
యూపీ కేడర్ సత్యనారాయణ కోసం ఏపీ సర్కారు పట్టు
డిప్యుటేషన్పై పంపాలని కేంద్రంపై తీవ్ర ఒత్తిడి
నిబంధనలకు విరుద్ధమన్నా కూటమి పెద్దలు ససేమిరా
రెడ్బుక్ రాజ్యాంగం కక్ష సాధింపునకు సమర్థుడని నమ్మకం
టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, స్పీకర్కు బంధువు
సాక్షి, అమరావతి : ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి కె.సత్యనారాయణను డిప్యుటేషన్పై ఏపీకి పంపాల్సిందేనని చంద్రబాబు ప్రభుత్వం పట్టుపడుతోంది. నిబంధనలకు విరుద్ధమని కేంద్ర హోం శాఖ స్పష్టం చేస్తున్నా, తమకు ఆయన కావాల్సిందేనని తేల్చి చెబుతోంది. ఇంతకీ ఆయన కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అంతగా పట్టుపడుతోందంటే.. రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసుల బాధ్యతలను ఆయనకు అప్పగించేందుకేనని పోలీస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం వెనుక వివరాలిలా ఉన్నాయి. ప్రస్తుత అనకాపల్లి జిల్లాకు చెందిన కె.సత్యనారాయణ 1998 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో రహదారి భద్రత విభాగం అదనపు డీజీగా ఉన్నారు. ఆయన టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి సమీప బంధువు కూడా. అందుకే 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన్ను ప్రత్యేకంగా డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. అప్పట్లో ఆయన సీఐడీ విభాగంలో ఐజీగా విధులు నిర్వహించారు. డిప్యుటేషన్ కాలం ముగిసిన తర్వాత తిరిగి ఉత్తరప్రదేశ్కు వెళ్లిపోయారు.
చెప్పింది చెప్పినట్లు చేస్తారని..
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు సత్యనారాయణపై దృష్టి సారించారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరిట బరితెగించి రాష్ట్రంలో అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలతో విరుచుకు పడేందుకు అస్మదీయుడైన అధికారి కావాలని భావించారు. దాంతో ప్రభుత్వ ముఖ్య నేత దృష్టి సత్యనారాయణపై పడింది. దీంతో ఆయన్ను రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపాలని కేంద్ర హోం శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఐజీ లేదా అంతకంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను డిప్యుటేషన్పై ఇతర రాష్ట్రాలకు పంపేందుకు నిబంధనలు సమ్మతించవు.
అదే విషయాన్ని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసి.. సత్యనారాయణను డిప్యుటేషన్పై ఏపీకి పంపేందుకు నిరాకరించింది. దీనిపై కొన్ని నెలలు మౌనంగా ఉన్న ప్రభుత్వ పెద్దలు ఇటీవల మరోసారి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని తెలిసింది. ఈ ఆరు నెలల్లో బరితెగించి రాష్ట్రంలో అక్రమ కేçÜులు, కక్షసాధింపు చర్యలతో అరాచకం సృష్టిస్తున్న కూటమి సర్కారు.. ప్రత్యర్థులను అడ్డగోలుగా ఇరికించే కుట్రలకు పదును పెడుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా అరాచకం సృష్టిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు తోడుగా తమ కోసం అడ్డగోలుగా పనులు చేసిపెట్టే మరో ఐపీఎస్ అధికారి కావాలని ప్రభుత్వ పెద్దలు భావిసు్తన్నారు. అందుకే కె.సత్యనారాయణను డిప్యుటేషన్పై పంపించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అ«దికారులు అంజనా సిన్హా, పి.వెంకటరామిరెడ్డి మంగళవారం రిటైరయ్యారు.
డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కూడా జనవరిలో రిటైరవుతారు. ఆయనకు పొడిగింపు ఇస్తారా లేదా అన్నది స్పష్టత రాలేదు. ప్రస్తుత సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సెలవుపై ఉన్న అదనపు డీజీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు జనవరిలో డైరెక్టర్ జనరల్గా పదోన్నతి పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సీనియర్ పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
అప్పటికల్లా కె.సత్యనారాయణను రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకు రావాలన్నది ప్రభుత్వ ముఖ్య నేత ఉద్దేశం. కక్షసాధింపు చర్యలు, పోలీస్ అరాచకం బాధ్యతలను ఆయనకు అప్పగించాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసమే నిబంధనలకు విరుద్ధమైనా సరే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment