స్పందించకుంటే నిరవధిక దీక్ష: కేజ్రీవాల్ | Arvind Kejriwal, his ministers continuous on 'dharna' outside Rail Bhavan | Sakshi

స్పందించకుంటే నిరవధిక దీక్ష: కేజ్రీవాల్

Jan 21 2014 9:17 AM | Updated on Sep 2 2017 2:51 AM

స్పందించకుంటే నిరవధిక దీక్ష: కేజ్రీవాల్

స్పందించకుంటే నిరవధిక దీక్ష: కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. పోలీసుల తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నా రెండోరోజు కూడా కొనసాగుతోంది.

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. పోలీసుల తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నా రెండోరోజు కూడా కొనసాగుతోంది. రైల్‌ భవన్‌ దగ్గర ఆయనతో పాటు ఢిల్లీ మంత్రులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాత్రి పూట చలిలో కూడా వారు అక్కడే నిద్రించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం  ఇప్పటికైనా స్పందించకుంటే నిరవధిక దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. కాగా ఈరోజు జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం కూడా దీక్షాస్థలి వద్దే నిర్వహించాలని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్నా దృష్ట్యా ఇవాళ కూడా 4 మెట్రో స్టేషన్లు మూసివేశారు.


కాగా కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని మనీశ్‌ సిసోడియా స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటి దగ్గర డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ సెల్యూట్‌ చేయనందుకే ఆ గార్డును సస్పెండ్‌ చేసే షిండే.. ఢిల్లీలో మహిళలకు భద్రత లేకుండా పోయినా పట్టించుకోవడంలేదని సిసోడియా ఆరోపించారు. పోలీసుల అండతోనే ఢిల్లీలో సెక్స్‌ రాకెట్‌, డ్రగ్‌ మాఫియా జరుగుతోందని... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement