కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి | Water shortage with a new water system | Sakshi
Sakshi News home page

కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి

Published Thu, Aug 24 2017 2:43 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి

కొత్త జల విధానంతో నీటి కొరత తీర్చండి

కేంద్ర మంత్రికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఎగువన ఉన్న రాష్ట్రాలు తెలంగాణకు నీటి విడుదలలో వివక్ష చూపుతున్నాయని ఎంపీ బూర  నర్సయ్య గౌడ్‌ ఆరోపించారు. నీటి వినియోగంపై కేంద్రం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి బుధవారం లేఖ రాశారు. కర్ణాటకలో రిజర్వాయర్లు నిండుగా ఉంటే.. ఏపీ, తెలంగాణలో మాత్రం ఎండిపోతున్నాయన్నారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు కేటాయింపుల కంటే అధిక నిష్పత్తిలో నీటిని వినియోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కలసి భువనగిరికి మంజూరైన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ మెడిసిన్‌ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement