'ఆదర్శ్' నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారు: ఉద్ధవ్ ఠాక్రే | Adarsh case should have been probed thoroughly: Sena chief | Sakshi

'ఆదర్శ్' నిందితుల పేర్లను ఎందుకు దాస్తున్నారు: ఉద్ధవ్ ఠాక్రే

Jan 16 2014 8:50 PM | Updated on Jul 26 2019 5:53 PM

ఆదర్శ్ కుంభకోణంకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే తెలిపారు.

ముంబై: ఆదర్శ్ కుంభకోణంకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేయాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఆదర్శ్ కేసులో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ విచారించిన సీబీఐ తర్వాత అసలు నిందితుల పేర్లను బయటకు వెల్లడించకపోవడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. ఈ కేసు విచారణ సవ్యమైనదిశలో సాగడం లేదని ఆయన పేర్కొన్నారు. కొంతమంది పెద్దలు నేరాలకు పాల్పడిన అనంతరం వారికి వారే క్లీన్ చిట్ పొందడం పరిపాటిగా మారిందన్నారు.

 

ఆదర్శ్ స్కాం దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  ఈ ఘటనలో అభియోగాలు మోపడ్డ వారి పేర్లను దాచడాన్నిఠాక్రే ప్రశ్నించారు. కాగా, అశోక్ చవాన్ ఆదర్శ్ కుంభకోణానికి పాల్పడ్డారని తాను వ్యాఖ్యానించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement