బీజేపీ, కాంగ్రెస్ రహస్య మంతనాలు | Congress leaders meet Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్ రహస్య మంతనాలు

Published Fri, Feb 7 2014 3:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

బీజేపీ, కాంగ్రెస్ రహస్య మంతనాలు - Sakshi

బీజేపీ, కాంగ్రెస్ రహస్య మంతనాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా బీజేపీ మద్దతు కూడగట్టేందుకోసం కాంగ్రెస్ చర్చలు కొనసాగిస్తోంది. బీజేపీ నాయకుడు వెంకయ్య నాయుడితో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం రహస్య మంతనాలు సాగించారు. ఈ భేటీలో అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నట్టు సమాచారం.

హైదరాబాద్ సహా పలు అంశాలపై వీరు చర్చించినట్టు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును బీజేపీ అగ్రనాయకులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైదరాబాద్ రెవెన్యూ సహా సీమాంధ్రకు కొత్త రాజధాని, ప్యాకేజీ తదితర విషయాలపై వెంకయ్యతో కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement