Union Home Ministry
-
మణిపూర్ సంక్షోభం.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న మణిపూర్కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసంచారంపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని.. మార్చి 8వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో సాధారణ స్థితి నెలకొల్పాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంబంధిత ఆదేశాలను జారీ చేశారు.మార్చి 8వ తేదీ నుంచి మణిపూర్(Manipur)లో అన్ని రోడ్లపై ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి. ఎవరైనా జనసంచారానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి అని అమిత్ షా మణిపూర్ అధికార యంత్రాంగానికి సూచించారు. మణిపూర్లో రాష్ట్రపతి విధింపు తర్వాత.. అక్కడి శాంతి భద్రతలపై జరిగిన తొలి సమీక్షా సమావేశం ఇదే కావడం గమనార్హం.ఈ సమావేశానికి మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా(Ajay Kumar Bhalla), ఇతర ఉన్నతాధికారులు, సైన్యం.. పారామిలిటరీ తరపున ప్రతినిధులు హాజరయ్యారు. 2023 మే నుంచి ఈ ఈశాన్య రాష్ట్రంలో తెగల వైరంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేలా ప్రయత్నాలను కేంద్రం ఇప్పుడు ముమ్మరం చేసింది.దాదాపు రెండేళ్లుగా జాతుల మధ్య వైరంతో రగులుతున్న మణిపుర్లో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో.. ఇటీవల ఫిబ్రవరి 13వ తేదీన సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన కేంద్ర ప్రభుత్వం అధికారాలన్నింటినీ అక్కడి గవర్నర్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కల్లోల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భద్రతా బలగాలకు చెందిన ఆయుధాలను కొందరు ఎత్తుకెళ్లారు. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి చర్యల ఉండవని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు
-
ఏపీ కేడర్కు ముగ్గురు ఐపీఎస్లు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను వారి హోం కేడర్ అయిన ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.అంజనీకుమార్ తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీగా, అభిలాష బిస్త్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, ట్రైనింగ్స్ డీజీగా పనిచేస్తున్నారు. అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకుముందే తెలంగాణలో పనిచేసిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్కుమార్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలిలను ఏపీ కేడర్కు పంపిన విషయం తెలిసిందే -
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
తిరుమలలో వరుస ఘటనలపై కేంద్ర హోం శాఖ ఆగ్రహం. తొక్కిసలాట, అగ్ని ప్రమాదంపై నివేదిక పంపాలని ఆదేశం
-
మణిపూర్ చల్లారుతుందా?
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం. 2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు. మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి. భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు. బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. -
వల విసురుతున్న ఫేక్ లోన్యాప్లు
సాక్షి, హైదరాబాద్: కొన్ని లోన్యాప్ల అరాచకాలకు తోడు నకిలీ లోన్యాప్లు ఇప్పుడు వల విసురుతున్నాయి. ఫేక్ లోన్యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చిక్కులు తప్పవని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆర్థిక అవసరాల్లో ఉండేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్ల వల విసురుతున్నారని వారు పేర్కొంటున్నారు. ఈ యాప్లను ఇన్స్టాల్ చేయగానే ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల గుర్తించిన కొన్ని నకిలీ లోన్యాప్లు.. ఇటీవల గుర్తించిన కొన్ని నకిలీ లోన్యాప్స్ వివరాలు కేంద్ర హోంశాఖ ఎక్స్లో వెల్లడించింది. వీటిలో కొన్ని శత్రుదేశాల నుంచి నడుపుతున్నారని, అనుమానాస్పద కదలికలు అందులో ఉన్నట్టు వెల్లడించింది. అలాంటి యాప్లను ఇన్స్టాల్ చేయగానే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని పేర్కొంది. హోంశాఖ వెల్లడించిన ప్రకారం..క్రెడిట్ కార్డ్ మేనేజర్ (ఎర్లీ యాక్సెస్), సీసీ క్రెడిట్–ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సిల్వర్ క్యాష్, ఈజీ రూపే, క్యాష్ పార్క్–పర్సనల్ లోన్, సింప్లీ రూపే, 3ఏ రూపీ, దానా క్రెడిట్, ప్రెఫర్డ్ వ్యాలెట్, టచ్ రూపీ–ఆన్లైన్ క్రెడిట్, టకామాల్, క్రేజీ మనీ: క్యాష్ అడ్వాన్స్, సింపుల్ క్యాష్, స్మాల్ క్రెడిట్–బడ్డీక్యాష్ యాప్లు ఉన్నాయి. ఫేక్లోన్ యాప్లను ఎలా గుర్తించాలి.. » చట్టబద్ధమైన లోన్ యాప్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)అనుమతి తప్పనిసరి. ఇది లేదంటే ఫేక్ లోన్యాప్గా గుర్తించాలి. » యాప్ డిజైన్లో లోపాలు: నకిలీ రుణ యాప్లలో పేలవమైన వినియోగదారు ఇంటర్ఫేస్లు, అనేక స్పెల్లింగ్ లేదా వ్యాకరణ దోషాలు గమనించవచ్చు. » రుణం తీసుకోవాలనుకునే వ్యక్తులను త్వరగా వివరాలు పంపాలని, వెంటనే మేం చెప్పిన లింక్లపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలని.. త్వరగా చేయకపోతే సమయం అయిపోతుందని..ఇలా తీవ్రమైన ఒత్తిడి పెడతారు. » ఫేక్ లోన్యాప్లలో సదరు సంస్థ చిరునామా, కస్టమర్ సర్వీస్ నంబర్, ఈ మెయిల్ వంటివి ఉండవు. ఉన్నా..తప్పుడు వివరాలు నమోదు చేస్తారు. » వాస్తవంలో సాధ్యం కాని ఆఫర్లు ఉన్నా అనుమానించాలి. అత్యల్ప వడ్డీ రేట్లు, ఎలాంటి తప్పనిసరైన డాక్యుమెంట్లు సైతం అవసరం లేదనడం. ఆఫర్ అసాధారణంగా ఆకర్షణీయంగా కనిపిస్తే, అది స్కామ్ కావచ్చు.నకిలీల నుంచి ఇలా కాపాడుకోవచ్చు.. » ఎలాంటి పత్రాలు లేకుండా లోన్ ఇస్తామంటే తొందరపడి లోన్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవద్దు. » లోన్యాప్ గురించిన వివరాలు పూర్తిగా ఆరా తీయాలి. ఆన్లైన్లో ఆ యాప్ రేటింగ్, రివ్యూలు చదివి తెలుసుకోవాలి. » సమయం అయిపోతుందని పదేపదే ఫోన్లు చేసి తొందరపెడుతున్నట్లయితే అది కచ్చితంగా ఫేక్ లోన్యాప్ అని గుర్తించాలి. -
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
అడవిలో ఆఖరి పోరాటం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మావోయిస్టులను 2026 మార్చి కల్లా ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఇటీవల ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సల్వాజుడుం పేరుతో 2007లో మావోయిస్టుల ఏరివేతలో నేరు గా కేంద్రం జోక్యం చేసుకునే ప్రక్రియ.. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. యూపీఏ హయాంలో.. దేశంలోని ప్రధాన విప్లవ శక్తులైన పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్లు విలీనమై 2004 సెపె్టంబర్ 21న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఆవిర్భవించాయి. నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఏపీలోని తిరుపతి వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ఆయా పార్టీల నేతలు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దీంతో మావోయిస్టు పార్టీకి గెరిల్లా జోన్గా ఉన్న బస్తర్ అడవుల నుంచి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ను కేంద్రం ప్రారంభించింది. మావోయిస్టులకు ఎక్కువ మద్దతిచ్చే తెగకు.. ఎదురు నిలిచే మరో తెగ సభ్యులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించింది. వారి చేతికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేసింది. సల్వాజుడుం మొదటి అడుగు నుంచి 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. సల్వాజుడుంపై విమర్శలు ఎక్కువ రావడంతో 2009 సెప్టెంబర్లో పెద్దఎత్తున సీఆర్పీఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. దీన్నే ఆపరేషన్ గ్రీన్హంట్గా పేర్కొంటున్నారు. ఆపరేషన్ గ్రీన్హంట్ కారణంగా మావోయిస్టుల చేతిలో భద్రతా దళాలకు చెందిన జవాన్లు తీవ్రంగా నష్టపోయారు. బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కలేదు. నాగా కమాండోలు.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన గ్రీన్హంట్కు మరింత పదును పెట్టింది. అప్పటికే పశ్చిమ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్ను బస్తర్ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి చేతుల్లో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, శాటిలైట్ ఫోన్లు పెట్టింది. అప్పటికే కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్) దళాలు రంగంలో ఉన్నాయి. అయినప్పటికీ కేంద్రం ఆశించిన ఫలితాలు రాలేదు. ఆపరేషన్ సమాధాన్.. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమనే భావనకు కేంద్రం వచ్చి0ది. దీంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్ – స్మార్ట్ లీడర్íÙప్, ఏ – అగ్రెసివ్ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్ – హర్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ – యాక్షన్ ప్లాన్, ఎన్ – నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్)ను తెరపైకి తెచ్చి0ది. మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడటం, మావోయిస్టుల్లోకి కొత్త నియామకాలు జరగకుండా జాగ్రత్త పడటం వంటి పనులపై ఎక్కువ శ్రద్ధ చూపించారు. దీంతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో వేగం పెంచారు. గగనతల దాడులు ఆపరేషన్ సమాధాన్తో పరిస్థితులు అనుకూలంగా మారాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత 2021 జూన్ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై కేంద్ర బలగాలు దాడులు చేశాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై ఆందోళన వ్యక్తం కావడం, నిరసనలు రావడంతో.. ఈ తరహా దాడులపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయినప్పటికీ 2021 జూన్ నుంచి 2022 చివరి వరకు నాలుగుసార్లు తమపై గగనతల దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. లోపాలను అధిగమిస్తూ.. మావోయిస్టుల ఏరివేతలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరికొత్త వ్యూహాలను కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చాయి. లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టుల (సాధారణంగా స్థానిక ఆదివాసీలకే అధికారం)తో డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ పేరుతో ప్రత్యేక దళాలను తయారు చేసింది. నాగా కమాండోలు ఇక్కడి అడవులపై పట్టు సాధించలేకపోవడంతో.. వారికి బదులుగా ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లను రంగంలోకి దించింది.సాయుధులైన పురుష కమాండోల వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేకంగా విమెన్ కమాండో దళాలను తయారు చేసింది. ఎండాకాలం, వానాకాలం అని తేడా లేకుండా ఏడాదంతా అడవుల్లో కూంబింగ్ చేపట్టేలా ఆపరేషన్ సూర్యశక్తి, ఆపరేషన్ జల్శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి0ది. దీంతో ఆఖరికి వానాకాలంలో కూడా మావోయిస్టులు నిర్భయంగా సంచరించే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా భద్రతా దళాలపై మావోలు జరిపే వ్యూహాత్మక ఎదురుదాడులను గణనీయంగా తగ్గించగలిగారు. విస్తృతంగా పారా మిలిటరీ క్యాంపులు సంఖ్య, శిక్షణ, ఆధునిక ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీ పరంగా సంసిద్ధమైన తర్వాత బస్తర్ అడవుల్లో ప్రతీ ఆరు కిలోమీటర్లకు ఒకటి చొప్పున భద్రతా దళాలకు చెందిన క్యాంపులను ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులను కేంద్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం బస్తర్లో 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులున్నాయి. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, బస్తర్ జిల్లాలతో కూడిన దండకారణ్యంలో మావోయిస్టుల గెరిల్లా జోన్లు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాయి. చివరికి మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తిలోనూ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేశాయి. ఆపరేషన్ కగార్ సీఆర్పీఎఫ్, డీఆర్జీ, స్పెషల్ టాస్్కఫోర్స్, కోబ్రా, పోలీసులు.. ఇలా అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుడుతూ ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను 2024 జనవరిలో ప్రారంభించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్గా ఉన్న అబూజ్మడ్ (బీజాపూర్, నారాయణ్పూర్, కాంకేర్, కొండగావ్) అడవులపై ప్రభుత్వం గురి పెట్టింది.ఈనెల 5న తుల్తులీ ఎన్కౌంటర్లో ఏకంగా 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 200 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. మరో 400 మందికి పైగా లొంగిపోవడం లేదా అరెస్టయ్యారు. ప్రభుత్వ దళాల నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు అగ్రనేతలు చెల్లాచెదురయ్యారనే ప్రచారం జరుగుతోంది. -
పవన్, అనితలకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితలకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధమని తేల్చింది. ఈ మేరకు లోక్సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలతోనే ఆ బండారమంతా బయటపడింది. గతంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో పవన్ కల్యాణ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అందరినీ రెచ్చగొట్టారు. కూటమి అధికారంకి వచ్చాక సైతం పవన్ వాళ్లను వెనక్కి రప్పిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే వంగలపూడి అనిత సైతం అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారాయన. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. -
చట్టంలో ఈ మార్పులు ఎవరి కోసం?
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై ఒకటవ తేదీ నుంచి అమలులోకి వస్తున్నాయి. ఈ మూడు చట్టాలు బాధితులకు అనుకూలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ అలా ఉన్నట్టుగా అనిపించటం లేదు. అందుకు ఉదాహరణగా ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను పేర్కొనవచ్చు. ప్రాథమిక దృష్టితో చూసినప్పుడు నేర సమాచారం కాగ్నిజబుల్ అయితే ఎఫ్ఐఆర్ను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 154 ప్రకారం తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిపై ఉంది. ఈ విషయంలో అతను తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకునే అవకాశం చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వసనీయత కనిపించటం లేదనే కారణం కానీ లేదా అవసరమైన వివరాలు లేవని కానీ ఎఫ్ఐఆర్ను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత తీవ్రతను చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారన్న విషయం తేలితే కేసును మూసివేసి, తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు. అవసరమని భావించినప్పుడు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ను విడుదల చేయటానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. అందుకు కావలసిన అంశాలు రెండే రెండు. మొదటిది– అది సమాచారం అయ్యుండాలి. రెండవది– అది కాగ్నిజబల్ అయిన సమాచారం అయిఉండాలి. అయితే సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (ఏఐఆర్ 2014 సుప్రీం కోర్టు 187) కేసులో కొన్ని సందర్భాలలో ప్రాథమిక విచారణ చేసే వెసులుబాటును పోలీసులకు కల్పించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రాథమిక విచారణ గురించి ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా ప్రాథమిక విచారణ జరుపకూడదని కూడా ఎక్కడా నిషేధం లేదు. నిషేధం లేనంత మాత్రాన ప్రాథమిక విచారణ చేయవచ్చని అనుకోడానికి వీలు లేదు. కానీ సుప్రీంకోర్టు కొన్ని కేసులలో ప్రాథమిక విచారణ జరుపడానికి వెసులుబాటు కల్పించింది. ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడానికైనా ముందు ఎంక్వయిరీ జరిపే నిబంధన ఏదీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో లేదు. లలిత కుమారి కేసు ప్రకారం కాగ్నిజబల్ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీసులు విధిగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాలి. ఎలాంటి విచారణనూ చేయడానికి వీలు లేదు. ఒకవేళ అందిన సమాచారంలో కాగ్నిజబల్ నేరం వెల్లడికానప్పుడు అది కాగ్నిజబల్ నేర సమాచారం ఔనా, కాదా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమిక విచారణ చేయవచ్చు. అంతే తప్ప మరే విషయంలో ప్రాథమిక విచారణ చేయడానికి వీలులేదు. ఎలాంటి కేసులలో ప్రాథమిక విచారణ జరుపాలో సుప్రీంకోర్టు నిర్దేశించింది. 1. వివాహ వివాదాలు/ కుటుంబ వివాదాలు 2.వాణిజ్య నేరాలు 3. వైద్య నిర్లక్ష్య కేసులు 4. అవినీతికి సంబంధించిన కేసులు 5. సమాచారం అందచేయటంలో తీవ్రమైన జాప్యం ఉన్నప్పుడు. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు జరుపవచ్చు. విచారణ సమయాన్ని 15 రోజులుగా సుప్రీంకోర్టు నిర్దేశించింది. చట్టం ఇంత స్పష్టంగా ఉన్నపుడే కేసు నమోదు చేసుకోవడానికి బాధితులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. అంతేకాదు కేసు నమోదు కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉంది. ఈ ప్రాథమిక విచారణను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన ఉదాహరణ, పత్రికల్లో వచ్చిన ఉదాహరణ– ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి పది కోట్ల రుణం తీసుకున్నాడు. అది కట్టలేదు. చివరికి బ్యాంక్ వాళ్ళు ఆ రుణం వసూలు చేయడానికి ఏజంట్లను నియమించుకున్నారు. ఈ పరిస్థితిని అధిగమించటానికి ఆ రుణం తీసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, ఒక ఫిర్యాదును బ్యాంక్ ఉన్నతాధికారుల మీద దాఖలు చేశాడు. ప్రాథమిక విచారణ పేరుతో పోలీసులు ఆ అధికారులను తరచూ పిలుస్తూ ఆరు మాసాలు గడిపారు. ఆ ఉన్నత అధికారులకు కేసు భయం పట్టుకునేలా చేశారు. చివరికి బ్యాంక్ అధికారులు తక్కువ మొత్తానికి ఒకేసారి పరిష్కారాన్ని చేసుకున్నారు. దాని వల్ల బ్యాంక్ నష్ట పోయింది. రుణం తీసుకున్న వ్యక్తి లాభపడ్డాడు. ఈ ప్రాథమిక విచారణ సమయంలో అనుమానితుడిని పిలిచే అధికారం పోలీసులకు లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీసులు చేయాల్సింది రహస్య విచారణ. దాని పరిధి కూడా చిన్నది. కాగ్నిజబల్ నేరం జరిగిందా, లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే పోలీసులు విచారణ జరపాలి కానీ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులో చెప్పిన దానిని మించి ప్రాథమిక విచారణ పేరుతో ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం జరిగే విధంగా ప్రవర్తించారు. బ్యాంక్కు కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాత్రమే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 41 ప్రకారం లేదా 160 ప్రకారం మాత్రమే అనుమానితులను పిలవడానికి అవకాశం ఉంది. కానీ ఎలాంటి అధికారం లేకుండానే పోలీసు అధికారులు ఈ కేసులో బ్యాంక్ ఉన్నత అధికారులను పిలిచి, ఫిర్యాదు చేసిన వ్యక్తికి లాభం కలిగేలా చేశారు. ప్రాథమిక విచారణను పైవిధంగా జరుపడానికి అధికారం లేనప్పుడే పోలీసులు ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ జరుపచ్చని చట్టం నిర్దేశిస్తే ఇంకా ఎంత దుర్వినియోగం అవుతుందోనని అనిపిస్తుంది. ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత 2024’ లోని 173 ప్రకారం పోలీసు అధికారులు 3 సంవత్సరాలు కానీ, అంతకు మించి కానీ, 7 సంవత్సరాల లోపు కానీ ఉన్న నేరాలలో పోలీసులు ప్రాథమిక విచారణ జరుపవచ్చు. అది కాగ్నిజబల్ నేర సమాచారం ఐనప్పటికి కూడా ఈ విచారణను పోలీసు అధికారి జరపటానికి అవకాశం ఉంది. ఈ ప్రాథమిక విచారణ చేయడానికి పోలీస్ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అతను ఈ అనుమతిని ఎంతకాలంలో ఇవ్వాలి అన్న విషయం గురించి చట్టంలో ఏమీ చెప్పలేదు. ఆ అనుమతి కోసం కూడా బాధితులు ఆ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణను చేయడానికి అనుమతిస్తే... పోలీస్ అధికారి విచారణను 14 రోజుల్లో పూర్తి చేయాలి. ఈ విచారణ లలిత కుమారి కేసులో సుప్రీం కోర్టు చెప్పిన విధంగా కాదు. కేసులో ప్రాథమికంగా చూసినప్పుడు బలం ఉందా, లేదా అని అనిపించినప్పుడు విచారణ జరుపవచ్చు. కేసులోని స్వభావాన్ని బట్టి, తీవ్రతను బట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రాథమిక విచారణ జరుపడానికి అనుమతిని ఇస్తారు. ఈ విచారణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేసు నమోదు కావడానికే బాధితులు తీవ్రమైన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. 7 ఏళ్ల లోపు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాలు 98 వరకు ఉన్నాయి. వాటిలో చాలా నేరాలు తీవ్రమైన నేరాలే. ప్రాథమిక విచారణ పేరుతో నెలల తరబడి విచారణ జరిపితే సాక్ష్యాలు మాయమయ్యే పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రథమ సమాచార నివేదిక ఉద్దేశ్యం కూడా దెబ్బ తినే అవకాశం మరింత ఉంది. బాధితులకు లాభం చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ నిబంధన ఏర్పాటు చేశారని ప్రభుత్వం చెప్పినప్పటికీ అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. ఈ నిబంధన దుర్వినియోగం కానుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ విమర్శను గమనించి కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని బీపీఆర్డీఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఈ ప్రాథమిక విచారణ గురించి విడుదల చేసింది. దాని ప్రకారం ప్రాథమిక విచారణ కోసం ఆఫీసర్ ఇన్ఛార్జి ఆఫ్ పోలీస్ స్టేషన్ అనుమతి కోరిన 24 గంటలలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవ్వాలని చెప్పారు. ఒకవేళ 24 గంటల్లో అనుమతి ఇవ్వకపోయినా, అనుమతిని తిరస్కరించినా, ఏ విషయాన్ని తెలియచేయకపోయినా... ఆ పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టవచ్చు. ఈ ప్రా«థమిక విచారణ సమయం లో పోలీసు అధికారి సాక్ష్యాలు నమోదు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా సాక్షులను విచారిస్తారు. వీటి వల్ల సాక్ష్యాలలో వైరుద్ధ్యాలు పెరిగి కేసు బలహీనపడే అవకాశం ఉంది. దానివల్ల బాధితులకి న్యాయం జరుగదు. మరి ఎవరి కోసం ఈ మార్పులు? ఈ కొత్త చట్టాలు? దీనికి సమాధానం కాలమే చెప్తుంది. డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001 -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
అమల్లోకి సీఏఏ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం–2019ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచి్చంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది. సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కలి్పస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కలి్పంచడం దీని ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు ఆ దేశాల నుంచి భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు దీని ప్రకారం ఎలాంటి రుజువులు, ధ్రువీకరణలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం మంజూరు చేస్తారు. వీటిని పౌరసత్వ (సవరణ) నిబంధనలుగా పిలుస్తారని కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘‘సీఏఏ చట్టం–2019 ప్రకారం అర్హులైన వారంతా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని ఆన్లైన్లో సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక విండో అందుబాటులో ఉంచాం’’అని ఆయన వెల్లడించారు. బీజేపీ హర్షం, విపక్షాల ధ్వజం సీఏఏ అమలు, నిబంధన జారీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాతల హామీని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చి చూపారంటూ అభినందించారు. పాక్, బంగ్లా, అఫ్గాన్లలో మతపరమైన ఊచకోతకు గురైన ముస్లిమేతర మైనారిటీలు భారత పౌరసత్వం పొందేందుకు ఈ నిబంధనలు ఉపకరిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాలు మాత్రం కేంద్రం నిర్ణయంపై మండిపడ్డాయి. ఇది దేశ సమగ్రతకు సీఏఏ విఘాతమంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఆప్, సమాజ్వాదీ, వామపక్షాలు, మజ్లిస్ తదితర పారీ్టలు దుయ్యబట్టాయి. దీన్ని కేవలం బీజేపీ ఎన్నికల లబ్ధి ఎత్తుగడగా అభివరి్ణంచాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, అసోంలలో మతపరమైన విభజన తెచ్చి ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ చర్యకు దిగిందని ఆరోపించాయి. ఆమ్నెస్టీ ఇండియా కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించనందుకు ఎస్బీఐకి సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వైనం మీడియా హెడ్లైన్లలో రాకుండా చూసేందుకు బీజేపీ ఈ పని చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. సీఏఏను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఇది సమాజంలో మతపరంగా విభజనకు దారి తీస్తుందదన్నారు. ప్రజల హక్కులను హరించే ఎలాంటి మత, కుల, సామాజికపరమైన వివక్షనైనా తుదికంటా వ్యతిరేకించి తీరతామని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. పాక్ తదితర దేశాల నుంచి వచి్చన ముస్లిమేతర శరణార్థులు మాత్రం దీన్ని స్వాగతించారు. ముస్లింల పట్ల సీఏఏ పూర్తిగా వివక్షపూరితమంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019లోనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఏఏ అమలు నిర్ణయం వెలువడ్డ నిమిషాల్లోనే సంబంధిత ఇ–గెజిట్ వెబ్సైట్ క్రాషైంది. దాన్ని కాసేపటికి పునరుద్ధరించారు. సీఏఏలో ఏముంది...! ► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు. ► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచి్చన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు. ► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కలి్పస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు. ► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది. ► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(ఎంఏ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: వేర్పాటువాద నేత మసరత్ ఆలం భట్ నేతృత్వంలోని ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్(మసరత్ ఆలం)ను ఐదేళ్లపాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థ ఉగ్రవాదులకు సాయపడుతూ దేశ వ్యతిరేక, ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం తన నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. ‘‘ దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచే ఎలాంటి సంస్థలు, శక్తులనైనా కేంద్రం ఊరికే వదిలిపెట్టదు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)(ఉపా) చట్టం కింద ఈ సంస్థపై చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్లో భారత వ్యతిరేక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, జనాన్ని ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు. జమ్మూకశ్మీర్లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు ప్రయత్నిస్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో ట్వీట్చేశారు. సయ్యద్ అలీ షా గిలానీ మరణం తర్వాత అతివాద హురియత్ కాన్ఫెరెన్స్కు మసరత్ చైర్మన్గా ఉన్నారు. 2010లో కశ్మీర్ అల్లర్లకు బాధ్యుల్లో భట్ కూడా ఒకరు. దీంతో అదే ఏడాది భట్ను పోలీసులు అరెస్ట్చేయగా ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే భట్ను విడిపించారు. బీజేపీ ఒత్తిడితో అరెస్ట్చేసి జైలులో పడేశారు. -
విభజనతో ఏపీకి తీవ్ర నష్టం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా చట్టంలో పేర్కొన్న అంశాలు అలానే ఉన్నాయని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఢిల్లీలో రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. పోలవరం, ప్రత్యేక హోదా ప్రస్తావించండి అప్పుల్లో 58% ఏపీకి, 42% తెలంగాణకు కేటాయించారు. కానీ రెవెన్యూ పరంగా 58% తెలంగాణకు, 42% ఏపీకి వచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం ఆదాయాలు ఏ రకంగా పెరుగుతాయి. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు, పోలవరానికి నిధుల రాకలో సమస్యలున్నాయి. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలూ రాలేదు. మరి విభజన కష్టాల నుంచి రాష్ట్రం ఏవిధంగా బయటకు రాగలుగుతుంది. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సిన అవసరముంది. అప్పుడే విభజన నష్టాల నుంచి గట్టెక్కగలుగుతుంది. విభజన వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే కదా విభజన చట్టంలో హామీలిచ్చారు. హైదరాబాద్ రూపేణా పారిశ్రామిక, రోడ్డు రవాణా, విద్యా సంస్థల పరంగా ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కోల్పోయాం. దీనివల్ల రాష్ట్రానికి రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయాం. దీన్ని సర్దుబాటుచేస్తూ విభజన చట్టంలో ఆయా రంగాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్రం హామీలిచ్చింది. విభజన చట్టంలో ఉన్న స్ఫూర్తి ఇప్పుడు అమల్లో కూడా కనిపించాల్సిన అవసర ముంది. ఇవి నెరవేరితే ఏపీలో వసతులు సమకూరి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. రెవెన్యూ క్రమంగా పెరుగుతూ వస్తుంది. రాష్ట్రం పురోగమిస్తేనే దేశం కూడా పురోగమిస్తుంది. కడప స్టీల్ప్లాంట్కు గనులు కేటాయించాలి కొత్తగా సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీని కోరుతున్నాం. కచ్చితంగా ఇది వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దుగరాజç³ట్నం పోర్టు నిర్మాణం, కడపలో స్టీల్ప్లాంట్పై కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంటుకు సమీపంలోని ఎన్ఎండీసీ నుంచి గనులు కేటాయించాలి. దీంతో ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్గం సులభమవుతుంది. వీటకోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. భోగాపురం ఎయిర్పోర్టు రోడ్డును ప్రస్తావించండి విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మారుస్తామన్నారు. విశాఖలో నేవీ కార్యకలాపాల వల్ల పౌరవిమానాలకు ఇబ్బంది వస్తోంది. దీంతో ఎయిర్ పోర్టును వేరేచోటకు బదిలీచేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భోగాపురం ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారు. దీనికి కనెక్టివిటీ చాలా ముఖ్యం. మంచి రహదారి ఏర్పాటుకు కేంద్రం ఇతోధికంగా సహాయం అందించాలి. విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి అంశంపై కేంద్రంతో జరుగుతున్న సమావేశంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భూ సేకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడ లాంటి ఎయిర్ పోర్టుల్లోనూ భూ సేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాల్సి వస్తోంది. విశాఖ మెట్రో రైలుపై ఒత్తిడి తెండి విశాఖ మెట్రో రైలు అంశాన్ని కూడా కొలిక్కి తీసుకురావాలి. ప్రైవేట్ డెవలపర్ 60% భరిస్తున్నందున, భూ సేకరణ సహా మిగిలిన 40% కేంద్రం భరించేలా ఒత్తిడి తీసుకురావాలి. 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పెండింగ్లో ఉంది. దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి. పలు బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టిపెట్టాలి. విశాఖ నుంచి రాయలసీమకు హైస్పీడ్ రైల్ కారిడార్ కావాలి విశాఖ నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే రైళ్ల కోసం హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. విశాఖ–వయా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా కడపకు అత్యంత వేగంగా నడిచే రైళ్లకోసం ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల 3 ప్రాంతాల మధ్య రాకపోకలు సులభమవుతాయి. విశాఖ రైల్వే జోన్ అంశంపై కూడా దృష్టిపెట్టాలి. మూడు ప్రాంతాల అభివృద్ధికి సాయాన్ని కోరాలి అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిలో భాగంగా మూడు రాజధానులను ప్రకటించాం. ఈ ప్రాంతాల మధ్య సమతుల్యమైన, సమగ్రమైన అభివృద్ధి మన బాధ్యత. మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా వీటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సమగ్రమైన సహకారం, సహాయం అవసరం. దీనికోసం సమావేశంలో కేంద్రాన్ని గట్టిగా కోరాలి. -
ఫేక్ లోన్ యాప్లతో జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్ లోన్యాప్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని ఆన్లైన్ రుణ యాప్లు ప్రముఖ కంపెనీల పేర్లను సైతం వాడుకొని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూపీ ప్రో అనే ఆన్లైన్ రుణ యాప్ బజాజ్ ఫైనాన్స్ పేరును వినియోగించినట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే గుర్తించింది. ఫేక్ యాప్ల వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తోంది. చైనా సహా శత్రుదేశాల నుంచి కొన్ని సంస్థలు ఆన్లైన్ రుణ యాప్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వాటి సర్వర్లు ఆయా దేశాల్లో ఉంటున్నందున బాధితులు మోసపోయినప్పుడు కేసుల దర్యాప్తు సైతం కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో రుణం తీసుకొనే ముందు యాప్ల వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఫేక్ రుణ యాప్ల బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి... ♦ వెరిఫై చేయని ఆన్లైన్ రుణ యాప్లనుప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవద్దు. ♦ ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో అఫిలియేషన్ లేకపోయినా అది మోసపూరిత ఆన్లైన్ లోన్ యాప్గా గుర్తించాలి. ♦ తక్కువ మంది యూజర్లు, ప్రతికూల రేటింగ్స్ ఉన్న యాప్ల జోలికి వెళ్లవద్దు. ♦ రుణం ఇచ్చేందుకు నిబంధనలేమీ లేకుండా వెంటనే సొమ్ము ఖాతాలో జమ చేస్తామని పేర్కొనే యాప్లు నకిలీవేనని తెలుసుకోవాలి. ♦ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా, ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండానే లోన్ ఇస్తామంటే అనుమానించాలి. కేంద్ర హోంశాఖ గుర్తించిన నకిలీ రుణ యాప్లు - ఐవొరి లెండ్స్, క్యాష్ పార్క్, ఆన్లైన్ రూపీ ప్రో, మొబాబా కాయిన్స్, ఫిన్కాష్, లోన్బడ్డీ. -
29 మంది ఏపీ అధికారులకు పోలీస్ పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ దేశంలో మొత్తం 954 మంది అధికారులకు సోమవారం పోలీస్ పతకాలను ప్రకటించింది. వీరిలో ఒకరిని రాష్ట్రపతి పోలీస్ శౌర్య పతకం, 229 మందిని పోలీస్ శౌర్య పతకాలు, 82 మందిని రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకాలు, 642 మందిని ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్కు 1 రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకం, 10 ప్రతిభా పోలీస్ పతకాలు, 18 పోలీస్ శౌర్య పతకాలు లభించాయి. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) శంఖబ్రత బాగ్చి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీస్ పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ప్రతిభా పోలీస్ పతకాలకు ఎంపికైనవారు.. 1. దాడిరెడ్డి మురళీధర్రెడ్డి, సీఐ, కర్నూల్ టౌన్ 2. సింగులూరి వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఏలూరు 3. కొండపు ఆనందరెడ్డి, డీసీపీ, విశాఖపట్నం సిటీ 4. సుంకర మునిస్వామి, ఆర్ఐ, మంగళగిరి 5. బెండి కాశీపతి, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, విశాఖపట్నం 6. జమ్మలమడుగు నిసార్ అహ్మద్ బాషా, ఏఎస్ఐ 7. బెహార నాగభూషణరావు, ఏఎస్ఐ 8. కన్నూజు వాసు, ఇన్స్పెక్టర్, గుంటూరు 9. మంద సత్యనారాయణ, ఏఎస్ఐ 10. తోట బ్రహ్మయ్య, డీఎస్పీ రాష్ట్రం నుంచి పోలీస్ శౌర్య పతకాలకు ఎంపికైనవారు.. 1. కనపాకల హేమసుందరరావు (ఏఏసీ) 2. మార్పు సుదర్శనరావు (ఎస్సీ) 3. జక్కు దేముడు (జేసీ) 4. పొన్నాడ లవకుమార్ (ఏఏసీ) 5. చిక్కంగౌరి వెంకట రామచంద్రరావు (ఎస్సీ) 6. ముర సత్యనారాయణరావు (జేసీ) 7. మట్టపర్తి సుబ్రహ్మణ్యం (జేసీ) 8. శంఖబతుల వీరవెంకట సత్యనారాయణ (జేసీ) 9. ప్రగడ పోశయ్య (జేసీ) 10. ఏడిగగండ్లూరు అశోక్ కుమార్ (అడిషనల్ ఎస్పీ) 11. పైల పార్వతీశం (ఎస్సీ) 12. గొర్లి రమణబాబు (జేసీ) 13. షేక్ సర్దార్ ఘనీ (ఇన్స్పెక్టర్) 14. గుల్లిపల్లి నాగేంద్ర (జేసీ) 15. కోమట్ల రామచంద్రారెడ్డి (జేసీ) 16. దాసరి సురేష్ బాబు (జేసీ) 17. ఏపూరి మధుసూదన్రావు (జేసీ) 18. పాళ్యం మహేశ్వరరెడ్డి (ఏఏసీ) -
954 మందికి పోలీసు పతకాలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 63 మంది ఎంపిక
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 954 మంది పోలీసులకు పతకాలను.ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(PPM), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్పామ్ ఇబోంచా సింగ్కు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. ఇక తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. కాగా స్వాతంత్య్ర , గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది. తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన ఇద్దరు వీరే ►అదనపు డీజీ విజయ్ కుమార్, ►ఎస్పీ మదాడి రమణ కుమార్ తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు ►ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్. తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీస్ల వివరాలు : ►బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్. ►మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ. ►ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ. ►ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ. ►కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ. ►మహంకాళి మధు, ఆర్ఎస్ఐ. ►అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ. ►రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో. ►అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్. ►సాయన వెంకట్వార్లు, ఏఎస్ఐ. -
మణిపూర్ వీడియోపై నేడు సుమోటో విచారణ
మణిపూర్ అల్లర్ల విషయంలో కేంద్రం సీరియస్గానే ఉంది. మరీ ముఖ్యంగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలను మరింత తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ ఉపేక్షించబోం. కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. ఇక విచారణనే మణిపూర్ వెలుపలా.. అదీ కాలపరిమితిలో పూర్తయ్యేలా ఆదేశించండి: కేంద్రం హోం శాఖ ఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఘటనను సుమోటోsuo motoగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ తరుణంలో ఒక్కరోజు ముందు అంటే.. నిన్న గురువారం మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన కేంద్రం హోం శాఖ.. మరోవైపు ఈ కేసు ట్రయల్ కాలపరిమితితో(ఆరు నెలల గడువు) జరగాలని.. అదీ మణిపూర్ వెలుపలే జరగాలని అఫిడవిట్లో సుప్రీంను కోరింది. సీబీఐకి దర్యాప్తు బదిలీ అయ్యింది. కేంద్రం మాత్రం దర్యాప్తు వీలైనంత త్వరగా పూర్తవుతుందని నమ్ముతోంది. అయితే విచారణ మాత్రం కాలపరిమితితో పూర్తి కావాలని, ఆ విచారణ మణిపూర్ వెలుపలే జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్ర హోం శాఖ కోరింది. శాంతి భద్రతల అంశం ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అయినా.. కేంద్రం తమ వంతుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా సదరు అఫిడవిట్లో స్పష్టం చేశారు. లైంగిక దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చాక.. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తోందని తెలియజేసింది. దీంతో నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో.. మీడియా ద్వారా మణిపూర్ వైరల్ వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. జులై 20వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్ర స్థాయిలో కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. ‘‘యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్ని ఆ వీడియో బాధించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి. ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే మేమే రంగంలోకి దిగుతామ’’ని తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. జులై 28(నేటికి) విచారణ వాయిదా వేసింది. -
ఏపీలోనే మహిళా పోలీసులు అత్యధికం
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా పోలీసులు అత్య«దికంగా ఉన్న రాష్ట్రాల్లో అంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని 28 రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో అత్యధికంగా 21.76 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ల్లో ఉన్నారు. కాగా అఖిల భారత స్థాయిలో మహిళా పోలీసులు చాలా తక్కువగా ఉన్నారు. జాతీయ స్థాయిలో 11.75 శాతమే ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. పోలీసుల అంశం రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీతోపాటు మహిళా కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి అదనపు పోస్టులను సృష్టించాలని సూచించింది. ప్రతి పోలీసు స్టేషన్లో కనీసం ముగ్గురు మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు పేర్కొంది. తద్వారా పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్డెస్క్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపింది. -
ఏపీ భవన్.. ఆంధ్రప్రదేశ్కు 12.09, తెలంగాణకు 7.64 ఎకరాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలు వీలైనంత త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్–డీలో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7.64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతోపాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోందని కేంద్రం తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్రం ఆప్షన్–ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7.64 ఎకరాలు తెలంగాణకు, గోదావరి, శబరి బ్లాకులున్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్కు అని ప్రతిపాదించింది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆప్షన్లు ఇవే.. ఏపీ ఆప్షన్–ఏ: తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్లో సగభాగం.. ఏపీకి గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ బ్లాకు, పటౌడీ హౌస్లో సగభాగం ఏపీ ఆప్షన్–బీ: ఏపీకి పటౌడీ హౌస్ మొత్తం, శబరి బ్లాకు, తెలంగాణకు గోదావరి బ్లాకు, నర్సింగ్ హాస్టల్ తెలంగాణ ఆప్షన్–సీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్కు నర్సింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ తెలంగాణ ఆప్షన్–డీ: తెలంగాణకు శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ 12.09 ఎకరాలు, ఏపీకి పటౌడీ హౌస్ కేంద్రం ఆప్షన్–ఈ: ఏపీకి శబరి, గోదావరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ సహా 12.09 ఎకరాలు.. తెలంగాణకు పటౌడీ హౌస్ 7.64 ఎకరాలు . చదవండి: CM Jagan: ‘జగన్ పట్టుదలకు శెభాష్ అనాల్సిందే!’ -
ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కేంద్ర రాష్ట్రాల విభాగం జాయింట్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఉన్నతాధికారులు ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా తొమ్మిదేళ్లుగా ఒకే బిల్డింగ్లో ఏపీ, తెలంగాణ భవన్లు కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ఏపీ భవన్ను విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు పంచుకున్నాయి. తాత్కాలికంగా 58 : 42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. అయితే ఢిల్లీ ఇండియా గేట్ పక్కన 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఏపీ భవన్.. ఏడు వేల కోట్ల రూపాయల ఉమ్మడి ఆస్తి. జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే ఈ 20 ఎకరాల్లో ఏపీ వాటాగా 58 శాతం అంటే 11 ఎకరాలకు పైగా దక్కుతుంది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించట్లేదు. అయితే నేటీ సమావేశంలో ఏం తేలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చదవండి: Video: కర్ణాటక ఎన్నికలు.. హోటల్లో దోసెలు వేసిన ప్రియాంక -
ఏపీ భవన్ విభజన సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ నిర్వహించ తలపెట్టిన సమావేశం వాయిదాపడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(సోమవారం) సమావేశం జరగాల్సి ఉండగా.. బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందించింది హోంశాఖ. అయితే సమావేశం వాయిదాకి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ సమావేశానికి రావాలని ఇరు రాష్ట్రాల అధికారులను ఇదివరకే హోంశాఖ కోరిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. ఇదీ చదవండి; ‘లింక్’ కోసం డబ్బులా? -
పేద ఖైదీలకు ఆర్థిక భరోసా
న్యూఢిల్లీ: జరిమానా సొమ్ము గానీ, బెయిల్ రుసుము గానీ చెల్లించే స్తోమత లేక జైళ్లలో మగ్గిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో నిమ్న కులాలు, పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వారికి ఆర్థిక భరోసా కల్పించే పథకంపై భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ–ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేస్తామంది. -
‘ఆక్స్ఫాం’పై దర్యాప్తుకు కేంద్రం సిఫార్సు
న్యూఢిల్లీ: విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్సీఆర్ఏ) చట్ట ఉల్లంఘన ఆరోపణలపై ఆక్స్ఫాం ఇండియా సంస్థపై సీబీఐ దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ఎదుర్కోనున్న రెండో స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫాం. అమన్ బిరదారీ అనే సంస్థపైనా సీబీఐ దర్యాప్తుకు హోం శాఖ గత నెల సిఫార్సు చేయడం తెలిసిందే. పలు సంస్థలు, ఇతర ఎన్జీవోలకు విదేశీ ‘సాయాన్ని’ ఆక్స్ఫాం బదిలీ చేసినట్టు హోం శాఖ గుర్తించింది. అమన్ బిరదారీకీ కొంత మొత్తం పంపిందని సమాచారం.ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఉన్న సంస్థలకు నిధుల బదిలీ, కన్సల్టెన్సీ మార్గంలో తరలింపుకు పాల్పడిందని ఐటీ సర్వేలో తేలింది. -
కొలిక్కిరాని ‘విభజన’ సమస్యలు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన వివాదాలు మరోసారి కొలిక్కి రాలేదు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మంగళవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం పెద్దగా ఫలితమివ్వకుండానే ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలపాటు ఈ భేటీలో చర్చించగా రెండు రాష్ట్రాలు ఏ విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. కేంద్ర హోంశాఖ జోక్యం వద్దు.. షెడ్యూల్–9లోని సంస్థల విభజనలో కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికార పరిధి లేదని పాడిపరిశ్రమల సంస్థ కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని సమావేశంలో తెలంగాణ గుర్తు చేసింది. షెడ్యూల్–9లో 91 సంస్థలుండగా 90 సంస్థల విభజనపై షీలా బిడే కమి టీ చేసిన సిఫారసులన్నింటినీ అంగీకరించాలని ఏపీ కోరింది. అయితే కేసులు తేలే వరకు నిర్ణయాలు తీసుకోరాదని తెలంగాణ స్పష్టం చేసింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (దిల్) ఆస్తుల విభజనకు షీలా బిడే కమిటీ సిఫారసులు చేసిందని తెలంగాణ తప్పుబట్టింది. ‘దిల్’భూములను తెలంగాణ స్వాదీనం చేసుకోవడాన్ని ఏపీ సవాల్ చేయగా హైకోర్టు స్టే విధించిందని గుర్తుచేసింది. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూముల కేసు తేలాకే ఆ సంస్థను విభజించాలని తెలంగాణ స్పష్టం చేసింది. కోర్టు కేసులపై పరిశీలన జరపాలని కేంద్ర హోంశాఖను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు. నగదు నిల్వల పంపకాలపై తెలంగాణ ఓకే.. ఏపీ ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా షెడ్యూల్–10లోని సంస్థల నగదు నిల్వల పంపకాలను జనాభా దామాషా ప్రకారం జరపాలని కేంద్రం ఉత్తర్వులకు తెలంగాణ మద్దతు తెలిపింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టులో ఏపీ వేసిన కేసు పెండింగ్లో ఉందని గుర్తుచేసింది. ఈ ఉత్తర్వులపై పునఃసమీక్ష జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. సింగరేణి సంస్థను విభజించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ అభ్యంతరం తెలిపింది. సింగరేణిలోని 51% వాటాను తమకు బదలాయిస్తూ విభజన చట్టంలో కేంద్రం నిబంధనలు పొందుపర్చిన విషయాన్ని తెలంగాణ గుర్తుచేసింది. సింగరేణి అనుబంధ సంస్థ ‘ఆప్మెల్’నే విభజించాల్సి ఉందని స్పష్టం చేసింది. బియ్యం సబ్సిడీల్లో తెలంగాణ వాటా బకాయిలను ఏపీ చెల్లిస్తే ఏపీ పౌరసరఫరాల సంస్థ విభజనకు ముందు తెలంగాణ తీసుకున్న రూ. 354 కోట్ల రుణాలను చెల్లించడానికి తెలంగాణ అంగీకరించింది. విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. నగదు, బ్యాంకుల్లో నిల్వల విభజన విషయంలో ‘కాగ్’సహకారం తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. పన్నుల్లో తేడాల నిర్మూలనకు విభజన చట్ట సవరణ జరపాలని ఏపీ కోరగా తెలంగాణ వ్యతిరేకించింది. గిరిజన వర్సిటీ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును పరిశీలించండి... తెలంగాణ విజ్ఞప్తులకు స్పందిస్తూ విభజన హామీలైన గిరిజన వర్సిటీ, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్య, రైల్వే శాఖలకు కేంద్ర హోంశాఖ సూచించింది. వెనుబడిన జిల్లాల అభివృద్ధి నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ భేటీలో సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక, ఇంధన శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సునీల్ శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
విభజన చట్టం అమలుపై కేంద్ర హోం శాఖ సమావేశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. దాదాపురెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. 14 అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను వినిపించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని అధికారులు తెలిపారు. హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా నేతృత్వంలో భేటీ జరిగింది. సమావేశానికి ఏపీ ప్రభుత్వం తరపున సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు కరికాల వలవన్, కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు గౌరవ ఉప్పల్ పాల్గొన్నారు. చదవండి: (50లక్షల ప్యాకేజీతో ఉద్యోగం.. జాబ్లో చేరేలోపే గుండెపోటుతో మృతి) -
సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయాలి
న్యూఢిల్లీ: సహకార రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్రాలు కలసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడంలో సహకార రంగం కీలక పాత్ర పోషించగలదన్నారు. రాష్ట్రాల సహకార శాఖల మంత్రుల రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు గురువారం ఢిల్లీలో ప్రారంభమైంది. దీనిని ఉద్దేశించి అమిత్షా మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లోనూ సహకార ఉద్యమం ఒకే వేగంతో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార రంగం కార్యకలాపాలు నిదానించిన చోట, తగ్గుముఖం పట్టిన చోట వెంటనే వాటిని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అందుకే మనకు జాతీయ సహకార విధానం కావాలన్నారు. నూతన విధానం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోపరేటివ్ రంగం సమగ్రాభివృద్ధికి తోడ్పడేలా, కొత్త విభాగాలను గుర్తించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. సహకార ఉద్యమం దక్షిణ భారత్, పశ్చిమ భారత్లో బలంగా ఉందన్నారు. ఉత్తర, మధ్య భారత్లో అభివృద్ధి దశలో ఉంటే, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా తక్కువ అభివృద్ధికి నోచుకున్నట్టు చెప్పారు. 100 ఏళ్ల లక్ష్యం.. : కోపరేటివ్ రంగం అభివృద్ధికి రాష్ట్రాలన్నీ ఒకే మార్గాన్ని, ఏకీకృత విధానాలను అనుసరించాలని అమిత్షా సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వారమే 47 మంది సభ్యులతో ఒక ప్యానెల్ను ఏర్పాటు చేయడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు అధ్యక్షతన గల ఈ ప్యానెల్ సహకార రంగానికి సంబంధించి జాతీయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలు సహకార రంగం అభివృద్ధికి కలసి పనిచేయలని అమిత్షా కోరారు. ‘‘మన లక్ష్యం 100 ఏళ్లుగా ఉండాలి. కోపరేటివ్లు దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా మారాలి’’అని అమిత్షా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కోపరేటివ్ రంగం వృద్ధికి తాము తీసుకుంటున్న చర్యలను ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ల సంఖ్యను ఐదేళ్లలో మూడు లక్షలకు పెంచడంతోపాటు, డేటాబేస్ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. -
భారత పౌరసత్వం వదులుకుంటున్న ప్రవాసులు!
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు స్వదేశీ పౌరసత్వాన్ని వదులుకునేందుకు మొగ్గు చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపింది. గతేడాది 78,284 మంది ఇండియన్స్ అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఇతర దేశాల్లో ఉంటూ స్వదేశీ పౌరసత్వం వదులుకున్న వారిలో అమెరికా ఎన్నారైలే అత్యధికంగా ఉండటం విశేషం. ద్వంద్వ పౌరసత్వాన్ని మనదేశం అనుమతించదు. దీంతో విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ఒక దేశ పౌరసత్వం మాత్రమే కలిగి ఉండాల్సి ఉంటుంది. కాగా, చైనాలో నివసిస్తున్న 362 మంది భారతీయులు కూడా స్వదేశీ సిటిజన్షిప్ను వదులుకుని చైనా పౌరసత్వం ఉంచుకున్నారు. వ్యక్తిగ కారణాల వల్లే స్వదేశీ పౌరసత్వాన్ని ప్రవాసులు వదులుకున్నారని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు. లోక్సభలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లుర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం శాఖ 2018లో పౌరసత్వ నిబంధనలను సవరించింది. విదేశీ పౌరసత్వాన్ని పొందడం, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సంబంధించిన కాలమ్ను దరఖాస్తులో పొందుపరిచింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుల్లో 23,533 మంది, కెనడా నుంచి 21,597 మంది స్వదేశీ పౌరసత్వం వదులుకున్నారు. బ్రిటన్(14,637), ఇటలీ(5,986), నెదర్లాండ్స్ (2187), న్యూజిలాండ్( 2643), , సింగపూర్(2516), పాకిస్తాన్(41) నేపాల్(10) తదితర దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాల పౌరసత్వాలను స్వీకరించారు. భారత పౌరసత్వం వదులుకున్న వారిలో 103 దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఉన్నారని కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. (క్లిక్: రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్) -
జూలై 1 నుంచి ఆపరేషన్ ముస్కాన్–8
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదే శాల ప్రకారం ఏటా రెండు విడతల్లో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్–8ని వచ్చే నెల 1 నుంచి ప్రారంభించనున్నట్టు మహి ళలు, చిన్నారుల భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. జూలై 1 నుంచి నెల పాటు జరిగే ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులను, ట్రాఫికింగ్ ద్వారా వివిధ వ్యవస్థల్లో బందీలైన వారిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చనున్నారు. అలాగే తల్లిదండ్రులు లేని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలించి వారి బాధ్యతలను సంబంధిత విభాగాలకు అప్పగించనున్నారు. ఈ ఆపరేషన్పై మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం, కార్మిక శాఖ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సర్వశిక్షా అభియాన్, యూనిసెఫ్ విభాగాలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించినట్టు స్వాతిలక్రా తెలిపారు. ఈ సమా వేశంలో మహిళాభివృద్ధి, చిన్నారుల సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక క్యార్యదర్శి డి.దివ్య, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్, కుటుంబ సంక్షేమ శాఖ, శిశు ఆరోగ్య విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ పాల్గొన్నారు. (క్లిక్: 38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్) -
దేశంలో హిందీ ఎంతమంది మాట్లాడతారు ?
హిందీ జాతీయ భాషపై వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందినవారంతా కలిస్తే ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రతిపాదనలు అగ్గి రాజేస్తే, తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ హిందీయే మన జాతీయ భాష అంటూ చేసిన ట్వీట్తో వివాదం భగ్గుమంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్లో బీజేపీ ‘ఒకే దేశం ఒకే భాష’ తీసుకువస్తుందన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. చరిత్రలోకి తొంగి చూస్తే.. హిందీ భాషను ఇతర ప్రాంతాలపై రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలు కొత్తేం కాదు. స్వాతంత్య్రానికి ముందే 1937 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీలో హిందీ భాషను బోధించడానికి ప్రయత్నిస్తే దానిని వ్యతిరేకిస్తూ మూడేళ్ల పాటు ఉధృతంగా ఉద్యమం జరిగింది. 1946లో మొదటిసారిగా సమావేశమైన రాజ్యాంగ పరిషత్ పార్లమెంటులో చర్చలు హిందీ, ఇంగ్లిష్లో కొనసాగించాలని నిర్ణయించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జాతీయ భాషగా ఏది ఉండాలన్న దానిపై ఆనాటి కాంగ్రెస్ నాయకులు కేఎం మున్షీ, గోపాలస్వామి అయ్యంగార్ హిందీ అనుకూల, వ్యతిరేక వర్గాలను కలుసుకొని అభిప్రాయాలను సేకరించారు. చివరికి హిందీ, ఇంగ్లిషులను కేంద్రం అధికార భాషలుగా గుర్తించింది. పదిహేనేళ్ల పాటు ఆ విధానం కొనసాగాక దానిని సమీక్షించాలని నిర్ణయించింది. పదిహేనేళ్ల గడువు ముగిశాక జాతీయ భాషగా హిందీని చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమిళనాడు భగ్గుమంది. చివరికి కేంద్ర ప్రభుత్వం 1963లో అధికార భాషా చట్టంలో హిందీతోపాటు ఇంగ్లిష్ని చేర్చింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాలకు తమ అధికార భాషను గుర్తించే అధికారం, అందులోనే ఉత్తరప్రత్యుత్తరాలు చేసుకునే అవకాశం కల్పించింది. హిందీ ఎంతమంది మాట్లాడతారు ? 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 మాతృభాషలున్నాయి. వీటిలో 22 భాషల్ని రాజ్యాంగం గుర్తించి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చింది. ఆనాటి లెక్కల ప్రకారం 43.6% మందికి మాతృభాష హిందీయే. ఆ తర్వాత స్థానంలో 8 శాతంతో బెంగాలీ నిలిచింది. 6.86% మంది ప్రజలు మాట్లాడే మరాఠీ మూడో స్థానంలో నిలిస్తే, 6.70% మందితో మన తెలుగు భాష నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మధ్య కాలంలో తెలుగు, కన్నడ సినిమాలు బాలీవుడ్లో బంపర్ హిట్ కొడుతూ ఉండడంతో హిందీ చిత్ర పరిశ్రమలో కొందరు అసూయతో రగిలిపోతున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ప్రభంజనం మొదలైంది. ఇటీవల తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్ఆర్ఆర్ వసూళ్లలో సునామీ సృష్టిస్తే, కన్నడ సినిమా కేజీఎఫ్–2 సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఈ స్థాయిలో ఎందుకు విజయం సాధించడం లేదన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ హిందీ ఎప్పటికీ మన జాతీయ భాషేనంటూ ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంది. మూడు భాషల ఫార్ములా ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు నేర్చుకోవడం తప్పనిసరి. ఇంగ్లిష్ భాషలో మాట్లాడడం, రాయడం రాకపోతే అంతర్జాతీయ సమాజంలో నెగ్గుకువచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంగ్లిష్ సెకండ్ లాంగ్వేజీగా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో హిందీ కంటే ఇంగ్లిష్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ) మూడు భాషల ఫార్ములాను తీసుకువచ్చింది. 8వ తరగతి వరకు హిందీని నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ‘సరైన విధానంలో బోధించేవరకు మూడు భాషల ఫార్ములా మంచిదే. ఎన్ని భాషలు వస్తే అంత మంచిది. కానీ హిందీని జాతీయ భాషగా రుద్దకూడదు. ఆ భాష వస్తే ఒక అదనపు భాష వచ్చినట్టే. కానీ జాతీయ భాష అంటూ కిరీటాలు తగిలించకూడదు’ అని భాషావేత్త మాయా లీలా చెప్పారు. – నేషనల్ డెస్క్, సాక్షి స్థానిక భాషే సుప్రీం కేజీఎఫ్–2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేసిన నేపథ్యంలో కన్నడ సినీ నటుడు, ఈగ ఫేమ్ సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్దేవగణ్ మధ్య ట్వీట్ల ద్వారా నడిచిన చర్చ రాజకీయ రచ్చకి దారితీసింది. హిందీ ఇక జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ స్పందిస్తూ అలాంటప్పుడు మీ సినిమాలు హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీయే ఎప్పటికీ మన జాతీయ భాష అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ట్వీట్లు స్నేహపూర్వకంగా నడిచినప్పటికీ దానిపై రాజకీయ దుమారం లేచింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, హెచ్డీ కుమారస్వామిలు గురువారం నటుడు సుదీప్కు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. దేశంలో హిందీ కూడా ఇతర ప్రాంతీయ భాషల మాదిరిగా ఒక భాషే తప్ప జాతీయ భాష కాదని కుండబద్దలు కొట్టారు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో భాషకి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడిందని, ఎక్కడికక్కడ స్థానిక భాషే సుప్రీం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హుబ్లీలో చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి మాతృభాషని గౌరవించాలని, ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని అన్నారు. మన దేశంలో విశిష్టమైన భాషా వైవిధ్యాన్ని ప్రతీ పౌరుడు గౌరవించాలని, మాతృభాష వినిపిస్తే ఎవరైనా గర్వంతో ఉప్పొంగిపోవాల్సిందేనని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కాదని సుదీప్ చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం నిజమని, ఎక్కువ మంది మాట్లాడినంత మాత్రాన హిందీ జాతీయ భాష అవదని జేడీ(ఎస్) నాయకుడు కుమారస్వామి ట్వీట్లు చేశారు. మరోవైపు బొమ్మై కేబినెట్ మంత్రి డాక్టర్ సిఎన్ అశ్వంత్ నారాయణ్ కమ్యూనికేషన్ కోసం జాతీయ స్థాయిలో హిందీ భాషను మాట్లాడితే తప్పులేదని వ్యాఖ్యానించడం విశేషం. -
మాకే పాఠాలు చెప్తున్నారా? కేంద్రంపై సీరియస్
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ అబూ సలేం జైలు శిక్ష వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు, కేంద్ర హోంశాఖపై, హోం శాఖ సెక్రటరీపై మండిపడింది. కేంద్ర మంత్రిత్వ శాఖ అభ్యర్థనను తొందరపాటుగా అభివర్ణిస్తూనే.. నిర్ణయాత్మకంగా కేంద్రం వ్యవహరించడం మంచిదికాదని గురువారం అత్యున్నత న్యాయస్థానం మందలించింది. అభ్యర్థన పిటిషన్పై ఏం చేయాలో హోం సెక్రటరీ మాకు చెప్పే ప్రయత్నంగా అఫిడవిట్ను చూస్తే అనిపిస్తుంది. ఆయన మాకు చెప్పడం కాదు. అది అర్థం చేసుకోండి. మేం ఏం చేయాలో అది చేస్తాం. సమస్యను సరైన సమయంలో పరిష్కరించమని మాకు చెప్పడానికి హోం కార్యదర్శి ఎవరు?. అసలు హోం మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్లో.. ‘ఇది సరైన సమయం కాదు’ అనే లైన్ను ఎందుకు చేర్చారు అని అభ్యంతరం వ్యక్తం చేశారు జస్టిస్ ఎస్కే కౌల్. 1993 బాంబే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబూ సలేంని.. పోర్చుగల్ నవంబర్ 11, 2005లో బారత్కు అప్పగించింది. ఆ సమయంలో 25 ఏళ్లకు మించి జైలు శిక్ష విధించబోమని పోర్చుగల్ న్యాయస్థానాలకు భారత్ చెప్పింది. ఆ మాట ప్రకారం.. 2030, నవంబర్ 10న శిక్షా కాలం ముగుస్తుంది. అయితే తన శిక్షాకాలం ఒప్పందానికి విరుద్ధంగా ఉందంటూ సలేం సుప్రీం కోర్టులో అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి ప్రతిస్పందనగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తరపున కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా.. మంగళవారమే ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్య అవుతుందని ఓ లైన్లో పేర్కొన్నారాయన. అబూ సలేం పిటిషన్పై స్పందించడానికి ఇంకా సమయం ఉందని, ఇది సరైన సమయం కాదని అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. ఇది న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. న్యాయవ్యవస్థకు ఉపన్యాసాలు ఇవ్వవద్దు. మీరు నిర్ణయించుకోవాల్సిన విషయాన్ని నిర్ణయించమని మీరు మాకు చెప్పినప్పుడు మేము దానిని దయతో పరిగణనలోకి తీసుకోం. సరైన సమయం కాదని మీరెలా చెప్తారు.. అని జస్టిస్ ఎస్కే కౌల్, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శిపై మండిపడ్డారు. ఇక 2017లో అబూ సలేంను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది ఇక్కడి న్యాయస్థానం. ముంబైలో 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో 257 మంది దుర్మరణం చెందగా.. 700 మంది గాయపడ్డారు. చదవండి: ఉచిత పథకాలపై నిర్ణయం ఓటర్లదే!. సుప్రీంలో.. -
ఇక స్వేచ్ఛగా ఊపిరి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో గత రెండేళ్లుగా అమల్లో ఉన్న కోవిడ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్ నిబంధనల్ని తెచ్చింది. కరోనా కట్టడికి ఈ రెండేళ్లలో పలుమార్లు నిబంధనల్ని మార్చింది. గత ఏడు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉండడంతో మార్చి 31 నుంచి ఈ నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,913గా ఉంది. రోజు వారీ పాజిటివిటీ రేటు 0.26 శాతానికి పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 181.89 కోట్ల టీకా డోసుల్ని ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి విపత్తు నిర్వహణ చట్టం కింద అమల్లో ఉన్న కరోనా కట్టడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టు అజయ్ భల్లా ఆ లేఖలో వివరించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన విధంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివన్నీ అమల్లోనే ఉంటాయి. కరోనా వైరస్ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలీని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అజయ్ భల్లా ఆ లేఖలో హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా కేసులు పెరిగితే వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలు అమల్లోకి తేవచ్చు. కేంద్ర హోంశాఖ చేసిన సూచనల్ని కూడా పాటించాల్సి ఉంటుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1778 కరోనా కేసులు నమోదయ్యాయి. -
హోంశాఖ సబ్ కమిటీ సమావేశం
-
విభజన సమస్యల పరిష్కారానికి.. ఇక ప్రతి నెలా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉప కమిటీ ఇకపై ప్రతి నెలా సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ తొలి సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎస్ఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గుల్జార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఇకపై ప్రతి నెలా సమావేశాన్ని నిర్వహిస్తామని ఆశిష్ కుమార్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన పలు రకాల బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీ ఇద్దరికీ ఇవ్వాల్సిందే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి కేంద్రానికి ప్రణాళిక అందచేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. దీనిపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలం జాప్యం చేసి ఇటీవలే కౌంటర్ దాఖలు చేయగా, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులకు బదులుగా ఇచ్చిన ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలన్నారు. కరెంట్ బకాయిలపై.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్లు చెల్లించాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినందున ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. న్యాయపరంగా పరిశీలన చేసి విభజన చట్టప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రూ.3,800 కోట్ల పన్నులు రావాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో నమోదైన పలు కంపెనీలు పన్నులు కూడా అక్కడే చెల్లించాయి. ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన రూ.3,800 కోట్ల పన్నులను ఇప్పించాలని ఏపీ అధికారులు ఉప కమిటీ సమావేశంలో కోరారు. ధాన్యం డబ్బులు, సబ్సిడీ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణకు కోసం వినియోగించిన రూ.400 కోట్ల ఏపీ నిధులను తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని సమావేశంలో ఏపీ అధికారులు కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైనా ఏపీ అధికారులు వాదనలు వినిపించారు. -
ఐదింటిపై పట్టు
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఎనిమిదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అడపాదడపా ఇరు రాష్ట్రాల సీఎస్లతో సమావేశం నిర్వహించడం మినహా పరిష్కార మార్గాలను సూచించలేదు. తాజాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్లు ఎస్ఎస్ రావత్, రామకృష్ణారావులతో ఏర్పాటైన ఉప కమిటీ గురువారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. విభజనకు సంబంధించి ఐదు పెండింగ్ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. గాజుల రామారంలో 270 ఎకరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్ఎఫ్సీ) ఆస్తుల విభజనపై తొలుత అంగీకరించిన తెలంగాణ సర్కారు ఆ తరువాత మాట మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఎఫ్సీకి 2005–06లో ప్రభుత్వ ఈక్విటీ కింద డబ్బులకు బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 270 ఎకరాలను కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలి. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో ఏపీకి వాటా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉప కమిటీ సమావేశంలో ప్రస్తావించనుంది. కరెంట్ బకాయిలు ఏవి? రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా అంగీకరించినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు కాకపోవడంతో ఏపీ విద్యుత్ సంస్థలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్ విద్యుత్తు బిల్లులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉప కమిటీ సమావేశంలో కోరనుంది. హైదరాబాద్లో పన్నుల చెల్లింపులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. మా వాటా మాటేమిటి? కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఏపీ నిధులతో ధాన్యం సేకరణ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల సంస్థలకు ఒకే అధికారి పని చేశారు. ఈ సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం ఏపీకి చెందిన రూ.400 కోట్లను వినియోగించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అదే సమయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీ కూడా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్ కుమార్ దృష్టికి తేనుంది. అజెండాలో ఐదు ప్రధానాంశాలు 1. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన 2. ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కమ్లు చెల్లించాల్సిన విద్యుత్బకాయిలు 3. పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం 4. బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ 5. ఏపీఎస్సీఎస్సీఎల్, టీఎస్సీఎస్సీఎల్ మధ్య నగదు అంశం -
ఏపీ, తెలంగాణ సీఎస్లతో కేంద్ర హోంశాఖ సమావేశం
-
ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఏపీ భవన్కు ఉన్న 19 ఎకరాల ఆస్తుల విభజనపై కేంద్రం మూడు ప్రతిపాదనలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తిలో ఏపీ భవన్ ఆస్తుల పంపిణి జరగాలని ఉంది. అయితే.. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన వర్చువల్గా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, సోమేశ్ కుమార్లు పాల్గొన్నారు. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్సిఆర్ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో). మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎఫ్సిఆర్ఎ లైసెన్స్లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్డేట్ చేసుకోలేదు. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది. చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్లో.. -
నాగాలకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: అమాయక కూలీలపై ఆర్మీ కాల్పులతో రగిలిపోతున్న నాగాలాండ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గురువారం షాకిచ్చింది. సైనిక బలగాలకు విస్తృత అధికారాలు, శిక్ష భీతిని లేకుండా చేస్తున్న ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) నాగాలాండ్లో మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. నాగాలాండ్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తూ... అక్కడ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అండగా నిలిచేందుకు సాయుధ బలగాల మొహరింపు తప్పనిసరని తెలిపింది. అందువల్ల ఏఎఫ్ఎస్పీఏ–1958 సెక్షన్ 3 కింద నాగాలాండ్ రాష్ట్రం మొత్తాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. డిసెంబరు 30 నుంచి ఆరునెలల పాటు ఏఎఫ్ఎస్పీఏ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. చొరబాటుదారులు వస్తున్నారనే సమాచారంతో ఈనెల 3వ తేదీన ఆర్మీ నాగాలాండ్లోని మోన్ జిల్లా ఓటింగ్ గ్రామ పరిసరాల్లో నిఘా పెట్టింది. పనులు ముగించుకొని ఒక ఓపెన్ జీపులో వస్తున్న బొగ్గుగని కార్మికులపైకి వారెవరనేది ధ్రువీకరించుకోకుండానే సైనికులు కాల్పు లు జరపడంతో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సైనికులపై దాడి చేయగా.. ఒక జవాను మరణించారు. వీరిని అదుపు చేసే ప్రయత్నంలో ఆర్మీ మళ్లీ కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సైన్యానికి విస్తృత అధికారాలు కట్టబెడుతున్న ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయాలని ముఖ్యమంత్రి రిఫియూతో పాటు నాగాలాండ్లోని అన్ని రాజకీయపక్షాలూ, గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. పార్లమెంటులో ఈ ఘటనను లేవనెత్తిన విపక్షాలు ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని గట్టిగా కోరాయి. కమిటీ వేసి... అంతలోనే 1958లో ఏఎఫ్ఎస్పీఏను తెచ్చారు. అప్పటినుంచీ నాగాలాండ్లో ఇది అమలవుతోంది. ఆరునెలలకు ఒకసారి పొడిగిస్తూ పోతున్నారు. ఓటింగ్ ఘటన తర్వాత నాగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీన్ని గమనించిన నాగాలాండ్ ప్రభుత్వం డిసెంబరు 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి... ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలనే తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. ఏఎఫ్ఎస్పీఏ ఉపసంహరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం నాలుగురోజులు తిరగకముందే... దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఆమోదయోగ్యం కాదు: కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యం కాదని నాగా గిరిజన సంఘాలు తేల్చిచెప్పాయి. కొన్నితరాల పాటు నాగాలను అణచివేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర సర్కారు ఏఎఫ్ఎస్సీఏను పొడిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశా యి. ‘నాగా ప్రజల ఆకాంక్షలను కేంద్రం పట్టించుకోలేదు. చట్టం ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఎంతదూరమైనా వెళతాం’ అని నాగా హోహో సంస్థ ప్రధాన కార్యదర్శి కె. ఎలు ఎన్ డాంగ్ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంపై చర్చించడానికి జనవరి 7న సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఈఎన్పీవో అధ్యక్షుడు ఆర్.టి.సంగ్టామ్ తెలిపారు. -
తమిళనాడులో ఉగ్రవాదులు.. హై అలర్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారని, జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ హెచ్చరించింది. సుమారు 15 మంది సముద్ర మార్గం ద్వారా తమిళనాడులోకి ప్రవేశించారని, తీరం నుంచి కేరళకు వెళ్లి అక్కడి నుంచి పాకిస్తాన్ చేరుకునేందుకు పథకం వేశారని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని కోస్ట్గార్డ్ దళాలు, ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను పోలీసులు ఆదేశించా రు. ఇదిలా ఉండగా చెన్నై పూందమల్లిలోని ఒక అపార్టుమెంటులో అనుమానాస్పదంగా ఉంటున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
త్వరలోనే థర్డ్ వేవ్!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి, మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్–అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తోందని వెల్లడించింది. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి(పీఎంఓ) సమర్పించింది. మూడో వేవ్లో పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారినపడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.చదవండి: Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం కొత్త వేరియంట్లతో ముప్పు జనాభాలో 67 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలు పెరిగితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించినట్లేనని నిపుణుల కమిటీ గతంలో అభిప్రాయపడింది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాల్సిందేనని తాజాగా తెలిపింది. ఒకసారి సోకిన కరోనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా శరీరంలో పెరిగిన రోగ నిరోధక శక్తి నుంచి కొత్త వేరియంట్లు తప్పించుకొనే అవకాశం ఉంటుందని పేర్కొంది. కొత్త వేరియంట్ల ప్రభావం నుంచి కాపాడుకోవడానికి వీలుగా సామూహిక నిరోధకత సాధించడానికి జనాభాలో 80–90 శాతం మందికి వ్యాక్సిన్ ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది. కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధం కావాలని తెలిపింది. సామూహిక నిరోధకత సాధించేదాకా.. భారత్లో ఇప్పటిదాకా 7.6 శాతం మందికే (10.4 కోట్లు) పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్లో వేగం పెంచకపోతే థర్డ్ వేవ్లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని తేల్చిచెప్పింది. ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా సామూహిక నిరోధకత (హెర్డ్ ఇమ్యూనిటీ) సాధించేదాకా కరోనాలో కొత్త వేవ్లు వస్తూనే ఉంటాయని వైద్య నిపుణులు అంచనా వేశారని గుర్తుచేసింది. కరోనా నియంత్రణ నిబంధనలను ఎత్తివేయడాన్ని బట్టి ఇండియాలో థర్డ్ వేవ్ మూడు రకాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఐఐటీ–కాన్పూర్ నిపుణులు గతంలో తెలిపారు. ఒకటి.. థర్డ్ వేవ్ అక్టోబర్లో గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 3.2 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తాయి. రెండోది.. అధిక తీవ్రత కలిగిన కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో థర్డ్ వేవ్ సెప్టెంబర్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజూ 5 లక్షల కేసులు బయటపడతాయి. ఇక మూడోది.. అక్టోబర్ మాసాంతంలో థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుతుంది. నిత్యం 2 లక్షల పాజిటివ్ కేసులు నమోదవుతాయి. వైరస్లో మార్పులు.. పిల్లలకు సవాలే థర్డ్ వేవ్లో పెద్దల కంటే పిల్లలే అధికంగా ప్రభావితం అవుతారని చెప్పడానికి ఇప్పటివరకైతే తగినంత సమాచారం లేదని నిపుణులు కమిటీ వివరించింది. కరోనా వైరస్లో క్రమంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి అవి పిల్లలకు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్లు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదని గుర్తుచేసింది. ఒకవేళ చిన్నారులకు కరోనా సోకినా అసలు లక్షణాలేవీ కనిపించకపోవడం, స్వల్పంగా కనిపించడం వంటివి ఉంటాయని వివరించింది. వారు అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారైతే పరిస్థితి తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం.. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన చిన్నారుల్లో 60–70 శాతం మంది ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే కావడం గమనార్హం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పిల్లల్లో అపాయకరమైన ఎంఐఎస్–సి(మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) తలెత్తే అవకాశం ఉందని నిపుణుల కమిటీ తన నివేదికలో తెలియజేసింది. చదవండి:Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొస్తేనే థర్డ్ వేవ్ కరోనాలో డెల్టా కంటే ఎక్కువ తీవ్రత కలిగిన కొత్త వేరియంట్ ఉద్భవిస్తే థర్డ్ వేవ్ నవంబర్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ–కాన్పూర్కు చెందిన ప్రముఖ సైంటిస్టు మహీంద్ర అగర్వాల్ సోమవారం చెప్పారు. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికి పూర్తి క్రియాశీలకంగా మారుతుందని అన్నారు. డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకురాకపోతే థర్డ్ వేవ్ దాదాపు రానట్లేనని అగర్వాల్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇలాంటి కొత్త వేరియంట్ బయటపడితే మూడో వేవ్లో నిత్యం 1.5 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
ఆగస్టు 14.. విభజన గాయాల సంస్మరణ దినం
న్యూఢిల్లీ: ఇకపై ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల సంస్మరణ దినంగా పాటించనున్నట్లు ప్రధాని∙మోదీ శనివారం ప్రకటించారు. దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని, ఎన్నెన్నో త్యాగాలు చేశారని, వాటిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినం జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేశ విభజన సృష్టించిన మతిలేని ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విభజనలు తొలగిపోవాలని, సామరస్యం పెంపొందాలని, ఏకత్వం అనే స్ఫూర్తి బలోపేతం కావాలని, మానవ సాధికారత పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఆశయాలను విభజన అకృత్యాల సంస్మరణ దినం మనకు గుర్తు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినంగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానమంత్రి నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. దేశ విభజన గాయాన్ని, సన్నిహితులను కోల్పోయామని వారి ఆవేదనను మాటల్లో వర్ణించలేమని అన్నారు. దేశ విభజన సమయంలో ఎందరో భరతమాత బిడ్డలు తమ జీవితాలను త్యాగం చేశారని కేంద్ర హోంశాఖ శ్లాఘించింది. బ్రిటీష్ వలస పాలకుల దుర్నీతి కారణంగా 1947లో భారతదేశం రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ రెండు ముక్కలై పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఆగస్టు 14న పాకిస్తాన్కు స్వాతంత్య్రం రాగా, భారత్ ఆగస్టు 15న వలస పాలకుల చెర నుంచి విముక్తి పొందింది. భారతదేశ విభజన మానవ చరిత్రలోనే అతిపెద్ద వలసలకు బీజం చేసింది. ఈ విభజన వల్ల 2 కోట్ల మంది ప్రభావితమైనట్లు అంచనా. -
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసులకు పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. కాగా సైనిక, పోలీస్ అధికారులకు కేంద్రహోంశాఖ వివిధ పతకాలు ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకం(పీపీఎంజీ), 628 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు(పీఎంజీ), 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 662 మందికి విశిష్ట సేవా పతకాలను కేంద్రం హోంశాఖ ప్రకటించింది. ఇక వీటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 11 మందికి, తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలు దక్కాయి. తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు గ్యాలంటరీ పోలీసు పతకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పతకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, వుమెన్ సేఫ్టీవింగ్ ఇంచార్జి స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బండ శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పతకాలు దక్కాయి. వీటిని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ అందజేయనున్నారు. -
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్కి పంపించింది. -
పోలీసు ఇమేజీ పెంచేలా శిక్షణ
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు మెరుగైన ప్రవర్తనతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెంచే విధంగా శిక్షణాంశాలపై దృష్టి పెడుతున్నట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ) డైరెక్టర్ అతుల్ కర్వాల్ తెలిపారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. ప్రజల పట్ల, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పోలీసు అధికారుల్లో మరింత సానుభూతి, సానుకూల వైఖరి పెరిగేందుకు అవసరమైన అంశాలు శిక్షణ కార్యక్రమాల్లో చేర్చుతున్నామన్నారు. ఎన్పీఏలో 72వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల శిక్షణ ముగింపు సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. 2019 బ్యాచ్లోని మొత్తం 178 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ పాసింగ్ ఔట్ పరేడ్లో పాల్గొంటారని చెప్పారు. బుధవారం ఎన్పీఏ జాయింట్ డైరెక్టర్లు అమిత్ గార్గ్, ఎన్.మధుసూదనరెడ్డి, అసిస్టెంట్ డైర్టెకర్ సి.వంశీకృష్ణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో సైబర్ నేరాల విస్తృతి పెరిగే అవకాశం ఉన్నందున, ఈ నేరాల దర్యాప్తులో మెళకువలకు సంబంధించిన అంశాలను ట్రైనింగ్లో చేర్చినట్టు కర్వాల్ చెప్పారు. తెలంగాణ కేడర్కు నలుగురు తెలంగాణ, ఏపీ కేడర్లకు నలుగురు చొప్పున మొత్తం ఎనిమిది మందిని కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణకు అక్షాన్ యాదవ్, అశోక్ కుమార్, రష్మి పెరుమాళ్, కేకన్ సుధీర్ రామనాథ్లను, ఏపీకి కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదిరాజ్ సింగ్ రానా, ప్రేరణా కుమార్, మహేశ్వర రెడ్డి (వైఎస్సార్ జిల్లా)లను కేటాయించినట్టు చెప్పారు. మహిళలు పోలీస్ ఫోర్స్ను ఎంచుకోవాలి: రష్మీ పెరుమాళ్ మహిళలు పోలీస్ ఫోర్స్ను ఎంచుకోవాలి. ఐపీఎస్లుగా అయితే మరింత బాగా పనిచేసే, సేవ చేసే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్లో స్థిరపడిన నన్ను తెలంగాణకు కేటాయించడం సంతోషంగా ఉంది. నా తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆయన నుంచి స్ఫూర్తి పొంది ఐపీఎస్ను ఎంచుకున్నా. తొలిసారిగా మహిళకు ఆల్రౌండ్ ట్రోఫీ మహిళా అధికారులు పురుషులతో పోటీపడుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కర్వాల్ తెలిపారు. గత 72 ఏళ్లుగా పురుష ప్రొబేషనరీ అధికారులు ఔట్డోర్ ఆల్రౌండ్ ట్రోఫీ గెలుస్తుండగా.. ఈ ఏడాది హరియాణకు చెందిన రంజీత శర్మ (రాజస్థాన్ కేడర్) ప్రతిష్టాత్మక ట్రోఫీని గెలుచుకున్నారని తెలిపారు. రెండో స్థానంలోనూ శ్రేయాగుప్త (తమిళనాడు కేడర్) అనే మరో అధికారి నిలవడం గొప్ప విషయమన్నారు. రంజీత శర్మ ప్రధానమంత్రి బేటన్ హోం మంత్రిత్వ శాఖ రివాల్వర్ అవార్డు, ఇతర ట్రోఫీలు అందుకోనున్నారు. ‘బెస్ట్ ఔట్డోర్ ప్రొబేషనర్’గా ఐపీఎస్ అసోసియేషన్ స్వోర్డ్ ఆఫ్ హానర్’లభించనుంది. శ్రేయ గుప్తా శ్రీ బుబానంద మిశ్రా స్మారక ట్రోఫీ అందుకోనున్నారు. నాన్నే నాకు ప్రేరణ: రంజీత శర్మ సివిల్స్లో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ కావడం. శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ, ప్రదర్శనకు నాన్న సతీష్కుమారే ప్రేరణ. ఆరోప్రయత్నంలో ఐపీఎస్ సాధించాను. నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా కృషి చేస్తే అసాధ్యమనేది ఏదీ లేదనేది నిజమైంది. -
‘269 రోజులైంది.. నా భార్యను చూడనివ్వరా?’
తన భార్యను నుంచి తనను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత దేశంలోకి తనను అడుగుపెట్టనివ్వడం లేదని పాపులర్ యూట్యూబర్ కర్ల్ రాక్ ఆరోపిస్తున్నాడు. కనీసం తనకు వివరణ కూడా ఇవ్వట్లేదంటూ ఇండియన్ గవర్నమెంట్ పై ఆరోపణలు గుప్పిస్తూ తాజాగా యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అయితే కార్ల్ రాక్ను బ్లాక్ లిస్ట్లో చేర్చిన కారణం ఇంతకాలం వెల్లడించకుండా వస్తున్న కేంద్ర హోం శాఖ.. తాజాగా దానిపై వివరణ ఇచ్చుకుంది. న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్కు చెందిన కార్ల్ ఎడ్వర్డ్రైస్.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇతనికి భారీగా మద్ధతు లభిస్తోంది. ‘కర్ల్ రాక్’ పేరుతో యూట్యూబర్గా పాపులర్ అయిన కార్ల్.. ట్రావెల్ సేఫ్టీ, వివిధ ప్రాంతాల్లో కల్చర్, వేరేదేశాల్లో ఫారినర్లకు ఎదురయ్యే మోసాల మీద వీడియోలు తీస్తుంటాడు. ప్రస్తుతం అతని ఛానెల్కు 1.8 మిలియన్ సబ్స్క్రయిబర్లు ఉన్నారు. 2019లో భారత్కు చెందిన మనీషా మాలిక్కు పెండ్లి చేసుకున్నాడు. అయితే కిందటి ఏడాది అక్టోబర్ నుంచి అతన్ని భారత్లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఈ విషయంపై భారత్ను నిలదీయడంతో పాటు న్యూజిలాండ్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తూ వస్తున్నాడు. కనీసం స్పందించరా? 2020 అక్టోబర్లో దుబాయ్, పాకిస్థాన్లో అతను పర్యటించాడు. ఆ టైంలో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అతను బయలుదేరగానే.. అతన్ని భారత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో తనపేరు చేర్చిందన్నది అతని వాదన. ‘269 రోజుల నుంచి నా భార్యను చూడనివ్వడం లేదు. భారత ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. కనీసం కారణాలైనా చెప్పమని ఎన్ని మెయిల్స్ పంపినా బదులు లేదు. నా భార్య, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బదులు ఇవ్వడం లేద’ని వీడియోలో వాపోయాడు అతను. అంతేకాదు ట్విటర్లో న్యూజిలాండ్ పీఎం జెస్సిండాను సైతం ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం కర్ల్కు సపోర్ట్గా సైన్ పిటిషన్ కూడా నడుస్తోంది. ఈ కోణాలు కూడా! అయితే సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందువల్లే అతనికి ఇలా జరుగుతోందని కొందరు మద్ధతుదారులు అంటున్నాడు. అంతేకాదు గతంలో అతను పాక్లో కొన్ని నెలలు గడిపాడు కూడా. అటుపై పాక్ అక్రమిత కశ్మీర్తో పాటు సైనిక శిబిరాలను సైతం సందర్శించాడు. ఈ నేపథ్యంలోనే అనుమానాల నడుమ భారత ప్రభుత్వం అతన్ని అడ్డుకుంటోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ ఐఎస్ఐ తనను గమనిస్తోందని అప్పట్లో అతను తీసిన వీడియోను సైతం పోస్ట్ చేస్తున్నారు. #Exclusive | ‘India is a secular country and it shouldn’t have any laws which talk about religion’, says Karl Rock on anti-CAA protests. Watch TIMES NOW’s Mohit Sharma speaking exclusively with YouTuber (@YouTube) @iamkarlrock. pic.twitter.com/RVtx6YWwI6 — TIMES NOW (@TimesNow) December 19, 2019 ఆరోపణలపై స్పందించిన కేంద్రం అయితే కర్ల్ రాక్ విషయంలో వినిపిస్తున్న వాదనలను, ఆరోపణలను కేంద్రం ఖండించింది. వీసా నిబంధనల, షరతులు ఉల్లంఘించిన నేరానికే అతన్ని బ్లాక్ లిస్ట్లో చేర్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టూరిస్ట్ వీసా మీద వచ్చిన అతను.. వ్యాపారాల్లో భాగం అయ్యాడని, ఇది వీసా కండిషన్స్ను ఉల్లంఘించడమే అవుతుందని, వచ్చే ఏడాది వరకు అతన్ని దేశంలోకి అనుమతించే ప్రసక్తే ఉండదని స్పష్టం చేసింది. కాగా, కరోనా టైంలో ఢిల్లీ ప్లాస్మా బ్యాంకులో రెండుసార్లు రక్తదానం చేసి సీఎం కేజ్రీవాల్ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు కర్ల్ రాక్. -
‘పెద్దకడుబూర్’కు జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్కు జాతీయ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకు సంబంధించిన రూ.25 వేల నగదు రివార్డును మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెలి్లకి డీజీపీ గౌతమ్ సవాంగ్ సోమవారం అందజేశారు. కేంద్ర హోంశాఖ ఇటీవల నిర్వహించిన డీజీపీల కాన్ఫరెన్సులో 2020 ఏడాదికి సంబంధించి ఈ అవార్డును ప్రకటించారు. ఏపీలో అత్యత్తమ పోలీసు స్టేషన్గా కర్నూలు జిల్లా పెద్దకడుబూరు పోలీస్స్టేషన్ను ‘సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు’కు ఎంపిక చేశారు. ఉత్తమ పోలీసు స్టేషన్గా ఎంపిక చేయడానికి పది ప్రధాన అంశాలను కేంద్ర హోంశాఖ పరిగణనలోకి తీసుకుంది. నేరాలను ముందస్తుగా నిరోధించడం, క్షుణ్ణంగా దర్యాప్తు చేయడం, వేగవంతంగా దర్యాప్తు చేసి పరిష్కరించడం, త్వరితగతిన ఛేదించడం, కమ్యూనిటీ పోలీసింగ్, శాంతిభద్రతలను పరిరక్షించడం, శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహార శైలి గురించి ప్రజల స్పందన (ఫీడ్ బ్యాక్), నేర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఆన్లైన్ చేయడం, డేటాను భద్రపరచడం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలపై నేరాలు, ఆస్తులకు సంబంధించిన నేరాలపై అవగాహన కల్పించి నియంత్రించడం, సకాలంలో ఎఫ్ఐఆర్లు, చార్్జషీట్లు దాఖలు చేయడం వంటి వాటిని పరిశీలించిన అనంతరం పెద్దకడుబూర్ పోలీస్ స్టేషన్ను ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకోవడం కర్నూలు జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని డీజీపీ సవాంగ్ అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను, సిబ్బందిని డీజీపీ సవాంగ్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అభినందించారు. డీజీపీ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. పోలీసింగ్లో ఆధునిక, సాంకేతిక టెక్నాలజీని వినియోగించి శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించాలన్నారు. -
చైనా పెట్టుబడులకు బ్రేక్..
ముంబై: పొరుగు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేసినప్పట్నుంచీ చైనా నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. నిర్దిష్ట నిబంధనలపై స్పష్టత కొరవడటంతో చైనా, హాంకాంగ్ దేశాలకు చెందిన 150కి పైగా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ)/వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో దేశీ స్టార్టప్ సంస్థలకు నిధుల కొరత సమస్య తీవ్రమవుతోంది. ఖేతాన్ అండ్ కో అనే న్యాయసేవల సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్తో సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో ప్రెస్ నోట్ 3 (పీఎన్3)ను రూపొందించింది. భారతీయ కంపెనీల్లో బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న చైనాను కట్టడి చేయడమే దీని ప్రధాన లక్ష్యం అయినప్పటికీ.. ఇందులోని కొన్ని అంశాలపై స్పష్టత కొరవడటంతో మిగతా సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులపైనా ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్లకు భారత్తో సరిహద్దులు ఉన్నాయి. పీఎన్3 సవరణలకు ముందు కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన సంస్థలు మాత్రమే భారత్లో ఇన్వెస్ట్ చేయాలంటే కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. పెట్టుబడులు 72 శాతం డౌన్.. చైనా, హాంకాంగ్ పెట్టుబడులు.. రెండేళ్ల క్రితం వరకూ దేశీ స్టార్టప్లకు ప్రధాన ఊతంగా నిల్చాయి. 2019లో 3.4 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు రాగా 2020లో 72 శాతం క్షీణించి 952 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. చైనా నుంచి పెట్టుబడులు 64 శాతం క్షీణించి 377 మిలియన్ డాలర్లకు పడిపోగా.. హాంకాంగ్ నుంచి ఏకంగా 75 శాతం తగ్గి 575 మిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే, కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలు, చైనా నుంచి పెట్టుబడుల క్షీణత వంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ 2020లో పీఈ/వీసీ పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 39.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 814 డీల్స్ కుదిరినట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇందులో సింహభాగం వాటా 27.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు .. రిలయన్స్ రిటైల్, జియోలోకే వచ్చాయి. కొత్త మార్గదర్శకాలివీ .. పీఎన్3 ప్రకారం భారత్తో సరిహద్దులున్న దేశాలకు చెందిన సంస్థలు భారత్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెట్టుబడుల ద్వారా అంతిమంగా లబ్ధి పొందే యజమాని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనపై గందరగోళం నెలకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం అంతిమ లబ్ధిదారు.. తైవాన్, హాంకాంగ్, మకావు వంటి దేశాలకు చెందిన వారైనా .. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసినా .. చైనా లాంటి సరిహద్దు దేశాల ద్వారా చేసే పెట్టుబడులకు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటోంది. కరోనా సంక్షోభ పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఇతర దేశాల మదుపుదారులు (ముఖ్యంగా చైనా సంస్థలు) దేశీ కంపెనీలను టేకోవర్ చేయడాన్ని నిరోధించేందుకే ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిందని ఖేతాన్ అండ్ కో పార్ట్నర్ రవీంద్ర ఝున్ఝున్వాలా తెలిపారు. చైనాపై ఆర్థికాంశాలపరంగా ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. టిక్టాక్, పబ్జీ వంటి 200కి పైగా చైనా యాప్లను నిషేధించడం, టెలికం పరికరాల నిబంధనలను కఠినతరం చేయడం వంటివి ఈ కోవకు చెందినవేనని ఆయన పేర్కొన్నారు. -
రాత్రిపూట కర్ఫ్యూ విధించొచ్చు
దేశవ్యాప్తంగా కరోనా సంక్రమణ హద్దులు దాటుతున్న వేళ కట్టడికి కేంద్రం మరోసారి రంగంలోకి దిగింది. శీతాకాలం ప్రారంభమై, కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో మళ్ళీ పెరుగుదల ఉన్న నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయి. సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ఇప్పటికే ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో కఠినంగా అమలు అవుతున్న కొన్ని నిబంధనలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. కరోనా సంక్రమణను ఆపేందుకు జన సమర్ధక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలని, పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచించింది. కొన్ని ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో కోవిడ్–19 సంక్రమణను తనిఖీ చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలను స్థానికంగా విధించుకోవచ్చని తెలిపింది. అయితే కంటైన్మెంట్ జోన్ బయట లాక్డౌన్ విధించే ముందు మాత్రం రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాల్లో నిర్దేశించిన నియంత్రణ చర్యలను ప్రజలు కచ్చితంగా పాటించేలా స్థానిక జిల్లా, పోలీసు, మునిసిపల్ అధికారులు బాధ్యత వహించాలని కేంద్రం ఆదేశించింది. ► మాస్క్లు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి తగిన జరిమానా విధించాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఆదేశించింది. వైరస్ సంక్రమణ కట్టడికి కార్యాలయాల్లోనూ మాస్క్లు ధరించని వ్యక్తులకు జరిమానాలు విధించాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ను విధిగా అందరూ వినియోగించాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల 50 శాతం కెపాసిటీతో సినిమా థియేటర్ల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చిన కేంద్రం, స్విమ్మింగ్ పూల్స్కు అనుమతిని క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే ఇచ్చింది. ఆధ్యాత్మిక, సామాజిక, క్రీడ, వినోద, విద్య , సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్య , వారు హాజరైన వేదిక సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదని తెలిపింది.మార్కెట్లు, వారాంతపు సంతలకు నియమాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో జారీ చేయనుంది. ► పాజిటివ్ కేసును గుర్తించిన తర్వాత వారితో కాంటాక్ట్లోకి వచ్చిన వారి వివరాలను సేకరించటంతో పాటు, వారిని గుర్తించటం, క్వారంటైన్ చేయటం వంటి పనులన్నింటినీ 72 గంటల్లో కనీసం 80శాతం పూర్తి చేయాలని సూచించింది. అంతేగాక కోవిడ్–19 రోగులకు వెంటనే హోం ఐసోలేషన్ నిబంధనలను పాటిస్తూ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సూక్ష్మ స్థాయిలో, జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్ల గుర్తింపులో అప్రమత్తంగా ఉండాలని, కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. ► కోవిడ్–19 సంక్రమణ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన మరింత పెంచాలని సూచించారు. వీక్లీ కేస్ పాజిటివిటీ రేటు 10 శాతానికి మించితే, ఒకేసారి కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు, సామాజిక దూరం పాటించేందుకు వీలుగా కార్యాలయ సమయాలను మార్చాలని రాష్ట్రాలకు, యూటీలను కేంద్రం ఆదేశించింది. 92 లక్షలు దాటిన కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. 24 గంటల్లో 44,376 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మంగళవారం వెలుగుచూసిన కేసుల కంటే బుధవారం 6,079 కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. బుధవారం బయట పడిన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 92,22,216కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 481 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,34,699కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య బుధవారానికి 86,42,771కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.72 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,44,746గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.82 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. -
వీసాల పునరుద్ధరణ తక్షణం అమల్లోకి
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం రద్దు చేసిన వీసాలను మళ్లీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్, టూరిస్టు, మెడికల్ కేటగిరీ మినహా మిగిలిన అన్ని రకాల వీసాలను పునరుద్ధరిస్తారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. భారత్ను సందర్శించేందుకు గాను ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ), పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(పీఐఓ) కార్డుదారులకు, ఇతర విదేశీయులకు టూరిస్టు వీసా మినహా ఇతర వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దీని ద్వారా విదేశీయులు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దేశ సందర్శనకు కాకుండా వారు వ్యాపారం, సదస్సులు, ఉద్యోగాలు, విద్యాభ్యాసం, పరిశోధనల కోసం ఇండియాకు రావొచ్చు. కరోనా వైరస్ బయటపడడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి విదేశాల నుంచి జనం రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అన్లాక్లో భాగంగా ఆంక్షలను క్రమంగా సడలిస్తోంది. అలాగే వీసాలు, విదేశీ ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. అందులో భాగంగా వీసాలను పునరుద్ధరించింది. ఒకవేళ వాటి గడువు తీరిపోతే మళ్లీ వీసాలు పొందవచ్చని కేంద్రం సూచించింది. విదేశీయులు భారత్లో వైద్య చికిత్స పొందాలని భావిస్తే మెడికల్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. విదేశాల నుంచి ఇండియాకు వచ్చేవారు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేసింది. -
రేప్ కేసుల విచారణ 2నెలల్లో..
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో చట్ట ప్రకారం రెండు నెలల్లోపు విచారణ పూర్తి చేసి, చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలపై నానాటికీ పెరిగిపోతున్న దారుణాలు, హాథ్రస్ ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఈమేరకు కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి మరణ వాంగ్మూలం రికార్డు చేయలేదన్న నెపంతో, మరణవాంగ్మూలాన్ని విస్మరించరాదని కేంద్రం తన మార్గదర్శకాల్లో తేల్చి చెప్పింది. సీఆర్పీసీ ప్రకారం నేరం జరిగిన వెంటనే తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధితులకు న్యాయం జరగదని, కనుక పోలీసులు నేరం జరిగినట్టు ఫిర్యాదు అందిన తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. ఒకవేళ నేరం జరిగిన ప్రాంతం సదరు పోలీస్ స్టేషన్ పరిధిలోనికి రాకపోయినప్పటికీ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంది. పోలీసులకు చట్టాలను గురించి అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఒకవేళ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వాటిని విచారించి, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన మార్గదర్శకాల్లో కేంద్ర హోంశాఖ పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 173 అత్యాచారం కేసుల్లో విచారణ రెండు నెలల్లో ముగించాలని చెపుతోందని, సీఆర్పీసీ సెక్షన్ 164–ఎ ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలిని ఫిర్యాదు అందిన 24 గంటల్లోపు గుర్తింపు కలిగిన వైద్యులచే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని హోం శాఖ తెలిపింది. సాక్ష్యాల చట్టం–1872 ప్రకారం, చనిపోయిన వ్యక్తి మరణానికి ముందు రాతపూర్వకంగా గానీ, నోటి మాట ద్వారాగానీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నిజమని నమ్మితీరాలని, విచారణలో అది తొలిసాక్ష్యమని చెపుతోంది. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ (ఎస్ఏఈసీ) కిట్లను వాడేందుకు పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, వైద్య సిబ్బందికి శిక్షణనిస్తున్నట్టు హోం శాఖ తెలిపింది. విచారణను ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలంది. పదే పదే అత్యాచారాలకు పాల్పడేవారిని గుర్తించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ స్థాయిలోని డేటాబేస్ని వాడుకోవాలని తెలిపింది. అత్యాచార నేరాలను విచారించేందుకు కేంద్రం, కఠినమైన చట్టాలను తీసుకొచ్చినట్లు పేర్కొంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు ఇవ్వాలని, నిర్ణీత కాల వ్యవధిలో చార్జ్షీట్ దాఖలయ్యేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
‘క్వీన్’కు కేంద్రం రక్షణ!
న్యూఢిల్లీ: సినీనటి కంగనా రనౌత్కు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉన్నవాళ్లకు దాదాపు పదిమంది కమాండోలు రక్షణగా ఉంటారు. తనకు రక్షణ కల్పించడంపై కంగన కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తులను ఎవరూ తొక్కేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్లు విమర్శలు గుప్పించాయి. రెండ్రోజుల క్రితం ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన సహా పలువురు భగ్గుమన్నారు. దీంతో తాను ఈ నెల 9న ముంబై వస్తున్నానని, ఎవరైనా ధైర్యముంటే అడ్డుకోవచ్చని ఆమె సమాధానమిచ్చారు. ఈ సవాళ్ల నేపథ్యంలోనే కేంద్రం ఆమెకు 24గంటల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వై ప్లస్ కేటగిరీలో ఆమెకు 10– 11 మంది కమాండోలు షిఫ్టుల వారీగా రక్షణ ఇస్తారు. ఆమె నివాసానికి వచ్చిపోయేవాళ్లందరినీ వీళ్లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్కార్ట్ వాహనం కూడా కేటాయిస్తారు. సుశాంత్ మరణం తర్వాత ముంబై సురక్షితంగా లేదని, బాలీవుడ్లో కొందరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని కంగనా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనాకు కేంద్రం సెక్యూరిటీ కల్పించడంపై హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ హర్షం ప్రకటించారు. కంగనాను హిమాచల్ కన్నబిడ్డగా అభివర్ణించారు. ఆమెకు రక్షణ ఇచ్చేందుకు కేంద్రం, తమ రాష్ట్రం సిద్దమన్నారు. మనాలీలో ఆమె నివాసానికి స్థానిక పోలీసులు రక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే కంగనాకు రక్షణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ‘‘కావాలంటే నన్ను ఈ పరిస్థితుల్లో ముంబై వెళ్లవ ద్దని సూచించవచ్చు. కానీ కేంద్ర హోం మంత్రి నా ఆత్మాభిమానాన్ని గుర్తించారు. అందుకే రక్షణ కల్పించారు. ఇది భరతమాత ఆడబిడ్డకు ఇచ్చిన గౌరవం. వారికి నా కృతజ్ఞతలు’’ అని కంగనా వ్యాఖ్యానించారు. అసలు గొడవేంటి? బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియాను బయటపెడుతున్న కంగనాకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని ఇటీవల బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగనా స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. వారికి బదులు హిమాచల్ ప్రభుత్వం లేదా కేంద్రం తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. నా ఆఫీస్ కూలుస్తారేమో! మున్సిపల్ అధికారులు ముంబైలోని తన ఆఫీసును కూల్చేస్తారేమోనని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తన ఆఫీసు వద్ద ఉన్న వీడియోను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోమవారం మున్సిపల్ అధికారులు తన ఆఫీసుకు వచ్చారని, మంగళవారం ఆఫీసును కూల్చవచ్చని ఆమె ట్విట్టర్లో కామెంట్ చేశారు. కార్యాలయ ఆస్తి విషయంలో అవకతవకలకు పాల్పడలేదని వివరించారు. ఒకవేళ అక్రమ నిర్మాణం ఉంటే నోటీసు ఇవ్వవచ్చన్నారు. అధికారులు బలవంతంగా ఆఫీసులోకి వచ్చి కొలతలు తీసుకున్నారని, ఇరుగుపొరుగును కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు. -
స్టేడియాలు తెరుచుకోవచ్చు
న్యూఢిల్లీ: ఈ నెలాఖరుదాకా పొడిగించిన ‘లాక్డౌన్ 4.0’లో ఆటలకు బాట పడింది. స్టేడియాలు, క్రీడా సముదాయాలు తెరుచుకోవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. అయితే మైదానాలు, స్టేడియాల వద్ద ఏ ఒక్క ప్రేక్షకుణ్ని అనుమతించరాదని ఆ శాఖ వెల్లడించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత క్రీడాకారులకు ఇది కచ్చితంగా పెద్ద ఊరట. తాజా వెసులుబాటుతో ఇకపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కేంద్రాల్లో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం అవుతాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతిస్తున్నాం. అయితే ఆటగాళ్లకు తప్ప ప్రేక్షకులకు ప్రవేశం లేదు’ అని ఆ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. భారత్లోనూ కరోనా రంగప్రవేశంతో మార్చి మూడో వారం నుంచి ఆటలకు, శిబిరాలకు చుక్కెదురైంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల క్రీడాకారుల కసరత్తుకు తీవ్రమైన అంతరాయం కలిగింది. దీనిపై పలువురు ఆటగాళ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ అంశంపై సమీక్షించి ప్రభుత్వానికి తెలియజేయడంతో నాలుగో విడత లాక్డౌన్లో ఎట్టకేలకు వెసులుబాటు దక్కింది. -
ఆ రెండింటిపై హోం శాఖ అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై వస్తున్న తప్పడు సమాచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం సూచించింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్లపై సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనది కాదని హోంమంత్రిత్వ శాఖ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. దీనిపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పందిస్తూ.. గిల్గిట్-బాల్లిస్తాన్పై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన ట్విటర్ ఖాతా ధ్రువీకరించబడినది కాదు. 31,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఈ ఖాతా గిల్గిట్-బాల్టిస్తాన్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల అధికారిక ట్విటర్ ఖాతా కాదు’ అని ట్వీట్ చేసింది. కేంద్ర భూభాగానికి చేందిన లడఖ్ అధికారిక ట్విటర్ ఖాతాలు రెండు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అవి @DIPR_Leh, @InformationDep4లు అధికారికమైనవని వెల్లడించారు. (భారత్పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు) The Union Territory of Ladakh has two official Twitter handles ie.“DIPR Leh Ladakh, @DIPR_Leh” & “Information Department Kargil, @InformationDep4” & only these two Twitter handles are used by the administration of Ladakh to disseminate data & to make all important announcements. pic.twitter.com/ESxRlTpP6Z — DIPR Leh Ladakh (@DIPR_Leh) May 12, 2020 ఇక 31వేల మంది ఫాలోవర్స్ ఉన్న ఖాతా నకిలీదని.. అది షేర్ చేసిన సమాచారం ప్రామాణికమైనదిగా పరిగణించలేమని చెప్పింది. కాగా లడక్ కేంద్రపాలిత ప్రాంతాలపై అధికారిక సమాచారం కోసం దయచేసి @DIPR_Leh & @ InformationDep4 ఖాతాలను మాత్రమే అనుసరించాలని విజ్ఞప్తి చేసింది. వీటికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్, లడక్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని గాని, ముఖ్యమైన ప్రకటనలను వీటి ద్వారానే అధికారులు ప్రకటించడం లేదా విడుదల చేయడం జరుగుతుందని వెల్లడిచింది. కాబట్టి లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై, వాటికి సంబంధించి వస్తున్న సమాచారాలు, ప్రకటనలపై దేశ ప్రజలంతా జాగ్రత్త వహించాలని ట్వీట్లో పేర్కొంది. చదవండి: 20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో -
లాక్డౌన్ పెనాల్టీలపై కేంద్రం స్పష్టత
న్యూఢిల్లీ: కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్డౌన్ సమయంలో విధించిన ఆంక్షలను పట్టించుకోని యజమానులకే జరిమానాలు విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్డౌన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలకు ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులను దుర్వినియోగం చేయడంతోపాటు ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ఆయా సంస్థల యాజమాన్యాలకే జరిమానాలు విధిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరించింది. ఎవరైనా ఉద్యోగి కోవిడ్–19 పాజిటివ్ అని తేలితే సంబంధిత కంపెనీల డైరెక్టర్లు, యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు హోం శాఖ ఆదేశాలిచ్చిందంటూ మీడియాలో వస్తున్నవన్నీ అబద్ధాలని తెలిపింది. లాక్డౌన్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్–2015 చట్టం కింద యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయని ట్విటర్లో స్పష్టంగా పేర్కొంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ గడువును మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో కేంద్రం గురువారం కొన్ని సడలింపులు ప్రకటించింది. స్టేషనరీ, మొబైల్ రీచార్జ్, నిర్మాణ రంగానికి అవసరమైన వస్తువులు అమ్మే దుకాణాలు తెరిచేందుకు అనుమతి మంజూరు చేసింది. పిండి మిల్లులకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోవిడ్-19 : నీతిఆయోగ్ కీలక సూచనలు.. -
వలస కూలీలు: కేంద్రం కీలక మార్గదర్శకాలు
-
వలస కూలీలు: కీలక మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి నిమిత్తం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలకు సంబంధించి కేంద్రహోంశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి పలు రంగాలకు సడలింపు ఇచ్చినా.. వలస కూలీలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నారో అక్కడే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే వలస కూలీలు ఉన్నచోటనే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధిహామీలో పని కల్పించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వలస కూలీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనుమతి ఇవ్వకూడదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రం దాటి మరో రాష్ట్రానికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖ కోరింది. అయితే ప్రస్తుతం వలస కూలీలు ఎక్కడున్న ఉపాధి పొందేలా స్థానిక అధికారులతో పేరు నమోదు చేయించుకోవాలని కేంద్ర సూచించింది. అలాగే అవసరమైనతే వారికి ప్రత్యేక క్యాంపులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 20 తరువాత నిర్మాణ, గ్రామీణ ఉపాధి, పరిశ్రమల్లో కార్యాకలాపాలకే అనుమతి ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వలస కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. పలు చోట్ల తింటానికి కూడా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. -
వారికి ‘కరోనా’ స్క్రీనింగ్ చేయండి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఉన్న రోహింగ్యా ముస్లింలను స్క్రీనింగ్ చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది. వీరిలో అధికులు ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్లో పాలొన్నారని తెలిపింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు తబ్లిగీ జమాత్ తర్వాత హరియాణా ఇజ్తెమాకు కూడా వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపింది. ఢిల్లీలోని శ్రమ్ విహార్, షహీన్ భాగ్ రోహింగ్యాలు తబ్లిగీకి హాజరైన తర్వాత తిరిగి తమ శిబిరాలకు రాలేదని వెల్లడించింది. రోహింగ్యా ముస్లింలను గుర్తించి స్క్రీనింగ్ చేయాలని, వారితో కలిసిన వారిని క్వారైంటన్లో ఉంచాలని ఆదేశించింది. కాగా, దేశంలో కోవిడ్-19 సోకి ఇప్పటివరకు 452 మంది చనిపోయారు. మొత్తం 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. (ఆ రోహింగ్యాలు ఎక్కడ?) తబ్లిగీ కేసులు అనడంపై అభ్యంతరం -
కరోనాకు మరో ముగ్గురి బలి
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం మరో ముగ్గురు కోవిడ్–19 (కరోనా వైరస్) బారిన పడి చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరింది. బిహార్, గుజరాత్లో తొలి మరణాలు నమోదయ్యాయి. భారత్లో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 360కి చేరినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 67 కరోనా కేసులను గుర్తించగా కేరళలో 52, ఢిల్లీలో 29 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్నట్లు గుర్తించిన 17 రాష్ట్రాల్లోని 80 జిల్లాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో లాక్డౌన్’కు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో నిత్యావసరాలు, అత్యవసర సేవల కోసం మాత్రమే బయటకు అనుమతిస్తారని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీ ఈ నెల 31 వరకు లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. (ట్రంప్ గుడ్న్యూస్.. కరోనాకు విరుగుడు..!) వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు సంఘీభావంగా జనతా కర్ఫ్యూ సాయంత్రం చప్పట్లు కొడుతున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా 31 వరకు రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సులు బంద్ కరోనా మహమ్మారి విస్తరించకుండా మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని రైళ్లు, మెట్రో రైళ్లు, సబర్బన్ రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 22వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రయాణికుల రైళ్లన్నీ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లను మాత్రమే అనుమతిస్తారు. మార్చి 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బయల్దేరిన రైళ్లను మాత్రం గమ్యస్థానం చేరేందుకు అనుమతిస్తారు. ప్రయాణాలను రద్దు చేసుకునే వారికి డబ్బులు పూర్తిగా వెనక్కి చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ► ఇటీవల కతార్ నుంచి తిరిగి వచ్చిన 38 ఏళ్ల కిడ్నీ బాధితుడు కరోనా లక్షణాలతో ఆదివారం చనిపోయినట్లు పట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. కరోనాతో ముంబైలో 63 ఏళ్ల వృద్ధుడు చనిపోగా సూరత్లో 67 ఏళ్ల వృద్ధుడు కూడా దీని బారిన పడి మృత్యువాత పడ్డారు. ► యూపీలో 27, రాజస్తాన్లో 24, హరియాణాలో 21, కర్ణాటకలో 26 కరోనా కేసులు నమోదు కాగా పంజాబ్లో 21, గుజరాత్లో 18, లడఖ్లో 13 కేసులు గుర్తించారు. తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పశ్చిమ బెంగాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ► అనుమానితుల నమూనాలు పరీక్షించేందుకు ల్యాబ్ల సంఖ్యను పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని పలు జిల్లాల్లో లాక్డౌన్కు కేంద్రం ఆదేశించింది. ► జమ్మూ కశ్మీర్లోనూ ఈనెల 31 వరకు లాక్డౌన్కు ఆదేశించారు. ► ఢిల్లీలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు లాక్డౌన్ ఆదేశిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. నిరసనలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడటంపై నిషేధాజ్ఞలు విధించారు. ► సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి మార్చి 27 వరకు కోల్కతాతోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ పాటించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ► పారా మిలటరీ బలగాల కదలికలపై కూడా నియంత్రణ విధించిన కేంద్రం ఏప్రిల్ 5 వరకు ఎక్కడి సిబ్బంది అక్కడే ఉండాలని ఆదేశించింది. ∙13,523 ప్యాసింజర్ రైళ్లు మార్చి 31 అర్ధరాత్రి వరకు రద్దయ్యాయి. కరోనా వైరస్ లక్షణాలు కలిగిన కొందరు వ్యక్తులు రైళ్లలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించినందున ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ► ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు నాగాలాండ్ తెలిపింది. ► మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్ల కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీని నిలిపివేయాలని నిర్ణయించాయి. ► ఫియట్ కంపెనీ కూడా ఈ నెలాఖరు వరకు తయారీని నిలిపివేసింది. ► హీరో మోటో కార్ప్, హోండా కూడా బైక్ల తయారీని నిలిపివేశాయి. సుదీర్ఘ సంగ్రామానికి ఆరంభం: ప్రధాని మోదీ కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలిపిన దేశ ప్రజలకు ధన్యవాదాలు కరోనాపై దీర్ఘకాలిక యుద్ధానికి 14 గంటల ‘జనతా కర్ఫ్యూ’ఆరంభం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం యావత్తూ ఏకమై ఏ సవాల్నైనా ఎదుర్కోగలమని రుజువు చేసిందని చెప్పారు. ‘జనతా కర్ఫ్యూ ఈరోజు రాత్రి 9 గంటలకు ముగియవచ్చు కానీ దీని అర్థం మనం సంబరాలు చేసుకోవాలని కాదు. స్వయం ప్రకటిత కర్ఫ్యూను విజయంగా భావించకూడదు. సుదీర్ఘ సంగ్రామానికి ఇది ఆరంభం మాత్రమే. గంటలు, వాయిద్యాలు మోగించడం ద్వారా కరోనాపై పోరాడుతున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన దేశ ప్రజలను అభినందిస్తున్నా’అని ట్విట్టర్లో ప్రధాని పేర్కొన్నారు. అంతా ఇళ్లలోనే.. మార్మోగిన చప్పట్లు ప్రధాని మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’పాటించిన ప్రజలు రోజంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో బాల్కనీల వద్దకు చేరుకుని గంటలు మోగించి వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు. – ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జుహూ బీచ్, బాంద్రా–వర్లీ సీ లింక్ జనతా కర్ఫ్యూతో జనసంచారం లేక బోసిపోయాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), ఇతర సబర్బన్ రైల్వే స్టేషన్లు ఖాళీగా కనిపించాయి. గోవా చర్చి, ఇతర చోట్ల ఆదివారం ప్రార్థనలు రద్దయ్యాయి. కోల్కతాలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎస్ల్పనేడ్, డల్హౌసీ హౌస్ ఏరియా ప్రాంతాలతోపాటు ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు జనం లేక వెలవెలపోయాయి. గుజరాత్లోని ప్రధాన నగరాలు అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్లో చాలా స్పల్ప సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పక్షుల కిలకిలా రావాలు వింటున్నారా? జనతా కర్ఫ్యూ సందర్భంగా ట్విట్టర్ వినియోగదారులు.. న్యూఢిల్లీ: కొందరు ఇళ్లలో గరిటె తిప్పగా.. మరికొందరు ఉదయం నుంచే పుస్తకాలు చేత పట్టారు. ఇంకొందరైతే చెట్లపై నుంచి వినిపించే పక్షుల కిలకిలా రావాలు వింటూ గడిపారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా జనాలు ట్విట్టర్లో పంచుకున్న అనుభవాలివీ... ఎప్పుడూ రణగొణ ధ్వనులతో బిజీగా ఉండే ముంబై నగరానికి చెందిన ట్విట్టర్ యూజర్ వందన కుమార్ ‘ప్రకృతి పిలుపు’అని ట్వీట్ చేయగా.. రచయిత స్మిత బరూహ్ ‘నెమలి పిలుపుతో మేల్కొన్నా..’అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ‘నా ఇంటి పరిసరాల్లో ఒక్క వ్యక్తి కానీ, కారు కానీ కదలడం చూడలేదు. మీరు కోకిల ఇతర పక్షుల గొంతును వినగలుగుతున్నారా? నేను నెమలి పిలుపుతో మేల్కొన్నాను..’బరూహ్ పేర్కొన్నారు. పక్షుల కిలకిల రావాలకు సంబంధించి 6,400 ట్వీట్లతో ట్రెండింగ్ టాపిక్గా ‘బర్డ్’నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్మానుష్య రోడ్ల ఫొటోలు షేర్ చేస్తూ 3.4 లక్షల మంది ట్వీట్లతో ‘జనతా కర్ఫ్యూ’ట్రెండింగ్లో నిలిచింది. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు వెళ్లే పవర్ రైసినా హిల్ ప్రాంతం ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా నిర్మానుష్యంగా మారిన దృశ్యం. ముంబైలోని చావల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లోకి వచ్చి సంఘీభావంగా చప్పట్లు కొడుతున్న స్థానికులు -
ఓసీఐ కార్డుదారులకు శుభవార్త
వాషింగ్టన్: ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డ్ ఉన్న విదేశాల్లోని భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 20 ఏళ్ల లోపు, లేదా 50 ఏళ్ల పైబడిన వయసు ఉండి, ఇటీవలే తమ పాస్పోర్ట్ను రెన్యూవల్ చేయించుకుని, భారత్కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ శుభవార్త. వారు తమ ఓసీఐ కార్డ్తో పాటు కొత్త పాస్పోర్ట్, రద్దైన పాత పాస్పోర్ట్.. రెండూ తమ వద్ద పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్కు రావచ్చని భారత హోంశాఖ లోని విదేశాంగ విభాగం మంగళవారం ప్రకటించింది. 2020, జూన్ 30 వరకు ఈ వెసులుబాటు కల్పించామని పేర్కొంది. -
నిర్భయ దోషికి క్షమాభిక్ష వద్దు!
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు శుక్రవారం కేంద్ర హోంశాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ సిఫారసును రాష్ట్రపతికి పంపించింది. దిశ హత్యాచార నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన రోజే ఈ సిఫారసు చోటు చేసుకుంది. మరోవైపు, క్షమాభిక్ష వినతిని తోసిపుచ్చాలని నిర్భయ తల్లి కూడా రాష్ట్రపతిని కోరింది. 2012 డిసెంబర్లో నిర్భయను ముకేశ్, పవన్, వినయ్, అక్షయ్లు పాశవికంగా అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనంతరం ఆ నలుగురికి కోర్టు మరణశిక్ష విధించింది. వారిలో వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఏడేళ్లు గడచిపోయినా, తమకు న్యాయం జరగలేదని, అదే అవేదనను ఇంకా అనుభవిస్తూనే ఉన్నామని రాష్ట్రపతికి రాసిన లేఖలో నిర్భయ తల్లి వివరించారు. తమలా కాకుండా, దిశ తల్లిదండ్రులకు సత్వరమే న్యాయం లభించిందని ఆ లేఖలో ప్రస్తావించారు. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మహిళల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గత కొద్ది రోజులుగా వెలుగు చూస్తున్న అత్యాచార ఘటనలు, దాడుల నేపథ్యంలో లేఖ రాస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్భల్లా తెలిపారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఆయన చెప్పారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు చట్టాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అయినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేయడంలో పోలీసులు విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మహిళలు, బాలికలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో పోలీసులు వేగంగా స్పందించాలని కోరారు. ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ఐటీఎస్ఎస్ఓ) పోర్టల్ ద్వారా ఆయా రాష్ట్రాలలోని అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లోగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేసుకోవచ్చని అందులో సూచించారు. -
కమల్నాథ్పై సిక్కు అల్లర్ల కేసు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కమల్నాథ్ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కమల్నాథ్పై నమోదైన కేసును రీ–ఓపెన్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారించనుంది. కమల్నాథ్ కేసుతో పాటు మరో 6 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను సిట్ పునర్విచారణ జరపనుంది. ఈ విషయమై ఢిల్లీ సిక్కుల గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, అకాలీదళ్ ఎమ్మెల్యే మన్జిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ..‘1984 అల్లర్ల కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్పై నమోదైన కేసును సిట్ పునర్విచారించనుంది. సిక్కుల ఊచకోతకు సంబంధించి 7 కేసుల్లో నిందితులైన ఐదుగురికి కమల్నాథ్ ఆశ్రయం కల్పించారు. గతేడాది నేనుచేసిన విజ్ఞప్తి మేరకు స్పందించిన హోంశాఖ, తాజా సాక్ష్యాల ఆధారంగా మళ్లీ విచారణ జరిపేందుకు వీలుగా కేసు నంబర్ 601/84ను రీ–ఓపెన్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇది అకాలీదళ్ సాధించిన విజయమే. ఈ కేసును మళ్లీ విచారించనున్న సిట్కు ధన్యవాదాలు. సిక్కులను కమల్నాథ్ చంపుతుండగా చూసిన సాక్షులు ధైర్యంగా ముందుకు రండి. భయపడాల్సిన పనిలేదు. కమల్నాథ్ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముక్తియార్ సింగ్, సంజయ్ సూరీ సిట్ ముందు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. త్వరలోనే కమల్నాథ్ అరెస్ట్ అవుతారు. కాంగ్రెస్ నేత సజ్జన్కుమార్కు పట్టిన గతే(యావజ్జీవ శిక్ష) కమల్నాథ్కు పడుతుంది. ’ అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెంటనే కమల్నాథ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలనీ, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు సహకరించాలని మన్జిందర్ సింగ్ కోరారు. కమల్నాథ్ను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అమృత్సర్లోని స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ ఉగ్రవాది జర్నైల్సింగ్ బింద్రన్వాలేను పట్టుకునేందుకు ప్రధాని ఇందిర ఆదేశాలతో ఆర్మీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను చేపట్టింది. ఆపరేషన్లో స్వర్ణ దేవాలయం తీవ్రంగా దెబ్బతినడం, ఆర్మీ బూట్లతో ఆలయంలోకి వెళ్లడంతో ఈ చర్యను తమ మతంపై దాడిగా సిక్కులు భావించారు. ఈ క్రమంలో 1984, అక్టోబర్ 31న సిక్కు మతస్తులైన సొంత బాడీగార్డులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఇందిరాగాంధీని కాల్చిచంపారు. దీంతో దేశవ్యాప్తంగా సిక్కు మతస్తులు లక్ష్యంగా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ ఢిల్లీలోని రాకాబ్గంజ్ గురుద్వారా వద్ద కమల్నాథ్ నేతృత్వంలో విధ్వంసానికి దిగిన అల్లరిమూక ఇద్దరు సిక్కులను చంపేసింది. ఈ ఘటనపై 2000లో బీజేపీ ప్రభుత్వం నానావతి కమిషన్ను నియమించింది. ఈ సందర్భంగా కమిషన్ ముందు విచారణకు హాజరైన కమల్నాథ్.. ‘ఆ రోజున నేను ఘటనాస్థలిలోనే ఉన్నా. ఆవేశంతో ఊగిపోతున్న అల్లరిమూకను శాంతింపజేసేందుకు ప్రయత్నించా’ అని వాంగ్మూలమిచ్చారు. చివరికి నానావతి కమిషన్ ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కమల్నాథ్ను ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద విడిచిపెట్టింది. తాజాగా ఈ కేసులో కమల్నాథ్ పాత్రకు సంబంధించి కొత్త ఆధారాలున్నాయని భావించిన కేంద్రం, కేసును రీ–ఓపెన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధికి జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ సోమవారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. కాంట్రాక్టర్లు ముందుకురాని చోట ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థలకు అప్పగించడం, కమ్యూనికేషన్ టవర్ల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణపై చర్చించారు. రూ. 50 లక్షల లోపు పనులను నామినేషన్ పద్ధతిలో స్థానిక గిరిజనులకు ఇచ్చే దానిపై దృష్టి సారించారు. నైపుణ్య శిక్షణా కేంద్రాల ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు ప్రతి గ్రామంలో పోస్టాఫీసు, బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశం ఫలప్రదంగా ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాల్లోని శాంతిభద్రతలు, అభివృద్ధి గురించి కీలకాంశాలు చర్చించినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, డీజీపీలు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచనలు యువత మావోయిజం వైపు ఆకర్షితులు కాకుండా చేపట్టాల్సిన తక్షణ చర్యల గురించి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ మెడికల్ కాలేజీ, ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ నెలకొల్పాలని కోరారు. గిరిజన ప్రాంతమైన సాలూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (చదవండి: తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస) -
‘ఆయుష్మాన్’ను అడ్డుకోవద్దు
హైదరాబాద్ : పేదలకు ఉచితంగా వైద్య ఆరోగ్య సదుపాయాన్ని కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ఆయుష్మాన్ భారత్’కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడం తగదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్రెడ్డి అన్నారు. పేదలకు రూ. 5లక్షల వరకు వైద్య ఖర్చులను భరించే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు కాకుండా మోకాలడ్డుతోందని ఆరోపించారు. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో శనివారం కేంద్రమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కంటే మెరుగైన ‘ఆయుష్మాన్ భారత్ ’ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సదుపాయాన్ని అందిస్తున్న ఈ పథకాన్ని అడ్డుకోవడం అంటే పేదలను వైద్యానికి దూరం చేయడమేనన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడుసహా అనేక రాష్ట్రాలు ‘ఆయుష్మాన్ భారత్’ అమలు చేస్తున్నాయన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారానే పేదలు ఆరోగ్యం గా జీవించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఒక్క రూ స్వచ్ఛ భారత్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో 10 కోట్ల మరుగుదొడ్లు, 18 వేల గ్రామాలకు కరెంట్ సదుపాయాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని కిషన్రెడ్డి అన్నారు. -
‘కేసీఆర్ సారు, కేటీఆర్ సారు ఉండవు’
సాక్షి, హైదరాబాద్: దేశ సరిహద్దు భద్రతే కాదు అంతర్గత భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని నార్త్బ్లాక్లోని హోం మంత్రిత్వ కార్యాలయానికి ప్రతి పోలీసు స్టేషన్ను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 70 శాతం వరకు పూర్తయిందని, ఈ నెలాఖరు వరకు దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లతో ఆన్లైన్ కనెక్టివిటీ పూర్తవుతుందన్నారు. అప్పుడు దేశంలో ఏ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైనా తెలుస్తుందన్నారు. శనివారం హైదరాబాద్లో ప్లాజా హోటల్లో ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘లంచ్ విత్ కిషన్రెడ్డి’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదేమీ ప్రెస్మీట్ కాదని, అందరిని కలువాలనే ఉద్ధేశంతోనే వచ్చానన్న కేంద్ర మంత్రి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్యార్థిలా నేర్చుకుంటున్నా... కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన విభాగాలు ఎన్నో ఉన్నాయని, ఒక స్కూల్ విద్యార్థిలా రోజు ఆఫీస్కు వెళ్తూ వాటిని నేర్చుకుంటున్నానని అన్నారు. టెర్రరిజం ఇప్పుడు తమ ముందున్న ప్రధాన సవాల్ అని వెల్లడించారు. మహిళల భద్రతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అది రాష్టాలకు సంబంధించిన అంశమే అయినా అవసరమైన చట్టాల మార్పులను చేసి కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అత్యాచార కేసుల్లో కఠిన శిక్షల అమలుకు చట్ట సవరణలు చేయబోతున్నామన్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష పడేలా ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో)లో మార్పులు చేస్తామన్నారు. ఇప్పటివరకు 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష వేసేలా చట్టం ఉందని, ఇకపై 18 ఏళ్లు లేదా 20 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడినా ఇదే శిక్ష వేసేలా చట్ట సవరణ చేయనున్నామన్నారు. సైబర్ సెక్యూరిటీ, పోలీస్ ఆధునికీకరణ, షీ టీమ్స్ వంటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. త్వరలోనే సైబర్ సెక్యూరిటీ, సైబర్ టెర్రరిజం ప్రివెన్షన్ చట్టాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ నెల 26తో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉన్నా వచ్చే నెల 2 వరకు పొడిగించే అవకాశం ఉందన్నారు. దీనిపై ఈ నెల 22న బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. మజ్లిస్తో కలసి టీఆర్ఎస్ రాజకీయాలు.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే తాము గెలిచామని కిషన్రెడ్డి వెల్లడించారు. తాము మతం పేరుతో గెలవలేదని జాతీయ వాదంతో గెలిచామన్నారు. ఎన్నికల్లో మతం పేరు ఎప్పుడైనా చెప్పామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మజ్లిస్ను పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధి ఎజెండాగానే తమ కార్యక్రమాలు ఉంటాయన్నారు. హైదరాబాద్ టెర్రరిజానికి సేఫ్ జోన్గా మారిందని చెప్పానని కిషన్రెడ్డి పేర్కొన్నారు. టెర్రరిజం బ్రీడింగ్ కేంద్రాల్లో హైదరాబాద్ కూడా ఒకటని చెప్పానే తప్ప.. దేశానికి సంబంధించిన ఉగ్రవాదమంతా ఇక్కడే ఉందనలేదు అని అన్నారు. ఎన్ఐఏ అరెస్టులే తన వాదనకు సాక్ష్యమన్నారు. దేశంలో అక్రమంగా ఉన్న విదేశీయులందరినీ గౌరవంగా వారి ప్రాంతాలకు పంపిస్తామన్నారు. హైదరాబాద్లోనూ ఈ చర్యలు చేపడతామన్నారు. నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ అనుమతి తీసుకొని వెళ్లాల్సిన ప్రాంతాలు ఉన్నాయని, అలాంటి వాటిని మార్చాల్సి ఉందన్నారు. నక్సల్స్ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కాగా, రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రత్యర్థులే.. శత్రువులుండరు.. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు కేసీఆర్.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కారు.. ఇవేవీ ఉండవన్నారు. కేసీఆర్ సారు.. కేటీఆర్ సారు... అనేది ఎవరు చూడరన్నారు. రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మిషన్ 2023లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే అమిత్ షా లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని యాంటీ నేషనల్ పార్టీ అని ఎక్కడా.. ఎప్పుడూ అనలేదన్నారు. కాంగ్రెస్ నేతలు రాజకీయంగా మాత్రమే తమకు ప్రత్యర్థులని, శత్రువులు అనే మాట ఎప్పుడూ మాట్లాడబోమని అన్నారు. ఎక్కడో ఒక చోట అత్యాచారం సంఘటన జరిగితే అది మొత్తం సాయుధ బలగాలకు ఆపాదించడం సరికాదని కిషన్రెడ్డి వివరించారు. -
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2020 వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్రదినోత్సావాన్ని పురస్కరించుకొని అవార్డులు ఇస్తామన్నారు. చిత్రలేఖనం, సామాజిక, సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్, ఇంజనీరింగ్, ట్రేడ్, అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, విద్య, సివిల్సర్వీస్, క్రీడలు, తదితరరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అవార్డుల కోసం ప్రతిపాదనలను ఈనెల 22 లోగా పంపించాలని సూచించారు. www.padmaawards.gov.in వెబ్సైట్లో పద్మ అవార్డుల కోసం గైడ్లైన్స్ చూడవచ్చని అన్నారు. ఈ అవార్డు కోసం జిల్లాకు చెందినవారై విశేష కృషి చేసిన ఆసక్తిగల వ్యక్తులు అవసరమైన పత్రాలను జతచేయాలన్నారు. హెచ్ఓడీలకు అందజేయాలని చెప్పారు. పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తులను ఎన్ఐసీ, డీఐఓ కార్యాలయంలో సంబంధిత వైబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారి పరిదిలో ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన వ్యక్తులను గుర్తించి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలన్నారు. -
12న హస్తినకు రండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్రంలో మళ్లీ కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పొందుపరిచిన అంశాలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 12న తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ సమాచారం పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రేణుసరీన్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో చేర్చిన అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు, ఎన్టీపీసీ ప్లాంటు, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి అంశాలపై ఇందులో చర్చ జరగనుంది. వీటితోపాటే కేంద్ర ఆర్థిక, జల వనరులు, రైల్వే, ఉన్నత విద్య, రవాణా, పెట్రోలియం, స్టీల్, ఆరోగ్య, గృహ నిర్మాణ, విద్యుత్, న్యాయ, విమానయాన శాఖల కార్యదర్శులను కూడా ఈ భేటీకి ఆహ్వానించింది. బయ్యారంపై ప్రత్యేక చర్చ... బయ్యారం స్టీలు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రం పలుమార్లుకేంద్రానికి విన్నవించింది. కేంద్రం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి బయ్యారం స్టీలు ప్లాంటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రానికి నివేదించింది. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కావాల్సిన సహకారాన్ని అందిస్తామని రాష్ట్రం సైతం చెబుతోంది. ప్రస్తుతం ఒడిశా నుంచి ఇనుప ఖనిజాన్ని ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని విశాఖకు తరలిస్తున్నారని, కేవలం 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారానికి ఎందుకు ఇనుమును తరలించి స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఢిల్లీ భేటీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ భేటీకి కేంద్ర జల వనరులశాఖను సైతం కేంద్ర హోంశాఖ ఆహ్వానించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది. దీంతోపాటే పట్టిసీమతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలో తెలంగాణ వాటాను కేటాయించాలని కోరుతోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత రాలేదు. దీనిపైనా కేంద్ర జల వనరుల శాఖతో హోంశాఖ చర్చించే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
నిశ్శబ్ధంగా సెక్షన్ 8 సమాధి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8కి కాలదోషం పట్టడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అనే విషయం లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుందని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ‘నవ్యాంధ్రతో నా నడక’ పుస్తకంలో స్పష్టం చేశారు. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టిందనే అంశాన్ని అందులోని ఓ అధ్యాయంలో ఆయన వివరించారు. ఆ అంశాలు యధాతధంగా... ‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందున సెక్షన్ 8కి ప్రాధాన్యం ఏర్పడింది. సెక్షన్ 8 ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడిన వారి ప్రాణ, ధన, ఆస్తి పరిరక్షణకు ఉద్దేశించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసించే ప్రజల స్వేచ్ఛ, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వీయ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్కు సలహాదారులుగా ఇద్దరు అధికారులను నియమించే ఏర్పాటు కూడా సెక్షన్ 8లో ఉంది. ఈ చట్టం ప్రకారం అవసరమైన నిబంధనలను రూపొందించాలని, హైదరాబాద్లో శాంతి భద్రతలు, ప్రజల రక్షణ విషయంలో అధిక పాత్ర నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావించింది. సెక్షన్ 8 సమర్ధవంతంగా అమలు కావాలంటే హైదరాబాద్ నగర పోలీసు వ్యవస్థలో రెండు రాష్ట్రాల పోలీసులకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని మేమే కోరాం. కానీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించింది. హైదరాబాద్ పూర్తిగా తెలంగాణలో ఉన్నందువల్ల శాంతి భద్రతలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అంశమని, ఈ విషయంలో గవర్నర్కు ఎలాంటి నిర్దిష్టమైన పాత్ర లేదని పేర్కొంది. సెక్షన్ 8 విషయంలో అప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్ గోస్వామితో నాకు వాగ్వివాదం జరిగింది. అనిల్ గోస్వామి పూర్తిగా తెలంగాణకు అనుకూలంగా కనపడ్డారు. ఇతర ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తెచ్చిన సెక్షన్ 8ను ఎందుకు విస్మరిస్తున్నారని గోస్వామిని నిలదీశా. దీనిపై ఆయన తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. హోంశాఖ కార్యదర్శి విభజన అంశాల గురించి పూర్తి ఉదాశీనంగా వ్యవహరించారు. కనీసం రెండు రాష్ట్రాల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆసక్తి కనపరచలేదు. తాంబూలాలిచ్చాం... తన్నుకు చావండి అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో పరస్పర సర్దుబాటు, కోర్టు ద్వారా సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇక ఏడాది తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈలోపు చంద్రబాబు రాజధానిని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది? ఒకసారి రాజధానిని విజయవాడకు తరలించిన తర్వాత సెక్షన్ 8 అనే దానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. దానికి కాలదోషం పట్టింది. మీ ప్రభుత్వమే ఇక్కడ లేనప్పుడు సెక్షన్ 8 అవసరం ఏముంది? అనే వాదన కేంద్ర ప్రభుత్వంలో వినిపించింది. దీనిపై కేంద్ర హోంశాఖకు సరైన జవాబు చెప్పలేక ఆ అంశాన్ని నిశ్శబ్ధంగా సమాధి చేశారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు ఆస్తులు, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు ప్రశంసనీయం. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఉండగలమన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. సెక్షన్ 8 అమలులో లేదన్న విషయమే అందరూ మరిచిపోయారు. సామాస్య ప్రజలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు బ్లాకులు కేటాయించారు. గవర్నర్, ఆయన సలహాదారులు ఆంధ్రప్రదేశ్కు హెచ్, ఎల్, బ్లాకులు అలాట్ చేశారు. హెచ్ బ్లాకు ముఖ్యమంత్రి కార్యాలయానికి కేటాయించారు. కానీ వాస్తు ప్రకారం హెచ్ బ్లాకు సరైంది కాదని అన్నిటికన్నా ఎతైన ఎల్ బ్లాక్ 8వ అంతస్థు నుంచి పనిచేస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎల్ బ్లాకులోని 8వ అంతస్తును అత్యాధునాతనంగా రూపొందించాం. దీనికి భారీ ఎత్తున ఖర్చు అయింది. -
‘ఆధార్’o ఇవ్వలేం..!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల నగర పోలీసులు పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేశారు. అతని వద్ద కొన్ని అనుమానాస్పద ఆధార్ కార్డులు లభించాయి. రాజేంద్రనగర్ చిరునామాతో కర్ణాటక నుంచి ఇవి జారీ అయ్యాయి. ఇదెలా సాధ్యం? ఈ కార్డులు అసలువా, నకిలీవా? తేల్చాలని కోరుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (యూఐడీఏఐ) లేఖ రాశారు. దీనికి స్పందించిన ఆ విభాగం ఇదే కాదు... ఏ వివరాలూ దర్యాప్తు సంస్థలకు ఇవ్వలేమంటూ చెప్పింది. ఈ అంశాన్నే యూఐడీఏఐ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ (ఎంహెచ్ఏ) స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎంహెచ్ఏ... క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ను (సీసీటీఎన్ఎస్) పరిపుష్టం చేయడం ద్వారా ఆధార్ వివరాలతో అవసరం లేకుండానే ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేలిముద్రలే అత్యంత కీలకం... పాత నేరగాళ్ల వివరాలు పోలీసు రికార్డుల్లో ఉండటంతో పాటు వారి వేలిముద్రలూ డేటాబేస్లో నిక్షిప్తమై ఉంటాయి. కొత్తగా నేరానికి పాల్పడే వారి వివరాలు లేకపోవడటంతో ఆ కేసులు త్వరగా పరిష్కారం కావట్లేదు. ఈ కేసులు కొలిక్కి చేరడంలో నేరగాళ్ల వివరాలు, వేలిముద్రలదే కీలకపాత్ర. ఈ పరిస్థితుల్ని బేరీజు వేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల యూఐడీఏఐకు కీలక ప్రతిపాదనలు చేసింది. ఆధార్ డేటాబేస్లో పోలీసు విభాగానికి లింకేజ్ ఇస్తే సొత్తు సంబంధిత నేరాలే కాకుండా ఇతర కేసుల్ని కొలిక్కి తీసుకురావడం తేలిక అవుతుందని అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్న ఎంహెచ్ఏ అయితే లింకేజ్ ఇవ్వడం సాధ్యంకాదని యూఐడీఏఐ పేర్కొంది. ఆధార్ చట్టం ప్రకారం ఏ తరహా వివరాలనూ పోలీసు సహా దర్యాప్తు సంస్థలకు ఇవ్వడం సాధ్యం కాదని ఎంహెచ్ఏకు లేఖ రాసింది. ఇప్పటికే కొన్ని టెలికం సంస్థలకు ఆధార్తో లింకేజీ లభించింది. ఆయా సంస్థలకే లింకేజ్ ఇస్తున్నప్పుడు పోలీసు విభాగానికి ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటన్నది అధికారుల ప్రశ్న. అయితే యూఐడీఏఐ ససేమిరా అనడంతో ఎంహెచ్ఏ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. సీసీటీఎన్ఎస్ను పరిపుష్టం చేస్తూ దీన్ని సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో (సీఎఫ్పీబీ)తో అనుసంధానించాలని నిర్ణయించింది. సీఎఫ్పీబీ ఇటీవలే ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టంతో పాటు నిస్ట్ ఫింగర్ ప్రింట్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తోంది. దేశంలో మొత్తం 15,500 ఠాణాలకు గాను 14,500 ఠాణాలను సీసీటీఎన్ఎస్తో అనుసంధానించారు. మిగిలిన ఠాణాలనూ లింకేజీ చేస్తూ ఈ ప్రాజెక్టును పరిపుష్టం చేయడానికి ఎంహెచ్ఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. -
విభజన సమస్యలు పరిష్కరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృత అంశాలు ఉన్నాయని, తెలంగాణలో కొన్ని అంశాలు పరిష్కారం కావాల్సి ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమై రాష్ట్ర విభజన అపరిష్కృత సమస్యలను తెలుసుకుంది. అపరిష్కృత అంశాలపై రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషి ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 15 అంశాలను తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం కాలపరిమితితో సమస్యలు పరిష్కరించాలని, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలని, 10వ షెడ్యూలు సంస్థల ఆస్తులు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎస్ కోరారు. హైదరాబాద్లో ఖాళీ చేసిన ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం వాడుకునేలా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై తగిన సిఫారసులు చేయాలని స్థాయీ సంఘానికి విన్నవించారు. నదీ జలాల పంపిణీపై.. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం పరిధిలోని సెక్షన్ 3 కింద తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కృష్ణా నదీ జలాలను అన్ని రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేపట్టాలని కోరాం. కానీ ఇప్పటివరకు కేంద్రం ట్రిబ్యునల్కు రెఫర్ చేయలేదు. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్–2 అవార్డు ఇంకా ఇవ్వలేదు. నదీ జలాలపై తెలంగాణ హక్కులను ఏపీ విస్మరిస్తోంది. వ్యవస్థీకృత విధానం లేకుండా పోయింది. ఇప్పటివరకు కృష్ణా నదీ జలాల పంపిణీపై అపెక్స్ కౌన్సిల్ ఒకేసారి సమావేశమైంది. పట్టిసీమ విషయంలో బచావత్ అవార్డు అమలు కాలేదు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వాలి. పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా భద్రాచలం సమీప ప్రాంతం ముంపునకు గురయ్యే అంశంపై అధ్యయనానికి ఆదేశాలు ఇవ్వాలి మౌలిక వసతులపై... తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సంస్థను ఎన్టీపీసీ స్థాపించాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో సమీకృత స్టీలు ప్లాంటు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇంకా అధ్యయన దశలోనే ఉంది. తెలంగాణలోని వెనుకబడ్డ ప్రాంతాల్లో రహదారి వ్యవస్థను కేంద్ర జాతీయ రహదారుల సంస్థ మెరుగుపరచాల్సి ఉంది. ముఖ్యమైన అంశాలు ఇవీ.. - శాసనసభ స్థానాలు: ఈ చట్టం ప్రకారం తెలంగాణలో శాసనసభ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. దీని తాజా పరిస్థితి తెలియకుండా పోయింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలపై ప్రభావం చూపింది. ఈ మూడు ఎస్టీ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సంఖ్యపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంకా తేల్చలేదు. - హైకోర్టు విభజన: హైకోర్టు విభజన జరగకపోవడం తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఉమ్మడి హైకోర్టులో మొత్తం 61 మంది న్యాయమూర్తులకు గాను 29 మంది న్యాయమూర్తులు పనిచేస్తుండగా ఇందులో ఆరుగురే తెలంగాణకు చెందినవారు. హైకోర్టు బార్ రెండుగా విడిపోయి హైకోర్టు ఆవరణలోనే పలుమార్లు ఆందోళనలు చోటు చేసుకున్నాయి. - రెవెన్యూ పంపిణీ: కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.1,630 కోట్లు ఏపీ సంచిత ఖాతాలో ఉన్నాయి. ఇవి తెలంగాణకు రావాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నిధులు ఇంకా రూ.1,132 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. - బయటి ఆస్తుల పంపిణీ: ఉమ్మడి ఏపీ బయట ఉన్న ఏకైక ఆస్తి ఢిల్లీలోని ఏపీ భవన్ ఒక్కటే. దీని పంపకానికి ఏపీ ఇచ్చిన రెండు ప్రతిపాదనలు తెలంగాణ పరిశీలనలో ఉన్నాయి. - ఆస్తులు, అప్పుల పంపిణీ: ఆపరేషనల్ యూనిట్స్ను భౌగోళికత ఆధారంగా పంపిణీ చేయాలి. కేంద్ర హోం శాఖ ఇచ్చిన స్పష్టత ప్రకారం ప్రధాన కార్యాలయాలు ఏ ప్రాంతంలో ఉంటే ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. అయితే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ ఫుడ్స్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థల విషయంలో ప్రధాన కార్యాలయం అనే పదానికి నిర్వచనం అవసరమవుతోంది. - షెడ్యూలు 9 సంస్థలు: ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో కోసం సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదు. మొత్తం 91 సంస్థలకు గాను 78 సంస్థల విభజనపై స్పష్టత వచ్చింది. - ఏపీహెచ్ఎంఈఎల్: ఈ సంస్థలో సింగరేణి సంస్థకు 81.54 శాతం ఈక్విటీ ఉంది. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. అయితే షీలాభిడే కమిటీ మాత్రం ఏపీహెచ్ఎంఈఎల్ సంస్థ ఏపీలో ఉన్నందున ఆ సంస్థ ఏపీకి చెందుతుందని సిఫారసు చేయడం చట్ట విరుద్ధం. -
షాపై దాడి; కేంద్ర హోంశాఖ సీరియస్!?
సాక్షి ప్రతినిధి, తిరుపతి : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్పై శుక్రవారం జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనికి సంబంధించి ఏపీ పోలీస్ శాఖను నివేదిక కోరినట్లు తెలిసింది. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోతే ఎలాగని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో ఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలను పంపాల్సిందిగా తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతిని ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, టీడీపీ కార్యకర్తల నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన నాయకులు ఎవరెవరు, ఈ ఘటనలో ఎవరెవరు కీలకపాత్ర పోషించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాన్వాయ్లో వెనుక ఉన్న వాహనాలకు అనుమతి ఉందా లేదా అన్న అంశాన్నీ పరిశీలిస్తున్నారు. మరోవైపు.. విధుల్లో ఉన్న పోలీసు అధికారుల వైఫల్యాన్ని చూపుతూ ఒకరిద్దరిపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఘటనా స్థలిలో రికార్డు అయిన వీడియో ఫుటేజీలు, ఫొటోలు తెప్పించుకుని విశ్లేషిస్తున్న అధికారులు బాధ్యులైన సీఐ, డీఎస్పీలపై బదిలీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
రిజర్వేషన్ల పెంపుపై నేడు సమావేశం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, పీడీ యాక్ట్ సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసింది. శుక్రవారం హోం శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబందించి కేంద్రం కోరిన వివరణలు, సమగ్ర ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పంపిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీలకు 6 నుంచి 10 శాతా నికి పెంచేందుకు రూపొందించిన బిల్లును అసెం బ్లీ ఆమోదించింది. కేంద్రం పెండింగ్లో పెట్టింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ హోం శాఖకు సూచించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన కారణం గా చూపింది. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లులోని అంశాల ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించిం ది. రెండు శాఖలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో పీట ముడి పడింది. అలాగే పీడీ యాక్ట్ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. శుక్రవారం జరిగే సమావేశంలో పెండింగ్ బిల్లులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, కేంద్రం లేవనెత్తిన అంశాలను నివేదించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను సైతం సమావేశానికి ఆహ్వానించింది. -
కాజీపేటలో వ్యాగన్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ!
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టం ప్రకారం తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బదులు కాజీపేటలో వ్యాగన్ పిరియాడికల్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న సంస్థల ఏర్పాటుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గాబా, సంయుక్త కార్యదర్శి ప్రసాద్, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖల అధికారులు సోమవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించారు. దీనికి రాష్ట్రం నుంచి పలువురు ఉన్నతాధికారులు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్కుమార్ హాజరయ్యారు. పిరియాడికల్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి 160 ఎకరాల స్థలం అవసరమవుతుందని సమావేశం నిర్ధారించింది. బయ్యారం స్టీల్ప్లాంట్పై తర్వాత నిర్ణయం ఇక ఛత్తీస్గఢ్లోని బైలదిల్లను అనుసంధానం చేస్తూ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలపై అధ్యయనం జరిపాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక హార్టికల్చర్, గిరిజన వర్సిటీల ఏర్పాటు, వెనుకబడిన ప్రాంతాలకు రహదారుల అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 200 ఎకరాల స్థలం కేటాయించినట్లు అధికారులు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వర్సిటీ ఏర్పాటుకు కేంద్రం 500 ఎకరాలు కోరడంతో మిగిలిన స్థలం కింద అటవీ భూములు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ 13లోని సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో గిరిజన, సెంట్రల్ వర్సిటీల ఏర్పాటుకు క్యాబినెట్ నోట్ పూర్తైనట్లు ఆ రాష్ట్ర సీఎస్ దినేశ్కుమార్ తెలిపారు. -
చెన్నమనేని రమేశ్కు హైకోర్టు ఊరట
సాక్షి, హైదరాబాద్: దేశ పౌరసత్వం వ్యవహారంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు ఉమ్మడి హైకోర్టు ఊరటనిచ్చింది. రమేశ్ భారత పౌరుడు కాదంటూ విచారణ కమిటీ ఇచ్చిన ఉత్తర్వులను, దానిని సమర్థిస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వుల అమలును 6 వారాల పాటు నిలిపివేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కంటితుడుపుగా కమిటీ విచారణ కేంద్ర హోంశాఖ తన భారత పౌరసత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ చెన్నమనేని రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్ర వారం న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ చేపట్టారు. రమేశ్ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. విచారణ కమిటీ కంటి తుడుపుగా విచారణ జరిపిం దన్నారు. రమేశ్ పౌరసత్వం కోసం దర ఖాస్తు చేసుకున్నాక జర్మనీ వెళ్లారని, ఆ ఒక్క అంశాన్నే కమిటీ పరిగణనలోకి తీసుకుందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముందు పునః సమీక్ష పిటిషన్ దాఖలు చేసినా, వాదనలు వినిపించే అవకాశమివ్వలేదన్నారు. జర్మనీ పిటిషనర్ నివాస ప్రాంతమని, కాబట్టి పిటిషనర్కు అది విదేశం ఎంత మాత్రం కాదన్న విషయాన్ని హోం శాఖ పట్టించుకోలేదని విన్నవించారు. అనం తరం కేంద్ర హోంశాఖ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ లక్ష్మణ్ వాదనలు వినిపించారు. పౌరసత్వ దరఖాస్తులో తాను 12 నెలల పాటు దేశంలోనే నివాసమున్నానని, మధ్యలో విదేశాలకు వెళ్లలేదని రమేశ్ తెలిపారని, అది తప్పుడు సమాచారం ఇవ్వడమేనని స్పష్టం చేశారు. ఇక ఫిర్యాదుదారు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. తప్పుడు సమాచారమిచ్చిన రమేశ్కు దానిని సరిచేసుకునే అవకాశాన్ని విచారణ కమిటీ ఇచ్చినా, రమేశ్ వాస్తవాలు వెల్లడించలేదన్నారు. రమేశ్ ఎన్నికపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేయగా.. భారత పౌరుడు కాదని ఇదే హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. -
మావో నే‘తల’లపై పెరగనున్న వెలలు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీఐ (మావోయిస్టు) పార్టీ కీలకనేతలపై మరో సారి రివార్డులు పెరగనున్నాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా రివార్డులను పెంచిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా ప్రతిపాదనలు కోరినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో రాష్ట్రవ్యాప్తంగా 84 మావోయిస్టు నేతల పేర్లతో జాబితా రూపొందించగా.. అందులో అత్యధికంగా తెలంగాణలోని 10 జిల్లాల నుంచి 62 మంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో పనిచేస్తున్న నేతలున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్గఢ్, మహా రాష్ట్ర, ఒడిశాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలవారీగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల సంఖ్య, పేర్లు, వివరాలు, ఇప్పుడున్న రివార్డు, ఏ మేరకు పెంచాలన్న అంశాలపై తాజాగా వివరాలను కోరినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్రావు అలియాస్ గణపతిపై ఇప్పటికే రూ.2.52 కోట్ల రివార్డు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో రూ.కోటి, ఛత్తీస్గఢ్లో రూ.కోటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రూ.25 లక్షలు, జార్ఖండ్లో రూ.12 లక్షలు, ఎన్ఐఏ రూ.15 లక్షలు ప్రకటించాయి. కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రాతి నిధ్యం వహిస్తున్న మావోయిస్టు నేతలు ఒక్కొక్కరిపై రూ. కోటి ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.25 లక్షలుగా ఉంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన కూడా చేసింది. ఆ రివార్డులను తెలుగు రాష్ట్రాల్లో పెంచడం కోసం తాజా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఉంది.