'వేం నరేందర్ సహాయకులను విచారిస్తున్న ఏసీబీ' | ACB quizzing vem narender reddy car driver, home maid | Sakshi
Sakshi News home page

'వేం నరేందర్ సహాయకులను విచారిస్తున్న ఏసీబీ'

Jul 17 2015 5:14 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు కీలక వ్యక్తులతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు కీలక వ్యక్తులతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. శుక్రవారం టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి కారు డ్రైవర్ దేవేందర్తో పాటు పనిమనిషి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ అధికారులు వీరిని ప్రశ్నిస్తున్నారు.

గత రెండు రోజులు ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్ను విచారించిన సంగతి తెలిసిందే. అంతకుముందు వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement