్ని వేధించినప్పుడు ఏమయ్యార’ని నిల దీయడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ‘ఆక్వా పార్క్ కట్టొద్దంటూ మీరెవరూ నా దగ్గరకు రాలేదు’ అని చెప్పే ప్రయత్నం చేయగా.. ‘అనేకసార్లు వినతి పత్రాలతో మీ ఆఫీసుకొచ్చాం. వాటిని చెత్తబుట్టలో వేసి ఆక్వా పార్క్ యాజ మాన్యానికి కొమ్ముకాస్తున్నార’ంటూ మహిళలు దుయ్యబట్టారు. ‘హైదరాబాద్లో ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా ఇబ్బందులు తెలియడంతో ఆయనే స్వయంగా ఇక్కడికొచ్చి మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ ప్రజలకు హాని కల్గించే ఫ్యాక్టరీలు నివాసాల మధ్య కట్టడం మంచిది కాదని చెప్పారు. 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీకు మాత్రం మా ఇబ్బందులు పట్టవా’ అని నిలదీశారు. తాను ఫ్యాక్టరీ కావాలన్న వారికే అండగా ఉంటానన్న అంజి బాబు, టీడీపీ నేతలు వెళ్లిపోయారు. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య కొట్లాట ఇదిలావుండగా, ఎమ్మెల్యే అంజిబాబు జొన్నలగరువు రావడంతో ఆక్వా పార్క్ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చిచ్చు రగిలింది. రెండువర్గాల తోపులాట జరిగి కొట్లాటకు దారితీసింది. జొన్నలగరువు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనుదిరగగా.. ఆక్వా పార్క్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కొట్లాటకు దిగటంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే, ఫుడ్పార్క్ యాజమాన్యం పెంచిపోషిస్తున్న వర్గం పోలీసుల సమక్షంలోనే తమను దూషిస్తూ కొట్లాటకు దిగిందని గ్రామానికి చెందిన కొయ్యే లూసీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. -
ముప్పుతిప్పలు పెట్టిన కొండచిలువ
చిగురుపాడు (అచ్చంపేట): 12 అడుగుల కొండ చిలువ ఓ ఇంట్లోకి దూరి గ్రామస్తులను ముప్పుతిప్పలు పెట్టింది. అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామానికి చెందిన గొట్టిముక్కల సాంబశివరాజు నివాసంలోని వరండాలో శనివారం రాత్రి 10గంటల సమయంలో కొండచిలువ ప్రత్యక్షమైంది. సాంబశివరాజు భార్య దీనిని చూసి భర్తకు చెప్పింది. కొండచిలువ వరండా మొత్తం తిరుగుతూ ఇంట్లో వారందరిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఇరుగుపొరుగు వారిని పిలువగా వారు కర్రలు తీసుకుని వచ్చి కొట్టినా పాము చావలేదు. పైగా రబ్బరు సాగినట్లుగా సాగింది. సుమారు రెండు గంటల పాటు అందరినీ ముప్పుతిప్పలు పెట్టి పక్కనే ఉన్న చెట్ల పొదలోకి దూరింది. దీంతో గ్రామస్తులు పొక్లెయిన్ తెప్పించి పొదను తవ్వించి కొండచిలువను వెలికి తీయించి గొడ్డలితో నరికి చంపించారు. -
కర్ణాటక పోలీస్స్టేషన్లో ప్రొద్దుటూరు విద్యార్థులు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని కామిశెట్టి సుబ్బారావు చెన్నమ్మ కళాశాల విద్యార్థులను కర్ణాటక రాష్ట్రంలోని మృదేశ్వర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని ఎస్కేఎస్సీ విద్యార్థులు దసరా సెలవులు కావడంతో సుమారు 150 మందికి పైగా 3 బస్సుల్లో కర్ణాటక రాష్ట్రానికి ఈ నెల 4న విహార యాత్రకు వెళ్లారు. విహారయాత్ర అనంతరం వీరు 9న ఉదయం ప్రొద్దుటూరు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మృదేశ్వర్లో ఉన్న ఆలయానికి వెళ్లారు. రాత్రి భోజనం చేశాక వారిలో కొందరు విద్యార్థులు స్థానికంగా ఇద్దరు యువకులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. దీంతో మృదేశ్వర్ గ్రామానికి చెందిన సుమారు 75 మంది దాకా విద్యార్థుల బస్సులను చుట్టుముట్టారు. దాడికి కారణమైన 10 మంది విద్యార్థులను వారు సమీపంలోని పోలీస్స్టేషన్కు తీసుకొని వెళ్లారు. మిగతా విద్యార్థులు, అధ్యాపకులు రాత్రి నుంచి స్టేషన్లోనే ఉండి పోయారు. గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున కేకలు వేస్తుండటంతో విద్యార్థులందరూ బిక్కుబిక్కు మంటూ ఉండి పోయారు. సమాచారం అందించిన విద్యార్థి వారిలో ఆసిఫ్ అనే విద్యార్థి అక్కడ జరిగిన ఘటన గురించి తన సెల్ఫోన్ ద్వారా కౌన్సిలర్ రఫిక్కు మెసేజ్ పెట్టాడు. కౌన్సిలర్ వెంటనే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ రామకృష్ణకు, డీఎస్పీ పూజితానీలంకు తెలిపారు. దీంతో ఎస్పీ మృదేశ్వర్ సీఐ, ఎస్ఐలతో మాట్లాడి అక్కడ పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రొద్దుటూరు పోలీసులు కూడా అక్కడి పోలీసులతో మాట్లాడారు. కాగా అక్కడి గ్రామ పెద్దలు, కళాశాల అధ్యాపకులు స్టేషన్లో పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. కేసులు పెడితే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందని వారు ప్రాధేయ పడ్డారు. అయితే గ్రామస్తులు మాత్రం కచ్చితంగా కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ స్టేషన్లోనే మంతనాలు జరిపారు. ఈ విషయం ప్రొద్దుటూరులోని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళన చెంద సాగారు. -
ములుగు జాతీయరహదారిపై ఉద్రిక్తత
వరంగల్: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగును జిల్లా కేంద్రంగా చేయాలంటూ గ్రామస్తులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ములుగు జాతీయరహదారిపై ఆందోళనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనతో ములుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
కాడిజోల కట్టి... వాగు దాటి
టేకులపల్లి: ఉప్పొంగుతున్న వాగులు.. వంకలు.. ఏజెన్సీవాసుల రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. అనారోగ్యం పాలైనా.. ఎవరైనా చనిపోయినా వాగులు దాటించేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కర్రకు దుప్పటి కట్టి కాడి జోలలా ఏర్పాటు చేసి శుక్రవారం ఓ మృతదేహాన్ని వాగు దాటించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని మేళ్లమడుగుకు చెందిన వీసం లక్ష్మి(68), రామయ్యలకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతు పెన్షన్ పై ఆధారపడి జీవిస్తోంది. శుక్రవారం గంగారం పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ తీసుకున్న లక్ష్మి ఫొటో దిగేందుకు గ్రామస్తులతో కలసి కొత్తగూడెం బయలుదేరి వెళ్లింది. అక్కడ ఫొటో దిగిన తర్వాత కొద్దిసేపటికే అనార్యోగంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఓ వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొని బయలుదేరారు. చింతోని చెలకవాగు వద్ద బ్రిడ్జి, చెక్డ్యాం నిర్మాణం జరుగుతోంది. వాగు నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ కర్రకు దుప్పటి కట్టి అందులో మృతదేహం ఉంచి వాగు దాటించారు. ఆపై స్వగ్రామానికి తీసుకెళ్లారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేం దుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రత్తికోళ్లలంకలో మళ్లీ చిచ్చు
పెద్దలపై గ్రామస్తుల ఆగ్రహం వివస్త్రలను చేసి కొడుతున్నారు గ్రామ మహిళల ఆవేదన రక్షిణ కల్పించాలని డిమాండ్ రూ.మూడు కోట్లు కాజేశారని విమర్శ కోర్టు ఉత్తర్వులకు అడ్డుతగులుతున్నారంటూ గగ్గోలు ఏలూరు (మెట్రో) : ప్రత్తికోళ్లలంకలో మళ్లీ చిచ్చు రాజుకుంది. నమ్మిన పెద్దలే తమను నట్టేట ముంచుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ లేకుండా పోయిందని, వివస్త్రలను చేసి కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టర్ను కలుద్దామని ఏలూరు వచ్చిన ప్రత్తికోళ్లలంక గ్రామస్తులు ఆయన అందుబాటులో లేకపోవడంతో జిల్లా పరిషత్ అతిథి గహం వద్ద విలేకరులతో మాట్లాడారు. అసలు వివాదమేంటంటే.. ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంకలోని ప్రభుత్వ భూముల్లో ఉన్న చేపల చెరువులు తమవంటే తమవని గ్రామస్తులు, కొందరు పెద్దలు ఐదేళ్లుగా ఘర్షణ పడుతున్నారు. దీనిని కొందరు పెద్దలుగా తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇటు గ్రామస్తులకు నమ్మకంగా ఉంటూనే, అటు పెద్దలకు సహకరిస్తున్నారు. మానుతున్న గాయాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. దీంతో అధికారులు, పోలీసులు గ్రామంలో అల్లర్లు జరగకుండా పోలీస్పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు తీర్పుతో పెద్దల్లో ఆగ్రహం ఏడాదిగా ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. ఇటీవల గ్రామస్తులకు అనుకూలంగా కోర్టు ఉత్తర్వులివ్వడంతో రాజకీయాలు చేస్తున్న పెద్దల్లో ఆగ్రహం పెల్లుబికింది. వారు గ్రామస్తులపై విరుచుకుపడుతున్నారు. తమను కాదని న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు ఎందుకు తెచ్చారంటూ దాడులకు తెగబడుతున్నారు. దీంతో గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ కలిసేందుకు ఏలూరు వచ్చారు. ఆయన రాకపోవడంతో విలేకరులకు తమ ఆవేదనను వెలిబుచ్చారు. వివస్త్రలను చేసి కొడుతున్నారయ్యా..? గ్రామంలో తమ మాట వినకుంటే ఆడవాళ్లని అని కూడా చూడకుండా తమను, తమ కుమార్తెలను వివస్త్రలను చేసి కొడుతున్నారంటూ పలువురు మహిళలు మీడియా ముందు కన్నీటిపర్యంత మవుయ్యారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ వేడుకున్నారు. దాచుకున్న సొమ్ముతోపాటు పుస్తెలు తాకట్టు పెట్టి తెచ్చిన రూ.మూడుకోట్లు గ్రామపెద్దలకు ఇచ్చామని ఆ సొమ్మును కోర్టు ఖర్చులకు వెచ్చించి, అనుకూలంగా ఉత్తర్వులు తెస్తామని వారు తమను నమ్మబలికారని, ఇప్పుడు ఆ డబ్బుపై ఎవరు నోరు మెదిపినా కొడుతున్నారని మహిళలు ఆవేదన చెందారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని, తమ వద్ద పెద్దలు కాజేసిన సొమ్మును ఇప్పించాలని వారు కోరారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే ఘర్షణే గ్రామస్తులకు అనుకూలంగా తీర్పు రావడం వల్ల గ్రామంలో చేపల చెరువుల విషయంలో మరోమారు ఘర్షణ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. ఈనేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించేందుకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
మొసలిని బంధించిన గ్రామస్థులు
-
మొసలిని బంధించిన గ్రామస్థులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న సోనెపేట్ చెరువు పక్కన రోడ్డుపై ఆదివారం ఉదయం మొసలిని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా అక్కడికి చేరుకొని మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. -
‘నానో’ వద్దే వద్దు
– కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన – రోడ్డుపై బైఠాయింపు – అధికారులను అడ్డుకున్న వైనం – గ్రామస్తులతో పోలీసుల చర్చలు పాణ్యం: కొండజుటూరు గ్రామ సమీపంలో సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించేందుకు కిందిస్థాయి అధికారులు ఆదివారం గోప్యంగా గ్రామంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విషయం గమనించిన గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తహసీల్దార్ చంద్రావతి అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర ్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మహిళలు, చిన్నపిల్లలు సహా గ్రామస్తులు కర్రలు తీసకుఉని రోడ్డుపై బైఠాయించారు. 500 మంది వరకు స్థానికులు నిరసన గళం విప్పారు. పరిశ్రమ, అదీ ఇదీ అంటూ మరోసారి గ్రామంలోకి వస్తే ఎం జరిగినా తమది బాధ్యత కాదంటూ హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. -
హంగర్గ శివారులో చిరుత సంచారం ?
కోటగిరి : మండలంలోని హంగర్గ శివారులో చిరుత సంచరిస్తుందని పుకార్లు శికార్లు చేస్తున్నాయి. కొందరు యువకులు గ్రామ శివారులోని వాగు వద్ద చిరుతను చూసినట్లుగా వారు చెబుతున్నారు. వాగువద్ద చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉన్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ శివారులో చిరుత సంచరించడంపై ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్లు గ్రామ సర్పంచ్ ఉదయ్భాస్కర్ బుధవారం తెలిపారు. ఫారెస్టు అధికారులు గురువారం గ్రామానికి రానున్నారని ఆయన చెప్పారు. -
సాక్షి కథనంతో గ్రామస్తులకు వైద్య సేవలు
-
మా గ్రామాలను మహబూబ్నగర్లో కలపండి
మరికల్, మల్కాపూర్, కల్మన్కల్వ, చాకల్పల్లి, కొత్తపల్లి ప్రజల ఆందోళన కుల్కచర్ల: తమ గ్రామాలను మహబూబ్నగర్ జిల్లాలో కలపాలని మండల పరిధిలోని మరికల్, మల్కాపూర్, చాకల్పల్లి, కల్మన్కల్వ, కొత్తపల్లి గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు గురువారం కుల్కచర్ల-నవాబ్పేట్ రోడ్డుపై గురువారం బైఠాయించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై టైర్లు వేసి కాల్చివేశారు. అనంతరం మరికల్లో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. తమ గ్రామాలను మహబూబ్నగర్ జిల్లాలో కలిపే వరకూ ఆందోళన విరమించేది లేదని తీర్మానించారు. అందుకోసం ఆ గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో విలీన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఒక దగ్గర ఆందోళన చేయాలని తీర్మానించారు. విలీన కమిటీ.. విలీన కమిటీ చైర్మన్గా సుధాకర్రెడ్డి (కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్) వైస్ చెర్మన్గా పాండురంగయ్య (వైస్ ఎంపీపీ) కన్వీనర్గా పాండురంగాచారి, సభ్యులుగా రాజు నాయక్ (మరికల్ సర్పంచ్), మెగ్యానాయక్ (మల్కాపూర్), చెన్నయ్య (కొత్తపల్లి), చిన్నరామయ్య(చాకల్పల్లి), కృష్ణాజీ, రామ్మోహన్శర్మ, నరేందర్ప్రసాద్, నర్సింలు, నిరంజన్, కృష్ణాచారి, ఉదయ్శంకర్, సత్తయ్య, వెంకటేష్, శ్రీనివాస్, నరేందర్లను ఎన్నుకున్నారు. -
ముళ్ల పొదలో ఆడ శిశువు
కాపాడిన గ్రామస్తులు తీగారంలో కలకలం రేపిన ఘటన జఫర్గఢ్/ఎంజీఎం : తల్లి వెచ్చని పొత్తిళ్లలో కునుకు తీయాల్సిన ఓ శిశువు ముళ్లపొద పాలైంది. ఆకలితో పాల కోసం గుక్క పెట్టి ఏడ్చింది. తెల్లవారుజామున ఆ పసికందు ఆక్రందనలు విన్న గ్రామస్తులు ‘అయ్యో బిడ్డా’ అని అక్కున చేర్చుకున్నారు. గుండెలకద్దుకొని ఊరడించారు. ఈ సంఘటన మండలంలోని తీగారం గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తీగారం గ్రామంలో పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన ముళ్లపొదల నుంచి పసికందు ఏడుపు శబ్దాలు స్థానికులకు వినిపిం చాయి. దీంతో వారు ఆ ఏడుపు వినిపిస్తున్న ముళ్ల పొదల వైపు వెళ్లి చూడగా చిన్నచిన్న గాయాలతో ఓ శిశువు కనిపించింది. మహిళలు ఆ ఆడ శిశువుకు సపర్యలు చేసి, నెత్తికి కుల్ల కుట్టారు. శరీరానికి వెచ్చదనం కలిగేలా దుస్తులు తొడిగి తల్లి ప్రేమను చాటారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చేరుకున్న ఎస్సై బండారి సంపత్ గ్రామస్తుల ద్వారా సంఘటన వివరాలను తెలుసుకున్నారు. అప్పటికే గాయాలతో ఉన్న శిశువుకు వైద్యం అందించేందుకుగాను వెంటనే పోలీస్ వాహనంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళల సాయంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు ఎస్సై సంపత్ తెలిపారు. కాగా పుట్టిన శిశువు ఆడ పిల్ల కావడం వల్లనే శిశువు తల్లిదండ్రులు తమకు ఎక్కడ భారమవుతుందోనని ముళ్లపొదల్లో పారేసినట్లుగా ఉందని స్థానికులు తెలిపారు. ఆ పసికందును చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన గ్రామం లో కలకలం రేపింది. -
పస్క జాతరలో పల్లెజనం
చెట్లకిందే వంటా-వార్పు వరుణుడు కరుణించాలని ప్రత్యేక పూజలు మెదక్ రూరల్: పల్లెలు పస్కజాతరకు పయనమయ్యాయి.యేటా శ్రావణ మాసంలో గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామ శివార్లలోని పొలాల్లోకి కుటుంబమంతా కలిసి వెళ్లి అక్కడే వంటలు చేసుకొని గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా వరుణుడు కరుణించి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధి పండాలని, అనారోగ్యాలు దరిచేరకుండా చూడాలని గ్రామదేవతలను కోరుకుంటారు. ఈ యేడాది కూడా మెదక్ మండలంలోని హవేళి ఘణాపూర్, చౌట్లపల్లితోపాటు పలు గ్రామాల ప్రజలు ఆదివారం పస్క జాతర పండగ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలు బాగా పండాలంటూ గ్రామశివార్లలోని చెట్ల కింద వంటా-వార్పు చేసుకుంటారు. ఈ సందర్భంగా చిలకమ్మ అనే దేవతకు పరమాన్నం నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే గ్రామశివారులోని గ్రామదేతలకు నైవేద్యం పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఇంటిల్లిపాది కలిసి వన భోజనం చేసి సరదాగా గడుపుతారు. అలాగే అనారోగ్యాలు దరిచేరకూడదని, పిల్లా పాపలతో చల్లంగా ఉండేలా దీవించాలని గ్రామదేవతలను కోరుకుంటారు. కొన్ని గ్రామాల్లో శ్రావణమాసంలో మూడుసార్లు పస్కజాతర జరుపుకుంటారు. పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు చెన్లలో గల పంటకు పట్టిన పురుగును సాగదోలేందుకు, రోగాలు దరిదాపుల్లోకి రాకుండా ఉండేందుకు ఊరు ఊరంతా చెట్ల కిందికి వెళ్లి దేవునికి మొక్కి పరమాన్నం నైవేద్యంగా పెట్టి కుటుంబ సమేతంగా ఉల్లాసంగా పస్క పండగను చేసుకుంటాం. - బరంచ భూమయ్య, హవేళిఘణాపూర్ పంటలు బాగా పండేందుకే పస్క పండగ వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని పస్క పండగ చేసుకుంటాం. పంటకు పట్టిన పురుగును తరిమేందుకు శ్రావణంలో సంక్రమించే వ్యాధులను తరిమేందుకు దేవుణ్ని కోరుకుంటూ నైవేద్యం పెట్టి, వంటలు చేసుకొని కుటుంబంతో చెట్లకింద సంతోషంగా గడుపుతాం. - మూగ వెంకటి, హవేళిఘణాపూర్ -
నిర్విరామంగా శతచండీయాగం
వల్లభాపురం (కొల్లిపర): కృష్ణా పుష్కరాల సందర్భంగా మండలంలోని వల్లభాపురం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్న శతచండీయాగం నిర్విరామంగా కొనసాగుతోంది. సకలేశ్వరస్వామి ఆలయం సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిట్లో గణపతిపూజ, ప్రత్యేక వస్త్రాలు ధరించి నిర్వహించిన రుద్రహోమం, మృత్యుంజయహోమం, ప్రదోషకాల అర్చన, కల్యాణోత్సం హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు కొత్తూరు వెంకట రమణశాస్త్రి శిష్యబృందం పూజలు చేశారు. -
వామ్మో కొండ చిలువ
మైదుకూరుటౌన్ : మైదుకూరు మండల పరిధిలోని లింగాలదిన్నెలో శుక్రవారం సాయంత్రం కొండ చిలువ గ్రామంలోకి వచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తి పరుగులు తీశారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతలోనే పాముల పట్టే వ్యక్తి నాగసుబ్బయ్య దీనిని పట్టుకొని అధికారులకు అప్పజెప్పారు. వారు దానిని అడవిలోని పెద్దవనం దగ్గర వదిలేశారు. -
గోడు వినేదెవరు?
కుక్కలగూడూర్ వాసుల అవస్థలు తెప్పలపై ప్రయాణం పదిరోజులుగా నిలిచిన రాకపోకలు మునిగిన రక్షిత మంచినీటి బావులు శ్మశానవాటికకు స్థలం కరువు జాడలేని జిల్లా అధికారులు బసంత్నగర్ : ‘శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ గ్రామంలోకి ప్రవేశించి పది రోజులైతాంది. మాకు కంటినిండా నిద్దుర కరువైంది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గీత కార్మికులకు ఉపాధి పోయింది. తాగునీటి బావులు మునిగాయి. ఇళ్లలో పాములు వస్తున్నాయ్. కనీసం సచ్చినోళ్లను బొందపెడదామంటే జాగ లేకుండా అయింది. ఇన్ని అవస్థలు పడుతున్నా.. మాగోడు పట్టించుకునే వారే కరువయ్యారు’ ఇది రామగుండం మండలంలోని కుక్కలగూడుర్ గ్రామస్తుల ఆవేదన. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కింద పాక్షికంగా ముంపునకు గురైన కుక్కలగూడుర్ గ్రామాన్ని 10 రోజులుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ వణికిస్తోంది. శివారులోని బుగ్గ ఒర్రె పొంగి ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిపై దాదాపు 2 మీటర్ల ఎత్తులో వరద నీరు చేరింది. సమీప గ్రామాలకు రాకపోకలు స్తంభించింది. గ్రామస్తులు ప్రతి అవసరానికి తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వరద నీరు.. తెప్పలపై రాకపోకలు.. కుక్కలగూడుర్ గ్రామ శివారులోని బుగ్గ ఒర్రెపై గల వంతెన మునిగిపోవడంతో సమీపంలోని మద్దిర్యాల, పొట్యాల, సోమన్పల్లి, ఆకినపల్లి, బ్రాహ్మణపల్లి, అంతర్గాం, రామగుండం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల వ్యవసాయ భూములు ఉన్న రైతులతోపాటు కూలి పనులకు వెళ్లే మహిళలు, పాఠశాల, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, గీత కార్మికులు, బ్యాంకుల ఖాతాదారులు, ప్రయాణికులు ఇలా ఒకటేమిటీ అందరూ అవస్తలు పడుతున్నారు. గ్రామంలో ముదిరాజ్ కులస్తులు ఏర్పాటు చేసిన మూడు లె ప్పల ద్వారా వరద నీటిలో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కో మనిషికి రూ. 20 , ద్విచక్ర వాహనాలు దాటిస్తే రూ.100 చెల్లించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు దాదాపు 3 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. ఐదు రోజులుగా నల్లాలు బంద్ గ్రామానికి రక్షిత మంచినీటిని అందించే రెండు బావులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఐదు రోజులుగా గ్రామంలో నల్లాలు బంద్ అయి స్థానికులకు రక్షిత మంచినీరు కరువైంది. ప్రస్తుతం గ్రామస్తులు నీటి కోసం సమీపంలోని బోరుబావులు, చేదబావులపై ఆధారపడుతున్నారు. వరద నీటి కారణంగా నీరంతా కలుషితమై రోగాల బారినపడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు స్థలం కరువు గ్రామంలో శ్మశాన వాటికకూ స్థలం లేకుండా పోయింది. గతంలో నీరు లేనప్పుడు గ్రామంలో ఎవరూ చనిపోయినా.. బుగ్గ ఒర్రె వద్దకు తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఒర్రెతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతమంతా నీటితో నిండిపోవడంతో శ్మశానవాటికకు స్థలం కరువైందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థలంలేని కారణంగా గురువారం గ్రామంలో మృతిచెందిన సిద్ద పోశమ్మను శుక్రవారం వేంనూర్ గ్రామ శివారులోని మట్టికుప్పల వద్ద ఖననం చేయాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కిలోమీటర్లు నడుస్తున్నాం.. – గాజుల సత్తయ్య, గీత కార్మికుడు మేము కల్లుగీసి బతుకుతం. సగానికిపైగా చెట్లు నీటిలో మునిగిపోయాయి. ఉన్న చెట్లను గీద్దామంటే రోడ్డు మీదికి నీళ్లచ్చి రాకపోకలు బంద్ అయ్యాయి. తెప్పలపై పోదామంటే రూ.80 ఖర్చవుతున్నయ్. మూడు కిలోమీటర్లు పొలాల వెంట నడిచి వచ్చి కల్లు గీస్తున్నం. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. ఒక్క అధికారి కూడా రాలేదు – ఎనగందుల సతీష్, స్థానికుడు పదిరోజులుగా గ్రామస్తులమంతా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నాం. రాత్రిళ్లు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నాం. ఐదు రోజులుగా నల్లా నీళ్లు బంద్ అయ్యాయి. అయినా ఇప్పటికి వరకు జిల్లా స్థాయి అధికారి ఒక్కరూ కూడా గ్రామాన్ని సందర్శించలేదు. -
బుద్ధుడి విగ్రహాలకు.. కెమికల్ ట్రీట్మెంట్ తప్పనిసరి
ఒంగోలు కల్చరల్: - లేదంటే విగ్రహాలు పాడయ్యే ప్రమాదం - గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు సహకరించాలి - ఆర్కియాలజీ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కేశవ ప్రాచీన బౌద్ధ సంస్కృతికి పేరుగాంచింది ప్రకాశం జిల్లా..ముఖ్యంగా నాగులుప్పలపాడు మండలంలోని కనిగిరి ప్రధాన కేంద్రం అనే విషయం 2015 డిసెంబర్ 7న అక్కడ లభ్యమైన బుద్ధుని విగ్రహాలు చాటి చెప్పాయి. కనపర్తి గ్రామం బయట ఉన్న పొలాల్లో మట్టిని సేకరించేందుకు కూలీలు తవ్వుతున్న సమయంలో అక్కడి మట్టిలో ఒక పెద్ద కుండ వారికి దర్శనమించ్చింది. ఇందులో రాగి, ఇనుముతో చేసిన బుద్ధుడి అడుగు సైజు విగ్రహాలు లభ్యమయ్యాయి. నిలబడిన భంగిమలో 15 విగ్రహాలు, ధ్యాన బుద్ధుని విగ్రహాలు 3, గంధర్వ నృత్య విగ్రహం 1, మకర తోరణ భాగాలు, మట్టిపాత్ర, హారతి పళ్లాలు, పంచపాత్ర, గంటలు మొత్తం 55 వస్తువులు లభ్యమయ్యాయి. మట్టిని తొలగించగా రెండు పెద్ద ఆయక స్తంభాలు, ఇటుకలు బయల్పడ్డాయి. రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకుడు డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ కేశవ, నెల్లూరు అసిస్టెంట్ డైరక్టర్ జాన్ కమలాకర్ ఆ ప్రాంతానికి చేరుకుని ఆధారాలను పరిశీలించారు. ఆయక స్తంభాలు క్రీస్తు శకం రెండో శతాబ్ధికి చెందినవిగా పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేశారు. విగ్రహాలను మ్యూజియంకు తరలింపు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ జాన్ కమలాకర్ , నాగులుప్పలపాడు మండల తహసీల్దార్ రమణారావు తదితరులు పంచనామా నిర్వహించి లభ్యమైన విగ్రహాలను, ఆయక స్తంభాలను, ఇతర వస్తువులను కనపర్తి పురావస్తు శాఖ మ్యూజియంకు తరలించారు. గ్రామస్తుల వ్యతిరేకత.. కనపర్తిలో దొరికిన విగ్రహాలను గ్రామంలోని పురావస్తు మ్యూజియంలోనే ఉంచాలని పలువురు గ్రామస్తులు కోరారు. విగ్రహాలను బయటకు తరలించేందుకు ఆనాడు వారు అంగీకరించ లేదు. రెవెన్యూ సహకారం కీలకం.. సహజంగా తవ్వకాల్లో లభ్యమైన విగ్రహాలు వంటి వాటికి పంచనామా నిర్వహించిన అనంతరం రెవెన్యూ అధికారులు వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించడం సహజంగా జరిగే ప్రక్రియ. బుద్ధ విగ్రహాల విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆర్కియాలజీ అధికారుల అభ్యర్థన మేరకు బుద్ధ విగ్రహాలను కెమికల్ ట్రీట్మెంట్కు పురావస్తు శాఖ అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సుజాతా శర్మ నాగులుప్పలపాడు తహసీల్దార్తో పాటు ఒంగోలు ఆర్డీవోను ఆదేశించారు. అయితే వారు విగ్రహాలను అప్పగించేందుకు తాత్సారం చేస్తున్నారని, దీనివల్ల బయటి వాతావరణంలో విగ్రహాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు. నిర్లక్ష్యం మూలంగా విగ్రహాలు దెబ్బతిన్న పక్షంలో అది అందుకు బాధ్యులైన అధికారుల మెడకు చుట్టుకుంటుందని పురావస్తు శాఖ అధికారులు సూచిస్తున్నారు. విషయం కలెక్టర్ దృష్టికి ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ డైరక్టర్ ఎస్.కేశవకూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. బుద్ధ విగ్రహాల తరలింపులో రెÐð న్యూ శాఖ పరంగా ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ సుజాతా శర్మ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆర్కియాలజీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కెమికల్ ట్రీట్మెంటే కీలకం.. గ్రామస్తులు సమకూర్చిన లాకర్లో విగ్రహాలను భద్రపరచినంత మాత్రానా ప్రయోజనం లేదని అవి పాడు కాకుండా ఉండాలంటే వాటిని ఆర్కియాలజీ లాబ్కు తరలించి, రసాయన శుద్ధి చేయాలంటున్నారు. ల్యాబ్ను హైదరాబాద్ నుంచి కనపర్తికి తరలించడం సాధ్యమయ్యే పని కాదని పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందరూ సహకరించాలి – డిప్యూటీ డైరెక్టర్ ఎస్. కేశవ కనపర్తిలో దొరికిన బుద్ధ విగ్రహాలకు వెంటనే కెమికల్ ట్రీట్మెంట్ అవసరం. లేకుంటే విగ్రహాలు త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. గ్రామస్తులు, రెవెన్యూ అధికారులు స్పందించి అపురూప బుద్ధ విగ్రహాలు నాశనం కాకుండా వెంటనే వాటికి కెమికల్ ట్రీట్మెంట్ జరిగేందుకు వీలుగా తరలించేందుకు తమ తోడ్పాటును అందించాలి. రసాయన శుద్ధి అనంతరం విగ్రహాలను తిరిగి కనపర్తికి తరలిస్తాం. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు
అవనిగడ్డ(కృష్ణా): కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్నారు. పాలకాయతిప్ప గ్రామంలో పర్యటించేందుకు శనివారం సాయంత్రం మంత్రి రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో 13 మీటర్ల రోడ్డు కోసం ఆక్రమణలను తొలగించిన అధికారులు.. కోడూరు సెంటర్లో 7 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం ఆక్రమణలను వదిలేశారని తెలిపారు. ఈ విషయమై ఉప సభాపతి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. మంత్రి హామీ మేరకు వారు ఆందోళన విరమించటంతో పర్యటన కొనసాగింది. -
ఆరు రోజులుగా తాగునీరు బంద్
కె.కొత్తపల్లి గ్రామంలో ఆరు రోజుల నుంచి తాగునీటి సరఫరా బంద్ అయ్యింది. ఆలూరు శివారులో ఉన్న సంప్ నుంచి ఈ గ్రామానికి తాగునీటి సరఫరా కావాల్సి ఉంది. సంప్ వద్ద తాత్కాలికంగా పని చేస్తున్న వర్కర్ ఇటీవల విధుల నుంచి తప్పుకొన్నాడు. అతని స్థానంలో మరొకరిని నియమించే విషయంలో పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు పొలాలకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామన్నారు. అధికారులు స్పందించి తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మండుతున్న ఎండలు.. ఊరూరా జ్వరాలు
కొవ్వూరు : జిల్లాలో మూడు రోజులుగా ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు, నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో గడచిన 15 రోజులుగా 32 నుంచి 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు గురువారం 37 డిగ్రీలు నమోదు కాగా, శుక్రవారం 38 డిగ్రీలకు చేరింది. శుక్రవారం ఏలూరు నగరంలో 40 డిగ్రీలు దాటింది. నరసాపురంలో మూడు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదవుతోంది. విజృంభిస్తున్న జ్వరాలు వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులతోపాటు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోనూ రోజుకు సగటున 2,200 జ్వరపీడిత కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 400 వరకు టైఫాయిడ్ కేసులు ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వారితో కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సగటున 100 టైఫాయిడ్, 2 వేలకు పైగా వైరల్ జ్వరాల కేసులు నమోదవుతున్నాయని డీసీహెచ్ఎస్ కె.శంకర్రావు తెలిపారు. అప్రమత్తంగా ఉన్నాం ప్రస్తుతం జ్వరాలు విజృంభించే అవకాశం ఉన్నదృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఏదైనా గ్రామంలో ఐదారు జ్వరం కేసులు నమోదైతే వెంటనే సర్వే చేయిస్తున్నాం. రక్త నమూనాలు సేకరిస్తున్నాం. ఎక్కడైనా జ్వరాలు అధికంగా ఉంటే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో నెలకు 6, 7 మలేరియా కేసులు నమోదవుతున్నాయి. -కె.కోటీశ్వరి, డీఎంహెచ్వో -
నీల్గాయిపై కుక్కల దాడి..
- రక్షించిన గ్రామస్తులు మెదక్ దాహార్తి తీర్చుకునేందుకు వచ్చిన నీల్గాయిపై కుక్కల మంద దాడి చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఓ నీల్గాయి(మనుబోతు) దాహార్తి తీర్చుకునేందుకు వ చ్చింది. దానిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపరిచాయి. ఈ ఘటన గమనించిన గ్రామస్తులు కుక్కల దాడి నుంచి నీల్గాయ్ ను కాపాడారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి వచ్చిన అటవీ అధికారులకు నీల్గాయ్ ని అప్పగించారు. -
దొంగను చితకబాదిన గ్రామస్తులు
♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ♦ మృతుడు రంగారెడ్డి జిల్లావాసి కొత్తూరు: చోరీకి పాల్పడుతుండగా ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దెయ్యాలగూడకు చెందిన తాళ్లపల్లి మల్లయ్య(48) శనివారం తెల్లవారుజామున మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం మొదళ్లగూడకు వచ్చాడు. ఆరుబయట నిద్రిస్తున్న దార మల్లమ్మ మెడలో నుంచి రెండు గ్రాముల బంగారు పుస్తె చోరీచేశాడు. అక్కడినుంచి ఈదులపల్లికి చేరుకుని కిష్టమ్మ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమె మేల్కొని కేకలు వేసింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు వెంబడించి పట్టుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లయ్య భార్య మణెమ్మ ఇక్కడికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ శ్రీశైలం కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
మంత్రి మృణాళినికి చుక్కెదురు
ఆస్పత్రి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిలదీసిన గ్రామస్తులు చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళినికి సొంత నియోజకవర్గ కేంద్రమైన విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించాలని భావించిన మంత్రి మృణాళిని నిర్ణయాన్ని మేజర్ పంచాయతీ పరిధిలో గల వంగపల్లిపేట గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన మంత్రి మృణాళినిని ఈ విషయమై గ్రామస్థులు, మహిళలు నిలదీశారు. తొలుత మంత్రిని కలిసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుని లోపలికి వెళ్లి కార్యాలయంలో బైఠాయించారు. మంత్రి వారివద్దకు వచ్చి దీని కోసం సిక్స్మ్యాన్ కమిటీ వేస్తామని చెప్పినప్పటికీ శాంతించని గ్రామస్థులు.. ఏ కమిటీలు వేసినా తమకు ప్రయోజనం లేదని, ఊరు ఖాళీ చేయించి ఆస్పత్రి నిర్మించుకోవాలి తప్ప తాముండగా నిర్మాణం జరగనివ్వమని స్పష్టం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మహిళలు, గ్రామస్థులను అక్కడి నుంచి పంపించేశారు. -
పసిగుడ్డును రోడ్డుపై వదిలేశారు
ఆత్మకూరురూరల్(శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు): ఒక రోజు వయసున్న బిడ్డను వస్త్రంలో చుట్టి రోడ్డుపై వదిలి వెళ్లిన దారుణమైన సంఘటన ఆత్మకూరు మండలంలోని బోయిల చిరువెళ్ల గ్రామ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంకాల సమయంలో పొలిమేర్ల నుంచి వస్తున్న పశువుల కాపరులు పొదల్లో ఏడుపు వినిపించి చూడగా బిడ్డ కనిపించడంతో గ్రామపెద్దలకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, శ్యామలమ్మ దంపతులు సంఘటన స్థలానికి చేరుకొని బిడ్డను అక్కున చేర్చుకున్నారు. ఆడపిల్ల భారమనుకున్నారో ఏమో కానీ బిడ్డను రోడ్డు పక్కన వదిలి వెళ్లడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు. ఎవరైనా వాహనంలో వచ్చి జన సంచారం లేని సమయంలో రోడ్డు పక్కన వదిలి పెట్టి ఉంటారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, సుబ్బారెడ్డి దంపతులు తమకు ముగ్గురూ మగపిల్లలే అని.. ఆడపిల్లను దేవుడిచ్చిన వరంగా పెంచుకుంటామని అంటుండగా గ్రామానికి చెందిన మరో దంపతులు తమకు వివాహమై 15 ఏళ్లు అయినా సంతానం లేదని.. తమకు అప్పగిస్తే ఆ పాపను పెంచుకుంటామని పేర్కొన్నారు. గ్రామ పెద్దలు పోలీసులు, ఐసీడీసీఎస్ అధికారులకు సమాచారం అందించారు. -
కొల్లేరు పరిధిలో ఉద్రిక్తత..
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి ఫారెస్ట్ అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్లితే...పత్తికోళ్లలంక గ్రామంలో గురువారం ఉదయం ఫారెస్ట్ అధికారులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొల్లేరు పరిధిలోని వివాదాస్పద చెరువుల్లో చేపలు పట్టుకుంటున్న గ్రామస్తులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులపై గ్రామస్తులు దాడికి దిగడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చింతమనేని ప్రభాకర్ ఎందుకు అడ్డుకుంటున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. కేసు కోర్టుపరిధిలో ఉన్నందున అనుమతి ఇవ్వలేమని ఫారెస్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహం చెందిన చింతమనేని.. కలెక్టర్ వద్ద తేల్చుకుంటామని చెప్పి వెళ్లిపోయారు. అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. -
మైసూరులో గ్రహాంతర వాసులు..!
మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా పిరాయపట్టణ తాలూకాలో గ్రహాంతరవాసులు కనిపించారంటూ వదంతులు వ్యాపించాయి. సోమవారం రాత్రి పిరాయపట్టణ తాలూకా సూలకోటె గ్రామానికి చెందిన ఓ రైతు అర్ధరాత్రి తన పొలంలో పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అదే సమయంలో ఆకాశం నుంచి భారీ వెలుగుతో వచ్చిన ఫ్లయింగ్ సాసర్(గ్రహాంతర నౌక) భూమిని ఢీ-కొట్టి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని రైతు గ్రామస్థులతో చెప్పడంతో క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా వ్యాపించింది. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. -
ప్రభుత్వాలు చదువుకోవాలి
అన్నం ఉడికిందా లేదా? మెతుకు పట్టుకుంటే చాలు. గవర్నమెంట్ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి? రామోజీపేట ‘రిఫరెండమ్’లో ఏముందో చూస్తే చాలు. మొన్న ఇంటర్ ఫలితాల్లో ముందున్నది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలే! ఇంకొంచెం శ్రద్ధ తీసుకుంటే, ఇంకొంచెం బాధ్యతగా ఉంటే... గవర్నమెంట్ స్కూళ్లను, గవర్నమెంట్ టీచర్లను బలపరిస్తే... మరింత అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. సరిగ్గా ఈ ఆలోచనతోనే రామోజీపేట స్కూల్ హెచ్.ఎం., టీచర్లు రిఫరెండమ్ నిర్వహించారు. గ్రామస్థుల దగ్గరకు వెళ్లి, బడి అంటే ఎలా ఉండాలి? చదువు ఎలా చెబితే బాగుంటుంది? అని అడిగారు. ప్రభుత్వాలు ఈ రిఫరెండమ్ ఫలితాలను చదివితే... పిల్లలు ఇంకా బాగా చదువుకుంటారు. కరీంనగర్ జిల్లా.. ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామం! వారం రోజులుగా వార్తల్లో ఊరైంది. కారణం కరువు కాదు.. కార్యాలయమూ కాదు.. సర్కారు బడి! సర్కారు కొలువంటేనే జీతం తప్ప బాధ్యతలేని ఉద్యోగం అంటారు. మరీ టీచర్ అయితే.. కడుపులో చల్ల కదలకుండా చేసే పని అని ప్రచారం. ఈ ధోరణి ప్రైవేట్ స్కూళ్ల స్వైర విహారానికి కారణమైంది. టిప్టాప్ యూనిఫామ్లు.. బండెడు పుస్తకాలు.. అంతకుమించి బరువైన అడ్వర్టయిజ్మెంట్లు.. క్షణం తీరికనివ్వకుండా హోమ్వర్క్లు.. అన్నీ కలిసి.. ప్రైవేటు స్కూళ్ల పిల్లలు బాగా చదువుతున్నారనే భావనను కల్పించాయి. ఆ భావన పట్నం దాటి పల్లెలకూ విస్తరించింది. దాంతో పల్లెల్లోని ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లు.. చెరిగిపోతున్న నల్లబల్ల మీది రాతలు అయ్యాయి. బడి తలుపులు మూసేసుకున్నాయి. పాఠాలు చెప్పడం మీద ప్రేమున్న పంతుళ్లను అది బాధించింది. ఆ బాధ తమదాకా రాకుండా ఉండేందుకే రామోజీపేట బడి కొత్త అక్షరాలను దిద్దింది. అందుకే వార్తల్లోకి వచ్చింది. ప్రభుత్వం అంటే పారిపోతున్నారెందుకు? ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నా కూడా గవర్నమెంట్ స్కూళ్లను పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్లకు ఇంగ్లీష్ మీడియం.. ప్రైవేట్ స్కూల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. రామోజీపేటలోని తమ బడీ అలాంటి కాలపరీక్షను ఎదుర్కోక తప్పదని అర్థమైంది ఆ స్కూల్ హెచ్.ఎం. పెద్దింటి అశోక్ కుమార్కి. ఆయన రచయిత కూడా. బడి భవిష్యత్తు కోసం న్యూ సిలబస్ ఆ పరీక్షను తప్పించుకోవాలి.. బడిని బతికించుకోవాలి అని ఆరాటపడ్డారు అశోక్ కుమార్. తోటి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పిల్లల జ్ఞానానికి కాదు.. మన బోధనకు పరీక్షపెట్టుకుందాం అన్నారు హెచ్.ఎం.‘అవును... అసలు మనం ఏం చెప్తున్నాం.. ఎలా చెప్తున్నామో తెలిస్తే కదా.. పిల్లల మార్కులను కొలిచేది’ అనిపించింది మిగిలిన ఉపాధ్యాయులకు. ఏంచేద్దాం? ముక్తకంఠంతో సమాలోచన. ‘‘మనం చదువు చెప్పే పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్దాం.. మన నుంచి వాళ్లు ఎలాంటి బోధనను కావాలనుకుంటున్నారు? ఇంకా ఏం చేస్తే వాళ్ల పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారో అడుగుదాం. మన పనితీరుకు మార్కులు వేయమని అడుగుదాం.. ఏమంటారు?’’ అన్నట్టు చూశారు అశోక్కుమార్. అంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. అలా బడి భవిష్యత్ కోసం కొత్త సిలబస్ను తయారు చేసుకున్నారు. ఊరంతటినీ ఒకచోట చేర్చారు అనుకున్నదే తడవుగా అంతా కలిసి ఊళ్లోకి వెళ్లారు. ‘మా పనితీరు గురించి మీ అందరితో చర్చిద్దామనుకుంటున్నాం.. ఫలానా రోజున ఫలానా చోటికి రండి’ అంటూ ఊళ్లోవాళ్లకు విజ్ఞప్తి చేశారు. వాళ్ల వినతిని మన్నించిన జనం.. వాళ్లు చెప్పిన రోజున.. చెప్పిన చోట సమావేశమయ్యారు. సర్కారు బడులు మూతపడే స్థితి ఎందుకు వస్తోంది? చర్చ మొదలైంది. ప్రైవేట్స్కూల్స్ అని గ్రామస్థుల సమాధానం. కారణం ఎవరు? ఉపాధ్యాయులే అని కొంతమంది సమాధానమిస్తే.. ఇంకొంతమంది తప్పును ప్రభుత్వం మీదకి నెట్టారు. వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. ‘‘సరే.. తప్పొప్పులు ఎవరివైనా పరిష్కారం కావాలి. మళ్లీ మా బడి.. అదే మన బడి బతకాలంటే మేం ఏం చేయాలి? మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి?’’ అంటూ తమ పనితీరుకి సంబంధించి 15 ప్రశ్నలు తయారు చేసుకొని గ్రామస్థులను అడిగారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ విధానాలు మారాలి చర్చకు హాజరైన గ్రామస్థులలో 80 శాతం మంది ఉపాధ్యాయులను సమర్థించారు. మిగిలిన 20 శాతం మంది టీచర్ల విధానాలను విమర్శించారు. ఎలాంటి విధానాలను అమలు చేయాలో సూచించమని అడిగారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచర్లు. ఇంగ్లీషు మీడియం కావాలన్నారు గ్రామస్థులు. ప్రీ ప్రైమరీ కూడా కావాలన్నారు. అంటే ప్రాథమిక స్థాయి కంటే ముందే పిల్లల్ని బడిలో చేర్పించే సదుపాయం ఉండడం. పరిష్కారం దొరికింది. అయితే ఇది ప్రభుత్వం చేతిలో ఉన్న పని. ఎలా? అయినా సరే రామోజీపేట టీచర్లు నిరాశ పడలేదు ఎలాగైనా సరే.. వందశాతం పిల్లల్ని బడిలో చేర్చుకోవాలి అని కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఆ చర్చ అక్కడితో ముగిసినా తెల్లవారి నుంచి ఇల్లిల్లూ తిరగడం మొదలుపెట్టారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఆ క్రమంలోనే ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. వారిని లబ్ధిదారులుగా చేర్చారు. ఈ విద్యాసంవత్సరానికి తల్లిదండ్రులు ఆశించినట్టుగా బడిని నడిపే ప్రణాళిక తయారుచేసే పనిలో ఉన్నారు ప్రస్తుతం రామోజీపేట ఉపాధ్యాయులు. బడినిండా పిల్లలు.. మదినిండా పాఠాలతో.. తమ బడి కళకళలాడుతుందని ఆశిస్తున్నారు. - వూరడి మల్లికార్జున్, సాక్షి, సిరిసిల్ల ఒక అడుగు ముందుకు వేశాం ‘ప్రజల్లోకి వెళ్లడానికి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వెళ్లాం. మేం చదువు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం... మీకేం కావాలంటూ సూటిగా అడిగాం. ప్రజలు అంతే సూటిగా లోపాలను చాటిచెప్పారు. బడిని బతికించుకునేందుకు మేం నిర్వహించిన రెఫరెండం మా ఆత్మసై ్థ్యర్యాన్ని పెంచింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మమ్మల్ని తలెత్తుకునేలా చేసింది. మార్పు ఎక్కడో చోట ఒక్క అడుగుతో మొదలు పెట్టాల్సిందే. మేం చేసింది కూడా అదే. ఒక అడుగు వేశాం. - పెద్దింటి అశోక్కుమార్, ప్రధానోపాధ్యాయుడు రెఫరెండంలో బయటపడ్డ విషయాలు * లోపం ఇటు ఉపాధ్యాయుల పని తీరులో ఉంది అటు విద్యా పాలసీలో ఉంది. ‘ఇలాంటి విద్య కావాలి’ అని సమాజం కోరుకుంటున్నట్టు పాలసీ అమలు చేయడం లేదు. * ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని సమాజం గుర్తించడంలేదు. పాలసీని, ప్రజల కోరికలను సమన్వయ పరిచినప్పుడే ఇది సఫలీకృతమవుతుంది. సవరణలు చేసినా కూడా సరిపోతుంది. * 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 59 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లుండాలి. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఉంది పరిస్థితి. అందుకే తరగతికో ఉపాధ్యాయుడినివ్వాలి. * పిల్లలే లేకుండా తరగతికో ఉపాధ్యాయుడు ఎలా? అవును పదిమంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లు ఉండడం అనవసరమే. అలాంటి స్కూళ్లను విలీనం చేయాలి. 100 మంది నిండే వరకు విలీనం చేసి రవాణా సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారం తగ్గుతుంది. నాణ్యమైన విద్యను పిల్లలకు అందించేందుకు అవకాశం ఉంటుంది. ప్రై వేటు స్కూళ్లు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకూ దీన్ని అమలు చేయాలి. * పర్యవేక్షణ పెంచాలి. పాఠశాలలోని విద్యార్థులను దత్తత తీసుకునే పాలసీని అమలు చేయాలి. దత్తత తీసుకున్న విద్యార్థుల చదువు బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించాలి. అప్పుడు తప్పకుండా ఉపాధ్యాయుల పని తీరు మెరుగుపడుతుంది. * సర్కారు బడులు ప్రమాదపు చివరి అంచుల్లో ఉన్నాయి. ఇకనైనా ఉపాధ్యాయులు కళ్లు తెరిచి పని తీరును మెరుగు పరుచుకోకుంటే, ప్రభుత్వం కళ్లు తెరిచి పాలసీలు మార్చకుంటే ఐదూ పదేళ్లలోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వస్తుంది. -
గ్రామీణ వైద్యానికి గ్రహణం
విశ్లేషణ గ్రామీణ ప్రజలకు సంచార వైద్య సేవల (104) వంటి ఉత్తమ పథకం వైఎస్ మరణానంతరం అటకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజలకు మంచి చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని చెబుతున్నాయి. కాబట్టి అవి గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెట్టాలి. ఆసుపత్రుల ఫీజులు కట్ట లేని రోగి చావాల్సిందేనా? నేడు ఈ ప్రశ్న తరచుగా విన బడుతోంది. జవాబు ఇచ్చే వాళ్లే లేరు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య, వైద్య సేవల గురించి విశ్లేషిం చుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వాలు ఏటా కోట్లాది రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు) కొంత మేరకు ప్రజ లకు ఆరోగ్య సేవలను అందిస్తున్నా గ్రామీణ ప్రజల ఆరోగ్యం సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య శాస్త్ర పట్టభద్రులు పల్లెల్లో వైద్యం చేయడానికి సిద్ధంగా లేరు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. పీహెచ్సీలకు దూరంగా ఉన్న పల్లెల్లోని ప్రజలకు ఈ అరకొర సదుపాయమూ అందుబాటులో లేదు. ఇక అంత సులువుగా చేరుకోలేని కొండకోనల్లోని ఆది వాసులకు రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. వారికి మలేరియా, అతిసార వంటి వ్యాధులేగాక మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ల వ్యాధులతో కూడా బాధపడుతుంటారు. అయినా వారు ఎలాంటి వైద్య పరీక్షలు ఎన్నడూ చేయించుకుని ఎరుగరు. కనుక వారికి తమ జబ్బుల గురించే తెలియదు. ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్యశాఖ అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే, వైద్యం అవసరం రాదన్న అర్థం అందులో నిగూఢంగా ఉంది. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాథమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోతాయి. వైద్య రంగంపై ప్రభుత్వం, వ్యక్తులు చేసే ఖర్చు గణనీ యంగా తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం. ఈ సదుద్దేశంతోనే కొద్దికాలం క్రితం హెచ్ఎంఆర్ఐ అనే స్వచ్ఛంద సంస్థ కొంత కృషి చేసింది. సుదూర గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, నాటు వైద్యంపైనే ఆధారప డుతున్న ప్రజలకు సంచార వైద్య కేంద్రాల ద్వారా వారి గ్రామాలకే వెళ్లి, వైద్యసేవలను అందించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి వివరించింది. సంచార వైద్య కేంద్రాలు గ్రామీణ ప్రజానీకానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ జరిపి తగిన మందులిస్తే చాలా రోగాలకు సులువుగా సురక్షితమైన వైద్యాన్ని అందించవచ్చని, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా వారిని కాపాడవచ్చని తెలిపారు. స్వత హాగా వైద్యుడయిన నాటి ముఖ్యమంత్రి అలాంటి వైద్య సేవల ఆవశ్యకతను గుర్తించారు. అలా ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రంలో హెచ్ఎంఆర్ఐ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. పీహెచ్సీలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు నెల నెలా వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందించే 104 సంచార వైద్య వాహనానికి రూపకల్పన చేశారు. ఇక 108 అంబులెన్స్ పథకం ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి ఎనభై రూపాయలే. వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్లో పది శాతం కన్నా తక్కువ. ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శించేది. ఈ వాహనంలో ఉండే మొత్తం ఏడుగురు సిబ్బంది గర్భిణులను, బాలిం తలను పరీక్షించి మందులు ఇచ్చేది. గర్భిణుల కడుపులో పిండం పెరుగుదలను బట్టి, తగు జాగ్రత్తలు సూచించేది. అవసరమని భావిస్తే 108 అంబులెన్స్ను రప్పించి రోగిని ఆస్పత్రిలో చేర్పించే వారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులున్న వారికి నెలవారీ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు తగు మార్పులు చేస్తూ అక్కడికక్కడే మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సవివరంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేవారు. ‘దర్వాజాలో దవాఖానా’ వంటి ఈ పథకం తదనంతర రాజకీయ పరిణామాల ఫలితంగా అర్ధంతరంగా అటకెక్కింది. దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం, వైఎస్ ఆకస్మిక మరణానంతరం కొందరి నిర్వాకాలకు, మరికొందరి స్వార్థాలకు బలైపోయింది. ఇంత అత్యుత్తమ పథకం మూలన పడినా అంతా ఏమీ జరగనట్టే ఉండటానికి కారణం... ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్న వారు నోరూవాయీ లేని నిరుపేదలు కావడమే. నిరక్ష రాస్యులైన వారి గురించి రాసేవారూ లేరు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. వారి దుర్భర జీవితాలు బుల్లి తెరలపైకీ ఎక్కవు. ఎందు కంటే అలాంటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉన్న అభాగ్యుల గోడు వినిపిస్తే చూపిస్తే రేటింగులూ పెరగవు. సమాజంలోని అట్టడుగు బడుగులకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పథకం పురిట్లోనే సంధికొట్టిన రీతిగా అదృశ్యమైంది. ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కథ. ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమదైన రీతిలో ప్రజలకు మంచి పనులు చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని పదేపదే చెబుతున్నారు. వారికి ఆ తపన ఉంటే అలాంటి ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తాం అనే సంస్థలకు కొదవలేదు. కాబట్టి ఇకనైనా రెండు తెలుగు ప్రభుత్వాలూ గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెడితే బాగుంటుంది. తుది పలుకు: పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలిచి చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే...’అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పింది నేటికీ వర్తించే వాస్తవం. రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు మొబైల్ : 98491 30595 -
విధులకు డుమ్మాకొట్టిన హెచ్ఎం
♦ యువతితో పాఠశాల నిర్వహణ ♦ పొట్టి నాగన్నదొరపాలెంలో ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు ♦ విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందునే ఈ దుస్థితి అని ఆవేదన ♦ చర్యలు తీసుకుంటాం: ఎంఈవో సాయిశైలజ నాతవరం : మారుమూల గిరిజన గ్రామంలో పాఠశాలకు వెళ్లకుండా విధులకు డుమ్మా కొడుతున్న హెచ్ఎం ఉదంతం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పొట్టి నాగన్నదొరపాలెంలో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరిని జాలారిపేట పాఠశాలకు డిప్యూటేషన్పై విద్యాశాఖ అధికారులు నియమించారు. మిగిలిన హెచ్ఎం రమణ మాత్రం వారం రోజుల్లో రెండు మూడు రోజులు మాత్రమే పాఠశాలకు వస్తున్నారని మిగతా రోజుల్లో ఓ యువతితో నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఎక్సైజ్ సీఐ రాజు, నాతవరం ఎస్ఐ అశోక్కుమార్ నిర్వహించిన సారా నిర్మూలన అవగాహన సదస్సులో గ్రామస్తులు ఉపాధ్యాయుల పనితీరుని వారి దృష్టికి తీసుకువచ్చారు. సభ అనంతరం ఎస్ఐ, విలేకరులను గ్రామస్తులు పాఠశాలకు తీసుకువెళ్లి చూపించారు. ఆ సమయంలో హెచ్ఎం లేరు. ఓ యువతి, 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీనిపై ఎస్ఐ ఆరా తీయగా హెచ్ఎం సక్రమంగా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుకావడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులను బయట ప్రాంతాలకు పంపించడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయనందున ఉపాధ్యాయుల పనితీరు ఇష్టారాజ్యంగా ఉందని గ్రామస్తులు ధ్వజమెత్తారు. దీనిపై ఎంఈవో సాయిశైలజను వివరణ కోరగా హెచ్ఎం రమణ సెలవు పెట్టలేదన్నారు. దీనిపై పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
హోలీ బీభత్సం..75 మందిపై కేసులు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముజఫర్ నగర్ లో హోలీ పండుగ రోజు బీభత్సం వాతావరణం నెలకొంది. మహరాజ్ నగర్ గ్రామంలో హోలీ ఉత్సవాల సందర్భంగా రోడ్డు బ్లాక్ చేయొద్దు అన్నందుకు గ్రామస్తులు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో ఒక ఎస్సై సహా నలుగురు పోలీసులు గాయపడడంతో ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. వివరాల్లోకి వెళితే గురువారం హోలీ సందర్భంగా గ్రామస్తులు సంబరాలకు హాజరయ్యారు. సుమారు వందలమందితో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ బృందం అక్కడకు చేరుకుని రోడ్డును మూసివేయొద్దని, సజావుగా కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులపై రాళ్లతో దాడికి చేశారు. పోలీసు అవుట్పోస్ట్ ఇన్చార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ జితేందర్ సింగ్, కానిస్టేబుళ్లు గౌరవ్, జయవీర్ , ప్రవీణ్ గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్నారు. నిందితుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఈ ఘటనలో 75 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఇద్దర్ని అరెస్ట్ చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నామన్నారు. -
వివాహితపై అత్యాచారయత్నం
కెరమెరి : మండలంలోని దేవుడ్పల్లి గ్రామానికి చెందిన వివాహతపై ఆదే గ్రామానికి చెందిన మహాత్మే అశోక్ మంగళవారం రాత్రి అత్యాచారయత్నం చేసినట్లు రాథోఢ్ తానాజి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవుడ్పల్లి గ్రామానికి ఓ వివాహిత తన పిల్లలతో ఇంట్లో పడుకుని ఉంది. భర్త ఆటోలో ఇతర గ్రామానికి వెళ్లడం గమనినించిన అశోక్ ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లో చొరబడి ఆత్యాచారయత్నం చేయబోయాడు. దీంతో సదరు మహిళ పెద్దపెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఇది గమనించిన అశోక్ పారిపోయాడు. అప్పటికే వచ్చిన భర్తతోపాటు గ్రామస్తులకు జరిగిన విషయాన్ని ఆ మహిళ చెప్పింది. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి వివరాలు సేకరించి.. కేసు నమేదు చేసినట్లు తానాజి పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. -
గ్రామస్తులపైకి దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
విడవలూరు: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. 30 మంది రౌడీలను తెచ్చి గ్రామస్తులపై దాడి చేయబోయాడు. నెల్లూరు నగరం మూలాపేటకు చెందిన ఓ వ్యక్తికి చౌకుచర్ల గ్రామంలో 22 ఎకరాల పొలం ఉంది. గ్రామస్తుల దగ్గర కొంత మేర అప్పు తీసుకున్నాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు వచ్చాడు. అప్పు తీర్చిన తర్వాతే పంట కోయాలని గ్రామస్తులు సదరు వ్యక్తికి చెప్పారు. దీంతో తన అనుచరులు 30 మందిని మూడు ఆటోల్లో గ్రామానికి తీసుకు వచ్చాడు. వాళ్ల దగ్గర నాటు తుపాకులు, కత్తులు ఉండటం చూసి గ్రామస్తులు పోలీసులకు ఈ విషయం తెలిపారు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
విద్యార్థినిపై లైంగిక వేధింపులు
ఆందోళనకు దిగిన గ్రామస్తులు దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ఆ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో శనివారం గ్రామస్తులు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగడంతో పాటు పంచాయతీ నిర్వహించారు. ఇందుకు సంబందించి వివరాలు ఇలా ఉన్నాయి. గౌరారం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రకరకాల ప్రలోభాలకు గురిచేస్తూ లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాలికల పాఠశాలలో పురుష ఉపాధ్యాయులు ఉండటంతోనే ఇటువంటి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం బాలిక మేడారం జాతరకు వెళుతుండగా మార్గమధ్యలో ఆ ఉపాధ్యాయుడు మోటారుసైకిల్పై ఎక్కించుకుని పెదనల్లబల్లి అడ్డ రోడ్డు వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం మూడు రోజుల క్రితం బయటకు పొక్కింది. దీంతో గ్రామస్తులు స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్కి వివరాలు సేకరించి హెచ్ ఎం రమేష్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు మల్లేశ్వరరావు, జుంకిలాల్లను హెచ్ఎం శుక్రవారం సాయంత్రం తీవ్రంగా మందలించి అటువంటి చర్యలకు పాల్పడితే సరిదిద్దుకోవాలని మరోసారి ఇటువంటి ఆరోపణలు వసే ్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో విద్యార్థి సంఘాల నాయకులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఆందోళన చేపట్టారు. గ్రామ పెద్దలు అక్కడికి చేరుకొని పంచాయతీ నిర్వహించారు. అయితే పదో తరగతి బాలికలను సందేహాల నివృత్తి పేరుతో వారి గదులకు పిలిపించుకొని వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. సమాచారం సేకరించేందుకు వెళ్లిన విలేకరులను పంచాయతీ జరిగే సమయంలో అక్కడ ఉండవద్దని గ్రామస్తులు కోరారు. కాగా పాఠశాలకు చెందిన వర్కర్లు ఉపాధ్యాయుల మెప్పు పొందేందుకు బాలికలను లైంగిక దాడులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటీడబ్ల్యూఓ విచారణ గౌరారం ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న పరిణామాలపై ఏటీడబ్ల్యూ బాబూరావు శనివారం సాయంత్రం విచారణ చేపట్టారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు ఆయన పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థినులను, ఉపాధ్యాయులతో వేరువేరుగా మాట్లాడి సమాచారం సేకరించి ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. డీడీకి ఫిర్యాదు ఈ విషయంపై గిరిజన సంఘాల నాయకుడు చలపతి, స్థానిక సర్పంచ్ రాముడు డీడీ అబ్రహంకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలలో మహిళా టీచర్లను నియమించాలని కోరారు.తక్షణమే కీచక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎటువంటి లైంగిక దాడులు జరగలేదు గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డారనే వదంతులు నిరాధారమైనవి. కొందరు గిట్టని వారు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు. -హెచ్ఎం రమేష్ నాకే పాపం తెలియదు లైంగిక వేధింపులు చేస్తున్నారని ఆరోపణలు అవాస్తవం. పదో తరగతి విద్యార్థిని గౌరారం నుంచి పెదనల్లబల్లికి వెళుతుండగా మార్గమధ్యలో కనబడితే వాహనంపై ఎక్కించుకొని పెదనల్లబల్లి అడ్డరోడ్డులో దించాను. లైంగి క వేధింపులకు నాకు ఎటువంటి సంబంధం లేదు. - ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు -
రెండేళ్ల పిల్లాడిని చంపేసిన పులి
హరిద్వార్ : ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ ఏరియాలో మరోసారి కలకలం రేగింది. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి గాంచిన ఈ పార్క్ లోంచి బయటికి వచ్చిన పులి ఓ చిన్నారిని పొట్టనపెట్టుకుని బీభత్సం సృష్టించింది. హరిద్వార్లోని మోతిచూర్ అనే ప్రాంతంలోకి చొరబడిన ఓ పులి.. రెండేళ్ల పిల్లవాడిని చంపేసింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. పార్కులో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయాలంటూ ఆందోళనకు దిగారు. పార్క్ చుట్టూ గోడ ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. కాగా గత ఏడాది ఈ పార్క్ లోంచి ఐదు ఏనుగులు జనావాసంలోకి చొచ్చుకొని వచ్చి గలాటా సృష్టించాయి. -
పోలీసులపై గ్రామస్తుల దాడి
కరీంనగర్ : కేసు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇటీవల గ్రామానికి చెందిన ఓదెలు, మందల శ్రీనివాస్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారిరువురు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు గ్రామానికి వెళ్లారు. ఆ క్రమంలో గ్రామస్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులను చుట్టిముట్టి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని.... గ్రామస్తులను, పోలీసులు శాంత పరిచారు. అనంతరం పోలీసులు వెనుతిరిగారు. -
టోల్ప్లాజా వద్ద గ్రామస్థుల ఆందోళన
బిక్నూర్: నిజామాబాద్ జిల్లా బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం స్థానిక గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. టోల్ప్లాజా వద్ద స్థానికులకు చెందిన వాహనాలకు చలానాల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. తమకు చెందిన వాహనాలకు పదేపదే చలానాలు చెల్లించవలసి వస్తుందని దీనిపై మినహాయింపు ఇవ్వాలని టోల్ప్లాజా ఇంచార్జ్కు ప్రజలు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఇంచార్జ్ గ్రామస్థులకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు. -
'షోలే సీన్' ను ఫాలో అయ్యారు..
ఔరంగాబాద్ (మహారాష్ట్ర) : భారతదేశం గర్వించదగిన సినిమాల లిస్ట్ లో 'షోలే' ఒకటి. బాలీవుడ్ లో బంపర్ హిట్ అయిన ఆ సినిమాలోని ప్రతీ సీన్ అభిమానులకు కొట్టిన పిండే. అలాంటి ఓ సీన్నే గ్రామస్తులు తమ నిరసన వ్యక్తం చేయడానికి వాడుకున్నారు. షోలే సినిమాలో బసంతి(హేమా మాలిని)ని పెళ్లి చేసుకోవడానికి ఆమె పిన్ని నిరాకరించినందుకు నిరసనగా వీరూ(ధర్మేంద్ర) వాటర్ ట్యాంక్ పైకెక్కి నానా రచ్చ చేస్తాడు. సరిగ్గా అదే సీన్ ను ప్రేరణగా తీసుకుని కొన్ని గ్రామాలకు చెందినవారంతా కలిసి వాటర్ ట్యాంక్ ఎక్కారు. కానీ ఇక్కడ బసంతి కోసం కాదు.. తాగునీటి కోసం. మహారాష్ట్రలోని మరథ్వాడా జిల్లా పరిధిలో గల కొన్ని గ్రామాలు గత కొంతకాలంగా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులరిగిపోయాయిగానీ నీటి కష్టాలు మాత్రం తీరలేదు. విసిగిపోయిన గ్రామస్తులు ఆదివారం ఓ వాటర్ ట్యాంకు పైకెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. జైక్వాడ్ డ్యాం నుంచి నీటిని విడుదల చేసేదాకా దిగేది లేదంటూ హెచ్చరించారు. వేసవి మొదలుకాకముందే మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రత్యేకించి మరథ్వాడా జిల్లాలోని డ్యాంలలో ఇప్పటికే నీటి శాతం ఎనిమిదికి పడిపోయింది. కాగా దీనిపై నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ స్పందిస్తూ.. డ్యాంలలో నీటి నిల్వలు లేనందున ఇబ్బందులు తప్పవని, అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 రెట్లు ఎక్కువ సంఖ్యలో వాటర్ ట్యాంకులను గ్రామాలకు సప్లై చేస్తామని వెల్లడించారు. -
డెక్కన్ కెమికల్స్ వద్ద ఉద్రిక్తత
-
డెక్కన్ కెమికల్స్ వద్ద ఉద్రిక్తత
పాయకరావుపేట: ఫ్యాక్టరీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని.. వెంటనే భద్రతా చర్యలు తీసుకోకుంటే మూసివేయిస్తామని హెచ్చరిస్తూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివరాలివీ...విశాఖ జిల్లా పాయకరావుపేట వద్ద పట్టణ సమీపంలో డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీ ఉంది. దీనిలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేతవరం, రాజానగరం, గజపతి నగరం, వెంకటనగరం, రాజవరం గ్రామాలకు చెందిన దాదాపు వెయ్యి మంది ప్రజలు కర్మాగారం ప్రధాన గేట్ వద్ద బైఠాయించారు. ఫ్యాక్టరీ చైర్మన్, ఎండీ వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీలోకి చొచ్చుకుపోయి ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేయటానికి పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
చిత్తూరు జిల్లాలో రెచ్చిపోయిన తమ్ముళ్లు
తిరుపతి: చిత్తూరుజిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులతో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేణిగుంట మండలం కొట్రమంగళం టీడీపీ గ్రామసర్పంచ్ దామోదర రెడ్డి అక్రమాలకు పాల్పడినట్లు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ దామోదర రెడ్డి చెక్ పవర్ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన గ్రామస్తులపై సర్పంచ్ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
డీఈ కార్యాలయం ముట్టడి
మిర్యాలగూడ: అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ మృతి చెందిందని.. కోపోద్రిక్తులైన గ్రామస్థులు బుధవారం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓల్టేజీ సమస్యపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కార్యాలయం ముట్టడికి యత్నించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ట్యాంక్ తండాలో మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో ఇళ్లలోని పలు విద్యుత్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. తాజాగా.. గ్రామానికి చెందిన రమావత్ బుజ్జీ(35) టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నించి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన తండా వాసులు మృతదేహం సహా మిర్యాలగూడలోని డీఈ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగేవి కావని తండావాసులు చెప్పుతున్నారు. -
దొంగల్ని చితకబాది దోచుకున్నారు..
ఆగ్రా: డబ్బు దోచుకుని పారిపోతున్న ఘరానాదొంగల్ని గ్రామస్తులు పట్టుకుని చితకబాదారు. వారి నుంచి నగదు, ఆయుధాలు దోచుకున్నారు. గ్రామస్తులు దొంగల్ని బంధించి పోలీసులకు ఫోన్ చేశారు. ఈ వార్త వినగానే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా పోలీసులు సంతోషించారు. ఎందుకంటే గ్రామస్తులు బందించిన వాడిలో ఓ వాంటెడ్ క్రిమినల్ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఆగ్రా సమీపంలో నలుగురు దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. దొంగలు రెండు బైకులపై వెళ్తూ విజయ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేసి అతణ్నుంచి పర్స్ లాక్కొ పారిపోయారు. అయితే విజయ్ సింగ్ దొంగలను పట్టుకునేందుకు వారి వెంటపడ్డాడు. దొంగలు మాల్పురా బ్లాక్ ఖల్లావా గ్రామంలోకి వెళ్లగానే విజయ్ వారిని పట్టుకోవాల్సిందిగా కేకలు వేశాడు. గ్రామస్తులు అప్రమత్తమై దొంగల వెంటపడ్డారు. ఓ బైకులో వెళ్తున్న ఇద్దరు దొంగలు తప్పించుకోగా, మరో బైకులో ఉన్న ఇద్దరు దొంగలు దొరికిపోయారు. గ్రామస్తులు వీరిద్దరినీ చితకబాది డబ్బు, మూడు రివాల్వర్లు, ఓ ల్యాప్టాప్ దోచుకున్నారు. వారిని బందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దొంగల్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగల్లో నేత్రపాల్ సింగ్ అనే వాంటెడ్ క్రిమినల్ ఉన్నట్టు గుర్తించారు. అతడి కోసం ఫిరోజాబాద్, ఆగ్రా జిల్లాల పోలీసులు ఎప్పటి నుంచో గాలిస్తున్నారు. నేత్రపాల్ సింగ్పై చాలా కేసులున్నాయని, ఓ దొంగల ముఠాలో సభ్యుడని పోలీసులు తెలిపారు. గ్రామస్తులు మొదట డబ్బు, రివాల్వర్లను వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించినా.. తర్వాత పోలీసులకు అప్పగించారు. -
చిత్తూరులో ఏనుగుల బీభత్సం
చిత్తూరు జిల్లాలో వరసగా రెండో రోజు.. ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బెరైడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లె గ్రామం శివారులోని పంట పొలల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు పంటలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇప్పటికే ఏనుగుల దాడిలో గ్రామస్థులు వరి, రాగి, బీన్స్ పంటలను నష్టపోయారు. కాగా ఈ రోజు ఉదయం వాటిని తర మివేయడానికి ప్రయత్నించిన కొందరు గ్రామస్థులపై ఏనుగులు దాడికి దిగాయి. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. తమ గ్రామాల్లో తరచూ ఏనుగులు పంటలను నాశనం చేయడంతో పాటు.. గ్రామస్తులపై దాడికి దిగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అటవీ అధికారులకు ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా.. ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది..
-
కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత
ఘట్కేసర్: ఇతర జిల్లాల నుంచి అక్రమంగా హైదరాబాద్లోని కబేళాలకు తరలిస్తున్న 40 పశువులను స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్రోడ్డు వద్ద శుక్రవారం సాయత్రం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు పశువుల వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన 40 లేగ దూడలను ఓ లారీలో అక్రమంగా తరలిస్తుండగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్టుకింద... కట్టు ‘బడి’
చినరాజాం కాలనీ వాసుల వినూత్న నిరసన ‘మాగ్రామంలో పాఠశాలను మూసేయొద్దు’ అని ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో ఆగ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. చెట్టుకిందే బడి నిర్వహిస్తూ సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గల చినరాజాంకాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తక్కువ మంది పిల్లలు ఉన్నారనే నెపంతో ప్రభుత్వం ఇటీవల మూసివేసింది. పాఠశాలను మూసివేయడం సరికాదని గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి దూరంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం బరంపురం కాలనీ పాఠశాలలో దీనిని విలీనం చేసింది. తమ గ్రామం నుంచి పిల్లలు రోడ్డుపై అంతదూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని, మా పాఠశాల మాకు కావాలి అని గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామంలో ఉన్న విద్యాధికులు ఒక చెట్టుకిందనే బడి నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈపరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. - పలాస -
నార్మెట్టలో చిరుత కలకలం
వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం మచుపహాడ్లో చిరుత కలకలం రేపుతోంది. ఇటీవల గ్రామ శివారులో మృతి చెందిన పశువుల దూడలకు బుధవారం పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలోనే దూడ మృతిచెందినట్లు నిర్ధరించారు. దీంతో గ్రామస్థులు భయంతో వణికి పోతున్నారు గతంలో పలుమార్లు చిరుత సంచారంపై అధికారులకు సమాచారం ఇచ్చిన.. సరైన ఆధారాలు లభించని కారణంగా వారు చూసీ చూడనట్లు వ్యవహరించారు. కాగా.. వైద్యుల రిపోర్టు చిరుత సంచారానికి బలం చేకూర్చింది. ఇప్పటికైనా...అధికారులు స్పదించి తగినచర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇసుక రవాణా అడ్డుకున్న గ్రామస్తులు
కొవ్వూరు(పశ్చిమగోదావరి): కొవ్వూరు మండలం వాడపల్లి ఇసుక ర్యాంప్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలిస్తున్న ఇసుక లారీలను స్థానికులు అడ్డుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 మధ్యే ఇసుకను తరలించేందుకు పర్మిషన్ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో ఇసుక తరలిస్తుండటంతో స్థానికులు ప్రతిఘటించారు. దీంతో చేసేదేమీ లేక ట్రాక్టర్లు, లారీలలో నింపిన ఇసుకను ఖాళీ చేయించి అధికారులు వెనుదిరిగారు. సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. -
చాకచక్యంగా చిన్నారిని రక్షించిన గ్రామస్తులు
జైపూర్: బోరుబావిలో పడిన రెండున్నరేళ్ల చిన్నారిని గ్రామస్తులు సురక్షితంగా కాపాడిన వైనం ఆ గ్రామంలో ఆనందోత్సాహాల్ని నింపింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ కు సమీపంలో దౌసా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బిహార్పుర గ్రామంలో జ్యోతి మీనా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ఇంటివద్ద ఆడుకుంటూ సుమారు 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. దాదాపు12 గంటల కఠిన ప్రయత్నాల తర్వాత గ్రామస్తులు సోమవారం తెల్లవారుజామున పాపను బయటకు తీయగలిగారు. ప్రాథమిక చికిత్స అనంతరం దోసాలోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారిని కోలుకుంటోందని వైద్యులు ప్రకటించారు. ఈ సహాయ కార్యక్రమంలో ఎన్డీఆర్ఆఫ్ దళాలు, జిల్లా రక్షర దళాల సహాయంతో బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్విన గ్రామస్తులు పాపను రక్షించారని జిల్లా కలెక్టర్ ఎస్ ఎస్ పవార్ మీడియాకు తెలిపారు. ముఖ్యంగా స్థానికం తయారు చేసిన ఇనుప రాడ్లు, పగ్గాల ద్వారా పాపను రక్షించడంలో గ్రామస్తులు చాలా చాకచక్యంగా వ్యవహరించారని ఆయన కొనియాడారు. -
ఏపి మంత్రికి ఒళ్లు మండింది!!
-
రేషన్ సరుకుల కోసం గ్రామస్తుల ఆందోళన
ప్రకాశం జిల్లా దర్శి మండలం అబ్బాయిపాలెం గ్రామస్తులు రేషన్ సరుకుల కోసం శనివారం ధర్నాకు దిగారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సరుకులను ఇంతవరకు డీలర్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా ఉన్న రేషన్ డీలర్ను రాజకీయ కారణాలతో తొలగించి నాలుగు నెలల క్రితం ఇరుగు పోల్రెడ్డి అనే వ్యక్తికి డీలర్షిప్ అప్పగించారని గ్రామస్తులు అంటున్నారు. కొత్తగా వచ్చిన డీలర్ సరుకులను పంపిణీ చేయకుండా అక్రమంగా విక్రయించుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ కోటా డీలర్కు వచ్చిననప్పటికీ వాటిని ఇంతవరకు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా విషయం తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
విషాదం
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆడుతూ పాడుతూ శోభాయాత్రలో పాల్గొన్న ముగ్గురిని మృత్యువు కబళించింది. డీజే పాటల కోసం విద్యుత్ తీగలు అమర్చే క్రమంలో షాక్ తగిలి.. ఆటోలో కూర్చున్న మడావి కాశీరామ్(45), రజినీకాంత్(15), గేడం సంతోష్(27) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇదే ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి. ఇంద్రవెల్లి మండలం పిప్రిలో బుధవారం రాత్రి జరిగిన ఈ సంఘటన మూడు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. జైనథ్ మండలం బాలాపూర్ గ్రామానికి చెందిన రౌత్ గజానన్(18) వినాయక నిమజ్జనం అనంతరం పెండల్వాడ వాగులో గల్లంతయ్యాడు. గ్రామస్తులు మూడు గంటలపాటు గాలించగా మృతదేహం లభించింది. - గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి - వేర్వేరు చోట్ల నలుగురు దుర్మరణం - విద్యుదాఘాతంతో ముగ్గురు.. - వాగులో గల్లంతై డిగ్రీ విద్యార్థి.. - మరొకరికి గాయాలు ఇంద్రవెల్లి : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళించింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మండలంలోని పిప్రి గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన మూడు గ్రామాల్లో విషాదం మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని లక్కుగూడ గ్రామస్తులు గణేష్ ప్రతిమను ఏర్పాటు చేసి ఏడు రోజులు పూజలు నిర్వహించారు. బుధవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో గణేష్ ప్రతిమ ఊరేగింపు నిర్వహించారు. ముత్నూర్ త్రివేణి సంగం ప్రాజెక్టులో నిమజ్జనం చేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలోని పిప్రి గ్రామంలో ఆటోలో అమర్చిన డీజే కోసం కోండిల(విద్యుత్ వైర్లు) ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పిస్తుండగా ఆటో మొత్తానికి కరెంటు సరఫరా జరిగింది. దీంతో ఆటోలో ఉన్న చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి కాశీరామ్(45), పిప్రి గ్రామానికి చెందిన కోడప గంగారాం, మొతుబాయి దంపతుల కుమారుడు రజినీకాంత్(15), మండలంలోని తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధి మల్లపూర్కు చెందిన గేడం సంతోష్(27) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లపూర్ గ్రామానికి చెందిన డీజే ఆపరేటర్ దుర్వ అనిల్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించంగా చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై రమేష్కుమార్ పిప్రి, లక్కుగూడ గ్రామాలను సందర్శించి సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు విద్యుతాఘాతంతో ముగ్గురు మృత్యువాతపడడంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి కాశీరామ్కు భార్య దుర్పతబాయి, నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. గేడం సంతోష్కు భార్య వనజ, కుమారుడు నాగరాజ్(2) ఉన్నారు. వనజ ఐదు నెలల గర్భిణి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
'మా భూములు ఇవ్వం'
విజయనగరం: భోగాపురం విమానాశ్రయ భూముల సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను వారు మధ్యలోనే నిలువరించారు. డిప్యూటీ కలెక్టర్ అనిత సహా సర్వే అధికారులను సర్వే చేయకుండా ఆపేశారు. తమ భూములు విమానాశ్రయం కోసం ఇవ్వబోమని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటుచేసుకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. -
కృష్ణాజిల్లాలో క్షుద్రపూజల కలకలం
తిరువూరు : కృష్ణాజిల్లా తిరువూరు మండలం వామకుంట్లలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన నగేశ్, వెంకట్రావమ్మ, రవిలు ఊరి పొలిమేరలో చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. వీరితో పాటు గ్రామానికి చెందిన మరో 40మంది చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. రహదారిపై బైటాయించి రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు పలు దఫాలుగా గ్రామ పెద్దలతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన కొనసాగించారు. గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు
-
మంత్రి, ఎంపీలను తరిమికొట్టిన గ్రామస్తులు
మచిలీపట్నం: బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల కోసం భూసేకరణకు గ్రామస్తులను ఒప్పిస్తామంటూ వెళ్లిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణలను గ్రామస్తులు తరిమికొట్టారు. పచ్చటి పంట పొలాలను కూడా భూసేకరణ జాబితాలోకి చేర్చి.. పొలాలు ఇవ్వడానికి రైతులను ఒప్పిస్తామని మంత్రి రవీంద్ర, ఎంపీ నారాయణ సర్వే సిబ్బందితో కలిసి శనివారం బందరు మండలంలోని కోన గ్రామానికి వెళ్లారు. అయితే, రెండు మూడు పంటలు పండే పచ్చటి పొలాలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నాలపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి, ఎంపీ కలిసి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, అసలు మీరు మా గ్రామానికి వచ్చే సాహసం ఎలా చేశారంటూ రైతులు, గ్రామస్తులు వాళ్ల మీద తిరగబడ్డారు. వాళ్లను మాట్లాడనివ్వకుండా గ్రామంలోంచి తక్షణం వెళ్లిపోవాలంటూ తిరగబడ్డారు. అలా గ్రామ పొలిమేరల వరకు నేతలను రైతులు తరిమికొట్టారు. ఈ సమయంలో మంత్రి రవీంద్ర పీఏ హరిబాబు రైతులను నివారించే ప్రయత్నం చేయడంతో.. వాళ్లు ఆయనపై తిరగబడ్డారు. ఈ ఘటనలో హరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. చివరకు మంత్రి, ఎంపీ గ్రామస్తుల ఆగ్రహానికి తలవంచి వెళ్లిపోయారు. ఇప్పటికీ అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. -
మంచంపట్టిన మందుబాబులు !
-
అక్రమ మైనింగ్ను ఆపాల్సిందే
- ఉడమలకుర్తి, చిన్నపల్లి గ్రామస్తుల ధర్నా - మద్దతు తెలిపిన ఎమ్మెల్యే చాంద్బాషా కదిరి: ‘‘తలుపుల మండలం గుండ్లకొండలో చేపట్టిన అక్రమ మైనింగ్ను ఆపాల్సిందే.. లేదంటే అందరం ఇక్కడే ఏదైనా తాగి చచ్చిపోతాం..’’ అని ఆ కొండను ఆనుకొని ఉన్న చిన్నపల్లి, ఉడమలకుర్తి వాసులు హెచ్చరించారు. బుధవారం ఆ రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు సుమారు 4 గంటల పాటు ధర్నాకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గుండ్లకొండలో తమ ఇలవేల్పు దేవుడు గుండ్లకొండరాజు గుడి ఉందని, మైనింగ్ లీజుదారులు ఆ గుడిని కూల్చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. కొండపై ఉన్న పురాతనమైన గుడి ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని, తక్షణం లీజు అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2010లో కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనింగ్కు అనుమతులు కోరితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారని శాపనార్థాలు పెట్టారు. ఆ బ్లాస్టింగులతో తమ ఇంఇ గోడలు నెర్రెలు చీలడంతోపాటు వాటి శబ్దాలకు ఇళ్లలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అక్రమ మైనింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నపల్లి, ఉడమలకుర్తి గ్రామస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా హామీ ఇచ్చారు. ఆయన ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ఆ గ్రామస్తులతో కలిసి ఆర్డీఓతో మాట్లాడారు. తాను కూడా త్వరలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తానన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు!
పుల్కల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు తాము వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మిచుకునేందుకే తవ్వకాలు జరుపుతున్నామని చెబుతున్నా.. కాదు గుప్త నిధులకోసమే తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మండలంలోని శివ్వంపేట గ్రామంలో బండ బోయిని నర్సింలు ఇంటి సమీపంలోని స్థలంలో 50 నుంచి 60 ఫీట్ల లోతులో ఐదు వారాలుగా గుంత తీస్తున్నారు. రాత్రి పూట తవ్వకాలు జరుపుతుండటంతో ఆ ప్రాంతంలోని వారు ఆందోళనకు గురవుతున్నారు. బాత్ రూం నిర్మాణం కోసమైతే పగలు తవ్వకాలు నిర్వహిస్తారు. అయినా తొమ్మిది ఫీట్ల కంటే ఎక్కువ లోతు తీసే పరిస్థితి ఉండదు. కాని ఏకంగా 50 ఫీట్లకు పైగా తవ్వకాలు నిర్వహించడంతో అనుమానాలకు దారి తీస్తోంది. అది ఎవ్వరికీ అనుమానం రాకుండా చుట్టూ దడి నిర్మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికీ సుమారుగా 50 ఫీట్లకు పైగా తీయడం వల్ల గుంతల్లో నీరు ఊరుతుంది. అయినా తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు. -
గృహవల్లి
- ఎర్రవల్లికి 285 డబుల్ బెడ్రూంలు మంజూరు - గ్రామస్తుల హర్షాతిరేకాలు - త్వరలోనే సీఎం భూమిపూజ జగదేవ్పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లిలో సోమవారం సంబురాలు మిన్నంటాయి. ఈ గ్రామానికి 285 డబుల్ బెడ్రూములు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. సంబురాలు చేసుకున్నారు. గ్రామంలో డబుల్ బెడ్ రూముల ఇళ్లను మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణాల కోసం రూ.14.36 కోట్లను సైతం మంజూరు చేశారు. కలెక్టర్ రోనాల్డ్రాస్, గడా అధికారి హన్మంతరావు, మండల తహశీల్దార్కు, హౌసింగ్ అధికారులకు ఉత్తర్వులను పంపించారు. ఒక్క డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.4 లక్షల చొప్పున విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఎర్రవల్లిలో సీఎం పర్యటించినప్పుడు.. ఒక్క పెంకుటిల్లు లేకుండా కూల్చివేయాలని సీఎం అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. అలాగే ఇళ్లు లేనివారు కోసం అధికారులు సర్వే చేసి 285 మంది అర్హులను గుర్తించారు. గృహనిర్మాణ సంస్థ అధికారులు కూడా ఇటీవల సర్వే నిర్వహించారు. గ్రామంలో గుర్తించిన అర్హుల నివేదికను ఇటివల సీఎం కేసీఆర్ దృష్టికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్, గడా అధికారి హన్మంతరావు తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో సోమవారం ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూంల నిర్మాణం కోసం గృహ నిర్మాణ సంస్థ నుంచి జీఓ విడుదలైంది. చైనా పర్యటన అనంతరం సీఎం కేసీఆర్.. ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసే అవకాశం ఉంది. కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం... గ్రామానికి డబుల్ బెడ్రూంలు మంజూరు కావడంతో సోమవారం ఎర్రవల్లి గ్రామ సర్వ వర్గ సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఊరంతా స్వీట్లు పంచుకున్నారు. గ్రామ సర్పంచ్ భాగ్య, గ్రామ సర్వ వర్గ సమితి అధ్యక్షుడు కిష్టారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు ఎర్రవల్లి గ్రామస్తులందరం జన్మజన్మలా రుణపడి ఉంటామన్నారు. ఊరంతా పెంకుటిళ్లు లేకుండా డబుల్ బెడ్ రూంలు కట్టించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణ, ఆంజనేయులు, సలహాదారులు భిక్షపతి, బాల్రాజు, సభ్యులు సత్తయ్య, నవీన్, మహిళ సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
మాధారంలో మద్యం నిషేధం
- విక్రయిస్తే జరిమానా,ప్రభుత్వం పథకాలు రద్దుచేయూలని తీర్మానం - అమ్మకందారులకు నోటీసులు మాధారం (రఘునాథపల్లి) : మండలంలోని మాధారంలో బెల్టుషాపులు, గుడుంబా నివారణకు గ్రామస్తులు నడుంబిగించారు. శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ బాల్నె అనురాధ ఆధ్వర్యంలో అన్ని పార్టీల నాయకులు, కుల పెద్దలు, మహిళా సంఘాల అధ్యక్షులు సమావేశమయ్యారు. గ్రామంలో బెల్టుషాపులు, గుడుంబా విక్రయిస్తే జరిమానాలతో పాటు ప్రభుత్వ పథకాలు పూర్తిగా నిలిపి వేయాలని నిర్ణయించారు. ఈ నెల 8 నుంచి గ్రామంలో మద్య నిషేధం అమల్లోకి తేవాలని పకడ్బంధీగా అమలయ్యేలా నిషేధ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా బెల్టు షాపు నిర్వహిస్తే రూ 20 వేల జరిమానా, గుడుంబా అమ్మితే రూ 10 వేలు, తాగిన వారికి రూ 5 వేల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ప్రస్తుతం బెల్టు షాపులు నిర్వహిస్తున్న నలుగురికి, గుడుంబా అమ్ముతున్న ఆరుగురికి గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు తయారు చేసి స్వయాన నూతనంగా ఎంపికైన నిషేధ కమిటీ సభ్యులు వారి వద్దకు వెళ్లి అందించారు. గ్రామస్తుల నిర్ణయాన్ని ధిక్కరించి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామాఖ్య సంఘం అధ్యక్షురాలు ఉమ్మగోని సరిత, సీఏ కర్ల పద్మ, టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మగోని నర్సయ్య, బాల్నె భిక్షపతి, అరూరి బాలస్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
మద్యనిషేధానికి గ్రామస్తుల ప్రతిజ్ఞ
భైంసా రూరల్: సంపూర్ణ మద్య నిషేధానికి ఓ గ్రామస్తులు ముందుకొచ్చారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుంసరా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని యువకులు, కులసంఘాలు, పెద్దలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యావంతులు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యంతో ఇబ్బందులు వస్తున్నాయని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరూ మద్యం ముట్టుకోరాదని ప్రతిజ్ఞ చేశారు. మద్యానికి దూరంగా ఉంటూ గ్రామంలో మద్యం విక్రయాలు సైతం చేపట్టకుండా ఉండాలని అంతా నిర్ణయానికి వచ్చారు. -
లంచం కాటుకు చెంప దెబ్బ
-
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాలు
నిజామాబాద్ : బాల్కొండ మండలం నాగ్పూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. గ్రామంలో కబ్జాకు గురైన పశువుల మంద భూమిని వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ధర్నాలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. కాగా అదే సమయంలో ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామస్తులు కూడా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. -
కెమికల్ ఫ్యాక్టరీపై గ్రామస్తుల దాడి
నెల్లూరు: తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెడుతున్న ఓ ఫ్యాక్టరీ పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండలకేంద్రం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. మండల కేంద్రానికి సమీపంలోని న్యూట్రస్ స్పెషాలిటీ కార్యలయం అద్దాలు ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దాడిలో పాల్గోన్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.